India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సంధ్య థియేటర్ తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై కిమ్స్ వైద్యులు బులెటిన్ రిలీజ్ చేశారు. రెండు రోజులుగా మినిమల్ వెంటిలేటర్ సపోర్ట్తో వైద్యం అందిస్తున్నామని తెలిపారు. న్యూరోలాజికల్ స్టేటస్లో పెద్దగా మార్పు లేదన్నారు. ఎడమవైపు ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ తగ్గిందని, పైప్ ద్వారానే ఆహారం అందిస్తున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం అతడికి జ్వరం లేదని వివరించారు.
లద్దాక్లోని పాంగాంగ్ సరస్సు ఒడ్డున ఛత్రపతి శివాజీ విగ్రహం ఏర్పాటుపై తమ అభిప్రాయాలను పట్టించుకోలేదని స్థానికులు చెబుతున్నారు. ఈ నిర్ణయం స్థానికుల్ని అసంతృప్తికి గురి చేసిందని, ఈ ప్రాంతంలో ఉన్న ప్రత్యేక వాతావరణం-వైల్డ్లైఫ్కి విగ్రహ ఏర్పాటుకు ఉన్న సంబంధం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇక్కడి ప్రజల్ని, ప్రకృతికిని గౌరవించే ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని స్థానికులు కోరుతున్నారు.
AP: రాష్ట్రంలో నూతన మద్యం పాలసీ ప్రకటించిన తర్వాత అమ్మకాలు జోరందుకున్నాయి. అక్టోబర్ 16 నుంచి డిసెంబర్ 29 మధ్య 75 రోజుల్లోనే రూ.6,312 కోట్ల విలువైన లిక్కర్ సేల్ అయినట్లు ఎక్సైజ్ శాఖ ప్రకటించింది. 83,74,116 కేసుల లిక్కర్, 26,78,547 కేసుల బీర్లు అమ్ముడుపోయినట్లు తెలిపింది. ఇవాళ, రేపు, జనవరి 1న మద్యం అమ్మకాలు మరింత పెరుగుతాయని అంచనా వేసింది.
TG: న్యూ ఇయర్ సందర్భంగా రేపు రాత్రి హైదరాబాద్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనున్నట్లు తెలంగాణ ఫోర్ వీలర్స్ అసోసియేషన్ ప్రకటించింది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలో 500 కార్లు, 250 బైక్ ట్యాక్సీలు అందుబాటులో ఉంటాయని తెలిపింది. మద్యం మత్తులో ప్రమాదాలకు గురవకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
ఢిల్లీ CM ఆతిశీ మార్లేనాను అరవింద్ కేజ్రీవాల్ టెంపరరీ CM అనడం బాధించిందని లెఫ్టినెంట్ గవర్నర్ VK సక్సేనా బాంబుపేల్చారు. ఇది ఒక రకంగా తనకూ అవమానమేనని పేర్కొన్నారు. న్యూఇయర్ విషెస్ చెబుతూ ఆమెకు లేఖ రాశారు. ‘మీరు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు నేను మనస్ఫూర్తిగా అభినందించాను. మీరు CM అవ్వడం నాకూ సంతోషమే. మీ పూర్వ CM చేయలేని పనులనూ మీరు చక్కబెడుతున్నారు. మంత్రిగానూ నిబద్ధతతో పనిచేశారు’ అని పేర్కొన్నారు.
ఎప్పుడెప్పుడా అని ప్రపంచమంతా ఎదురుచూస్తున్న HIV/AIDS వ్యాక్సిన్ వచ్చేసింది. గిలీడ్ సైన్సెస్ రూపొందించిన Lenacapavirకు USFDA అనుమతి ఇచ్చింది. మూడేళ్లలోనే ఈ టీకా 20 లక్షల మందికి చేరనుంది. ఎయిడ్స్ ఎక్కువగా వ్యాప్తి చెందుతున్న దక్షిణాఫ్రికా, టాంజానియాలో నిర్వహించిన ట్రయల్స్లో మంచి ఫలితాలు వచ్చాయని తెలిసింది. ఏడాదికి 2సార్లు తీసుకోవాల్సిన ఈ టీకా ఖరీదు సామాన్యులకు అందుబాటులో ఉండదన్న ఆందోళన నెలకొంది.
HIV/AIDSను 1983లో మొదటిసారి అమెరికాలో గుర్తించారు. అక్కడి నుంచి అన్ని దేశాలకు పాకేసింది. ప్రపంచానికి ఇదో పెనుముప్పుగా మారడంతో ‘ఎయిడ్స్కు మందు లేదు. నివారణే మార్గం’ అన్న నినాదం పుట్టుకొచ్చింది. HIV సోకి ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 4.2 కోట్ల మంది చనిపోయారని అంచనా. మొత్తంగా 8.8 కోట్ల మందికి సోకింది. 2023 చివరి నాటికి 4 కోట్ల మంది ఎయిడ్స్తోనే బతుకుతున్నారు. ఎట్టకేలకు వ్యాక్సిన్ రావడం భారీ ఊరట.
APలో ఫిబ్రవరి 1 నుంచి భూముల రిజిస్ట్రేషన్ విలువలు పెరుగుతాయని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఎక్కడ భూమి రేట్లు బాగా పెరిగాయో అక్కడ మాత్రమే రిజిస్ట్రేషన్ విలువలను పెంచుతామన్నారు. భూమి విలువల కంటే రిజిస్ట్రేషన్ విలువలు అధికంగా ఉన్న చోట రిజిస్ట్రేషన్ విలువలను తగ్గిస్తామని చెప్పారు. విలువలు పెరిగే చోట సగటున 15 నుంచి 20 శాతం వరకు పెంపుదల ఉంటుందని పేర్కొన్నారు.
తెలంగాణ ప్రభుత్వం చేపట్టే అన్ని కార్యక్రమాల్లో భాగస్వామిగా ఉంటామని మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెళ్ల తెలిపారు. HYDలో ఆయనతో సీఎం రేవంత్ బృందం భేటీ అయింది. నైపుణ్యాభివృద్ధి, మెరుగైన మౌలిక వసతులే ఆర్థికాభివృద్ధికి దోహదపడి HYDను ప్రపంచంలోని టాప్-50 నగరాల్లో ఉంచగలవని సత్య నాదెళ్ల అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెంచుతున్నందుకు ఆయనకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు.
బాక్సింగ్ డే టెస్టులో ఓడిన భారత జట్టు WTC ఫైనల్ చేరాలంటే తప్పనిసరిగా తర్వాతి టెస్టులో గెలవాలి. మరోవైపు AUSతో జరిగే టెస్టు సిరీస్లో శ్రీలంక 1-0 లేదా 2-0తో గెలవాలి. దీంతో పర్సంటేజ్ పరిగణనలోకి తీసుకుంటే భారత్ ఫైనల్ చేరనుంది. భారత్ నెక్స్ట్ టెస్టులో గెలిచినా శ్రీలంక, ఆస్ట్రేలియా సిరీస్ డ్రాగా ముగిస్తే కనుక ఫైనల్ చేరే అవకాశాలు తక్కువే. మరోవైపు వచ్చే టెస్టులో భారత్ ఓడినా, డ్రా చేసుకున్నా ఫైనల్ చేరదు.
Sorry, no posts matched your criteria.