India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విజయ్ వర్మతో బ్రేకప్ వార్తలు వస్తున్న వేళ తమన్నా పెళ్లిపై స్పందించారు. ప్రస్తుతానికి వివాహం చేసుకునే ఆలోచన లేదని ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. ప్రేమను వ్యాపారంగా చూస్తే సమస్యలొస్తాయని <<15926914>>మిల్కీ బ్యూటీ,<<>> రిలేషన్షిప్లో సంతోషం, బాధలను స్వీకరిస్తేనే సంతోషంగా ఉంటామని విజయ్ ఇటీవల కామెంట్ చేశారు. దీంతో వీరు విడిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై వీరిద్దరూ ఇప్పటి వరకు స్పందించలేదు.
AP: తిరుపతి జిల్లాలోని శ్రీసిటీలో LG కంపెనీ కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఏర్పాటు చేయబోతోంది. మే 8న దీని ఓపెనింగ్ సెర్మనీ ఉండే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం గతేడాది NOVలో 247 ఎకరాలను కేటాయించింది. రూ.5,001 కోట్ల పెట్టుబడులను ఆమోదించింది. ఈ ప్లాంటులో ఫ్రిజ్లు, ఏసీలు, వాషింగ్ మెషీన్లు, టీవీలు, కంప్రెషర్లను తయారు చేయనున్నారు. 1,495 మంది స్థానికులకు ప్రత్యక్ష ఉపాధి కల్గనుంది.
TG: ఇకపై విద్య, <<16093517>>ఉద్యోగాల్లో<<>> SC వర్గీకరణ అమలు అవుతుందని మంత్రులు దామోదర, ఉత్తమ్ మీడియా సమావేశంలో వెల్లడించారు. SC వర్గీకరణ నేటి నుంచి అమల్లోకి వస్తుందని, నేటి నుంచి భారీ స్థాయిలో జాబ్ నోటిఫికేషన్లు విడుదల చేస్తామని ప్రకటించారు. ప్రభుత్వం జారీ చేసే అన్ని జాబ్ నోటిఫికేషన్లకు SC వర్గీకరణ వర్తిస్తుందన్నారు. SC వర్గీకరణ గురించి చాలా పార్టీలు మాట్లాడాయని, కానీ దాని కోసం ప్రయత్నం చేయలేదని అన్నారు.
TG: సీఎం రేవంత్ అధ్యక్షతన కాంగ్రెస్ శాసనసభా పక్షం రేపు సమావేశం కానుంది. శంషాబాద్ నోవాటెల్లో ఉ.11 గంటల నుంచి జరగనున్న ఈ భేటీలో 4 అంశాలపై చర్చించనున్నారు. భూ భారతి, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, SC-ST వర్గీకరణపై చర్చ జరగనుంది. ఈ మేరకు పార్టీ MLAలు, MLCలకు ప్రభుత్వ విప్లు సమాచారం ఇచ్చారు.
కాంగ్రెస్ తమ స్వార్థ ప్రయోజనాల కోసం రాజ్యాంగాన్ని బుజ్జగింపు సాధనంగా వాడిందని ప్రధాని మోదీ విమర్శించారు. హస్తం పార్టీ తన అధికారానికి ముప్పు ఉందని భావించినప్పుడల్లా దేశ అత్యున్నత శాసనాన్ని తుంగలో తొక్కేదని నొక్కిచెప్పారు. రాజ్యాంగంతో దేశంలో సామాజిక న్యాయం జరుతుందని భావించిన అంబేడ్కర్ ఆశయాలకు కాంగ్రెస్ ద్రోహం చేసిందని మండిపడ్డారు. హరియాణాలో హిసార్ విమానాశ్రయంలో ప్లాంటును PM ప్రారంభించారు.
