news

News December 20, 2024

అల్లరి నరేశ్ ‘బచ్చలమల్లి’ పబ్లిక్ టాక్

image

టాలీవుడ్ హీరో అల్లరి నరేష్‌, అమృత అయ్యర్‌ జంటగా నటించిన ‘బచ్చలమల్లి’ సినిమా ఈరోజు థియేటర్లలో రిలీజైంది. మూవీ చూసిన వారు తమ అభిప్రాయాన్ని నెట్టింట పంచుకుంటున్నారు. అల్లరి నరేశ్ క్యారెక్టర్, డైలాగ్స్, పర్ఫార్మెన్స్ అదుర్స్ అంటున్నారు. సాంగ్స్ బాగున్నాయని, బీజీఎంపై మరింత ఫోకస్ చేయాల్సిందని చెబుతున్నారు. అల్లరి నరేశ్‌ను కొత్తగా చూశామని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. మరికొద్దిసేపట్లో WAY2NEWS రివ్యూ!

News December 20, 2024

పెరిగిన అమెరికా జనాభా.. ఎంతంటే?

image

అమెరికా జనాభా 34 కోట్లకు చేరింది. 23ఏళ్లలో ఎన్నడూ లేనంతగా జనాభా వృద్ధి నమోదైందని, ఈ ఏడాదిలో పెరిగిన 1% ఇప్పటి వరకు అధికమని అమెరికా తెలిపింది. విదేశీయుల వలసలే దీనికి కారణమని చెప్పింది. ఈ ఏడాది 33లక్షల మంది జనాభా పెరగ్గా అందులో వలస వచ్చిన వారే 28 లక్షల మంది ఉన్నట్లు తెలిపింది. 2023-24 మరణాల కంటే జననాలే అధికమని పేర్కొంది. 2022లో 17లక్షలు, 2023లో 2.3లక్షల మంది జనాభా పెరిగింది.

News December 20, 2024

పాక్ మాకు ప్రమాదకరంగా మారుతోంది: అమెరికా

image

పాక్ ఖండాంతర క్షిపణుల్ని అభివృద్ధి చేయడంపై అమెరికా జాతీయ భద్రత సహాయ సలహాదారు జాన్ ఫైనర్ తాజాగా ఆందోళన వ్యక్తం చేశారు. ‘దీర్ఘ పరిధి బాలిస్టిక్ మిస్సైల్స్‌ను పాక్ అభివృద్ధి చేస్తోంది. ఆ క్షిపణులు మా వరకూ రాగలవు. వీటి అభివృద్ధి వెనుక పాక్ ఉద్దేశాలు అనుమానాస్పదంగా ఉన్నాయి. మాకు ప్రమాదకరంగా మారుతోందని భావిస్తున్నాం’ అని పేర్కొన్నారు. కాగా.. అమెరికా గతంలో పాక్‌కు అండగా నిలవడం గమనార్హం.

News December 20, 2024

Stock Market: ఫ్లాటుగా మొదలై లాభాల్లోకి..

image

స్టాక్‌మార్కెట్లు ఫ్లాట్‌గా మొదలై లాభాల్లో ట్రేడవుతున్నాయి. నిఫ్టీ 24,028 (+70), సెన్సెక్స్ 79,443 (+220) వద్ద చలిస్తున్నాయి. ఆటో, మీడియా, కన్జూమర్ డ్యురబుల్స్, O&G షేర్లకు డిమాండ్ కనిపిస్తోంది. బ్యాంకు, ఫైనాన్స్, FMCG, మెటల్ సూచీలు ఎరుపెక్కాయి. నిఫ్టీ ADV/DEC రేషియో 25:25గా ఉంది. NTPC, ADANIENT, DRREDDY, BAJFINANCE, TITAN టాప్ గెయినర్స్. AXISBANK, CIPLA, TECHM, ITC, JSWSTEEL టాప్ లూజర్స్.

News December 20, 2024

విద్యార్థులకు న్యూ ఇయర్ కానుక

image

AP: ఇంటర్ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 475 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో జనవరి నుంచి మధ్యాహ్న భోజనం పథకం అమలు చేసేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అదే ప్రాంగణంలో కలిసి ఉన్న లేదా సమీపంలోని హైస్కూళ్ల నుంచి మధ్యాహ్న భోజనం పంపనున్నారు. అలాగే పిల్లల్లో నైతిక విలువలు పెంచేలా ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావుతో ప్రత్యేకంగా పుస్తకాలు రూపొందించనున్నారు.

