India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి వచ్చే ఏడాది జనవరిలో ఇస్రో GSLV-F15 ప్రయోగాన్ని చేపట్టనుంది. ఇది షార్ నుంచి చేపట్టే వందో రాకెట్ ప్రయోగం. దీనితో షార్ మరో మైలురాయిని చేరుకోబోతున్న సందర్భంగా ఈ రాకెట్ ప్రయోగాన్ని చూసేందుకు రావాలని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ ప్రధాని మోదీని ఆహ్వానించారు. 100వ రాకెట్ ప్రయోగం కావడంతో క్షేత్రస్థాయిలో వివిధ కార్యక్రమాలను చేపట్టనున్నారు.
దేశంలోనే తొలి డయాబెటిస్ బయోబ్యాంక్ను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ICMR) చెన్నైలో ఏర్పాటు చేసింది. అధునాతన శాస్త్రీయ పరిశోధనల కోసం మద్రాస్ డయాబెటిస్ రీసెర్చ్ ఫౌండేషన్ సహకారంతో దీనిని ప్రారంభించింది. జీవ నమూనాలు సేకరించి ప్రాసెస్ చేయడం, నిల్వ, పంపిణీ చేయడం వంటివి ఈ బ్యాంక్ నిర్వహిస్తుంది. దేశవ్యాప్తంగా శాంపిళ్లను సేకరించి ఇక్కడ పరిశోధనలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
ఆస్ట్రేలియాతో మూడో టెస్టులో రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్కు బదులు లెఫ్టార్మ్ స్పిన్నర్ జడేజాను ఆడించి టీమ్ ఇండియా మిస్టేక్ చేసిందని పుజారా అన్నారు. AUS టీమ్లో ఖవాజా, హెడ్, క్యారీ వంటి లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్లున్నారు కాబట్టి అశ్విన్ లేదా సుందర్ను ఆడించాల్సిందని అభిప్రాయపడ్డారు. ఈ టెస్టులో ఇప్పటివరకు 16 ఓవర్లు వేసిన జడేజా ఒక్క వికెట్ కూడా తీయలేకపోయిన సంగతి తెలిసిందే.
TG: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన బాధితులకు అల్లు అర్జున్ రూ.కోటి ఇవ్వాలని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. సికింద్రాబాద్ కిమ్స్లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసిన ఆయన, బాధ్యులెవరైనా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. కాగా శ్రీతేజ్ ఆరోగ్యం ప్రస్తుతం విషమంగానే ఉందని, రెండు వారాలు గడిస్తే గానీ ఏం చెప్పలేమని డాక్టర్లు అంటున్నారు.
‘పుష్ప-2’ సినిమా హిందీలో రెండో వీకెండ్లో రూ.116కోట్లు వసూలు చేసింది. దీంతో హిందీ సినీ చరిత్రలో రెండో వీకెండ్లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాగా నిలిచింది. ఇప్పటివరకూ ఈ రికార్డు స్త్రీ-2 (రూ.92కోట్లు) సినిమా పేరిట ఉండేది. పుష్ప-2 సెకండ్ ఫ్రైడే రూ.24.5 కోట్లు, రెండో శనివారం రూ.42 కోట్లు, రెండో ఆదివారం రూ.50 కోట్లు రాబట్టింది. ఇప్పటివరకూ హిందీలో మొత్తం రూ.508 కోట్లు వసూలు చేసింది.
AP: పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను సీఎం చంద్రబాబు ఇవాళ పరిశీలించనున్నారు. పనుల పురోగతిపై అధికారులతో చర్చించడంతో పాటు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ, కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణం తదితర అంశాలపై సమీక్షించనున్నారు. అనంతరం ప్రాజెక్టు నిర్మాణాలకు సంబంధించిన షెడ్యూల్ను రిలీజ్ చేస్తారు. సీఎం అయ్యాక ఈ ఏడాది ఆయన పోలవరాన్ని సందర్శించడం ఇదే రెండోసారి. అంతకుముందు జూన్ 17న ఆయన ప్రాజెక్టును సందర్శించారు.
TG: అసెంబ్లీ సమావేశాలు ఇవాళ్టి నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీలో నేడు పర్యాటక విధానంపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. ఉ.10 నుంచి 11 వరకు తొలుత ప్రశ్నోత్తరాలు నిర్వహించనున్నారు. ఆ తర్వాత ఇటీవల మృతి చెందిన మాజీ MLAలకు సభ్యులు సంతాపం తెలియజేస్తారు. ఈరోజు సభలో స్పోర్ట్స్ యూనివర్సిటీ, యూనివర్సిటీల సవరణ బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. అసెంబ్లీ సమావేశాలు ఈనెల 9న ప్రారంభమైన సంగతి తెలిసిందే.
వారానికి 70hrs పని చేయాలన్న తన వ్యాఖ్యలను ఇన్ఫోసిస్ కో ఫౌండర్ నారాయణ మూర్తి మరోసారి సమర్థించుకున్నారు. భారత్ నం.1 దేశంగా ఎదగాలంటే యువత కష్టపడి పనిచేయాలని సూచించారు. ‘బెస్ట్ గ్లోబల్ కంపెనీలతో మనల్ని పోల్చుకుంటే, ఇంకా మనం చేయాల్సింది చాలా ఉందని అర్థం అవుతోంది. మన లక్ష్యాలు ఉన్నతంగా ఉండాలి. మన దేశంలో 800M మంది ప్రజలు ఫ్రీ రేషన్ పొందుతున్నారు. వారంతా పేదరికంలో ఉన్నారు’ అని ఓ ఈవెంట్లో వ్యాఖ్యానించారు.
ఇండియాతో మ్యాచ్ అంటే చాలు AUS బ్యాటర్ హెడ్ భారీ ఇన్నింగ్స్ ఆడేస్తున్నారు. అయితే అతను భారత కెప్టెన్గా రోహిత్ శర్మ ఉన్నప్పుడు మాత్రమే బాగా ఆడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. రోహిత్ కెప్టెన్గా ఉన్నప్పుడు గత 6 ఇన్నింగ్స్లలో 4 సెంచరీలు చేసిన అతను, ఇతరులు IND కెప్టెన్గా ఉన్నప్పుడు 25 ఇన్నింగ్స్లలో ఒక్క శతకం కూడా బాదలేదు. దీంతో ‘హెడ్కు రోహిత్పై కోపమెందుకు?’ అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ప్రముఖ తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ చనిపోయినట్లు వస్తున్న వార్తలను ఆయన కుటుంబ సభ్యులు ఖండించినట్లు పలు జాతీయ మీడియా సంస్థలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందని, గుండె సంబంధిత సమస్యలతో శాన్ ఫ్రాన్సిస్కోలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపాయి. ఆయన మరణించినట్లు వార్తలు రావడంతో చాలా మంది ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయన పరిస్థితిపై స్పష్టత రావాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.