India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: మూసీ ప్రక్షాళన చేయొద్దని తాము అనడం లేదని BJP ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. మూసీ కంపును కడగమని చెబుతున్నామన్నారు. ఆ నదిలో స్వచ్ఛమైన నీరు పారాలని నల్గొండ ప్రజలు కోరుకుంటున్నారన్న ఈటల ప్రభుత్వం చెప్పే మాటలను ప్రజలు నమ్మవద్దని కోరారు. అంతకుముందు మూసీ ప్రక్షాళనలో భాగంగా నిర్మాణాల కూల్చివేతలపై ఈటల చేసిన వ్యాఖ్యలను సీఎం రేవంత్ ఖండించారు.
బేకరీల్లో దొరికే కేకులు తినేవారికి షాకింగ్ న్యూస్. కర్ణాటక రాష్ట్రంలోని బేకరీల్లో దొరికే రెడ్ వెల్వెట్, బ్లాక్ ఫారెస్ట్ వంటి కేకుల్లో క్యాన్సర్ కారకాలున్నట్లు పరీక్షల్లో తేలింది. బేకరీల్లో నుంచి సేకరించిన 235 కేక్ల నమూనాలను పరీక్షించారు. ఇందులో 12 విభిన్న రకాల క్యాన్సర్ కారకాలు ఉన్నట్లు తేలింది. కేకుల్లో వాడే ఆర్టిఫిషియల్ కలర్స్ క్యాన్సర్తో పాటు శారీరక, మానసిక సమస్యలకు దారితీయొచ్చని వెల్లడైంది.
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఫ్యాషన్ యాక్సెసరీస్ను సేకరించడంలో నటాషా పూనావాలా ముందుంటారు. రీసెంటుగా పారిస్ ఫ్యాషన్ వీక్ 2024లో ఆమె మోనోగ్రామ్ డ్రెస్లో మెరిశారు. ఇక ఆమె పట్టుకున్న హ్యాండ్బ్యాగ్ అందర్నీ ఆకర్షించింది. అదే Louis Vuitton Maison de Famille బ్యాగ్. ఇంటిని తలపించే ఈ బ్యాగ్ ధర రూ.38 లక్షలు. పారిస్ శివారులోని Maison d’Asnieresకి ఇది మినియేచర్ వెర్షన్. ఈ ఇంటికి చాలా లెగసీ ఉందని తెలిసింది.
AP: వైసీపీ శ్రేణులు ప్రజల తరఫున పోరాటాలు చేయాలని, కేసులకు భయపడొద్దని మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. తాడేపల్లిలో పశ్చిమగోదావరి నేతలతో ఆయన సమావేశమయ్యారు. ‘కూటమి ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టకుండా కాలయాపన చేస్తోంది. వైసీపీ, టీడీపీ పాలనకు తేడాను ప్రజలు గమనిస్తున్నారు. ఏ ప్రభుత్వంలో మంచి జరిగిందన్నదానిపై ప్రతి ఇంట్లోనూ చర్చ జరుగుతోంది. మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే’ అని ఆయన పేర్కొన్నారు.
సమంత విడాకులపై మంత్రి సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై హీరో మహేశ్బాబు స్పందించారు. ‘ఓ మహిళా మంత్రి మరో మహిళపై చేసిన ఆమోదయోగ్యంకాని వ్యాఖ్యలు, భాష పట్ల తీవ్ర వేదనకు గురయ్యా. ఒక కూతురి తండ్రిగా, భార్యకు భర్తగా, తల్లికి కొడుకుగా ఎదుటివారి మనోభావాలను దెబ్బతీయనంత వరకు వాక్స్వేచ్ఛను ఉపయోగించుకోవచ్చు. సినీ వర్గాన్ని సాఫ్ట్ టార్గెట్గా మార్చుకోవద్దని పబ్లిక్గా అభ్యర్థిస్తున్నా’ అని ట్వీట్ చేశారు.
