India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: భూ సమస్యల పరిష్కారానికై ఈనెల 6 నుంచి ప్రభుత్వం నిర్వహిస్తోన్న రెవెన్యూ సదస్సులకు అద్భుత స్పందన వస్తోందని టీడీపీ తెలిపింది. 10 రోజుల్లో రెండున్నర లక్షల మంది హాజరయ్యారని వెల్లడించింది. రాష్ట్రంలో 17403 రెవెన్యూ గ్రామాలు ఉండగా ఇప్పటివరకు 4427 గ్రామాల్లో సదస్సుల నిర్వహణ పూర్తయిందని ట్వీట్ చేసింది. వచ్చే ఏడాది జనవరి 8 వరకు ఈ సదస్సులు కొనసాగుతాయని పేర్కొంది.
TG: ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు కన్వీనర్లను నియమిస్తూ ఉన్నత విద్యా మండలి ఉత్తర్వులిచ్చింది. ఏయే పరీక్షలను ఏ వర్సిటీ నిర్వహించనుందో వెల్లడించింది.
EAPCET-ప్రొ. డీన్ కుమార్ (JNTUH)
PGCET-ప్రొ. అరుణకుమారి (JNTUH)
ICET-ప్రొ. అలువల రవి (MGU)
ECET-ప్రొ. చంద్రశేఖర్ (OU), PECET-ప్రొ. దిలీప్(PU)
LAWCET, PGLCET-ప్రొ. విజయలక్ష్మి(OU)
EDCET-ప్రొ. వెంకట్రామ్ రెడ్డి(KU)
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 21 నుంచి రెండు రోజులపాటు కువైట్లో పర్యటించనున్నారు. కువైట్ దేశాధినేతలతో, ఉన్నతాధికారులతో సమావేశమై దౌత్య, వ్యాపార సంబంధాలపై చర్చిస్తారు. అక్కడ నివసించే భారతీయులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఆ దేశంలో భారత ప్రధాని పర్యటించడం గత 43 ఏళ్లలో ఇదే తొలిసారి. చివరగా 1981లో అప్పటి పీఎం ఇందిరా గాంధీ కువైట్లో పర్యటించారు. ఆ దేశంలో 10 లక్షల మంది భారతీయులు ఉంటున్నట్లు సమాచారం.
హాలీవుడ్ హీరో టామ్ క్రూజ్కు అరుదైన గౌరవం దక్కింది. US నేవీ ఆయనను అత్యున్నత పౌర పురస్కారంతో సత్కరించింది. టాప్ గన్, బార్న్ ఆన్ ది ఫోర్త్ ఆఫ్ జులై, మిషన్ ఇంపాజిబుల్ వంటి సినిమాల్లో తన పాత్రల ద్వారా ఆయన నేవీ సిబ్బంది చేసే త్యాగాల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించారని, నేవీపై ప్రశంసలు పెరిగేలా చేశారని అధికారులు పేర్కొన్నారు. లండన్లోని లాంగ్క్రాస్ ఫిల్మ్ స్టూడియోలో ఈ అవార్డు ప్రదానోత్సవం జరిగింది.
భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత బ్యాటర్ కేఎల్ రాహుల్ అత్యధిక బాల్స్ (463) ఎదుర్కొన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో ట్రావిస్ హెడ్ (415), జైశ్వాల్ (339), స్మిత్ (262), నితీశ్ రెడ్డి (248), లబుషేన్ (238), అలెక్స్ క్యారీ (209), విరాట్ కోహ్లీ (200) ఉన్నారు. ఈ సిరీస్లో కేఎల్ రాహుల్ ఓపెనర్గా ఆడుతూ రాణిస్తున్న సంగతి తెలిసిందే.
AP: రాష్ట్రంలో ఎర్రచందనం స్మగ్లింగ్ను అరికట్టేందుకు జీరో టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. సహజ వనరులను దోపిడీ చేయడానికి ప్రయత్నించే వారు తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ₹3.5 కోట్ల విలువైన 155 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్న తిరుపతి ఎర్రచందనం టాస్క్ ఫోర్స్ను అభినందించారు.
బ్రిస్బేన్ టెస్టులో ప్రస్తుతం క్రీజులో ఉన్న ఆకాశ్ దీప్ ఆఖరి స్థానంలో బ్యాటింగ్కు వచ్చినప్పటికీ అతడి బ్యాటింగ్ మరీ అంత బలహీనమేమీ కాదు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఓ బ్యాటింగ్ రికార్డు ఆకాశ్ దీప్ పేరిటే ఉంది. 2021/22 రంజీ సీజన్లో బెంగాల్ తరఫున ఝార్ఖండ్పై 18 బంతుల్లోనే 53 రన్స్ చేశారు. దీంతో అప్పటికి ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో వేగవంతమైన ఫిఫ్టీ సాధించిన ఆటగాడిగా రికార్డు సాధించారు.
ఆస్కార్స్-2025 షార్ట్ లిస్ట్ విడుదలైంది. ఇండియా నుంచి ‘బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్’ కేటగిరిలో పోటీ పడ్డ ‘లాపతా లేడీస్’ సినిమా ఈ లిస్టులో చోటు దక్కించుకోలేకపోయింది. బ్రిటిష్-ఇండియన్ ఫిల్మ్ మేకర్ సంధ్య సూరి తెరకెక్కించిన ‘సంతోష్’ మూవీకి చోటు దక్కింది. ఈ మూవీ UK నుంచి పోటీ పడుతోంది. 10 విభాగాలకు సంబంధించిన షార్ట్ లిస్టు కోసం ఇక్కడ <
TG: రాష్ట్రంలో కొత్త అసెంబ్లీ అవసరమని మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అభిప్రాయపడ్డారు. అది కూడా సచివాలయం పక్కనే ఉంటే బాగుంటుందని చెప్పారు. ‘హుస్సేన్ సాగర్ ఒడ్డున సచివాలయం, అసెంబ్లీ, అమరవీరుల స్తూపం అన్ని ఒకచోట ఉండటం మంచిది. పాలనాపరంగా పక్కపక్కనే ఉంటే సౌలభ్యంగా ఉంటుంది. అవసరమైతే FTL పరిధిని కుచించి మరీ ఈ నిర్మాణాలు చేపట్టవచ్చు’ అని ఆయన పేర్కొన్నారు.
నవీ ముంబైలోని డా.డీవై పాటిల్ స్టేడియంలో భారత్తో జరిగిన రెండో T20లో వెస్టిండీస్ మహిళల జట్టు 9 వికెట్ల తేడాతో గెలిచింది. మొదట IND 20 ఓవర్లలో 159/9 స్కోర్ చేసింది. స్మృతి మందాన (62) టాప్ స్కోరర్గా నిలిచారు. అనంతరం WI 15.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఆ జట్టు కెప్టెన్ మాథ్యూస్ (47 బంతుల్లో 85) రాణించారు. 3 మ్యాచుల సిరీస్లో ఇరు జట్లు చెరో విజయంతో సమంగా ఉన్నాయి. మూడో T20 రేపు జరగనుంది.
Sorry, no posts matched your criteria.