News December 20, 2024

ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లోనూ TTD క్యాలెండర్లు

image

తిరుమల శ్రీవారి భక్తుల కోసం క్యాలెండర్లను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లోనూ TTD అందుబాటులోకి తీసుకొచ్చింది. తిరుమల, తిరుపతి, తిరుచానూరు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, విజయవాడ, విశాఖపట్నం, న్యూఢిల్లీ, ముంబై, వేలూరులోని TTD పబ్లికేషన్ స్టాళ్లు, ప్రధాన కళ్యాణ మండపాల్లో క్యాలెండర్లు, డైరీలు అందుబాటులో ఉంటాయని TTD తెలిపింది. తమ వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకున్న వారికి ఇంటి వద్దకే పంపిస్తామని పేర్కొంది.

News December 20, 2024

23న విజయవాడలో సెమీ క్రిస్మస్ వేడుకలు

image

AP: విజయవాడ ఏ ప్లస్ కన్వెన్షన్ సెంటర్‌లో ఈ నెల 23న రాష్ట్ర ప్రభుత్వం తరఫున సెమీ క్రిస్మస్ వేడుకలు జరగనున్నాయి. సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల క్రైస్తవ మతపెద్దలు, చర్చిల ఫాదర్లు, క్రైస్తవ సంఘాల నాయకులు ఈ కార్యక్రమానికి హాజరవుతారు. అటు క్రిస్మస్ సందర్భంగా హై టీ కార్యక్రమ నిర్వహణ కోసం ప్రతి జిల్లాకు రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్ష చొప్పున కేటాయించింది.

News December 20, 2024

అశ్విన్ తర్వాత ఎవరు?

image

అశ్విన్ రిటైర్మెంట్‌తో అతని స్థానాన్ని భర్తీ చేసే ఆటగాళ్ల లిస్టులో పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. ఆల్‌రౌండర్ సుందర్ ముందువరుసలో ఉన్నారు. ముంబై ఆఫ్‌స్పిన్నర్ తనుశ్ కొటియాన్ కూడా పోటీ పడుతున్నారు. ఇతనికి దేశవాళీల్లో 100వికెట్లు, 40కి పైగా బ్యాటింగ్ AVG ఉంది. కుల్దీప్ బౌలింగ్ గణాంకాలు బాగున్నా బ్యాటింగ్‌‌లో వెనకబడి ఉన్నారు. అక్షర్ ఉన్నా బౌలింగ్‌లో వైవిధ్యం కావాల్సిన తరుణంలో అవకాశాలు తక్కువే.

News December 20, 2024

చలికాలంలో ‘ఖర్జూర’ ఎందుకు తినాలంటే..

image

చలికాలంలో బాడీ వెచ్చదనానికి ఎనర్జీ అవసరం. ఖర్జూరలోని గ్లూకోజ్, ఫ్రక్టోజ్, సూక్రోజ్ వంటి నేచురల్ షుగర్స్ ఇందుకు సాయపడతాయి. ఫైబర్ ఆకలిని తగ్గించి జీర్ణక్రియకు తోడ్పడుతుంది. శీతాకాలం జబ్బులకు నెలవు. డేట్స్‌లోని ఫ్లేవనాయిడ్స్, కెరటనాయిడ్స్, ఫెనోలిక్ యాసిడ్ దేహంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గించి ఇమ్యూనిటీని పెంచుతాయి. కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం కీళ్లలో స్టిఫ్‌నెస్, డిస్‌కంఫర్ట్‌ను తగ్గిస్తాయి.

News December 20, 2024

కవులు, కళాకారులు వాస్తవాలను ఆవిష్కరించాలి: సీఎం రేవంత్

image

TG: కవులు, కళాకారులు ఉద్యమాల గురించి వాస్తవాలను సమాజం ముందు ఆవిష్కరించాలని సీఎం రేవంత్ అన్నారు. వాస్తవాలను రాయకపోతే అసలైన పోరాట యోధులు, అమరుల గురించి భవిష్యత్తు తరాలకు అసంపూర్తి సమాచారమే అందుబాటులో ఉంటుందని వ్యాఖ్యానించారు. HYD బుక్ ఫెయిర్ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. ఉద్యమాల్లో అమరులైన వారికంటే రాజకీయంగా ప్రయోజనం పొందిన వారి గురించే ఎక్కువ చర్చ జరుగుతోందన్నారు.