news

News November 15, 2024

BJPలో ఉన్నందుకే బతికిపోయా: MLA విష్ణుకుమార్

image

AP: గత వైసీపీ ప్రభుత్వం విమర్శించిన వారిని తీవ్ర ఇబ్బందులు పెట్టిందని విశాఖ BJP MLA విష్ణుకుమార్ రాజు అన్నారు. ఎన్నికల సమయంలో ఓ MLAపై విమర్శలు చేసినందుకు తనపైనా కేసులు పెట్టారని, అయితే తాను BJPలో ఉండటం వల్ల తప్పించుకోగలిగానని అన్నారు. లేకపోతే రఘురామకృష్ణరాజుకు ఇచ్చిన ట్రీట్మెంటే తనకూ తప్పేది కాదన్నారు.

News November 15, 2024

INDvsSA: సాధిస్తారా? సమం చేస్తారా?

image

నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య చివరిదైన 4వ టీ20 జరగనుంది. ఈరోజు రాత్రి 8.30గంటలకు జొహన్నెస్‌బర్గ్‌లోని వాండరర్స్ స్టేడియంలో ప్రారంభం కానుంది. జరిగిన 3 టీ20ల్లో 2 గెలిచిన భారత్ 2-1తో ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని భావిస్తోంది. ఆతిథ్య సఫారీ జట్టేమో ఇందులో ఎలాగైనా గెలిచి సిరీస్ సమం చేయాలనే పట్టుదలతో ఉంది.
> ALL THE BEST INDIA

News November 15, 2024

నేడు బడ్జెట్‌పై చర్చ

image

AP: మొన్న ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌పై ఈరోజు అసెంబ్లీలో చర్చ జరగనుంది. ఈ సందర్భంగా సభ్యులు లేవనెత్తే ప్రశ్నలకు ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావుల కేశవ్ సమాధానం ఇస్తారు. దీంతోపాటు ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ బిల్లు, ఏపీ ఎలక్ట్రిసిటీ సవరణ బిల్లులను సభలో ప్రవేశపెడతారు.

News November 15, 2024

ఆటిజంపై స్పెషల్ ఫోకస్: మంత్రి సత్యకుమార్

image

AP: రాష్ట్రంలో ఆటిజం లక్షణాలున్న పిల్లలను గుర్తించేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు హెల్త్ మినిస్టర్ సత్య కుమార్ వెల్లడించారు. మొదటి రెండేళ్లలో లక్షణాలను గుర్తిస్తే దీన్ని నివారించగలమని అసెంబ్లీలో అన్నారు. దీనిపై ఇతర రాష్ట్రాల్లో పాటిస్తున్న తీరును పరిశీలిస్తామని తెలిపారు. ఆటిజం చికిత్సను ఎన్టీఆర్ వైద్య సేవ కింద చేర్చేందుకు యత్నిస్తున్నామన్నారు.

News November 15, 2024

ఇంగ్లండ్ టార్గెట్ 146 రన్స్

image

ఇంగ్లండ్‌తో మూడో టీ20లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ బ్యాటర్లు తడబడ్డారు. దీంతో విండీస్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 145 రన్స్ మాత్రమే చేసింది. కెప్టెన్ పావెల్(54), రొమారియో షెఫర్డ్(30) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో సాకిబ్ మహమూద్ 3, ఓవర్టన్ 3, ఆర్చర్ 1 వికెట్ తీశారు. ఇంగ్లండ్ గెలవాలంటే 146 రన్స్ చేయాలి.

News November 15, 2024

మహిళా మంత్రిని భయపెడుతున్న అరటిపండ్లు!

image

స్విడన్‌లో జెండర్ ఈక్వాలిటీ మినిస్టర్ పౌలినా బ్రాండ్‌బర్గ్‌ అరటి పండ్లను చూస్తే ఆమడదూరం పరిగెత్తుతున్నారు. ఆమెకు బనాన ఫోబియా ఉంది. అందుకే తాను ఎక్కడ పర్యటనకు వెళ్లినా ముందే అక్కడి అధికారులతో ‘బనానా ఫ్రీ’ జోన్‌లను ఏర్పాటు చేయమని మెయిల్స్ చేస్తున్నారు. ఫోబియా నుంచి బయటపడేందుకు ఆమె చికిత్స పొందుతున్నారు. వినడానికి వింతగా ఉన్నా ఈ ఫోబియా ఉన్నవారికి అరటి పండ్లను చూస్తే వికారం, ఆందోళన కలుగుతుంది.

News November 15, 2024

BRS, BJP ఒక్కటే అన్నవాడిని చెప్పుతో కొట్టాలి: KTR

image

TG: BRS, BJP ఒక్కటే అన్నవాడిని చెప్పుతో కొట్టాలని KTR ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ ఆ ప్రచారంలో నిజం ఉంటే MLC కవిత ఎందుకు 5నెలలు జైలులో ఉంటారని ప్రశ్నించారు. BRS, BJP ఒక్కటయితే కలిసి ఉంటే ‘అమృత్ స్కామ్‌’పై తాము ఫిర్యాదు చేస్తే ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు. మంత్రి పొంగులేటి మీద ED రైడ్స్ జరిగితే వివరాలు ఎందుకు బయటికి రావడం లేదని అన్నారు.

News November 15, 2024

పాకిస్థాన్‌కు చేరిన ఛాంపియన్స్ ‘ట్రోఫీ’

image

ఓవైపు ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ చుట్టూ అనిశ్చితి నెలకొని ఉండగా మరోవైపు ICC మాత్రం మరో ముందడుగు వేసింది. దేశవ్యాప్త ప్రదర్శన నిమిత్తం ఛాంపియన్స్ ట్రోఫీని పాకిస్థాన్‌కు పంపింది. ప్రపంచంలోనే రెండో ఎత్తైన పర్వతం K2 శిఖరానికి కూడా ఈ ట్రోఫీని తీసుకెళ్లనున్నారు. కాగా ఈ టోర్నీ కోసం పాక్‌కు వెళ్లేందుకు ఇండియా No చెప్పడంతో దీని నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి.

News November 15, 2024

కపిల్‌శర్మ షో నుంచి అందుకే బయటికొచ్చా: సిద్ధూ

image

కపిల్‌శర్మ షో నుంచి నిష్క్రమించడంపై నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఎట్టకేలకు మౌనం వీడారు. రాజకీయాల వల్లే తాను షో నుంచి వైదొలగాల్సి వచ్చిందన్నారు. అంతకంటే ఎక్కువ వివరించకూడదని చెప్పారు. 2019లో ఈ షో నుంచి సిద్ధూ నిష్క్రమించడం అభిమానులకు షాక్ ఇచ్చింది. అయితే పుల్వామా దాడి గురించి ఆయన ‘ఉగ్రవాదులకు మతాలు లేవు’ అని చేసిన వ్యాఖ్యల వల్లే షో నుంచి వెళ్లిపోవాల్సి వచ్చిందని అప్పట్లో ప్రచారం జరిగింది.

News November 15, 2024

నవంబర్ 15: చరిత్రలో ఈ రోజు

image

* 1949: నాథూరామ్ గాడ్సే మరణం.
* 1982: భారత స్వాతంత్ర్య సమరయోధుడు వినోబా భావే మరణం.
* 1986: భారతదేశ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా జననం.
* 2000: బీహార్ నుంచి ఝార్ఖండ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది.
* 2022: నటుడు ఘట్టమనేని కృష్ణ మరణం(ఫొటోలో).