news

News February 23, 2025

మహా శివరాత్రి స్పెషల్ బస్సుల్లో 50 శాతం ఎక్స్‌ట్రా ఛార్జీ

image

TG: మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల 24 నుంచి 28 వరకు 43 శైవ క్షేత్రాలకు 3 వేల స్పెషల్ బస్సులను నడుపుతామని TGSRTC వెల్లడించింది. వీటిలో 50 శాతం అదనపు ఛార్జీలు వసూలు చేస్తామని, మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం ఉంటుందని తెలిపింది. శ్రీశైలం, వేములవాడ, ఏడుపాయల, కీసరగుట్ట, వేలాల, కాళేశ్వరం, కొమరవెల్లి, అలంపూర్, రామప్పకు ఈ బస్సులు వెళ్తాయని పేర్కొంది. రెగ్యులర్ బస్సుల్లో సాధారణ ఛార్జీలే ఉంటాయంది.

News February 23, 2025

స్కూళ్లకు ఒకే యాప్.. కీలక నిర్ణయం

image

AP: విద్యాశాఖలో ప్రస్తుతం ఉన్న 45 యాప్‌ల స్థానంలో ఒకే యాప్ తీసుకొచ్చేందుకు కసరత్తు మొదలైంది. ఇందులో స్కూల్, టీచర్, స్టూడెంట్ అనే 3 ఆప్షన్లు ఉంటాయి. విద్యార్థుల సామర్థ్యాలు, మార్కులు, ఆరోగ్య సమాచారాలను పేరెంట్స్ సులభంగా తెలుసుకోవచ్చు. అలాగే పాఠశాలల్లో సౌకర్యాల సమాచారమూ ఉంటుంది. ఉపాధ్యాయుల రోజువారీ కార్యకలాపాలు, సెలవులు, బదిలీల వివరాలను పొందుపరుస్తారు. త్వరలోనే యాప్ అందుబాటులోకి వస్తుంది.

News February 23, 2025

కొత్త రేషన్ కార్డులపై BIG UPDATE

image

AP: వచ్చే నెల నుంచి క్యూఆర్ కోడ్‌తో కూడిన <<15497715>>కొత్త రేషన్ కార్డులు<<>> అందిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. నెల్లూరు జిల్లా సంగంలో మాట్లాడుతూ పాత కార్డుల్లో మార్పులు, చేర్పులకూ అవకాశం కల్పిస్తామన్నారు. అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రక్రియ మొదలవుతుందని చెప్పారు. ఇక రైతులకు పెండింగ్‌లో ఉన్న రవాణా, హమాలీ ఛార్జీలను రెండు రోజుల్లో విడుదల చేస్తామని తెలిపారు.

News February 23, 2025

ఏప్రిల్ 29న NCET.. నోటిఫికేషన్ విడుదల

image

2025-26లో నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఈడీ కోర్సుల్లో ప్రవేశానికి NCET(నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) నోటిఫికేషన్ తాజాగా విడుదలైంది. మార్చి 16 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి తెలిపింది. APR 29న దేశవ్యాప్తంగా తెలుగు సహా 13 భాషల్లో పరీక్ష నిర్వహిస్తామంది. ర్యాంక్ ఆధారంగా 64 IIT, NIT, కేంద్రీయ వర్సిటీల్లో ప్రవేశాలు కల్పిస్తామని పేర్కొంది.
వెబ్‌సైట్: <>https://exams.nta.ac.in/NCET/<<>>

News February 23, 2025

టన్నెల్ ఘటన.. కార్మికుల ప్రాణాలపై ఆందోళన

image

TG: SLBC టన్నెల్‌లో చిక్కుకున్న వారి ప్రాణాలపై ఆందోళన నెలకొంది. నిన్న ఉదయం 8-9 గంటల మధ్య టన్నెల్‌లో మట్టి కూలడం మొదలైంది. వెంటనే కొంతమంది బయటికి వచ్చినా 8 మంది మాత్రం అక్కడే చిక్కుకున్నారు. సాయంత్రానికి NDRF బృందం అక్కడికి చేరుకుంది. ఇవాళ్టి నుంచి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టనుంది. సముద్ర మట్టానికి 834 అడుగుల దిగువన కార్మికులు చిక్కుకుపోవడంతో వారికి ఆక్సిజన్ అందుతోందా? లేదా? అన్నదే కీలకంగా మారింది.

