news

News December 28, 2024

మన్మోహన్‌లా వాజ్‌పేయికీ జరిగితే BJP ఎలా ఫీలయ్యేది: కాంగ్రెస్ నేత

image

మన్మోహన్ స్మారక స్థలం కేటాయింపు అంశంలో BJPపై కాంగ్రెస్ నేత నవజోత్ సింగ్ సిద్ధూ విమర్శలు కురిపించారు. రాజ్‌ఘాట్‌లో అటల్ బిహారీ వాజ్‌పేయి స్మారకానికి స్థలం ఇవ్వకపోతే మీ పార్టీ ఎలా ఫీలయ్యేదని ప్రశ్నించారు. ‘మనిషి చనిపోయిన వెంటనే శత్రుత్వాలన్నీ మన్నులో కలిసిపోతాయి. కానీ ఇక్కడా రాజకీయాలు చేస్తున్నారు. అటల్‌జీ విషయంలో ఇలాగే జరిగేతే మీకెలా ఉండేది? ఇది ఓ పార్టీ అంశం కాదు. దేశ చరిత్రది’ అని అన్నారు.

News December 28, 2024

మాతృభాషను భవిష్యత్ తరాలకు పదిలంగా అందించాలి: చంద్రబాబు

image

AP: మాతృభాషను భవిష్యత్ తరాలకు పదిలంగా అందించాలని CM చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు విజయవాడలో నిర్వహించడం తెలుగువారికి గర్వకారణమని పేర్కొన్నారు. ‘తెలుగు జాతి కోసం పొట్టిశ్రీరాములు అద్వితీయ త్యాగం చేశారు. సభల ప్రాంగణానికి ఆయన పేరు పెట్టడం అభినందనీయం. మహాసభలకు విచ్చేసిన అతిథులు, భాషాభిమానులకు ధన్యవాదాలు’ అంటూ Xలో ట్వీట్ చేశారు.

News December 28, 2024

డిసెంబర్ 30న అసెంబ్లీ సమావేశాలు

image

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు డిసెంబర్ 30వ తేదీన ప్రత్యేకంగా జరగనున్నాయి. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం తెలిపేందుకు ఈ సమావేశాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యేలకు సమాచారం అందించారు.

News December 28, 2024

వారికి నెలలోపే కొత్త పెన్షన్

image

AP: పింఛన్ తీసుకుంటున్న భర్త చనిపోతే అదే నెలలోనే భార్యకు ప్రభుత్వం పెన్షన్ అందించనుంది. నవంబర్ 1 నుంచి ఈ నెల 15 మధ్య వితంతువులుగా మారిన 5,402 మందికి స్పౌజ్ కేటగిరీలో ఈ నెల 31న రూ.4వేల చొప్పున పంపిణీ చేయనుంది. అలాగే 3 నెలల వ్యవధిలో పింఛన్ తీసుకోలేని దాదాపు 50వేల మందికి 2, 3 నెలల మొత్తాన్ని ఒకేసారి అందివ్వనుంది. న్యూఇయర్ కానుకగా ఒకరోజు ముందే ప్రభుత్వం పెన్షన్లు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే.

News December 28, 2024

నిధుల బదిలీతో నాకు సంబంధం లేదు: కేటీఆర్

image

TG: ఫార్ములా-ఈ రేసింగ్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ హైకోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు. ఒప్పందాల అమలు, డబ్బు చెల్లింపుతో తనకు సంబంధం లేదని, విధానపరమైన అంశాలు చూసే బాధ్యత తనది కాదని పేర్కొన్నారు. విదేశీ సంస్థకు నిధుల చెల్లింపులపై అనుమతుల బాధ్యత సంబంధిత బ్యాంక్‌దేనని తెలిపారు. చెల్లింపుల విషయంలో అన్ని అంశాలను HMDAనే చూసుకోవాలన్నారు.

