news

News September 25, 2024

సినీ అభిమానులకు నాగవంశీ రిక్వెస్ట్!

image

‘దేవర’ రిలీజ్ నేపథ్యంలో నిర్మాత నాగవంశీ అభిమానులకు విజ్ఞప్తి చేశారు. ‘తారక్ అన్న చాలా గ్యాప్ తర్వాత మంచి మాస్ కంటెంట్‌తో వస్తున్నారు. బెన్ఫిట్ షోలతో పాటు భారీ స్థాయిలో విడుదల చేస్తున్నాం. అభిమానులు ఫ్యాన్స్ వార్స్ సృష్టించడం ఆపండి. మూవీపై నెగటివిటీని ఆపేయండి. ప్రీమియర్స్ చూసేవారు సోషల్ మీడియాలో వీడియోలు పెట్టకండి. ఎవరినీ వీడియోలు తీయనివ్వొద్దు. NTRకు బ్లాక్ బస్టర్ అందిద్దాం’ అని పేర్కొన్నారు.

News September 25, 2024

రంజీల్లో ఆడనున్న విరాట్ కోహ్లీ?

image

టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రంజీల్లో ఆడనున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ ప్రాబబుల్స్‌లో కోహ్లీతోపాటు రిషభ్ పంత్ పేరును కూడా DDCA చేర్చింది. చండీగఢ్‌తో జరిగే మ్యాచ్‌లో విరాట్ బరిలోకి దిగే సూచనలు కనిపిస్తున్నాయి. అప్పటికి బంగ్లాతో టెస్ట్ సిరీస్ కూడా పూర్తి కానుంది. కాగా కోహ్లీ చివరిసారిగా 2012-13 సీజన్‌లో రంజీల్లో ఆడారు. యూపీపై చెలరేగి ఆడి న్యూజిలాండ్ సిరీస్‌కు ఎంపికయ్యారు.

News September 25, 2024

అనుమతులు లేకుండానే నడుస్తోన్న EY కంపెనీ

image

పని ఒత్తిడితో <<14129191>>చనిపోయిన<<>> యువ సీఏ అన్నా సెబాస్టియన్ పనిచేసిన పుణేలోని EY కార్యాలయానికి పర్మిషనే లేదని విచారణలో తేలింది. కార్మిక శాఖ అధికారులు కంపెనీలో తనిఖీ చేయగా ఈ విషయం బయటపడింది. ఈ ఏడాది FEBలో రిజిస్ట్రేషన్ కోసం కార్మిక శాఖకు అప్లై చేశారు. 16 ఏళ్లుగా రిజిస్ట్రేషన్ చేయనందుకు శాఖ నిరాకరించింది. కార్మికుల మరణానికి సంస్థ కారణమైతే ₹5లక్షలు జరిమానా, ఓనర్‌కి 6నెలల జైలుశిక్ష ఉంటుందని అధికారులు తెలిపారు.

News September 25, 2024

నటుడు మోహన్ బాబు ఇంట్లో దొంగతనం

image

TG: నటుడు మోహన్ బాబు ఇంట్లో దొంగతనం జరిగింది. హైదరాబాద్‌లోని జల్‌పల్లి నివాసంలో రూ.10 లక్షలు పోయినట్లు ఆయన గుర్తించారు. పనిమనిషి నాయక్ ఆ డబ్బును చోరీ చేసినట్లు మోహన్ బాబు రాచకొండ సీపీకి ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం తిరుపతిలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా గతంలోనూ ఆయన ఇంట్లో చోరీ జరిగింది. 2019లో డబ్బులు, బంగారు ఆభరణాలు పనిమనిషి దొంగిలించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News September 25, 2024

పాక్ బిచ్చగాళ్లకు సౌదీ స్ట్రాంగ్ వార్నింగ్

image

ఉమ్రా, హజ్ వీసాలతో తమ దేశంలోకి పాకిస్థానీ బిచ్చగాళ్లు వెల్లువలా వచ్చిపడుతుండటంతో సౌదీ అరేబియా ఆందోళన వ్యక్తం చేస్తునట్లు తెలుస్తోంది.
పాక్ జాతీయులు తమ దేశంలో బిచ్చమెత్తుకుంటే రూ.2.22 లక్షల జరిమానా విధించనున్నట్లు సమాచారం. ఈ విషయంపై పాక్ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరించినట్లు తెలుస్తోంది. బిచ్చగాళ్లను తమ దేశానికి పంపడం వెనుక మాఫియా ఉందని, మొత్తం యాచకుల్లో 90% వారే ఉన్నట్లు తెలిపింది.

