India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
యూపీ ఝాన్సీకి చెందిన బజాజ్ ఫైనాన్స్ ఏరియా మేనేజర్ తరుణ్ సక్సేనా (42) పని ఒత్తిడి భరించలేక ఆత్మహత్య చేసుకున్నారు. ‘2 నెలల నుంచి EMI కలెక్షన్ల టార్గెట్ పెడుతున్నారు. రీచ్ కాకుంటే జీతం కట్ చేస్తామని బెదిరిస్తున్నారు. 45 రోజులుగా నాకు నిద్ర లేదు. పిల్లల ఏడాది స్కూల్ ఫీజు కట్టేశా. నా భార్య, పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి అమ్మానాన్న. నేను చనిపోతున్నా’ అని సూసైడ్ లెటర్ రాసి బలవన్మరణానికి పాల్పడ్డారు.
కుమార్తెకు పెళ్లి చేసిన జగ్గీ వాసుదేవ్ ఇతర యువతుల్ని సన్యాస జీవితం గడిపేలా ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారని మద్రాస్ హైకోర్టు ప్రశ్నించింది. తన ఇద్దరు కుమార్తెలను బ్రెయిన్వాష్ చేసి ఇషా సెంటర్లో పర్మనెంట్గా ఉంచారని Rtd. ప్రొఫెసర్ కామరాజు వేసిన HCP పిటిషన్ను సోమవారం విచారించింది. ఆధ్యాత్మిక జీవితంలో ఎవర్నీ ద్వేషించొద్దన్న వైఖరి పేరెంట్స్పై ఎందుకు కనిపించడం లేదని ఆ కుమార్తెలను ప్రశ్నించింది.
కొన్ని ట్యాబ్లెట్లు నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని పదేపదే వార్తలొస్తున్నాయి. అవి వాడితే ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. మందులు కొనేటప్పుడు ISO/WHO GHP సర్టిఫికేషన్ ప్రకారం ప్యాకింగ్ చేశారా చూడాలి. ఎక్స్పైరీ డేట్ సమీపించినవి తీసుకోకపోవడం మంచిది. మెడిసిన్ను సరైన పద్ధతిలో స్టోర్ చేశారా? అడిగి తెలుసుకోండి. కొన్ని ఇంజెక్షన్లతో పాటు ఇన్సులిన్ వంటివి రిఫ్రిజిరేటర్లో ఉంచారో లేదో గమనించండి. SHARE
లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలపై రాబడి తగ్గిపోవచ్చు. OCT 1 నుంచి మారిన పాలసీ సరెండర్ రూల్సే ఇందుకు కారణం. ఇప్పట్నుంచి ఒక ప్రీమియం చెల్లించినా మొదటి ఏడాది నుంచే గ్యారంటీగా సరెండర్ వాల్యూను పొందొచ్చు. దీంతో ఎక్కువ కాలం హోల్డ్ చేసే పాలసీలపై రిటర్న్స్ 30-50 బేసిస్ పాయింట్ల మేర తగ్గొచ్చని విశ్లేషకులు అంటున్నారు. బోనస్లోనూ కోత పడనుంది. నాన్ పార్టిసిపేటరీ పాలసీలపై మార్పు ప్రభావం వెంటనే ఉండనుంది.
తన బాల్య వివాహానికి వ్యతిరేకంగా చేసిన పోరాటంలో ఓ యువతి విజయం సాధించారు. 2004లో రాజస్థాన్లోని జోధ్పూర్లో 4 నెలల చిన్నారి అనితకు పేరెంట్స్ పెళ్లి చేశారు. ఇప్పుడు కాపురానికి రావాలంటూ అత్తింటివారు ఒత్తిడి తెచ్చారు. దీంతో ఆమె 20 ఏళ్ల వయసులో ఫ్యామిలీ కోర్టుకు వెళ్లగా, ఆ పెళ్లిని రద్దు చేసి, కోర్టు ఖర్చులను చెల్లించాలని అత్తమామలను ఆదేశించింది. బాల్య వివాహాలు దుర్మార్గం, నేరమని వ్యాఖ్యానించింది.
TG: మూసీ నది శుద్ధీకరణ అడ్డుకోవడమంటే హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు మరణశాసనం రాయడమేనని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. మూసీ విష రసాయనాలతో ఇప్పటికే ఇక్కడ పండే పంటలు, కాయగూరలను ఎవరూ కొనని పరిస్థితి వచ్చిందని ట్వీట్ చేశారు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో శుద్ధీకరణ కోసం ముందడుగు వేస్తుంటే రోజుకో కుట్రతో BRS రాజకీయం చేస్తుండటం అత్యంత దారుణం అని విమర్శించారు.
TG: దసరా నాటికి మంత్రివర్గాన్ని విస్తరించాలని కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ఈమేరకు పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి(NLG), గడ్డం వినోద్(ADB), గడ్డం వివేకానంద్(ADB), ప్రేమ్సాగర్ రావు(ADB), బాలూనాయక్(NLG), రామచంద్రునాయక్(WGL), మల్రెడ్డి రంగారెడ్డి(RR), సుదర్శన్రెడ్డి(NZB), దానం నాగేందర్(HYD), వాకిటి శ్రీహరి(MBNR) ఉన్నారు. మరికొద్దిరోజుల్లో క్లారిటీ రానుంది.
TG: ఈరోజు పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అంచనా వేసిన వాతావరణశాఖ యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, నిర్మల్, కొమురంభీమ్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, కామారెడ్డి, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, సిద్దిపేట, హన్మకొండ, వరంగల్, మల్కాజిగిరి, భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంది. <<14239007>>APలో ఈ జిల్లాల్లో వర్షాలు.<<>>
ఏపీలోని పలు జిల్లాల్లో ఈరోజు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, VZM, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విశాఖపట్నం, కాకినాడ జిల్లాల్లో మోస్తరు వర్షాలు, కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, కృష్ణా, NTR, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, ATP, శ్రీ సత్యసాయి, YSR, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడతాయంది.
AP: పోలవరంలో కీలకమైన డిజైన్లు, నిర్మాణ పనులపై ఈ నెల 20న కేంద్ర జల సంఘం ప్రాజెక్టు వద్ద వర్క్షాప్ నిర్వహించనుంది. డయాఫ్రంవాల్, ఎగువ కాఫర్ డ్యామ్లో సీపేజీకి అడ్డుకట్ట వేయడం తదితర అంశాలపై అంతర్జాతీయ నిపుణులు, ఉన్నతాధికారులు చర్చించనున్నారు. ఈ ఏడాది నవంబర్ నుంచి 2025 జులై వరకు చేయాల్సిన పనుల షెడ్యూల్ను ఖరారు చేస్తారు.
Sorry, no posts matched your criteria.