India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బాక్సింగ్ డే టెస్టులో ఓడిన భారత జట్టు WTC ఫైనల్ చేరాలంటే తప్పనిసరిగా తర్వాతి టెస్టులో గెలవాలి. మరోవైపు AUSతో జరిగే టెస్టు సిరీస్లో శ్రీలంక 1-0 లేదా 2-0తో గెలవాలి. దీంతో పర్సంటేజ్ పరిగణనలోకి తీసుకుంటే భారత్ ఫైనల్ చేరనుంది. భారత్ నెక్స్ట్ టెస్టులో గెలిచినా శ్రీలంక, ఆస్ట్రేలియా సిరీస్ డ్రాగా ముగిస్తే కనుక ఫైనల్ చేరే అవకాశాలు తక్కువే. మరోవైపు వచ్చే టెస్టులో భారత్ ఓడినా, డ్రా చేసుకున్నా ఫైనల్ చేరదు.
* విపరీతమైన అలసట * తరచూ జబ్బు పడటం * కండరాల నొప్పి, బలహీనత * వెన్నునొప్పి * ఎముకలు విరగడం, ఆస్టియో పోరోసిస్ * జుట్టు రాలడం * డిప్రెషన్ * బరువు పెరగడం * అలర్జీ, ఎగ్జిమా * దంతక్షయం, పుచ్చిపోవడం * చిగుళ్ల వ్యాధి * మూత్రనాళ వ్యాధులు * మూత్రాశయ వ్యాధి * రికెట్స్ – తరచుగా ఇలాంటి లక్షణాలు వేధిస్తుంటే విటమిన్-డి లోపంగా అనుమానించాలని వైద్యులు అంటున్నారు. అది దొరికే ఆహారం బాగా తీసుకోవాలని సూచిస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా 21వ శతాబ్దపు 60 మంది బెస్ట్ యాక్టర్ల జాబితాను యూకేకు చెందిన ‘ది ఇండిపెండెంట్’ పత్రిక విడుదల చేసింది. ఇందులో భారత్ నుంచి ఇర్ఫాన్ ఖాన్ ఒక్కరినే చేర్చింది. ఆయనకు 41వ ర్యాంక్ ఇచ్చింది. 1988లో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఇర్ఫాన్ 100కు పైగా చిత్రాల్లో నటించారు. పాన్ సింగ్ థోమర్ సినిమాకు గాను ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు, అనేక చిత్రాలకు ఫిల్మ్ఫేర్ పురస్కారాలను పొందారు. ఈయన 2020లో చనిపోయారు.
TG: నూతన సంవత్సర వేడుకలను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ మెట్రో రైళ్లు అర్ధరాత్రి వరకు సేవలందించనున్నాయి. రాత్రి గం.12:30కి చివరి రైలు బయల్దేరుతుందని HMRL వర్గాలు వెల్లడించాయి. అర్థరాత్రి వరకు వేడుకలు ఉండటంతో పాటు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు విస్తృతంగా జరిగే అవకాశం ఉండటంతో సేఫ్గా ఇంటికి చేరేందుకు ఇది సహకరించనుంది. ఇక నగరంలో రేపు రాత్రి ఫ్లై ఓవర్లు మూసేస్తామని పోలీసులు తెలిపారు.
రష్యాతో తలపడుతున్న ఉక్రెయిన్కు అమెరికా అధ్యక్షుడు బైడెన్ 2.5 బిలియన్ డాలర్ల భారీ సైనిక సాయాన్ని ప్రకటించారు. ఉక్రెయిన్ సైన్యానికి అవసరమైన తక్షణ సామాగ్రిని అందించేందుకు 1.25 బిలియన్ డాలర్ల డ్రాడౌన్ ప్యాకేజీ, 1.22 బిలియన్ డాలర్ల విలువైన ఆయుధాల సరఫరాకు ఆమోదం తెలిపారు. రష్యాను నిలువరించే ప్రయత్నాల్లో ఉక్రెయిన్కు అండగా ఉండడం తన ప్రాధాన్యమని బైడెన్ పేర్కొన్నారు.
AP: బీపీసీఎల్, టీసీఎస్ సహా 9 కొత్త ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. SIBP సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ‘క్లీన్ ఎనర్జీ పాలసీకి భారీ స్పందన లభిస్తోంది. కంపెనీలు క్యూ కడుతున్నాయి. రాష్ట్రానికి రూ.1,82,162 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. 2,63,411 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి’ అని పేర్కొన్నారు.
AP: సూపర్-6లో భాగంగా మరో హామీని అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఉగాది నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించేందుకు సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ అంశంపై ఉన్నతాధికారులు, మంత్రి రామ్ప్రసాద్ రెడ్డితో ఇవాళ సీఎం చంద్రబాబు చర్చించారు. పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇతర రాష్ట్రాల్లో ఈ పథకంపై అధ్యయనం చేసి వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
AP: రేషన్ బియ్యం మిస్సింగ్ ఆరోపణల కేసులో మాజీ మంత్రి పేర్నినాని సతీమణి జయసుధకు కృష్ణా జిల్లా కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. పోలీసుల విచారణకు సహకరించాలని ఆదేశించింది. జయసుధ పేరిట ఉన్న గౌడౌన్ను అద్దెకు ఇవ్వగా అక్కడున్న రేషన్ బియ్యం దారి మళ్లిందనే ఆరోపణలున్నాయి.
సంతానం రేటు భారీగా తగ్గడం వియత్నాం దేశాన్ని కలవరపెడుతోంది. రికార్డు స్థాయిలో బర్త్ రేటు 1.91కి పడిపోయింది. ఈ ట్రెండ్ మరికొన్నేళ్ల పాటు కంటిన్యూ అవుతుందని నిపుణులు చెబుతున్నారు. బర్త్ రేటు తగ్గితే వృద్ధుల సంఖ్య పెరగడంతో పాటు శ్రామికుల కొరత సమస్య ఏర్పడుతుంది. ప్రస్తుతం వియత్నాంలో 60 ఏళ్లకు పైబడ్డవారు 11.9% ఉండగా, ఇది 2050 నాటికి 25%కి మించనుంది. సంతానం రేటు పెరిగేందుకు ఆ దేశం ప్రణాళికలు రచిస్తోంది.
☛ జనవరి 3 నుంచి ఫిబ్రవరి 15 వరకు నాంపల్లి గ్రౌండ్స్లో నిర్వహణ
☛ 26 ఎకరాల్లో దాదాపు 2500 స్టాల్స్ ఏర్పాటు
☛ JAN 6న మహిళలకు, JAN 31న పిల్లలకు స్పెషల్ డేలుగా కేటాయింపు
☛ ఎంట్రీ టికెట్ ధర రూ.50, పిల్లలకు ఉచితం
☛ సందర్శకులకు ఎంట్రీ ఇచ్చిన 45 నిమిషాల వరకూ ఫ్రీ వైఫై
☛ శని, ఆదివారాల్లో సా.4 నుంచి రా.11 వరకు, మిగిలిన రోజుల్లో రాత్రి 10.30 వరకు ఎగ్జిబిషన్ నిర్వహణ
Sorry, no posts matched your criteria.