India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఏపీ అసెంబ్లీ శుక్రవారానికి వాయిదా పడింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై సుదీర్ఘంగా మాట్లాడారు. అనంతరం ఈ తీర్మానానికి ఆమోదం లభించినట్లు ప్రకటించిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆ తర్వాత ఫిబ్రవరి 28కి సభను వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు.

జీమెయిల్ లాగిన్కు సంబంధించి SMS కోడ్ స్థానంలో క్యూఆర్ కోడ్లను తీసుకురావాలని గూగుల్ యోచిస్తున్నట్లు సమాచారం. మెయిల్ సెక్యూరిటీ కోసం ప్రస్తుతం SMS బేస్డ్ టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ను గూగుల్ అమలు చేస్తోంది. దీనితో పోలిస్తే క్యూఆర్ కోడ్ విధానం మరింత భద్రతనిస్తుందని సంస్థ భావిస్తోంది. ఈ కోడ్లను స్కాన్ చేయడానికి స్మార్ట్ ఫోన్లలోని కెమెరా యాప్ను ఉపయోగించాల్సి ఉంటుంది.

AP: వసతి గృహాల్లో విద్యార్థులతో ఏ రకమైన <<15559875>>పనులు <<>>చేయించినా సిబ్బందిపై చర్యలు తప్పవని రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ ఛైర్మన్ అప్పారావు హెచ్చరించారు. విద్యార్థులతో వంట, పరిశుభ్రత పనులు, టాయిలెట్స్ క్లీనింగ్, నీళ్లు తెప్పిస్తున్న ఘటనలు తమ దృష్టికి వచ్చాయని తెలిపారు. ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యార్థులపై ఎలాంటి మానసిక, శారీరక ఒత్తిడి లేకుండా చూడాలన్నారు.

ఈ ఏడాది జూన్-జులైలో ఇంగ్లండ్తో టెస్ట్ సిరీస్ ఉన్న నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఐపీఎల్ జరిగే రెండు నెలలపాటు (మార్చి 22-మే 25) భారత ప్లేయర్లతో రెడ్ బాల్ ప్రాక్టీస్ కూడా చేయించేలా ప్రణాళికలు రచిస్తున్నట్లు CRICBUZZ పేర్కొంది. ఇటీవల టెస్టుల్లో వరుస ఓటములు ఎదురు కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్లాన్ ను ఎలా అమలు చేస్తారనేది తెలియాల్సి ఉంది.

AP: వల్లభనేని వంశీని కస్టడీకి తీసుకున్న పోలీసులు తొలి రోజు రెండున్నర గంటలు విచారించారు. సత్యవర్ధన్ కిడ్నాప్నకు సంబంధించి 20 ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. ఆ కేసుకు, తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. వంశీ రిమాండ్ను మరో 14 రోజులు పొడిగించిన కోర్టు 3 రోజులు పోలీస్ కస్టడీకి అనుమతించిన విషయం తెలిసిందే.

దంపతులు రెండో బిడ్డను కనడం కష్టమవుతోందని వైద్యులు అంటున్నారు. ఏళ్లు గడిచే కొద్దీ సెకండరీ ఇన్ఫెర్టిలిటీ రేటు పెరుగుతోందని ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతమిది 30%కి చేరిందని, అనారోగ్యం, జీవనశైలి సమస్యలే ఇందుకు ప్రధాన కారణాలని చెప్తున్నారు. దీంతో పురుషుల్లో వీర్యం నాణ్యత, మహిళల అండాశయాల్లో గుడ్లు తగ్గుతున్నాయని వివరించారు. BP, షుగర్, థైరాయిడ్, ఒబెసిటీ, PCOD వంటివి సమస్యను పెంచుతున్నాయని చెప్పారు.

TG: నిర్మల్ జిల్లా కలెక్టరేట్, ఆర్డీవో ఆఫీసు భవనాల స్వాధీనానికి స్థానిక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. SRSP, గడ్డెన్న వాగు పరిహారం చెల్లింపులో జాప్యం జరగడంతో ఈ భవనాలు స్వాధీనం చేసుకోవాలని సీనియర్ సివిల్ జడ్జి శ్రీనివాస్ ఈ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు కలెక్టరేట్, ఆర్డీవో ఆఫీసుల్లో కోర్టు సిబ్బంది నోటీసులు అందించారు.

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాకిస్థాన్తో జరిగిన మ్యాచులో టీమ్ఇండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ సెంచరీతో చెలరేగిన విషయం తెలిసిందే. దీనితో విరాట్ ఖాతాలో అన్ని ఫార్మాట్లలో కలిపి 82 సెంచరీలు చేరాయి. కోహ్లీ సెంచరీలు చేసిన 82 సార్లు నాన్ స్ట్రైకర్గా ఎవరో ఉన్నారనే లిస్టును ఓ నెటిజన్ షేర్ చేయగా వైరలవుతోంది. తొలి సెంచరీ చేసినప్పుడు గౌతమ్ గంభీర్ తనకు నాన్ స్ట్రైకర్గా ఉండగా 82వ టన్కు అక్షర్ పటేల్ ఉన్నారు.

టాలీవుడ్లో విషాదం నెలకొంది. ప్రముఖ సినీ నిర్మాత కేదార్ సెలగంశెట్టి కన్నుమూశారు. ఆయన దుబాయ్లో చనిపోయినట్లు సినీవర్గాలు తెలిపాయి. విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ నటించిన ‘గం..గం.. గణేశా’ సినిమాకు కేదార్ నిర్మాతగా పనిచేశారు. బన్నీ వాసు, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండలకు ఈయన సన్నిహితుడు.

1. గూగుల్ – 9.6 బిలియన్
2. యూట్యూబ్ – 5.1B
3. ఇన్స్టాగ్రామ్ – 919మిలియన్లు
4. ఫేస్బుక్ – 681M
5. వాట్సాప్ – 511M
6. chatgpt – 452M
7. అమెజాన్ – 388M
8. Bing – 294M
9. వికీపీడియా – 279M
Sorry, no posts matched your criteria.