News December 28, 2024

తండ్రి త్యాగానికి ఫలితం నితీశ్ సెంచరీ: ఎమ్మెస్కే

image

బాక్సింగ్ డే టెస్టులో నితీశ్ రెడ్డి సెంచరీ చేయడంతో సగటు తెలుగువాడిగా గర్విస్తున్నానని ఎమ్మెస్కే ప్రసాద్ తెలిపారు. ‘నితీశ్ నాకు 11 ఏళ్లప్పటి నుంచి తెలుసు. ఈ పదేళ్లలో అతడు ఎంతో కష్టపడ్డారు. ముఖ్యంగా అతడిని ఈ స్థానంలో నిలిపేందుకు నితీశ్ తండ్రి ఎన్నో త్యాగాలు చేశారు. తన ఉద్యోగం కూడా కోల్పోవాల్సి వచ్చింది. డబ్బులకు ఎంతో ఇబ్బంది పడ్డారు. చివరికి ఫలితం ఈ విధంగా రావడం సంతోషం’ అని ఎమ్మెస్కే తెలిపారు.

News December 28, 2024

గాజాలో ఆస్పత్రిని తగలబెట్టిన ఇజ్రాయెల్ సైనికులు

image

వెస్ట్ ఏషియా మళ్లీ రగిలిపోతోంది. ఇజ్రాయెల్ సైనికులు కమల్ అద్వాన్ ఆస్పత్రిలో ప్రవేశించి పేషంట్లు, వైద్యులను పంపించేశారు. ప్రాంగణంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రి ఉందన్న సమాచారంతో దానిని తగలబెట్టేశారు. మరోవైపు యెమెన్ నుంచి హౌతీలు ప్రయోగించిన మిసైళ్లను IDF అడ్డుకుంది. సరిహద్దుకు బయటే కూల్చేసినా దేశంలో సైరన్లు మోగినట్టు ప్రకటించింది. గురువారం యెమెన్ విమానాశ్రయాలపై దాడికి నిరసనగా హౌతీలు ప్రతిదాడి చేశారు.

News December 28, 2024

నితీశ్ కుమార్ రెడ్డికి నగదు బహుమతి

image

AP: ఆస్ట్రేలియాపై సెంచరీ చేసిన నితీశ్ కుమార్ రెడ్డికి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ నజరానా ప్రకటించింది. అతడికి రూ.25 లక్షల నగదు బహుమతి ఇవ్వనున్నట్లు ACA ప్రెసిడెంట్, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ వెల్లడించారు. త్వరలో సీఎం చేతుల మీదుగా నగదు అందిస్తామని పేర్కొన్నారు. ఏపీకి కూడా ఐపీఎల్ టీమ్ సిద్ధం చేస్తామని, అమరావతిలో ఇంటర్నేషనల్ సౌకర్యాలతో స్టేడియం నిర్మిస్తున్నామని చెప్పారు. నితీశ్ స్వస్థలం వైజాగ్.

News December 28, 2024

సిఫార్సు లేఖలపై నిర్ణయం తీసుకోలేదు: టీటీడీ ఈవో

image

తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలకు అనుమతిచ్చే విషయమై టీటీడీ ఈవో శ్యామలరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంకా దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ సమయంలో దాతలకు ప్రత్యేకంగా గదుల కేటాయింపు ఉండదన్నారు.

News December 28, 2024

ఆస్ట్రేలియన్లకు తెలుగోడి దెబ్బలు!

image

ఆస్ట్రేలియన్లకు తెలుగోళ్లు కొరకరాని కొయ్యలుగా మారారు. కంగారూలపై అప్పట్లో జైసింహా, అజహరుద్దీన్, వీవీఎస్ లక్ష్మణ్.. ఇప్పుడు నితీశ్ కుమార్ రెడ్డి తమ సత్తా చూపించారు. ముఖ్యంగా మన లక్ష్మణుడు కంగారూల విజయాలకు లక్ష్మణరేఖలు గీస్తే.. తాజాగా నితీశ్ హీరో అయ్యారు. ఈ సీజన్ BGTలో భారత్ తరఫున అత్యధిక రన్స్ చేసింది ఈ తెలుగు కుర్రాడే.