news

News February 25, 2025

భర్తని మిస్ అవుతున్నా: టాలీవుడ్ హీరోయిన్

image

షూటింగ్ సమయంలో తన భర్త జాకీ భగ్నానీని మిస్ అవుతున్నట్లు హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. జాకీతో ఉన్నాననే ఫీల్ రావడం కోసం ఆయన దుస్తులు వేసుకుంటున్నట్లు చెప్పారు. ప్రస్తుతం తెలుగు సినిమాలకు ఈ బ్యూటీ దూరమవ్వగా బాలీవుడ్‌లో వరుసగా మూవీస్ చేస్తున్నారు. ఆమె నటించిన ‘మేరే హస్బెండ్ కీ బీవీ’ మూవీ ఇటీవల థియేటర్లలో విడుదలైంది.

News February 25, 2025

టెన్త్ మార్కులు ఎలా ఇద్దాం?.. విద్యాశాఖ కసరత్తు

image

TG: ఈ ఏడాది నుంచి టెన్త్ మార్కుల విధానం మారనుంది. ఇప్పటివరకు అమల్లో ఉన్న గ్రేడింగ్‌ విధానాన్ని ఎత్తివేయగా ఆ స్థానంలో దేన్ని అమలు చేయాలనే దానిపై విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. మార్కులను బట్టి పాస్, ఫెయిల్ అని ఇవ్వాలా? లేక ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ కేటగిరీలుగా ఇవ్వాలా? అని నిన్నటి సమావేశంలో చర్చించారు. అయితే ఎటూ క్లారిటీ రాకపోవడంతో త్వరలో మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు.

News February 25, 2025

అకౌంట్లలో డబ్బులు.. సీఎం కీలక ప్రకటన

image

TG: మార్చి 31లోపు అన్నదాతల అకౌంట్లలో రైతు భరోసా డబ్బులు జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రభుత్వం ఇప్పటివరకు 3 ఎకరాల లోపు ఉన్న రైతులకు నిధులు జమ చేసింది. ఇకపై మిగతావారికీ అందజేస్తామని సీఎం వెల్లడించారు. కాగా తొలుత ఎకరం వరకు ఉన్న 17 లక్షల మందికి రూ.557.54Cr, రెండెకరాల వరకు ఉన్న 13.23 లక్షల మందికి రూ.1130.29Cr, మూడెకరాల వరకు ఉన్న 9.56 లక్షల మందికి రూ.1230.98Cr ఖాతాల్లో వేశారు.

News February 25, 2025

ఇంటర్ హాల్ టికెట్లు విడుదల.. త్వరలో మొబైల్స్‌కు లింకులు

image

TG: ఇంటర్ హాల్ టికెట్లను రిలీజ్ చేసినట్లు ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య తెలిపారు. కాలేజీల లాగిన్‌లలో హాల్ టికెట్లు అప్‌లోడ్ చేసినట్లు పేర్కొన్నారు. అతి త్వరలోనే విద్యార్థుల మొబైల్ నంబర్లకు హాల్ టికెట్ల డౌన్లోడ్ లింకును పంపిస్తామన్నారు. మార్చి 5 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానుండగా 9.5 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు.

News February 25, 2025

శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటలు

image

AP: తిరుమలలో టోకెన్లు లేనివారికి శ్రీవారి సర్వదర్శనం కోసం 8 గంటలు పడుతోంది. 4 కంపార్ట్‌‌మెంట్లలో వేంకటేశ్వరుడి దర్శనానికి వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 66,764 మంది భక్తులు దర్శించుకోగా, వారిలో 23,504 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.4.14కోట్లు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది. నిన్న 4.8లక్షల రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను TTD రిలీజ్ చేయగా 20 నిమిషాల్లోనే బుక్ అయ్యాయి.

News February 25, 2025

జేఈఈ మెయిన్ సెషన్2 దరఖాస్తులకు నేడే ఆఖరు

image

జేఈఈ మెయిన్ సెషన్2 దరఖాస్తులకు గడువు నేటితో ముగియనుంది. అభ్యర్థులు అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ నెల 27, 28 తేదీల్లో దరఖాస్తుల సవరణకు అవకాశం కల్పించారు. ఏప్రిల్ 1-8 మధ్య మెయిన్ పరీక్ష జరగనుంది. తొలి సెషన్ పరీక్ష జనవరిలో జరిగిన సంగతి తెలిసిందే.
వెబ్‌సైట్: https://jeemain.nta.nic.in/

News February 25, 2025

గోల్కొండ, చార్మినార్‌కు టూరిస్టుల ఓటు

image

TG: దేశంలో అత్యధిక మంది సందర్శించిన చారిత్రక ప్రదేశాల్లో గోల్కొండ 6, చార్మినార్ 9వ స్థానాల్లో నిలిచాయి. 2022-24కు గానూ ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా జాబితాను రిలీజ్ చేసింది. ఇందులో టాప్-3లో తాజ్ మహల్, కోణార్క్‌లోని సూర్య దేవాలయం, ఢిల్లీలోని కుతుబ్ మినార్ ఉన్నాయి. ఇక 2019 తర్వాత హైదరాబాద్‌కు సందర్శకుల తాకిడి 30 శాతం పెరిగినట్లు సర్వే వెల్లడించింది.

News February 25, 2025

టాయిలెట్‌కు మొబైల్ తీసుకెళ్తున్నారా?

image

టాయిలెట్‌లోకి మొబైల్ తీసుకెళ్లి గంటల కొద్దీ మాట్లాడటం, రీల్స్ చూడటం కొందరికి అలవాటుగా మారింది. అయితే కమోడ్‌పై ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల మలద్వారంపై ఒత్తిడి పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. దీనివల్ల నొప్పితో కూడిన ఇన్‌ఫ్లమేషన్, మొలలు, తీవ్ర కేసుల్లో యానల్ ఫిస్టులాలు ఏర్పడతాయని హెచ్చరిస్తున్నారు. చిరుతిళ్లు ఎక్కువగా తినడం, సరిపడిన నీరు తాగకపోవడమూ దీనికి కారణమవుతున్నట్లు పేర్కొంటున్నారు.

News February 25, 2025

స్వయం ఉపాధికి రాయితీ రుణాల మంజూరు

image

AP: క్రైస్తవ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో స్వయం ఉపాధి పథకాలకు రుణ రాయితీ కింద రూ.2.43కోట్లను విడుదల చేసినట్లు మంత్రి NMD ఫరూక్ తెలిపారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఈ కార్పొరేషన్ ద్వారా రూ.4.86కోట్ల స్వయం ఉపాధి ప్రణాళిక అమలుకు నిర్ణయించామన్నారు. ఇందులో భాగంగానే రూ.2.43కోట్లు రాయితీ కింద ఇస్తుండగా, మిగతా మొత్తాన్ని బ్యాంకుల ద్వారా రుణ రూపంలో పంపిణీ చేయనున్నట్లు మంత్రి వివరించారు.

News February 25, 2025

కోల్‌కతా, భువనేశ్వర్ సమీపంలో భూకంపం

image

కోల్‌కతా, ఒడిశాలోని భువనేశ్వర్ సమీపంలోని బంగాళాఖాతంలో భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై 5.1గా భూకంప తీవ్రత నమోదైంది. కోల్‌కతాతో పాటు పశ్చిమ బెంగాల్‌, ఒడిశాలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. దీంతో ఆయా ప్రాంతాల్లో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. ఒడిశాకు 175కి.మీ. దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించగా, దీని ప్రభావం బంగ్లాదేశ్‌లోనూ కనిపించింది.