news

News February 27, 2025

షాకింగ్.. కొడుకుకు 18 ఏళ్లు నిండొద్దని చంపేసింది

image

USలో మిచిగాన్‌లో దారుణ ఘటన జరిగింది. కేటీ లీ అనే మహిళ కొడుకు ఆస్టిన్(17)ను బర్త్ డే రోజునే చంపేసింది. తనకు 18 ఏళ్లు నిండొద్దని ఆస్టిన్ కోరుకున్నాడని, ఆ మేరకు తల్లి చంపేసిందని కోర్టు విచారణలో పోలీసులు వెల్లడించారు. అయితే తామిద్దరం ఆత్మహత్యాయత్నం చేశామని, అతను అపస్మారక స్థితిలోకి వెళ్లాక గొంతు కోసినట్లు ఆమె తొలుత 911కు కాల్ చేసి చెప్పడం గమనార్హం. ఆమె మానసిక స్థితి సరిగా లేనట్లు సమాచారం.

News February 27, 2025

Perplexity AIతో పేటీఎం జట్టు

image

తమ యాప్‌లో AI పవర్డ్ సెర్చ్‌ ఆప్షన్ అందించేందుకు Perplexity‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నామని Paytm CEO విజయ్ శేఖర్ అన్నారు. యూజర్లు ఆర్థిక నిర్ణయాలు తీసుకొనేందుకు, స్థానిక భాషల్లో రోజువారీ ప్రశ్నలు అడిగేందుకు దీంతో వీలవుతుందన్నారు. ‘నిర్ణయాలు తీసుకొనే ముందు ప్రజలు సమాచారం పొందుతున్న తీరును AI మార్చేసింద’ని ఆయన తెలిపారు. Perplexityని స్థాపించింది IITM గ్రాడ్యుయేట్ అరవింద్ శ్రీనివాస్ కావడం విశేషం.

News February 27, 2025

సత్యవర్ధన్‌కు నార్కో టెస్టులు చేయండి: వంశీ

image

AP: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ 3 రోజుల కస్టడీ ముగియడంతో పోలీసులు ఆయనను SC, ST కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మేజిస్ట్రేట్ ముందు వంశీ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసులో ఫిర్యాదుదారుడైన సత్యవర్ధన్‌కు నార్కో అనాలసిస్ పరీక్షలు నిర్వహిస్తే నిజాలు బయటకు వస్తాయని చెప్పారు. ఇందుకు తాను కూడా సిద్ధమేనన్నారు. కస్టడీలో పోలీసులు తనను కేసుతో సంబంధం లేని ప్రశ్నలు అడిగారని తెలిపారు.

News February 27, 2025

కన్నప్ప మూవీ కొత్త పోస్టర్ విడుదల

image

కన్నప్ప చిత్రం విడుదల తర్వాత శివుడి గురించి ఎవరు ఆలోచించినా అక్షయ్ కుమార్ రూపమే దర్శనమిస్తుందని నటుడు మంచు విష్ణు అన్నారు. కన్నప్ప హిందీ టీజర్ లాంఛ్ ఈవెంట్ సందర్భంగా మూవీకి సంబంధించిన కొత్త పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. స్టార్ హీరోల పాత్రలు ఎలా ఉండనున్నాయో ఈ పోస్టర్‌లో దర్శనమిస్తున్నాయి. ఈ చిత్ర టీజర్ మార్చి1న విడుదల అవుతుండగా ఏప్రిల్ 25న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

News February 27, 2025

CT: గెలుపు రుచి ఎరుగని పాకిస్థాన్

image

ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఆతిథ్య పాకిస్థాన్ ఒక్క విజయం కూడా లేకుండా తమ జర్నీ ముగించింది. దాదాపు 3 దశాబ్దాల తర్వాత ICC టోర్నీ నిర్వహిస్తున్న పాక్ గెలుపు రుచి చూడకుండానే నిష్క్రమించింది. న్యూజిలాండ్, భారత్‌తో జరిగిన మ్యాచుల్లో ఘోర ఓటమిపాలై, బంగ్లాతో జరగాల్సిన మ్యాచు వర్షం కారణంగా రద్దైంది. పాక్ తలరాతను చూసి ఆ దేశ అభిమానులు నిట్టూరుస్తున్నారు. కప్ కాదు కదా ఒక్క మ్యాచ్ కూడా విన్ కాలేదంటూ వాపోతున్నారు.

