news

News February 17, 2025

కేంద్రం మమ్మల్ని బ్లాక్‌మెయిల్ చేస్తోంది: సీఎం స్టాలిన్

image

కేంద్ర ప్రభుత్వం తమిళనాడును బ్లాక్‌మెయిల్ చేస్తోందని ఆ రాష్ట్ర CM స్టాలిన్ ఆరోపించారు. ‘రాజ్యాంగం ప్రకారం విద్యావ్యవస్థలో 3 భాషల విధానాన్ని అమలు చేయాల్సిందేనని మన కేంద్ర విద్యామంత్రి అన్నారు. అలా అని రాజ్యాంగంలో ఎక్కడ ఉందో ఆయన చెప్పాలి. 3 భాషల విధానాన్ని అమలు చేసేవరకూ మాకు నిధులు ఇవ్వమని కేంద్రం బెదిరిస్తోంది. తమిళులం చూస్తూ ఊరుకోం. మేం మాకు రావాల్సిన వాటానే అడుగుతున్నాం’ అని స్పష్టం చేశారు.

News February 17, 2025

మేం ఏం చేస్తున్నామో తెలియాలంటే RSSలో చేరండి: మోహన్ భాగవత్

image

తాము ఏం చేస్తున్నామో తెలుసుకునేందుకు ప్రజలు తమ సంస్థలో సభ్యులుగా చేరాలని RSS చీఫ్ మోహన్ భాగవత్ పిలుపునిచ్చారు. బెంగాల్లో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘బయటి నుంచి చూస్తూ అనేక అపోహల్ని చాలామంది నమ్ముతున్నారు. మీరు సంఘ్ గురించి తెలుసుకోవాలంటే ఒక్కసారి చేరి చూడండి. మేం చేసేది మీకు నచ్చకపోతే వదిలి వెళ్లిపోండి. చేరేందుకు సభ్యత్వ రుసుం, నిబంధనల్లాంటివేం లేవు’ అని వివరించారు.

News February 17, 2025

ఈ నిమ్మకాయ ధర రూ.5.09లక్షలు

image

HYDలోని బాలాపూర్ గణేశుడి లడ్డూకు ఎంత డిమాండ్ ఉంటుందో TNలోని పళని మురుగన్ నిమ్మకాయలకు అంతే పోటీ ఉంటుంది. పళనిలో ఏటా 3 రోజులు తైపూస ఉత్సవాలు జరిపి మురుగన్ పాదాల వద్ద ఉంచిన నిమ్మకాయలను వేలం వేస్తారు. తాజాగా జరిగిన వేలంలో ఒక్కో నిమ్మకాయ రూ.16వేల- రూ.40వేల వరకు పలికింది. తైపూసం రోజు నాటి నిమ్మకాయను ఓ భక్తుడు రూ.5.09లక్షలకు సొంతం చేసుకున్నారు. వేలంలో కేవలం వల్లనాట్టు చెట్టియార్లు మాత్రమే పాల్గొంటారు.

News February 17, 2025

అమానుషం.. చిన్నారులపై పలుమార్లు అత్యాచారం

image

తమిళనాడులోని కోయంబత్తూర్ జిల్లాలో అమానుష ఘటన చోటు చేసుకుంది. 10-12ఏళ్ల లోపు ఉన్న ఇద్దరు బాలికలు, ఓ బాలుడిపై.. మరో నలుగురు బాలురు, ఓ 18 ఏళ్ల యువకుడు పలుమార్లు అత్యాచారం చేశారు. పరువు పోతుందన్న భయంతో బాధితుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేసేందుకు ముందుకురాలేదు. స్థానికుల ద్వారా పోలీసులకు విషయం తెలియడంతో నలుగురు నిందితుల్ని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు.

News February 17, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

News February 17, 2025

ఫిబ్రవరి 17: చరిత్రలో ఈరోజు

image

1883: స్వాతంత్ర్య సమరయోధుడు వాసుదేవ బల్వంత ఫడ్కే మరణం
1954: తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ జననం
1963: అమెరికా బాస్కెట్ బాల్ దిగ్గజం మైఖేల్ జోర్డాన్ జననం
1983: సినీ రచయిత పాలగుమ్మి పద్మరాజు మరణం
1984: క్రికెట్ ప్లేయర్ డివిలియర్స్ జననం
1984: సినీ నటి సదా జననం
1986: తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి మరణం
2000: మైక్రోసాఫ్ట్ విండోస్ 2000 ఓఎస్ విడుదల

News February 17, 2025

ఈరోజు నమాజ్ వేళలు

image

తేది: ఫిబ్రవరి 17, సోమవారం
ఫజర్: తెల్లవారుజామున 5.29 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6.42 గంటలకు
దుహర్: మధ్యాహ్నం 12.30 గంటలకు
అసర్: సాయంత్రం 4.42 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6.19 గంటలకు
ఇష: రాత్రి 7.32 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News February 17, 2025

శుభ ముహూర్తం (సోమవారం, 17-02-2025)

image

తిథి: బహుళ పంచమి రా.2.28 వరకు
నక్షత్రం: చిత్త ఉ.5.37 వరకు
శుభసమయం: ఉ.5.51- ఉ.6.27, తిరిగి సా.7.03- సా.7.27
రాహుకాలం: ఉ.7.30 నుంచి ఉ.9.00 వరకు
యమగండం: ఉ.10.30 నుంచి మ.12.00 వరకు
దుర్ముహూర్తం: మ.12.24- మ.1.12, తిరిగి మ.2.46- మ.3.34
వర్జ్యం: మ.11.50 నుంచి మ.1.36 వరకు
అమృత ఘడియలు: రా.10.32 నుంచి రా.12.18 వరకు

News February 17, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

News February 17, 2025

TODAY HEADLINES

image

* అధికారులు ఏసీ గదులను వదలాలి: CM రేవంత్
* తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రం: కేటీఆర్
* సీఎం రేవంత్‌కు సబ్జెక్ట్ లేదు: ఎంపీ అర్వింద్
* APలో GBSతో తొలి మరణం
* ప్రతి ఎన్నికలో గెలవాల్సిందే: సీఎం చంద్రబాబు
* ఏప్రిల్‌లో మత్స్యకారులకు రూ.20వేలు: మంత్రి నిమ్మల
* IPL-2025 షెడ్యూల్ విడుదల
* న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌ తొక్కిసలాటలో 18మంది మృతి
* మరో 112 మందితో భారత్‌ చేరుకున్న US ఫ్లైట్