చైనా, నార్త్ కొరియా, ఇరాన్లో తమకు గూఢచారులు కావాలని అమెరికా బహిరంగ ప్రకటన ఇచ్చింది. ఫేస్బుక్, X, యూట్యూబ్, ఇన్స్టా అన్నింట్లో CIA పోస్టులు పెట్టింది. తమను ఎలా రహస్యంగా సంప్రదించాలో కూడా తెలిపింది. వీపీఎన్ లేదా టోర్ నెట్వర్క్ ఆధారంగా తమ వెబ్సైట్ను సంప్రదించాలని సూచించింది. ఆయా దేశాల వీపీఎన్లు వాడొద్దని పేర్కొంది. కాగా చైనా, నార్త్ కొరియా, ఇరాన్ యూట్యూబ్, ఎక్స్, ఫేస్బుక్లను నిషేధించాయి.
భారత్పై ఓ వర్గపు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఆధిపత్యమే ‘లవ్ జిహాద్’ లక్ష్యమని UPలోని ఓ ఫాస్ట్ట్రాక్ కోర్టు పేర్కొంది. దీనిని ప్రేమ పేరుతో అక్రమంగా మతం మార్చడం, పాక్, బంగ్లా పరిస్థితుల్ని కల్పించేందుకు జరుగుతున్న అంతర్జాతీయ కుట్రగా వర్ణించింది. జదావున్పూర్లో Md అలీమ్ తన ఐడెంటిటీ దాచి ఆనంద్ పేరుతో ఓ స్టూడెంట్ను రేప్ చేసి చంపేస్తానని బెదిరించాడు. కోర్టు అతడికి జీవితఖైదు విధిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది.
మూసీని అడ్డు పెట్టుకుని బీజేపీ, BRS రాజకీయాలు చేస్తున్నాయని CM రేవంత్ విమర్శించారు. ‘కిషన్ రెడ్డి, ఈటల.. మీకు మోదీ చేపట్టిన సబర్మతి రివర్ ఫ్రంట్ కావాలి కానీ.. మూసీ రివర్ ఫ్రంట్ వద్దా? కిరాయి మనుషులతో కేటీఆర్, హరీశ్ రావు హడావుడి చేస్తున్నారు. ఫాంహౌస్లు కూల్చుతామనే భయంతో పేదలను అడ్డుపెట్టుకుని ధర్నాలు చేస్తున్నారు. మూసీ పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కంటే ప్రత్యామ్నాయం ఏముంటుంది?’ అని ప్రశ్నించారు.
TG: ఇంకుడు గుంతలు నిర్మించని ఇళ్లకు పర్మిషన్ ఇవ్వబోమని CM రేవంత్ స్పష్టం చేశారు. ‘హైదరాబాద్లో ఒకప్పుడు 200 ఫీట్ల లోపే బోర్ పడేది. ఇప్పుడు 1,200 ఫీట్లు వేసినా లాభం ఉండట్లేదు. ఇంకుడు గుంతలు కట్టని ఇళ్లకు అనుమతులు ఇవ్వొద్దని అధికారులకు ఆదేశాలిచ్చా. అలాంటి ఇళ్లకు నీళ్ల ట్యాంకర్ ద్వారా నీళ్లిస్తే రెండింతలు అదనంగా వసూలు చేయాలని చెప్పా. నగరాన్ని బాగు చేసేందుకే ఈ నిర్ణయాలు తీసుకుంటున్నా’ అని తెలిపారు.
మద్రాస్ హైకోర్టు ఆదేశాలతో కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్పై TN పోలీసులు తదుపరి చర్యలు తీసుకోకుండా సుప్రీంకోర్టు అడ్డుకుంది. HCPని హైకోర్టు నుంచి బదిలీ చేసుకుంది. చర్యలపై స్టేటస్ రిపోర్టు ఇవ్వాలని పోలీసుల్ని ఆదేశించింది. విచారణను OCT 18కి వాయిదా వేసింది. 5వేల మంది ఉండే ఆశ్రమంలోకి 150+ పోలీసులు వెళ్లారని ఈషా లాయర్ ముకుల్ రోహత్గీ వాదించారు. ‘అవును, అలాంటి చోటకు అలా వెళ్లకూడదు’ అని CJI ఏకీభవించారు.
Sorry, no posts matched your criteria.