AP: భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా టీటీడీ బోర్డు మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ వ్యాఖ్యలు చేశారని టీటీడీ ఈవో శ్యామలారావు విమర్శించారు. 3 నెలల్లో 100 ఆవులు చనిపోయాయని అసత్య ప్రచారం చేశారన్నారు. ప్రతి నెలా సగటున 15 ఆవులు మరణిస్తాయని, 3 నెలల్లో 43 మృతి చెందాయని తెలిపారు. దాతలు ఇచ్చిన ఆవుల్లో కొన్ని అనారోగ్యంతో చనిపోయాయని చెప్పారు. మరణించిన ఆవులకు పోస్టుమార్టం చేయలేదనడం అవాస్తవమన్నారు.
AP: తిరుమలలోని గోశాల నిర్వహణలో మార్చి 2021 నుంచి మార్చి 2024 వరకు ఎన్నో అక్రమాలు జరిగాయని టీటీడీ ఈవో శ్యామలారావు ఆరోపించారు. గత ఐదేళ్లలో చనిపోయిన ఆవుల వివరాలను దాచిపెట్టారన్నారు. ఆవులు లేని గోశాలకు దాణా పేరుతో నిధులు దుర్వినియోగం చేశారని చెప్పారు. అలాగే స్వామివారికి ఆర్గానిక్ ప్రసాదాల పేరుతో అక్రమాలు చోటుచేసుకున్నాయని వివరించారు. రూ.3 కోట్ల విలువైన సరకులకు రూ.25 కోట్లు చెల్లించారని పేర్కొన్నారు.
US అధ్యక్షుడు ట్రంప్ ఉక్రెయిన్ సందర్శించాలని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీ కోరారు. రష్యా తమ దేశంలో చేసిన విధ్వంసం చూడాలన్నారు. యుద్ధంతో తమ దేశంలో నెలకొన్న పరిస్థితులు, మరణించిన, గాయపడిన ప్రజలు, దెబ్బతిన్న కట్టడాల్ని చూసిన అనంతరం ఏదైనా నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాగా ఫిబ్రవరిలో ట్రంప్, జెలెన్స్కీ మధ్య జరిగిన చర్చలు వాగ్వాదంతో అర్ధాంతరంగా ముగిశాయి.
పిల్లల్లో పాలదంతాలు ఊడిపోయి కొత్తవి వస్తాయి. వాటిని కోల్పోతే మళ్లీ రావు. తాజాగా ప్రపంచంలోనే తొలిసారి UK సైంటిస్టులు ల్యాబ్లో మానవ దంతాలను సృష్టించారు. దంతాల వృద్ధికి అవసరమైన వాతావరణాన్ని కల్పించే ఓ పదార్థాన్ని అభివృద్ధి చేశారు. భవిష్యత్తులో రోగులు కోల్పోయిన దంతాలను వారిలోనే వృద్ధి చేయొచ్చంటున్నారు. ఫిల్లింగ్స్, ఇంప్లాంట్స్ అవసరం ఉండదని, దంత రక్షణలో ఇదో విప్లవాత్మక పురోగతి అని చెబుతున్నారు.
IPL: ఢిల్లీ ప్లేయర్ కరుణ్ నాయర్ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. ముంబైతో జరిగిన మ్యాచ్లో తాను చేసిన స్కోరుకు విలువే లేదన్నారు. తనకు జట్టు విజయమే ముఖ్యమని.. ఓడిపోయిన మ్యాచ్లో ఎంత స్కోర్ చేసినా లాభం లేదన్నారు. ముంబైపై కరుణ్ నాయర్ 40 బంతుల్లో 89(12 ఫోర్లు, 5 సిక్సర్లు) స్కోర్ చేశారు. తన పవర్ హిట్టింగ్తో బుమ్రాను సైతం వణికించారు. కరుణ్ నాయర్, పోరెల్(33) మినహా ఢిల్లీ జట్టులో బ్యాటర్లు ఎవరూ రాణించలేదు.
Sorry, no posts matched your criteria.