India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జావెలిన్ అథ్లెట్ నీరజ్ చోప్రాతో ఆయన కోచ్ క్లాస్ బార్టోనీఎట్జ్ బంధం ముగిసింది. 75 ఏళ్ల క్లాస్ ఇకపై తన కుటుంబంతో గడిపేందుకు స్వదేశం జర్మనీకి పయనమయ్యారు. ఆయన గతంలోనే వెళ్లిపోదామనుకున్నప్పటికీ రిక్వెస్ట్ చేసి ఆపామని అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ కోచ్ రాధాకృష్ణన్ తెలిపారు. ఈసారి మాత్రం వెళ్లడానికే నిర్ణయించుకున్నారన్నారు. నీరజ్ 2సార్లు ఒలింపిక్ మెడల్ గెలవడం వెనుక క్లాస్ కీలక పాత్ర పోషించారు.
HYD మాదాపూర్లోని శ్రీచైతన్య కాలేజీ హాస్టల్పై రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫుడ్ పాయిజన్ అయిన ఘటనపై మండిపడింది. ఈ హాస్టల్ తక్షణమే మూసివేయాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్కు సిఫార్సు చేసింది. కాగా రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్మన్ నేరెళ్ల శారద కాలేజీని <<14239343>>సందర్శించిన <<>>24 గంటల్లోనే బాలల హక్కుల కమిషన్ చర్యలు తీసుకోవడం గమనార్హం.
ముడా స్కాంలో ఆరోపణల నేపథ్యంలో కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ నెల 3న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. ఖరీదైన భూములను తన భార్య పార్వతికి సిద్దరామయ్య కేటాయించారనేది ఆరోపణ. దీనిపై ED కేసు నమోదు చేసింది. ఇప్పటికే ఆ భూములు తిరిగి ఇచ్చేస్తామని పార్వతి ప్రకటించారు.
ఏపీలో రేపు పార్వతీపురం మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నెల్లూరు, అనంతపురం, వైయస్ఆర్ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది.
AIలను ట్రైన్ చేయడానికి Meta యూజర్ జనరేటర్ డేటాను వాడుతోందన్న ఆరోపణల నేపథ్యంలో Messenger, Instagram, WhatsAppలో AI Chat Historyని తరచూ డిలీట్ చేయడం మంచిది. AI చాట్ మెమరీని రీసెట్ చేయడానికి యూజర్లు /reset-ai కమాండ్ని టైప్ చేయాలి. దీంతో AI మెమరీని క్లియర్ చేయవచ్చు. గ్రూప్ చాట్స్కి /reset-all-ais కమాండ్ వాడాలి. యాప్స్లో చాట్స్ మనకు కనిపించినా AI మెమరీలో డిలీట్ అవుతాయి.
☞ అక్టోబర్ 3 నుంచి 21 వరకు రోజూ 2 సెషన్లలో పరీక్షలు
☞ పరీక్షకు గంటన్నర ముందే కేంద్రాల్లోకి అనుమతిస్తారు
☞ అభ్యర్థులు ప్రభుత్వ గుర్తింపు కార్డును తీసుకెళ్లాలి
☞ ఒకటి కన్నా ఎక్కువ హాల్టికెట్లు పొంది ఉంటే ఏదో ఒక కేంద్రంలోనే పరీక్ష రాయాలి
☞ హాల్ టికెట్పై ఫొటో లేకపోయినా, సరిగా కనిపించకపోయినా 2 పాస్పోర్టు ఫొటోలను డిపార్ట్మెంటల్ అధికారికి సమర్పించాలి
☞ దివ్యాంగ అభ్యర్థులకు 50 నిమిషాల అదనపు సమయం
TG: మూసీ బాధితులకు TPCC ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ గౌడ్ భరోసా కల్పించారు. ‘మీ ఇళ్లపై ఒక్క గడ్డపార కూడా పడదు. ఒక పొక్లెయిన్ కూడా రాదు. వస్తే నేను అడ్డుగా నిలబడతా. అన్యాయంగా మీ ఇళ్లపైకి బుల్డోజర్లు వస్తే కోర్టుకెళ్తా. న్యాయవాదిగా కోర్టులో కేసు వేసి న్యాయం చేస్తా. పిల్లాపాపలతో ప్రశాంతంగా నిద్రపోండి. మీ ఇళ్లు ఎవరూ కూల్చరు. అవసరమైతే ప్రభుత్వంతో పోరాటం చేస్తా’ అని ఆయన బాధితులకు చెప్పారు.
AP: ఈ నెల 12 నుంచి కొత్త మద్యం విధానం అమలుకు ప్రయత్నిస్తామని ఎక్సైజ్ కమిషనర్ నిశాంత్ కుమార్ వెల్లడించారు. ‘MRP కంటే అధిక రేటుకు విక్రయిస్తే చర్యలు తప్పవు. పర్మిట్ రూమ్లు, బెల్ట్ షాపులకు అనుమతి లేదు. స్కూళ్లు, ఆలయాలకు వంద మీటర్ల పరిధిలో మద్యం షాపుల ఏర్పాటుకు అనుమతి లేదు. ప్రతి షాపులో 2 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. కొత్త విధానం అమల్లోకి వచ్చేవరకూ పాత విధానమే అమల్లో ఉంటుంది’ అని ఆయన వెల్లడించారు.
ఫుడ్ ప్యాకేజింగ్, ప్లాస్టిక్ టేబుల్వేర్లలో 200 రసాయనాలు ఉన్నాయని, అవి బ్రెస్ట్ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయని ఓ పరిశోధనలో వెల్లడైంది. ఈ హానికరమైన రసాయనాలను కలిగి ఉన్న ఉత్పత్తులలో కార్డ్బోర్డ్, ప్లాస్టిక్ ర్యాప్, ప్లాస్టిక్ ఉన్నాయి. వీటిలో PFAలు, బిస్ఫినాల్స్, థాలేట్ వంటి ప్రమాదకరమైన రసాయనాలున్నాయి. రోజువారీ ఉత్పత్తుల్లో వీటిని తగ్గించడానికి నివారణ చర్యలు తీసుకోవాలని పరిశోధకులు సూచించారు.
టీమ్ ఇండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా మరో ఘనత సాధించారు. ఈ ఏడాదిలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా ఆయన అవతరించారు. ఆయన అన్ని ఫార్మాట్లలో కలిపి ఈ ఏడాది ఇప్పటివరకు 53 వికెట్లు పడగొట్టారు. ఆ తర్వాత హాంగ్కాంగ్ బౌలర్ ఎహ్సాన్ ఖాన్ (46), జోష్ హేజిల్వుడ్ (44), వనిందు హసరంగ (43), ఆడమ్ జంపా (41) ఉన్నారు.
Sorry, no posts matched your criteria.