News February 23, 2025

పాకిస్థాన్‌తో మ్యాచ్.. కోహ్లీ ఆడేనా?

image

పాకిస్థాన్‌తో మ్యాచ్‌‌లో భారత స్టార్ క్రికెటర్ కోహ్లీ ఆడటం అనుమానాస్పదంగా మారిందని జాతీయ మీడియా పేర్కొంది. నిన్న ప్రాక్టీస్ సెషన్‌లో కాలికి గాయం కావడంతో, ఐస్ ప్యాక్‌తో రెస్ట్ తీసుకుంటూ కనిపించినట్లు వెల్లడించింది. ఆ ఫొటోలు SMలోనూ చక్కర్లు కొడుతున్నాయి. అయితే కోహ్లీ గాయంపై BCCI ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో కీలక మ్యాచ్‌లో కోహ్లీ ఆడతాడని అంతా భావిస్తున్నారు. మ్యాచ్ సమయానికి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

News February 23, 2025

‘శివరాత్రి’ రోజంతా ఉచిత క్యూలైన్లు

image

AP: శివరాత్రి సందర్భంగా ఈ నెల 26న భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ అధికారులకు సూచించారు. ఆ రోజంతా ప్రముఖ శివాలయాల్లో ఉచిత క్యూలైన్లు కొనసాగించాలని ఆదేశించారు. అంతరాలయ దర్శనాలకు అనుమతించకపోతే వేగంగా క్యూలైన్లు ముందుకు కదులుతాయన్నారు. కాగా శ్రీశైలం, శ్రీకాళహస్తిలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి.

News February 23, 2025

IND Vs PAK: ప్రతీకారం తీర్చుకోవాల్సిందే..

image

ICC ఈవెంట్స్‌లో పాకిస్థాన్‌పై భారత్‌దే పైచేయి. కానీ CT గణాంకాలను చూస్తే కాస్త ఆందోళన కలుగుతోంది. ఇప్పటివరకు CTలో IND, PAK ఐదుసార్లు తలపడగా పాక్ 3సార్లు గెలిచింది. 2004, 2009లో పాక్ గెలవగా 2013లో IND విజయం సాధించింది. 2017 సీజన్‌లో దాయాది జట్లు 2సార్లు ఢీకొన్నాయి. లీగ్ స్టేజ్‌లో IND గెలవగా ఫైనల్లో పాక్ మనల్ని ఓడించి టైటిల్ ఎగరేసుకుపోయింది. ఈసారి ప్రతీకారం తీర్చుకోవాలని IND ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

News February 23, 2025

నేడు యాదగిరిగుట్టకు CM రేవంత్

image

TG: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి స్వర్ణ గోపురం ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ పాల్గొంటారు. వానమామలై మఠం 31వ పీఠాధిపతులు రామానుజ జీయర్ స్వామి పర్యవేక్షణలో జరిగే ఈ కార్యక్రమానికి మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, భక్తులు పెద్దసంఖ్యలో హాజరుకానున్నారు. 50.5 అడుగుల ఎత్తు, 68 కేజీల బంగారంతో చేసిన స్వర్ణతాపడ గోపురం దేశంలోనే అత్యంత ఎత్తైన స్వర్ణ విమాన గోపురంగా రికార్డులకెక్కింది.

News February 23, 2025

రూ.78వేలు సబ్సిడీ.. ‘సూర్యఘర్’ అమలుకు ఏపీ అనుమతి

image

AP: కేంద్రం ప్రారంభించిన <<12768799>>పీఎం సూర్యఘర్<<>> పథకాన్ని ఏపీలో అమలుకు పరిపాలనా అనుమతులిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. రాష్ట్రంలో 20 లక్షల ఎస్సీ, ఎస్టీ గృహాలపై సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని డిస్కంలను ఆదేశించింది. 3 కి.వా ఉత్పత్తి యూనిట్ ఏర్పాటుకు రూ.1.45లక్షల ఖర్చయితే అందులో కేంద్రం <<12768833>>రూ.78వేలు<<>> సబ్సిడీ ఇస్తుంది. మిగిలిన మొత్తాన్ని రుణంగా సమకూరుస్తుంది.