India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

నటి జయప్రద సోదరుడు రాజబాబు కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆమె ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలియజేశారు. హైదరాబాద్లోని నివాసంలో ఆయన నిన్న సాయంత్రం మరణించినట్లు వెల్లడించారు. తన సోదరుడి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని తన అభిమానులు ప్రార్థించాలని జయప్రద కోరారు.

TG: ప్రభుత్వం చేపట్టిన కులగణన రీసర్వే నేటితో ముగియనుంది. గతేడాది నవంబర్ 6 నుంచి డిసెంబర్ 25 వరకు నిర్వహించిన సర్వేలో పాల్గొనని కుటుంబాల కోసం ప్రభుత్వం ఈనెల 16 నుంచి రీసర్వే చేపట్టింది. అయితే ఇందులోనూ వివరాలు ఇచ్చేందుకు చాలామంది ఆసక్తి చూపలేదు. మొత్తం 3.50 లక్షల కుటుంబాలు మిగిలిపోగా సుమారు 10వేల ఫ్యామిలీలే ఎంట్రీ చేయించుకున్నట్లు తెలుస్తోంది. సర్వేలో పాల్గొనాలంటే 040 21111111 నంబర్కు కాల్ చేయండి.

AP: కూటమి ప్రభుత్వం నేడు తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఉదయం 10గం.కు అసెంబ్లీలో మంత్రి పయ్యావుల కేశవ్, మండలిలో మరో మంత్రి కొల్లు రవీంద్ర బడ్జెట్ను ప్రవేశపెడతారు. సూపర్ 6 పథకాలు, రాజధాని అమరావతి నిర్మాణానికి బడ్జెట్లో ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు సమాచారం. మరోవైపు, తొలిసారి బడ్జెట్ పుస్తకాల ముద్రణను ఆపేసిన ప్రభుత్వం ఆ వివరాలు ఉండే పెన్ డ్రైవ్ను సభ్యులతో పాటు మీడియాకు ఇవ్వనుంది.

TG: హైదరాబాద్లోని గాంధీభవన్లో మహేశ్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ఇవాళ టీపీసీసీ సమావేశం జరగనుంది. ఈ మీటింగ్కు సీఎం రేవంత్, ఇటీవల రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జీగా బాధ్యతలు చేపట్టిన మీనాక్షీ నటరాజన్ చీఫ్ గెస్టులుగా హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల విషయంలో బీసీలకు తగిన న్యాయం చేయాలని పార్టీలోని బీసీ నేతలు మీనాక్షీని కోరే అవకాశం ఉంది.

US రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ IND విద్యార్థిని నీలమ్ శిండే తండ్రికి <<15601992>>వీసాపై<<>> అక్కడి ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఇవాళ ఆయన వీసా ఇంటర్వ్యూకు అవకాశం కల్పించింది. కాలిఫోర్నియా వర్సిటీలో PG చేస్తున్న నీలమ్ను కారు ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లింది. ఆమె తండ్రి వీసాకు అప్లై చేస్తే ఎవరూ పట్టించుకోలేదు. ఈ విషయాన్ని NCP MP సుప్రియ కేంద్రం దృష్టికి తీసుకెళ్లగా విదేశాంగ శాఖ USతో చర్చించింది.

* జీరో డిప్రెసియేషన్: దీనివల్ల ఫుల్ క్లెయిమ్ అందుతుంది.
* ఇంజిన్ ప్రొటెక్షన్: ఇది యాడ్ ఆన్ చేసుకోవడం వల్ల ఇంజిన్ రిపైర్, రీప్లేస్మెంట్ సదుపాయం ఉంటుంది.
* రోడ్ సైడ్ అసిస్టెంట్: ప్రయాణంలో మీ కారు బ్రేక్ డౌన్ అయితే టోయింగ్, ఫ్యూయల్ అందించడం, బ్యాటరీ తదితర రిపైర్స్ చేస్తారు.
* కంన్జ్యూమబుల్ కవరేజీ: రిపేర్ సమయంలో ఇంజిన్ ఆయిల్, నట్లు, బోల్టులు, బ్రేక్ ఆయిల్ వంటి వాటికీ రీయింబర్స్మెంట్.

తమిళులపై కేంద్రం హిందీ భాషను రుద్దడంపై DMK MP కనిమొళి తీవ్రంగా మండిపడ్డారు. అసలు హిందీ నేర్చుకోవడం వల్ల ఉపయోగమేంటని ప్రశ్నించారు. ఆ భాష వల్ల ఏం సాధిస్తామన్నారు. తాను ఎన్నడూ హిందీ నేర్చుకోలేదని, స్కూలుకెళ్లే తన కుమారుడూ ఆ భాషను నేర్చుకోవడం లేదన్నారు. TNలోని ప్రతీ విద్యార్థికి హిందీ రావాలని లేదని తెలిపారు. నూతన విద్యావిధానాన్ని అమలు చేయనందుకు కేంద్రం రూ.5000Cr ఫండ్స్ను నిలిపివేసిందని ఆరోపించారు.

మొన్న ENGను చిత్తు చేసిన అఫ్గాన్ ఇవాళ AUSతో పోరుకు సిద్ధమవుతోంది. మ.2.30 గంటలకు ఇరు జట్ల మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. ఇందులో గెలిచిన జట్టు సెమీస్ చేరనుండగా ఓడిన టీమ్ ఇంటిబాట పట్టనుంది. ENGను ఓడించి ఊపులో ఉన్న AFG.. AUSను కూడా కొట్టాలని ఉవ్విళ్లూరుతోంది. కానీ అది అంత ఈజీ కాదు. ICC టోర్నీలంటే రెచ్చిపోయే AUS.. AFGపై విరుచుకుపడే అవకాశం ఉంది. మరి మరో సంచలనం నమోదవుతుందో? AUSకు AFG దాసోహం అవుతుందో?

మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘కన్నప్ప’లో శివుడి క్యారెక్టర్ చేసేందుకు ముందు 2 సార్లు ఆ ఆఫర్ను రిజెక్ట్ చేశానని బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ తెలిపారు. కానీ ఆ పాత్రకు తానే సరిగ్గా సరిపోతానంటూ విష్ణు చెప్పిన విధానం నచ్చడంతో అంగీకరించినట్లు వెల్లడించారు. కాగా ఈ చిత్రం విడుదల తర్వాత శివుడి గురించి ఎవరు ఆలోచించినా అక్షయ్ రూపమే దర్శనమిస్తుందని విష్ణు అన్నారు. కన్నప్ప APR 25న రిలీజ్ కానుంది.

హాలీవుడ్ సింగర్ కేటి పెర్రీ స్పేస్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్కు చెందిన ‘బ్లూ ఆరిజిన్’ సంస్థ ఈ ఏడాది న్యూ షెపర్డ్ స్పేస్క్రాఫ్ట్ను అంతరిక్షంలోకి పంపనుంది. అందులో ఆరుగురు సభ్యులు గల మహిళా బృందం వెళ్లనుంది. పెర్రీతో పాటు బెజోస్ ఫియాన్సీ సాంచెజ్, నటి గెయిల్ కింగ్, సామాజిక కార్యకర్త అమండా, నిర్మాత కరియన్నె ఫ్లిన్, నాసా మాజీ రాకెట్ సైంటిస్ట్ ఐషా బొవే వెళ్లనున్నారు.
Sorry, no posts matched your criteria.