News February 27, 2025

ఆర్టీసీలో ఏమైనా పొగొట్టుకున్నారా ? ఈ నంబర్‌కు కాల్ చేయండి

image

TG: ఆర్టీసీ టికెట్‌పై రాసిన చిల్లర తీసుకోకుండా మర్చిపోయారా? ఏం ఫర్వాలేదు. టోల్ ఫ్రీ నంబర్ 040-69440000 కాల్ చేసి మీరు ప్రయాణించిన బస్సు, టికెట్ వివరాలు చెబితే ఆ డబ్బులను RTC మీకు ఫోన్‌పే ద్వారా అందిస్తుంది. అంతేకాకుండా మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు మధ్యలో బస్సు మిస్సైనా అదే టికెట్‌పై మరో బస్సులో గమ్యానికి చేరవచ్చు. ఏవైనా వస్తువులు పొగొట్టుకున్నాటోల్ ఫ్రీ నంబరుకు కాల్ చేసి వాటిని పొందొచ్చు.

News February 27, 2025

ఢిల్లీ క్యాపిటల్స్ మెంటార్‌గా పీటర్సన్

image

ఐపీఎల్ టీమ్ ఢిల్లీ క్యాపిటల్స్ మెంటార్‌గా ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్‌ను ఆ ఫ్రాంచైజీ నియమించింది. త్వరలోనే ఆయన జట్టులో చేరనున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించింది. కాగా పీటర్సన్ 2009 నుంచి 2016 వరకు ఐపీఎల్‌లో ఆడారు. ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టుకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించారు. అప్పటి నుంచే జట్టు ఓనర్ గ్రంధి కిరణ్‌కుమార్‌తో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.

News February 27, 2025

ఇళ్ల నిర్మాణంపై కీలక ఉత్తర్వులు

image

APలో అక్రమ నిర్మాణాలకు సంబంధించి మున్సిపల్ శాఖ గైడ్‌లైన్స్ ఇచ్చింది. ఆక్యుపేషన్ సర్టిఫికెట్‌పై భవన యజమానుల వద్ద అండర్ టేకింగ్ తీసుకోవాలంది. ఎప్పటికప్పుడు అధికారులు బిల్డింగ్ ప్లాన్, నిర్మాణాలు తనిఖీ చేయాలని స్పష్టం చేసింది. ప్లాన్ మేరకు నిర్మాణం లేకపోతే నివాసయోగ్య పత్రం జారీ చేయకూడదని పేర్కొంది. ఆ పత్రం లేకపోతే తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్ కనెక్షన్లు, బ్యాంకులు రుణాలు ఇవ్వొద్దని తేల్చి చెప్పింది.

News February 27, 2025

గ్రూప్-2 మెయిన్స్: అభ్యంతరాల గడువు పొడిగింపు

image

AP: గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలో ప్రశ్నలు, కీపై అభ్యంతరాలు తెలిపేందుకు గడువును APPSC రేపటి వరకు పొడిగించింది. ఆన్‌లైన్‌లో మాత్రమే స్వీకరిస్తామని, పోస్ట్, ఫోన్, SMS, వాట్సాప్ ద్వారా పంపితే పరిగణించబోమని స్పష్టం చేసింది. అనేక వివాదాలు, ఆందోళనల నడుమ ఈ నెల 23న జరిగిన పరీక్షకు 79,599 మంది హాజరైన విషయం తెలిసిందే. అదే రోజు ప్రాథమిక కీని కమిషన్ విడుదల చేసింది.
వెబ్‌సైట్: https://portal-psc.ap.gov.in/

News February 27, 2025

14 నెలల పాలనలో 4 ప్రాజెక్టులు కొట్టుకుపోయాయి: హరీశ్ రావు

image

TG: రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులను కాపాడలేని దుస్థితిలో INC ప్రభుత్వం ఉందని BRS MLA హరీశ్ రావు మండిపడ్డారు. కృష్ణా జలాలను AP తరలించుకుపోతుంటే చోద్యం చూస్తోందని దుయ్యబట్టారు. గోదావరిపై బనకచర్ల ప్రాజెక్టు నిర్మిస్తుంటే నోరెత్తడం లేదని ఫైరయ్యారు. SLBC టన్నెల్ వద్ద ఆయన మాట్లాడుతూ ‘కాంగ్రెస్ 14 నెలల పాలనలో 4 ప్రాజెక్టులు కొట్టుకుపోయాయి. SLBC వద్ద శిథిలాల తొలగింపులో వేగం పెంచాలి’ అని పేర్కొన్నారు.