India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బెంచ్మార్క్ సూచీలు ఫ్లాటుగా మొదలయ్యాయి. నిఫ్టీ 23,723 (-31), సెన్సెక్స్ 78,434 (-111) వద్ద ట్రేడవుతున్నాయి. అనిశ్చితి నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. IT, O&G షేర్లకు డిమాండ్ నెలకొంది. మెటల్, రియాల్టి, ఫార్మా, బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాలపై ఒత్తిడి ఉంది. టాటా మోటార్స్, TCS, NESTLE, BRITANNIA, BAJAJ AUTO టాప్ గెయినర్స్. JSW STEEL, TATA STEEL, AIRTEL, SBI LIFE టాప్ లూజర్స్.
TG: అల్లు అర్జున్ కాసేపట్లో చిక్కడపల్లి పోలీసుల విచారణకు హాజరు కానున్నారు. సీన్ ఆఫ్ అఫెన్స్ కోసం అవసరమైతే సంధ్య థియేటర్కు రావాల్సి ఉంటుందని పోలీసులు నిన్న బన్నీకి ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ దాదాపు 10 ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సి ఉంటుందని సమాచారం. బన్నీ ఇటీవల ప్రెస్మీట్లో మాట్లాడిన ఆరోపణలపై విచారించే అవకాశం ఉంది. 11గంటలకు ఆయన PSకు వెళ్లనున్నారు.
ఫైబర్ ఎక్కువగా ఉండే స్వీట్ పొటాటో తినడం వల్ల కడుపు నిండుగా ఉంటుంది. స్నాక్స్ తినాల్సిన అవసరం ఉండదు. క్యారెట్లో క్యాలరీలు తక్కువ, పీచు ఎక్కువ. దీంతో బరువు, BMI, కొవ్వును తగ్గించుకోవచ్చు. నిత్యం మన డైట్ మెనూలో ఆకుకూరలు ఉండాల్సిందే. వీటిలోని నీరు, విటమిన్లు, మినరల్స్ ఆకలిని సంతృప్తి పరిచి జీర్ణశక్తిని పెంచుతాయి. బీట్రూట్లో నీరు, ఫైబర్, ప్రొటీన్ ఉంటాయి. కాజు, బాదం, అవిసెలకు ప్రాధాన్యం తప్పనిసరి.
BGT నాలుగో టెస్టులో మెక్స్వీని స్థానంలో సామ్ కొన్స్టాస్ను ఓపెనర్గా ఆడించనున్నట్లు ఆస్ట్రేలియా ప్రకటించింది. ఈ సిరీస్కు ముందు IND-A, ఇండియాVS ప్రైమ్ మినిస్టర్ 11 మ్యాచుల్లో అతను 73, 101 రన్స్తో రాణించారు. ఈ 19 ఏళ్ల క్రికెటర్ 11 ఫస్ట్ క్లాస్ మ్యాచుల్లో 718 పరుగులు చేశారు. బుమ్రాను ఎదుర్కొనేందుకు తన వద్ద ప్లాన్ ఉందని మీడియాకు వెల్లడించారు. నాలుగో టెస్టు ఎల్లుండి నుంచి మెల్బోర్న్లో జరగనుంది.
TG: అల్లు అర్జున్ కాసేపట్లో తన లీగల్ టీమ్తో భేటీ కానున్నారు. అనంతరం ఆ టీమ్తోనే ఆయన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు వెళ్లనున్నారు. అల్లు అర్జున్కు నిన్న పోలీసులు BNS 35(3) కింద నోటీసులిచ్చారు. సంధ్య థియేటర్ ఘటనకు సంబంధించి చిక్కడపల్లి ఏసీపీ రమేశ్, సీఐ రాజు ఆయన్ను ప్రశ్నించనున్నారు. తొక్కిసలాట కేసులో బన్నీ A11గా ఉండగా, నాలుగు వారాల వరకు అరెస్ట్ చేయొద్దని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.
TG: పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల వివరాలను జనవరి 31లోగా ఆన్లైన్లో నమోదు చేయాలని విద్యాశాఖ ఆదేశించింది. ఇందుకు DEOలు, MEOలు, HMలను బాధ్యులుగా చేస్తూ ఉత్తర్వులిచ్చింది. విద్యార్థుల వివరాల సేకరణకు ప్రభుత్వం కొంతకాలంగా ప్రయత్నిస్తున్నప్పటికీ కేవలం 3 శాతమే పూర్తయింది. దీంతో ఈ ప్రక్రియను వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటోంది.
కేంద్రం 5, 8 తరగతులకు నో డిటెన్షన్ విధానాన్ని రద్దు చేయడం AP, TGలో చర్చనీయాంశంగా మారింది. హాజరు శాతాన్ని బట్టి పై తరగతులకు ప్రమోట్ చేయడం వల్ల విద్యలో నాణ్యత కొరవడిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఐదో క్లాస్ పిల్లలకు రెండో క్లాస్ కూడికలు, తీసివేతలు, గుణకారాలు, భాగహారాలు రావడం లేదన్న వార్తలు గతంలో చాలానే విన్నాం. మరి 5, 8 క్లాసులకు బోర్డ్ ఎగ్జామ్స్ ఉండాలన్న నిర్ణయాన్ని మీరు స్వాగతిస్తారా?
TG: గ్రామాల్లో రెవెన్యూ అధికారుల నియామకానికి ప్రభుత్వం కసరత్తు మొదలెట్టింది. ఇతర శాఖల్లోకి బదిలీ అయిన వీఆర్వోలు, వీఆర్ఏల నుంచి ఆప్షన్లు స్వీకరిస్తోంది. గూగుల్ ఫామ్స్లో ఈనెల 28లోగా వివరాలు సేకరించాలని కలెక్టర్లను ఆదేశించింది. దాదాపు 11వేల మంది అధికారులను నియమించనుండగా, ఇందులో సగం మందిని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా తీసుకోనున్నట్లు సమాచారం. ఈ కొత్త పోస్టుల నియమ నిబంధనలపై స్పష్టత రావాల్సి ఉంది.
ప్రాక్టీస్లో గాయపడిన భారత కెప్టెన్ రోహిత్ కోలుకున్నారు. తాను మోకాలి గాయం నుంచి కోలుకొని 4వ టెస్టుకు రెడీగా ఉన్నట్లు రోహిత్ స్పష్టం చేశారు. అటు ఆస్ట్రేలియా బ్యాటర్ హెడ్ కూడా గాయం నుంచి కోలుకొని ఫిట్గా ఉన్నట్లు ఆ జట్టు కోచ్ ఆండ్రూ మెక్డొనాల్డ్ వెల్లడించారు. రోహిత్ కోలుకోవడం ఇండియాకు గుడ్న్యూస్ కాగా మనకు తలనొప్పిగా మారిన హెడ్ కూడా బాక్సింగ్ డే టెస్టుకు అందుబాటులోకి రావడం ఒక రకంగా బ్యాడ్న్యూసే.
అంబేడ్కర్పై కేంద్రమంత్రి అమిత్ షా వ్యాఖ్యలను నిరసిస్తూ ఇవాళ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్త ఆందోళనలు చేపట్టనుంది. ఢిల్లీలో జరిగే నిరసనల్లో కాంగ్రెస్ అగ్రనేతలు పాల్గొననున్నారు. హైదరాబాద్లో టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు హాజరవుతారు. ఆంధ్రప్రదేశ్లో ఏపీసీసీ చీఫ్ షర్మిల ఆధ్వర్యంలో ఆందోళనలు జరగనున్నాయి.
Sorry, no posts matched your criteria.