news

News December 17, 2024

ACB చేతుల్లోకి ఈ-ఫార్ములా కేసు!

image

TG: ఈ-ఫార్ములా రేసింగ్‌లో నిధుల దుర్వినియోగంపై విచారణ జరపాలని సీఎస్ శాంతికుమారి ఏసీబీకి లేఖ రాశారు. ఈ కేసుకు సబంధించి ఇటీవల గవర్నర్ ఇచ్చిన అనుమతి లేఖను కూడా జత చేసి పంపారు. కాగా ఈ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ రూ.53 కోట్లను ఓ విదేశీ సంస్థకు ఆర్బీఐ అనుమతులు లేకుండా నేరుగా ట్రాన్స్‌ఫర్ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

News December 17, 2024

పైప్డ్ గ్యాస్ రాజధానిగా అమరావతి

image

AP: అమరావతిని పైప్డ్ గ్యాస్ రాజధానిగా మార్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. పైప్డ్ గ్యాస్ అందించేందుకు IOC (ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్) ప్రభుత్వాన్ని సంప్రదించింది. గుజరాత్‌లోని గిఫ్ట్ సిటీ తరహాలో పైప్డ్ గ్యాస్ అందిస్తామని తెలిపింది. దేశంలోనే తొలి పైప్డ్ గ్యాస్ రాజధానిగా తీర్చిదిద్దుతామని పేర్కొంది. కాగా నివాసాలు, హోటళ్లు, సంస్థలు అన్నింటికీ సిలిండర్లతో కాకుండా పైపులతోనే గ్యాస్ అందిస్తారు.

News December 17, 2024

పృథ్వీ షా, రహానేకు మొండిచేయి

image

టీమ్ ఇండియా క్రికెటర్ పృథ్వీ షాకు మరో బిగ్ షాక్ తగిలింది. విజయ్ హజారే ట్రోఫీ కోసం ఎంపిక చేసిన జట్టులో ముంబై అతడికి చోటివ్వలేదు. ఆయనతోపాటు రహానేకు కూడా మొండిచేయి చూపింది. ఇటీవల జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో పృథ్వీషాను ఎవరూ కొనుగోలు చేయని విషయం తెలిసిందే. కాగా ఈ టోర్నీకి ఎంపిక కాకపోవడంతో పృథ్వీ తన ఇన్‌స్టా ఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు. ‘దేవుడా ఇంకెన్ని పరుగులు చేయాలి’ అంటూ అసహనం వ్యక్తం చేశారు.

News December 17, 2024

సంధ్య థియేటర్ క్లోజేనా?

image

సంధ్య థియేటర్ లైసెన్స్‌పై పోలీసులు <<14906082>>షోకాజ్<<>> నోటీసులు ఇవ్వడంతో దాన్ని క్లోజ్ చేస్తారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పుష్ప-2 మూవీ టీం వస్తుందని పోలీసులకు ముందుగా సమాచారం ఇవ్వకపోవడం, సెక్యూరిటీ ఏర్పాట్లు చేయకపోవడంపై పోలీసులు గుర్రుగా ఉన్నారు. ఎంట్రీ, ఎగ్జిట్ వివరాలు, టికెట్ వెరిఫికేషన్ సిస్టమ్ లేకపోవడం, భారీ స్థాయిలో ఫ్లెక్సీలు, పార్కింగ్ సమస్య.. ఇలా చాలా సమస్యలు ఉన్నట్లు గుర్తించారు.

News December 17, 2024

తిరుమల వైకుంఠ ఏకాదశి టికెట్లు.. ఎప్పుడు, ఎక్కడ?

image

AP: తిరుమలలో జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు ఉండనున్నాయి. దానికి సంబంధించిన టికెట్ల వివరాలు..
*DEC 23న ఆన్‌లైన్‌లో ఉ.11 గం.కు శ్రీవాణి వీఐపీ టికెట్ల విడుదల
*DEC 24న ఆన్‌లైన్‌లో ఉ.11 గం.కు రూ.300 స్పెషల్ దర్శన టోకెన్ల విడుదల
*తిరుపతిలోని ఎం.ఆర్ పల్లి, జీవకోన, ఇందిరా మైదానం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, తిరుమలలోని కౌస్తుభం విశ్రాంతి భవనంలో SSD టోకెన్ల కేటాయింపు

News December 17, 2024

గబ్బా టెస్టు డ్రాగా ముగుస్తుందా?

image

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న గబ్బా టెస్టు చివరి రోజు కూడా వర్షం పడొచ్చని తెలుస్తోంది. రేపు వర్షం పడేందుకు 90 శాతం అవకాశం ఉన్నట్లు ఆక్యూవెదర్.కామ్ తెలిపింది. దీంతో ఈ టెస్టు డ్రాగా ముగిసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. కాగా నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 252/9 పరుగులు చేసి ఫాలో ఆన్ తప్పించుకుంది. ఇంకా 193 పరుగులు వెనుకబడి ఉంది.

