India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇవాళ రాత్రి 8.30 గంటలకు ఆయన హస్తినకు బయల్దేరి వెళ్తారు. అక్కడ ఆయన కాంగ్రెస్ పెద్దలతో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణపై చర్చించనున్నట్లు సమాచారం.
టీమ్ ఇండియా స్టార్ విరాట్ కోహ్లీ చరిత్ర లిఖించారు. బంగ్లాతో జరుగుతున్న రెండో టెస్టులో 27వేల పరుగుల మైలురాయిని చేరుకున్నారు. అన్ని ఫార్మాట్లు కలిపి సచిన్ 623 ఇన్నింగ్స్లలో ఈ ఘనత సాధించగా విరాట్ 594 ఇన్నింగ్స్లలోనే ఆ మార్కును చేరుకున్నారు. క్రికెట్ చరిత్రలో ఇంత వేగంగా ఈ ఘనత సాధించింది విరాట్ ఒక్కరే. సచిన్, కోహ్లీతో పాటు రికీ పాంటింగ్, సంగక్కర కూడా 27వేల పరుగుల మైలురాయి దాటారు.
TG: తనపై మాజీ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో దారుణంగా పోస్టులు పెట్టిస్తున్నారని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. కవిత పట్ల ఎవరైనా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే కేటీఆర్ సమర్థిస్తారా? అని ప్రశ్నించారు. ఆయన మొదట్నుంచీ మహిళలను అవమానిస్తున్నారని, డబ్బులు ఇచ్చి దారుణంగా ట్రోలింగ్ చేయిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా ఇవన్నీ మానుకోవాలని, లేదంటే తెలంగాణ మహిళలంతా తిరగబడతారని మంత్రి హెచ్చరించారు.
కాన్పూర్ వేదికగా బంగ్లాదేశ్తో జరుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో భారత్ 285/9 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. జైస్వాల్ 72(51), రాహుల్ 68(43), కోహ్లీ 47(35), గిల్ 39(36), రోహిత్ 23(11) రన్స్తో రాణించారు. తొలి ఇన్నింగ్స్లో బంగ్లా 233 రన్స్కు ఆలౌట్ అయింది.
AP: విజయవాడ ఇంద్రకీలాద్రిపై దేవీశరన్నవరాత్రి ఉత్సవాలకు సీఎం చంద్రబాబును దేవదాయశాఖ ఆహ్వానించింది. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, దేవదాయశాఖ కమిషనర్ సీఎంకు ఆహ్వాన పత్రిక అందించారు. కాగా అక్టోబర్ 3 నుంచి ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
బేర్స్ పంజాతో దేశీయ బెంచ్ మార్క్ సూచీలు విలవిల్లాడాయి. సోమవారం ట్రేడింగ్లో ఏ దశలోనూ కోలుకోలేకపోయాయి. సెన్సెక్స్ 1,272 పాయింట్లు, నిఫ్టీ 368 పాయింట్ల భారీ నష్టాన్ని మూటగట్టుకున్నాయి. రెండు సూచీల్లోనూ Lower Lows మినహా ఏ రకమైన ప్యాట్రన్ దర్శనమివ్వలేదు. సెన్సెక్స్ 84,299 వద్ద, నిఫ్టీ 25,810 వద్ద స్థిరపడ్డాయి. మార్కెట్లు ఆల్ టైం హైలో ఉండడంతో ఓవర్ వాల్యూయేషన్ భయాలు వెంటాడాయి.
దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారానికి ఎంపికైన హిందీ నటుడు మిథున్ చక్రవర్తికి ఏపీ డిప్యూటీ సీఎం, నటుడు పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. ‘హిందీ, బెంగాలీ చిత్ర పరిశ్రమలో మిథున్ తనదైన ముద్ర వేశారు. 80వ దశకంలో దేశవ్యాప్తంగా యువతపై ఆయన ప్రభావం ఉంది. నేను నటించిన ‘గోపాల గోపాల’లో లీలాధర్ స్వామిగా కీలక పాత్ర పోషించారు. భగవంతుడు ఆయనకు సంపూర్ణ ఆయురారోగ్యాలను ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను’ అని పేర్కొన్నారు.
లడ్డూ వివాదంలో AP ప్రభుత్వం తీరును SC ఆక్షేపించింది. ‘ఈ వివాదంపై Sep 18న ముఖ్యమంత్రి ప్రకటన చేశారు. Sep 25న FIR నమోదైంది. Sep 26న సిట్ ఏర్పాటైంది. విచారణ పూర్తవ్వకముందే మనోభావాలు దెబ్బతీసేలా మీడియా ముందు ప్రకటన చేయాల్సిన అవసరం ఏముంది’ అని ప్రశ్నించింది. లడ్డూలు రుచిగా లేవని భక్తులు ఫిర్యాదు చేశారని TTD లాయర్ పేర్కొన్నారు. మరి ఆ లడ్డూలను పరీక్షలకు పంపారా? అంటూ కోర్టు నిలదీసింది.
తిరుమల లడ్డూ వ్యవహారంపై నటుడు ప్రకాశ్ రాజ్ మరోసారి స్పందించారు. విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఇవాళ ‘దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగకండి’ అన్న వ్యాఖ్యలను ఆయన కోట్ చేశారు. SC స్టేట్మెంట్ను పోస్ట్ చేశారు. కాగా లడ్డూ వివాదాన్ని పెద్దది చేయకుండా దర్యాప్తు చేయాలని ఇటీవల ప్రకాశ్ రాజ్ అన్నారు. అయితే ఆయన వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం పవన్ తీవ్రంగా స్పందించిన విషయం తెలిసిందే.
TG: ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న CM రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి ఇంటిని ఎందుకు కూల్చడం లేదని మాజీ మంత్రి KTR ప్రశ్నించారు. ‘40-50 ఏళ్ల కిందట కట్టుకున్న పేదల ఇళ్లను పడగొడతామంటే నీ అయ్య జాగీర్ కాదని గుర్తుచేస్తున్నా. HYDలో రియల్ ఎస్టేట్ రంగాన్ని మొత్తం పడగొట్టారు. కొనుగోలుదారులు, పెట్టుబడిదారులు భయపడుతున్నారు. రిజిస్ట్రేషన్ ఆదాయం రూ.1150 కోట్ల నుంచి రూ.750 కోట్లకు పడిపోయింది’ అని KTR తెలిపారు.
Sorry, no posts matched your criteria.