India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నూతన సంవత్సరం అనగానే కొత్త మార్పులను చాలా మంది కోరుకుంటారు. డబ్బులు ఆదా చేయడం, స్మోకింగ్, మద్యం మానేయడం, జిమ్కి వెళ్లడం, డైటింగ్, స్కిల్స్ నేర్చుకోవడం, కొత్త ప్రయాణాలు చేయడం వంటి రిజల్యూషన్స్ తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తారు. మరి కొత్త ఏడాదిలో మీరు ఎలాంటి రిజల్యూషన్ తీసుకుంటున్నారు? కామెంట్ చేయండి.
AP: పదో తరగతి విద్యార్థులకు SSC పరీక్షల విభాగం మరో అవకాశం కల్పించింది. వివిధ కారణాలతో మార్చి-2025 పరీక్ష ఫీజు చెల్లించని వారికోసం తత్కాల్ విధానం తీసుకొచ్చింది. ఈ నెల 27 నుంచి జనవరి 10 వరకు ఫీజులు చెల్లించవచ్చని తెలిపింది. తత్కాల్లో రూ.1000 ఫైన్ చెల్లించాలని స్పష్టం చేసింది. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కె.శ్రీనివాసులురెడ్డి సూచించారు.
AP: వైఎస్ జగన్తో పాటు తన కుటుంబసభ్యులపై అసభ్యకర పోస్టులు చేస్తున్న వారిపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవట్లేదని అంబటి రాంబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పలువురు తనకు ఫోన్ చేసి చంపేస్తామంటూ బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. ఈ విషయంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఈ పిటిషన్ రేపు/ఎల్లుండి విచారణకు రానుంది. పార్టీ ఇన్పర్సన్గా రాంబాబు స్వయంగా వాదనలు వినిపించనున్నారు.
సెకండ్ హ్యాండ్ కార్ల అమ్మకాలపై 18% జీఎస్టీ విధించడంతో నెటిజన్లు కేంద్రంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దీనిపై జీఎస్టీ కౌన్సిల్ క్లారిటీ ఇచ్చింది. ఇది కేవలం రిజిస్టర్డ్ బిజినెస్ (డీలర్ల)కే వర్తిస్తుందని పేర్కొంది. వ్యక్తిగతంగా కారు అమ్మితే ఎలాంటి జీఎస్టీ ఉండదని తెలిపింది. అయితే డీలర్ చెల్లించిన ఆ పన్ను మొత్తాన్ని తిరిగి కస్టమర్ నుంచే వసూలు చేస్తారని, భారం తమకే అని పలువురు మండిపడుతున్నారు.
TG: హైదరాబాదీలు బ్రేక్ఫాస్ట్గా దోశ ఇష్టపడుతున్నారని, అందులోనూ ఉల్లిదోశపై ఎక్కువగా మక్కువ చూపుతున్నారని ఫుడ్ డెలివరీ ఫ్లాట్ఫాం స్విగ్గీ తెలిపింది. దేశంలో ఉదయం పూట ఎక్కువగా దోశను ఆర్డర్ చేసేది హైదరాబాద్ వాసులే అని ‘హౌ హైదరాబాద్ స్విగ్గీడ్’ నివేదికలో వివరించింది. అలాగే ప్రతి నిమిషానికి 34 బిర్యానీలను ఆర్డర్ చేస్తున్నట్లు తెలిపింది. అటు, హైదరాబాదీల ఫేవరెట్ స్వీటుగా ‘డబుల్ కా మీటా’ నిలిచింది.
AP: CM చంద్రబాబు నూతన సంవత్సరంలో తొలి రోజు పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. పింఛన్ల పంపిణీలో భాగంగా నరసరావుపేటలో పర్యటించనున్నట్లు ఆ పార్టీ నేతలు తెలిపారు. తొలుత గురజాలలో పర్యటించాలని అనుకున్నా.. BC ఎమ్మెల్యే ఉన్నచోట కార్యక్రమం నిర్వహించాలని అధిష్ఠానం నుంచి ఆదేశాలు రావడంతో నరసరావుపేటకు మార్చినట్లు తెలుస్తోంది. రొంపిచర్ల మండలం అన్నవరంలో CBN పింఛన్లు పంపిణీ చేస్తారని తెలుస్తోంది.
TG: గ్రామాల్లో సర్పంచులు, MPTCలు, ZPTCలు చేసిన పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులను త్వరలోనే విడుదల చేస్తామని Dy.CM భట్టి విక్రమార్క చెప్పారు. BRS పెట్టిన బకాయిలు ₹1,300కోట్లు ఉన్నాయన్నారు. తొలుత ₹10లక్షల లోపు బిల్లులను సెటిల్ చేసే ఆలోచన చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ బకాయిల విలువ దాదాపు ₹400కోట్లు ఉందని తెలిపారు. బిల్లులను పెండింగ్లో పెట్టిన BRS నేతలు మళ్లీ ధర్నాలు చేస్తామనడం సమంజసం కాదన్నారు.
AP: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు రోజూ తప్పనిసరిగా బయోమెట్రిక్ హాజరు వేయాలని ప్రభుత్వం ఆదేశించింది. బయోమెట్రిక్ ఆధారిత వేతన బిల్లులనే నమోదు చేయాలని అధికారులకు సూచించింది. అలాగే ఇటీవల విడుదల చేసిన విజన్ డాక్యుమెంట్-2047 ఫ్రేమ్ వర్క్ బాధ్యతల్లోనూ పాలుపంచుకోవాలని పేర్కొంది. దీనిపై CM ప్రతి శుక్రవారం నిర్వహించే సమీక్షలో RTGSతోపాటు గ్రామ, వార్డు సచివాలయ శాఖ అధికారులు కూడా పాల్గొనాలని తెలిపింది.
AP: నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం ఇవాళ బలహీనపడుతుందని IMD వెల్లడించింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కూడా విస్తరించి ఉందని తెలిపింది. వీటి ప్రభావంతో ఇవాళ ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు, మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వానలు కురుస్తాయంది. కాగా బంగాళాఖాతంలో 2 రోజుల్లో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది.
ఏఐసీసీ అధ్యక్షుడిగా మహాత్మా గాంధీ బాధ్యతలు స్వీకరించి వందేళ్లు పూర్తవుతున్న సందర్భంగా రేపు, ఎల్లుండి కాంగ్రెస్ ప్రత్యేక భేటీ నిర్వహించనుంది. కర్ణాటకలోని బెలగావిలో జరిగే ఈ సమావేశానికి ‘నవ సత్యాగ్రహ బైఠక్’గా పేరు పెట్టింది. 26వ తేదీన CWC సభ్యులు, పీసీసీలు, సీఎల్పీలు సహా 200 మంది కీలక నేతలు హాజరై పలు అంశాలపై చర్చిస్తారు. 27న నిర్వహించే సంవిధాన్ ర్యాలీలో లక్ష మంది కార్యకర్తలు పాల్గొంటారు.
Sorry, no posts matched your criteria.