India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

దేశవాళీ క్రికెట్లో టన్నుల కొద్దీ పరుగులు చేసిన షెల్డన్ జాక్సన్ రిటైర్మెంట్ ప్రకటించారు. సౌరాష్ట్రకు ప్రాతినిధ్యం వహించిన ఇతను ఫస్ట్ క్లాస్+లిస్ట్ A+T20లలో పదివేలకు పైగా పరుగులు చేశారు. ఇందులో 31 సెంచరీలు, 64 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అయితే జాతీయ జట్టుకు మాత్రం ఎంపిక కాలేదు. IPLలో RCB, KKR జట్లు ఇతడిని కొనుగోలు చేసినప్పటికీ కేవలం 9 మ్యాచ్ల్లోనే ఆడే అవకాశం వచ్చింది.

ఇస్రో చేపట్టిన గగన్యాన్-1 మిషన్ ద్వారా ఈగలను (fruit flies) అంతరిక్షంలోకి పంపేందుకు TIFR సిద్ధమవుతోంది. జీవరాశిపై స్పేస్ ట్రావెల్ ప్రభావం, అనుభవించే స్ట్రెస్, జీవ రసాయన మార్పులను తెలుసుకోవడమే ఈ ప్రయోగ లక్ష్యం. మానవుల్లో రోగాలపై ప్రభావం చూపే జెనెటిక్ పాథ్వేస్ను 75% షేర్ చేసుకుంటుండటంతో ఈగలను ఎంచుకున్నారు. మైక్రో గ్రావిటీ ఉండే స్వల్పకాల స్పేస్ ట్రావెల్లో మెటబాలిజం ఫిట్నెస్ను తెలుసుకోనున్నారు.

జేఈఈ మెయిన్ మొదటి సెషన్ ఫలితాలను ఎన్టీఏ రిలీజ్ చేసింది. అభ్యర్థులు <

సైబర్ నేరగాళ్లు తనను ట్రాప్ చేసేందుకు యత్నించారని మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ట్విటర్లో తెలిపారు. ‘రూ.25వేలు కావాలంటూ ఓ సన్నిహితుడి నంబర్ నుంచి నాకు సందేశం వచ్చింది. అతడి ఫోన్ హ్యాక్ అయిందని నాకు ముందే తెలుసు. జీ పేలో పంపితే ఓకేనా అని అడిగాను. ఓ నంబర్ పంపించి పేమెంట్ స్క్రీన్ షాట్ కావాలన్నాడు. రూ.25వేలు సరిపోతాయా రూ.2.5 లక్షలు పంపించనా అని అడిగాను. ఇక మళ్లీ మెసేజ్ రాలేదు’ అని వెల్లడించారు.

దేశీయ మార్కెట్లో శాంసంగ్ హవాకు బ్రేక్ పడింది. 2024లో ఆ సౌత్ కొరియా కంపెనీ వాటా 17 నుంచి 13.2 శాతానికి పడిపోయి రెండో స్థానంలో నిలిచింది. వివో(చైనా) 15.2 నుంచి 16.6 శాతానికి చేరి టాప్లో నిలిచినట్లు ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ వెల్లడించింది. ఐఫోన్ మార్కెట్ 6.4 నుంచి 8.2 శాతానికి చేరినట్లు తెలిపింది. 3-10 స్థానాల్లో వరుసగా OPPO, షియోమీ, రియల్మి, ఆపిల్, మోటొరోలా, POCO, వన్ప్లస్, ఐక్యూ ఉన్నాయంది.

ఏఐ టెక్నాలజీ అన్ని దేశాలకూ అందుబాటులోకి రావాలని పారిస్లో జరిగిన ఏఐ శిఖరాగ్ర సదస్సులో PM మోదీ అన్నారు. ‘ఏఐ అనేది ఇప్పటికే మన రాజకీయ, ఆర్థిక, భద్రత, సామాజిక వ్యవస్థల్ని సమూలంగా మార్చేస్తోంది. ఈ శతాబ్దంలో మానవాళికి ఏఐ కోడ్ వంటిది. శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. అంతే వేగంగా ప్రజలకు అందుబాటులోకి వస్తోంది. ఏఐలో మా అనుభవాన్ని ప్రపంచంతో పంచుకోవడానికి మేం ఎల్లప్పుడూ సిద్ధం’ అని పేర్కొన్నారు.

ఇండియన్ పోస్ట్ 21,413 GDS పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏపీలో 1215, తెలంగాణలో 519 ఖాళీలున్నాయి. అర్హత 10వ తరగతి కాగా కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరి. సైకిల్ లేదా స్కూటర్ నడిపే నైపుణ్యం ఉండాలి. వయసు 18-40 ఏళ్ల మధ్య ఉండాలి. మెరిట్ ఆధారంగా రిక్రూట్మెంట్ చేపడతారు. దరఖాస్తు ఫీజు జనరల్, ఓబీసీ, EWS వారికి రూ.100 కాగా మిగతా అభ్యర్థులకు ఉచితం. మార్చి 3 వరకు <

‘ఇండియాస్ గాట్ లేటెంట్’లో పేరెంట్స్ శృంగారంపై యూట్యూబర్ రణ్వీర్ అలహాబాదియ చేసిన <<15413969>>అభ్యంతకర వ్యాఖ్యలు<<>> దుమారం రేపుతున్నాయి. పార్లమెంటులోనూ ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. ఈ క్రమంలో మొత్తం ఎపిసోడ్ వీడియోను యూట్యూబ్ తొలగించింది. సమాచార మంత్రిత్వ శాఖ, NHRC ప్రతినిధుల ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. తన వ్యాఖ్యలపై రణ్వీర్ క్షమాపణ కోరిన విషయం తెలిసిందే.

AP: తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయం వద్ద అగ్నిప్రమాద ఘటనపై CC ఫుటేజీ ఇవ్వాలన్న పోలీసుల <<15407091>>నోటీసులకు<<>> పార్టీ ప్రతినిధులు సమాధానం ఇచ్చారు. ప్రభుత్వం మారిన తర్వాత ఆ రోడ్డులోని సీసీ కెమెరాలను అధికారులే తొలగించారని తెలిపారు. బారికేడ్లను తీసేసి అన్ని వాహనాలకు అనుమతిచ్చారన్నారు. మాజీ సీఎం జగన్ భద్రతపై అనుమానాలున్నాయని, ఈ విషయాన్ని ఇప్పటికే కోర్టు దృష్టికి తీసుకెళ్లామని పేర్కొన్నారు.

ENGపై రెండో వన్డేలో సెంచరీతో అదరగొట్టిన IND కెప్టెన్ రోహిత్ శర్మ మరో రికార్డుపై కన్నేశారు. రేపు జరిగే మ్యాచ్లో 13 పరుగులు చేస్తే ODIలలో వేగంగా 11,000 రన్స్ చేసిన రెండో ఆటగాడిగా నిలుస్తారు. హిట్ మ్యాన్ ఇప్పటి వరకు 259 Innsలో 10,987 రన్స్ చేశారు. 222 ఇన్నింగ్సుల్లోనే 11వేల పరుగులు చేసిన కోహ్లీ టాప్లో ఉన్నారు. ఆ తర్వాత సచిన్(276Inns), పాంటింగ్(286Inns), గంగూలీ(288Inns), కల్లిస్(293Inns) ఉన్నారు.
Sorry, no posts matched your criteria.