India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
లిప్స్టిక్ వేసుకుందనే కారణంతో చెన్నై మేయర్ ప్రియ తన దఫేదార్ మాధవిని బదిలీ చేయించారు. హఠాత్తుగా ఆమెను మనలి మండలానికి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మేయర్ వేసుకునే రంగులోనే దఫేదార్ కూడా లిప్స్టిక్ వేసుకు రావడంతో బదిలీ వేటు వేసినట్లు తెలుస్తోంది. 15 ఏళ్లుగా లిప్స్టిక్ వేసుకుంటున్నానని, దీనిని ఉన్నట్టుండి మార్చుకోమనడం సబబు కాదని మాధవి వాదిస్తోంది ఈ వార్తలను కార్పొరేషన్ ఖండించింది.
KBC16లో ₹కోటి <<14197949>>గెలుచుకున్న<<>> చందర్ ₹7Cr ప్రైజ్మనీని త్రుటిలో కోల్పోయారు. ‘1587లో నార్త్ USలో ఇంగ్లిష్ దంపతులకు జన్మించిన తొలి బిడ్డ ఎవరు?’ అని అమితాబ్ ప్రశ్నించారు. ఆన్సర్ తెలియకపోవడంతో చందర్ రూ.కోటితో క్విట్ అయ్యారు. గెస్ చేయమని అమితాబ్ అడగ్గా.. అతడు చెప్పిన సమాధానమే కరెక్ట్ అయింది. మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆప్షన్స్.. వర్జీనియా డేర్, వర్జీనియా హాల్, వర్జీనియా కాఫే, వర్జీనియా సింక్.
కిరణ్ రావు తెరకెక్కించిన ‘లాపతా లేడీస్’ 2025ఆస్కార్ అవార్డుకు భారత్ నుంచి అధికారికంగా నామినేట్ అయిన విషయం తెలిసిందే. అయితే, ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో భారతీయ హిందీ చిత్రం ‘సంతోశ్’ UK నుంచి అధికారిక ఎంట్రీగా ఎంపికైంది. బ్రిటీష్-ఇండియన్ ఫిల్మ్ మేకర్ సంధ్యాసూరి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆస్కార్కి UK నుంచి ఎంపిక కావడం తమ కృషికి ప్రతిఫలంగా భావిస్తున్నట్లు నటి గోస్వామి అభిప్రాయపడ్డారు.
AP: YCP మాజీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరినా చర్యలు తప్పవని TDP MLA దామచర్ల జనార్ధన్ హెచ్చరించారు. ఆయనతోపాటు కొడుకు ప్రణీత్పై కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ‘ఎన్నికల ముందు నాపైన, TDP శ్రేణులపైనా బాలినేని అక్రమ కేసులు పెట్టించారు. బాలినేనిని.. పవన్ కళ్యాణ్ ఎందుకు పార్టీలో చేర్చుకుంటున్నారు? పవన్ కూడా బాలినేనిని కాపాడలేరు. ఈ విషయంలో ఎంతదూరమైనా వెళ్తాను’ అని మండిపడ్డారు.
తన లక్ష్య సాధనలో ఎన్ని సమస్యలు వచ్చినా పోరాడిన తీరును ఒలింపిక్ మెడలిస్ట్ మనూ భాకర్ గుర్తుచేసుకున్నారు. ‘నాకు 14 ఏళ్లు ఉన్నపుడు షూటింగ్ ప్రయాణం ప్రారంభించా. మీరు ఏదైనా ప్రారంభించిన తర్వాత మీ కలలు ఎంత పెద్దవైనా వాటిని పూర్తిచేసేందుకు సాధ్యమైనవన్నీ చేయండి. లక్ష్య సాధనకు కట్టుబడి, ఏకాగ్రతతో మీ ప్రయాణం కొనసాగించండి. ఒలింపిక్లో స్వర్ణం సాధించే నా కల కోసం కష్టపడుతూనే ఉంటా’ అని ట్వీట్ చేశారు.
ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ వరుస ట్వీట్లతో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ఆయన చేసిన మరో ట్వీట్ వైరలవుతోంది. ‘గెలిచేముందు ఒక అవతారం. గెలిచిన తర్వాత ఇంకో అవతారం. ఏంటీ అవాంతరం. ఎందుకు మనకీ అయోమయం. ఏది నిజం? జస్ట్ ఆస్కింగ్?’ అని ప్రశ్నించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ను ఉద్దేశించి ఆయన ఈ ట్వీట్ చేశారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
టీమ్ ఇండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ బంగ్లాదేశ్తో తొలి టెస్టులో (6, 17 రన్స్) విఫలమయ్యారు. కాగా రెండో టెస్టులో ఫామ్ అందుకుంటారని అంతా భావిస్తున్న నేపథ్యంలో మళ్లీ ఆందోళన మొదలైంది. నెట్ ప్రాక్టీస్లో కోహ్లీని 15బంతుల్లో 4సార్లు బుమ్రా ఔట్ చేశారు. దీంతో కోహ్లీ పక్కనే నెట్స్లోకి వెళ్లి అశ్విన్, జడేజా, అక్షర్ పటేల్ బౌలింగ్లో ప్రాక్టీస్ చేశారు. అయితే అక్కడా కోహ్లీ కాస్త తడబడ్డట్లు తెలుస్తోంది.
AP: తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో మాజీ సీఎం జగన్ రేపు తిరుమల పర్యటనకు వెళ్లనున్నారు. ఎల్లుండి శ్రీవారికి ప్రత్యేక పూజలు చేయనున్నారు. కాగా జగన్ పర్యటన నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అలిపిరిలోనే జగన్ డిక్లరేషన్ ఇవ్వాలని కూటమి నేతలు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే కొండ కిందనే ఆయనను అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు ముందస్తు అరెస్టులు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.
శివసేన నేత సంజయ్ రౌత్కు ముంబై మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ 25వ కోర్టు 15 రోజుల జైలు శిక్ష విధించింది. BJP నేత కిరీట్ సోమయ్య సతీమణి మేధా వేసిన పరువు నష్టం దావా విచారణ అనంతరం కోర్టు ఈ తీర్పిచ్చింది. జైలుతో పాటు రూ.25వేల జరిమానా కూడా విధించింది. పబ్లిక్ టాయిలెట్స్కు సంబంధించిన రూ.100కోట్ల ప్రాజెక్టులో తాను, తన భర్త అవినీతికి పాల్పడ్డట్లు సంజయ్ నిరాధార ఆరోపణలు చేశారంటూ మేధా కోర్టును ఆశ్రయించారు.
ప్రస్తుతం కొందరు ఏ చిన్న నొప్పి కలిగినా వెంటనే పెయిన్ కిల్లర్స్ వాడుతున్నారు. కానీ వీటిని వేసుకోవడం ఏమాత్రం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. పెయిన్ కిల్లర్స్ అతిగా తీసుకుంటే తల నొప్పి, కడుపులో మంట, అల్సర్లు, రక్త ప్రసరణ సమస్యలు, కిడ్నీలు దెబ్బతినడం వంటి సమస్యలు తలెత్తుతాయి. శరీరంపై ప్రతికూల ప్రభావం చూపిస్తాయి. సహజ మార్గాల్లోనే నొప్పి తగ్గించుకుంటే మంచిది. తొందరపడి వీటిని వాడవద్దు.
Sorry, no posts matched your criteria.