News December 17, 2024

మిస్టరీ డ్రోన్ల గురించి మా సైన్యానికి తెలుసు: ట్రంప్

image

గత కొన్ని రోజులుగా అమెరికా గగనతలంలో రాత్రుళ్లు మిస్టరీ డ్రోన్లు కలకలం రేపుతున్నాయి. అధ్యక్ష ఎన్నికల విజేత ట్రంప్ తాజాగా వాటిపై స్పందించారు. ‘అసలేం జరుగుతోందో ప్రభుత్వానికి తెలుసు. మన సైన్యానికీ తెలుసు. కారణమేంటో తెలీదు గానీ ఆ విషయంపై వారు వివరణ ఇవ్వడం లేదు. అదేంటన్నది సస్పెన్స్‌లో పెట్టకుండా బయటికి చెప్పేస్తే బెటర్. ఒకవేళ అవి శత్రు డ్రోన్లైతే ఈపాటికే వాటిని పేల్చేసి ఉండేవారు’ అని పేర్కొన్నారు.1

News December 17, 2024

ఉత్తమ విద్య లభించే దేశాలివే!

image

వరల్డ్ రిపోర్ట్‌ను పరిగణనలోకి తీసుకొని 2024లో ఉత్తమ విద్యను అందిస్తోన్న దేశాల జాబితా రిలీజైంది. ప్రపంచవ్యాప్తంగా 17,000+ మంది అభిప్రాయాలను సేకరించి దీనిని రూపొందించారు. అనేక అంశాల్లో ప్రజలు తమ అవగాహన ప్రకారం దేశాలకు ర్యాంకులిచ్చారు. ప్రథమ స్థానంలో అమెరికా, రెండో స్థానంలో UK, మూడోస్థానంలో జర్మనీ ఉన్నాయి. ఆ తర్వాత కెనడా, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, జపాన్, ఆస్ట్రేలియా ఉండగా 42వ స్థానంలో ఇండియా ఉంది.

News December 17, 2024

జమిలి ఎన్నికలు అసాధ్యం.. విపక్షాల్లో విశ్వాసానికి కారణం ఇదే!

image

LSలో Tue జమిలి ఎన్నికల బిల్లుపై ఓటింగ్ సరళితో ఈ ప్రతిపాదన అమలు అసాధ్యమని విపక్షాలు అంటున్నాయి. ఎందుకంటే భ‌విష్య‌తులో బిల్లును ఆమోదించాలంటే హాజ‌రైన స‌భ్యుల్లో 2/3 బలం అవ‌స‌రం. అయితే Tue జ‌రిగిన ఓటింగ్‌లో 461 మంది స‌భ్యులు పాల్గొంటే, అనుకూలంగా 269 మంది మాత్రమే ఓటేశారు. ఈ లెక్కన 2/3 మెజారిటీ (307 మంది)కి ఇది చాలా తక్కువ. దీంతో బిల్లు ప్రవేశపెట్టడానికి ఆమోదం లభించినా, పాస్ అవ్వడం అసాధ్యం అంటున్నాయి.

News December 17, 2024

మెదడు పనితీరు, ఆరోగ్యాన్ని పెంచే ఫుడ్స్

image

ఆరోగ్యకరమైన ఆహార పదార్థాల ద్వారా మెదడు పనితీరు, ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చు. తృణధాన్యాల ద్వారా మెదడు ఇతర శరీర అవయవాల పనితీరు మెరుగుపడుతుంది. నట్స్&సీడ్స్‌లో విటమిన్-E అధికంగా ఉండి మెదడు సంబంధిత వ్యాధులతో వచ్చే మరణాలను తగ్గిస్తుంది. అవకాడో తింటే మెదడుకు రక్తప్రసరణ పెరుగుతుంది. డార్క్ చాక్లెట్ తింటే ఏకాగ్రత మెరుగవుతుంది. బ్లూ బెర్రీస్ వల్ల డిమెన్షియా లక్షణాలు తగ్గి అల్జీమర్స్ వ్యాధి ప్రమాదం తగ్గుతుంది.