News September 25, 2024

అక్టోబర్ 9న సింగరేణి కార్మికుల బోనస్ పంపిణీ

image

TG: సింగరేణి కార్మికులకు 33% లాభాల వాటాను ప్రభుత్వం దసరా బోనస్‌గా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మొత్తాన్ని అక్టోబర్ 9న చెల్లించేందుకు యాజమాన్యం ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు సింగరేణి CMD ఎన్.బలరామ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మొత్తంగా రూ.796 కోట్ల లాభాలను GOVT బోనస్‌గా చెల్లించనుంది. సంస్థలో పని చేస్తున్న 42 వేల మంది లబ్ధి పొందనున్నారు. సగటున ఒక్కొక్కరు రూ.1.90 లక్షల చొప్పున పొందే అవకాశముంది.

News September 25, 2024

డబ్బుల కోసమే నా పై ఆరోపణలు: హర్షసాయి

image

తనపై నార్సింగి పీఎస్‌లో అత్యాచార <<14188760>>కేసు <<>>నమోదు కావడంపై యూట్యూబర్ హర్షసాయి సోషల్ మీడియాలో స్పందించారు. ‘డబ్బుల కోసమే ఆమె నాపై ఆరోపణలు చేస్తోంది. త్వరలోనే నిజాలు బయటకు వస్తాయి. నా అడ్వొకేట్ అన్ని వివరాలు తెలియజేస్తారు. నేనేంటో నా ఫాలోవర్స్‌కు తెలుసు’ అని ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టారు. అటు హర్షసాయి కోసం HYD పోలీసులు గాలిస్తున్నారు.

News September 25, 2024

Ease of Business: డీక్రిమినలైజ్ కోసం 300 లా పాయింట్లు షార్ట్‌లిస్ట్

image

మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్‌కు బూస్ట్ ఇచ్చేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 300 లా పాయింట్లు, సెక్షన్లను షార్ట్‌లిస్ట్ చేసింది. వివిధ మంత్రిత్వ శాఖల్ని సంప్రదించి వీటిలో సగం వరకు డీక్రిమినలైజ్ చేస్తామని కామర్స్ మినిస్టర్ పీయూష్ గోయల్ అన్నారు. జన్ విశ్వాస్ 2.0 కింద కంపెనీలపై రూల్స్ ఒత్తిడి తగ్గిస్తామన్నారు. ప్రతి ఎలక్ట్రానిక్ డివైజులో మేకిన్ ఇండియా పరికరం ఉండాలన్నదే తమ గోల్‌ అని చెప్పారు.

News September 25, 2024

బాలుగారి మధుర గాత్రం చెవులకు వినిపిస్తూనే ఉంది: సీఎం

image

AP: గానగాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వర్ధంతి సందర్భంగా సీఎం చంద్రబాబు నివాళి అర్పించారు. ‘సినీ సంగీత చరిత్రలో ఒక సువర్ణ శకాన్ని తన పరం చేసుకున్న మధుర గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు. మైమరపింపజేసే ఆయన మధుర గాత్రం పాట రూపంలో చెవులకు వినిపిస్తూనే ఉంది. బాలుగారి వర్ధంతి సందర్భంగా ఆ బహుముఖ ప్రజ్ఞాశాలి స్మృతికి నివాళి అర్పిస్తున్నాను’ అని సీఎం ట్వీట్ చేశారు.

News September 25, 2024

కమలా హారిస్ క్యాంపెయిన్ ఆఫీస్‌పై కాల్పులు

image

అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ అరిజోనా క్యాంపెయిన్ ఆఫీస్‌పై కాల్పులు జరిగాయని పోలీసులు తెలిపారు. సెప్టెంబర్ 16 అర్ధరాత్రి తర్వాత ఇలా జరగడం రెండోసారి అన్నారు. ఆఫీస్ ముందున్న విండోస్‌పై బుల్లెట్ హోల్స్ గుర్తించామన్నారు. BB గన్ లేదా పెల్లెట్ గన్‌తో పేల్చినట్టు వారు అనుమానిస్తున్నారు. ‘రాత్రి కావడంతో ఆఫీసులో ఎవరూ లేరు. అక్కడ పనిచేస్తున్న వారి భద్రతపై ఆందోళన కలుగుతోంది’ అని వారు పేర్కొన్నారు.

error: Content is protected !!