India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సూపర్ స్టార్ రజినీకాంత్ తీవ్రమైన కడుపునొప్పితో ఈరోజు ఉదయం ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఆయనకు అనుభవజ్ఞులైన ముగ్గురు వైద్యుల బృందం పొత్తి కడుపు కింది భాగంలో స్టెంట్స్ వేసినట్లు తెలుస్తోంది. ఈ ప్రక్రియ విజయవంతమైనట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం రజినీకాంత్ ఆరోగ్యం నిలకడగా ఉందని, మూడు రోజుల్లో డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని చెప్పాయి. ఆయన త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు.
నటుడు ప్రకాశ్ రాజ్ ట్వీట్ల పరంపర కొనసాగుతోంది. మరోసారి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి ఆయన ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది. ‘కొత్త భక్తుడికి పంగనామాలు ఎక్కువ.. కదా? ఇక చాలు.. ప్రజల కోసం చేయాల్సిన పనులు చూడండి.. జరిగిందేదో జరిగిపోయింది. జస్ట్ ఆస్కింగ్’ అంటూ ట్వీట్ చేశారు.
AP: సీఎం చంద్రబాబు కర్నూలు జిల్లా పత్తికొండ(M)లోని పుచ్చకాయలమడ గ్రామంలో పర్యటిస్తున్నారు. స్వయంగా ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. వారి సమస్యలను తెలుసుకుంటున్నారు. కాసేపట్లో గ్రామ సభ నిర్వహించి ప్రసంగిస్తారు.
డీజే సౌండ్ సిస్టమ్ వినియోగంపై హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కమిషనరేట్ పరిధిలో మతపరమైన ఊరేగింపుల్లో DJ సౌండ్ మిక్సర్లు, యాంప్లిఫయర్, బాణాసంచా ఉపయోగించడాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులిచ్చారు. డీజేల నుంచి ఉత్పన్నమయ్యే అధిక డెసిబెల్స్ కారణంగా ఆరోగ్యం దెబ్బతింటుందని ఈ నిర్ణయం తీసుకున్నారు. నిబంధనలు అతిక్రమిస్తే ఐదేళ్లు జైలు శిక్ష, రూ. లక్ష జరిమానా ఉంటుందన్నారు.
AP: తిరుమల లడ్డూ అంశంలో సీఎం చంద్రబాబుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందీశ్వరి తప్పుపట్టారు. ‘రాజ్యాంగ పదవిలో ఉన్న ఆయన రాష్ట్రానికి సంబంధించిన ఏ అంశంపై అయినా మాట్లాడతారు. లడ్డూ విషయంలో జరిగిందే చెప్పారు. చంద్రబాబు అలా మాట్లాడకుండా ఉండాల్సిందని ధర్మాసనం కామెంట్స్ చేయడం సరికాదు’ అని పేర్కొన్నారు.
TG: మూసీ నదిని ప్రక్షాళన చేసి గోదావరి జలాలు తీసుకురావాలనేది తమ ప్రభుత్వ ఉద్దేశం అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. మల్లన్నసాగర్ జలాశయం నుంచి మూసీకి నీటిని తరలిస్తామన్నారు. మూసీ పరివాహక ప్రాంత ప్రజలు రోగాల బారిన పడుతున్నారని, గత ప్రభుత్వం మూసీని ఎందుకు ప్రక్షాళన చేయలేదని ప్రశ్నించారు. గతంలో మూసీ ప్రక్షాళన కోసం తెచ్చిన రూ.1,000 కోట్ల అప్పు ఎందుకోసం ఖర్చు చేశారని నిలదీశారు.
AP: తిరుమల లడ్డూ అంశంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సుప్రీంకోర్టులో విచారణ నేపథ్యంలో ఎల్లుండి వరకు సిట్ దర్యాప్తును నిలిపివేసినట్లు డీజీపీ ద్వారకా తిరుమలరావు ప్రకటించారు. 3న ధర్మాసనం ఆదేశాల తర్వాత తదుపరి దర్యాప్తు కొనసాగిస్తామన్నారు. లడ్డూలను కల్తీ నెయ్యితో తయారుచేశారనడానికి ఆధారాలు లేకుండానే సీఎం చంద్రబాబు ఎలా ప్రకటన చేశారని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
బుల్డోజర్ యాక్షన్పై తమ వ్యాఖ్యలు మతాలతో సంబంధం లేకుండా అందరికీ వర్తిస్తాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ‘మనది సెక్యులర్ కంట్రీ. పబ్లిక్ రోడ్, ఫుట్పాత్, వాటర్ బాడీ, రైల్వే లైన్లో ఆక్రమణలు అన్నిటికీ మా ఆదేశాలు వర్తిస్తాయి. రోడ్డు మధ్యలో గుడి, గురుద్వారా, దర్గా సహా ఎలాంటి మతపరమైన కట్టడాలున్నా కూల్చేయాల్సిందే. అనధికార నిర్మాణాలకు ఒకటే చట్టం. వాటికి మతాలతో సంబంధం లేదు’ అని వివరించింది.
ASMI పేరుతో భారత్లో డెవలప్ చేసిన మొదటి సబ్మెషీన్ గన్స్ సైన్యం చేతికి అందాయి. వీటి డిజైన్, డెవలప్మెంట్, తయారీకి మూడేళ్ల కన్నా తక్కువ సమయమే పట్టింది. అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన ఇజ్రాయెల్ Uzi, జర్మనీ MP5 కన్నా ఇవెంతో మెరుగ్గా పనిచేస్తాయి. పైగా వాటితో పోలిస్తే 10-15% బరువు, 30% ధర తక్కువ. రూ.లక్ష లోపే లభిస్తాయి. హైదరాబాద్ కంపెనీ లోకేశ్ మెషీన్స్ 550 ASMITA గన్స్ను ఆర్మీకి డెలివరీ చేసింది.
ఉద్యోగంలో ఒత్తిడి పెరిగి ఆత్మహత్యలు చేసుకుంటుండటం ఆందోళనకరం. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనను తొలగించి మిమ్మల్ని మానసికంగా దృఢంగా మార్చేందుకు కేంద్రం ఉచితంగా కౌన్సెలింగ్ ఇస్తోంది. దీనికోసం టోల్ ఫ్రీ నంబర్ 1800-599-0019కు కాల్ చేయాలి. ఒత్తిడి నిర్వహణ, మానసిక ఆరోగ్యం, సానుకూల ధోరణిని పెంచడం వంటి మానసిక ఆరోగ్య సేవలను ఈ హెల్ప్లైన్ అందిస్తుంది. ఇది 24 గంటలూ అందుబాటులో ఉంటుంది. >>SHARE IT
Sorry, no posts matched your criteria.