India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: వికారాబాద్(D) లగచర్లలో ప్రభుత్వాన్ని ప్రతిఘటించిన రైతులపై ప్రభుత్వ నిర్బంధ కాండ-పోలీసుల థర్డ్ డిగ్రీ ప్రయోగం, రైతులను జైళ్లలో బంధించిన అంశంపై బీఆర్ఎస్ వాయిదా తీర్మానంపై చర్చను కోరింది. దీనిని స్పీకర్ గడ్డం ప్రసాద్ తిరస్కరించారు. దీంతో పాటు మూసీ పరీవాహకంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో అనుమానాలపై చర్చించాలన్న వాయిదా ప్రతిపాదనను సైతం తిరస్కరించారు. తర్వాత సభను తాత్కాలికంగా వాయిదా వేశారు.
మంచు కుటుంబంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మంచు మనోజ్ భార్య మౌనికతో కలిసి జనసేనలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఇవాళ ఆళ్లగడ్డలో జరిగే భూమా శోభా నాగిరెడ్డి జయంతి వేడుకల్లో దీనిపై ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇప్పటికే మౌనిక సోదరి అఖిలప్రియ రాజకీయాల్లో ఉన్న సంగతి తెలిసిందే. గతంలో మనోజ్ తండ్రి మోహన్ బాబు రాజ్యసభ ఎంపీగా పనిచేశారు.
పన్ను ఎగవేతదారులపై IT శాఖ కొరడా ఝుళిపించింది. అధిక ఆదాయం పొందుతూ ITR దాఖలు చేయనివారి నుంచి 20 నెలల్లోనే రూ.37,000 కోట్లు వసూలు చేసింది. ఎగవేతదారుల నుంచి ముక్కుపిండి వసూలు చేసేందుకు ప్రభుత్వం డేటా అనలిటిక్స్, నాన్ ఫైలర్ మానిటరింగ్ సిస్టమ్ (NMS), TDSలను ప్రాసెస్ చేసింది. లగ్జరీ స్పెండింగ్, బంగారం, నగలు, వజ్రాలను మొత్తం నగదు రూపంలో కొనుగోలు చేసి ITRఫైల్ చేయని వారిని గుర్తించి తనిఖీలు చేపట్టింది.
ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ మరణంపై మాస్టర్ బ్లాస్టర్ సచిన్ సంతాపం ప్రకటించారు. ‘ఆయన దరువులు మన హృదయాల్లో ఎప్పటికీ ప్రతిధ్వనిస్తూనే ఉండిపోతాయి. ఆయన చేతులు లయలను అందిస్తే, చిరునవ్వు & వినయపూర్వకమైన వ్యక్తిత్వం మనసుకు దగ్గర చేశాయి. మీ మాయాజాలాన్ని చూసే అదృష్టం మాకు కలిగింది. మీ సంగీతానికి హద్దులు లేవు. మీ మరణం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంగీత ప్రియులకు తీరనిలోటు’ అని తెలిపారు.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ తెరకెక్కిస్తోన్న ‘గేమ్ ఛేంజర్’ సినిమా నుంచి మరో సాంగ్ రిలీజ్ కానుంది. ‘తర్వాతి సాంగ్ గేమ్ ఛేంజర్ను సౌండ్ ఛేంజర్గా మారుస్తుంది’ అంటూ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ట్వీట్ చేశారు. దీంతో ఈ సాంగ్పై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. DHOP అంటూ సాగే ఈ సాంగ్ సాయంత్రం 6 గంటలకు రిలీజ్ అవుతుందని, ఆ తర్వాత దీని గురించి ప్రపంచమే మాట్లాడుకుంటుందని ఆయన పేర్కొన్నారు.
TG: సంక్రాంతి నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. కార్డులపై క్యాబినెట్ సబ్ కమిటీ వేశామని వెల్లడించారు. దాదాపు 36 లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు ఆయన చెప్పారు. అటు రేషన్ కార్డుదారులకు ఇప్పుడిచ్చే 6 కిలోలతో పాటు సన్నబియ్యం కూడా ఇస్తామన్నారు.
AP: నటుడు మోహన్ బాబు హైదరాబాద్ నుంచి చిత్తూరు జిల్లా చంద్రగిరి(మ) రంగంపేటలోని తన యూనివర్సిటీకి చేరుకున్నారు. అనంతరం చంద్రగిరి పీఎస్లో తన లైసెన్స్డ్ గన్ను PRO ద్వారా డిపాజిట్ చేయించారు. ఇటీవల గన్ సరెండర్ చేయాలని HYD పోలీసులు ఆయన్ను ఆదేశించడంతో తాజాగా గన్ అప్పగించారు.
చారిత్రక ప్రాధాన్యమున్న జవహర్లాల్ నెహ్రూ లేఖలను తిరిగివ్వాలని రాహుల్ గాంధీని PM మ్యూజియం, లైబ్రరీ (PMML) కోరింది. ఒరిజినల్/జిరాక్స్/డిజిటల్ కాపీలైనా ఇవ్వాలని లైబ్రరీ సభ్యుడు రిజ్వాన్ ఖాద్రీ లేఖ రాశారు. ఇందిర PMMLకు ఇచ్చిన నెహ్రూ ప్రైవేటు పేపర్లను 2008లో UPA హయాంలో 51 బాక్సుల్లో వీటిని సోనియాకు పంపించారని ఆయన తెలిపారు. ఎడ్వినా మౌంట్బాటెన్, ఐన్స్టీన్, జగ్జీవన్, JPకి రాసిన లేఖలు ఇందులో ఉన్నాయి.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చరిత్ర సృష్టించారు. తాను నటించిన ‘పుష్ప-2’ సినిమా నిన్న రూ.104 కోట్లు కలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో రిలీజైన 11వ రోజున రూ.100+ కోట్లు రాబట్టిన తొలి భారతీయ సినిమాగా నిలిచిందని సినిమా వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ‘పుష్ప-2’ అత్యధిక వసూళ్లు రాబట్టిన మూడో చిత్రంగా నిలిచినట్లు తెలుస్తోంది. ‘దంగల్’ తొలి స్థానంలో ఉండగా బాహుబలి-2 రెండో ప్లేస్లో ఉంది.
మంచు విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న ‘కన్నప్ప’ నుంచి మోహన్ లాల్ లుక్ను చిత్ర యూనిట్ రివీల్ చేసింది. ఈ సినిమాలో ఆయన ‘కిరాత’గా కనిపించనున్నట్లు పేర్కొంది. ‘పాశుపతాస్త్ర ప్రధాత విజయుడిని గెలిచిన ఆటవిక కిరాత’ అంటూ ఆయన క్యారెక్టర్ గురించి రాసుకొచ్చింది. ఈ చిత్రంలో ప్రభాస్, అక్షయ్ కుమార్ తదితర స్టార్లు నటిస్తున్న సంగతి తెలిసిందే.
Sorry, no posts matched your criteria.