India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

నాగ చైతన్య, సాయి పల్లవి నటించిన ‘తండేల్’ మూవీ కలెక్షన్లలో దూసుకెళ్తోంది. FEB 7న ప్రపంచ వ్యాప్తంగా రిలీజై నాలుగు రోజుల్లో రూ.73.20 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు మూవీ టీం ప్రకటించింది. ఈ మేరకు ‘బ్లాక్బస్టర్ లవ్ సునామీ’ అంటూ పోస్టర్ రిలీజ్ చేసింది. శ్రీకాకుళం జిల్లాలోని K.మత్స్యలేశం గ్రామానికి చెందిన రామారావు, జాలర్ల వాస్తవిక కథ ఆధారంగా తెరకెక్కించిన ‘తండేల్’కు పాజిటివ్ టాక్ వచ్చిన విషయం తెలిసిందే.

అమెరికాలో బ్యాన్ చేసిన ‘RED DYE #3’ ఫుడ్ కలర్ను చీప్గా వస్తోందని ఇండియాలోని చాలా కంపెనీలు వాడుతున్నాయి. ఈ రంగును చాక్లెట్స్, డ్రింక్స్, కేకుల్లో వాడుతుంటారు. ఇది హానికరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘RED DYE #3’ ఎలుకపై టెస్ట్ చేయగా అది క్యాన్సర్కు దారితీసింది. పిల్లల్లో హైపర్ యాక్టివిటీ, ఎలర్జీ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ప్రొడక్ట్ లేబుల్ చెక్ చేసి దానిలో ‘RED3’ అని ఉంటే వాటిని కొనకండి.

AP: రాష్ట్రంలో మద్యం ధరలు పెరగడంపై YCP ఆరోపణలు చేసింది. ‘మద్యం వ్యాపారం ప్రభుత్వ పెద్దల వ్యక్తిగత ఆదాయ వనరుగా మారింది. ఈ మేరకు లైసెన్సీలకు మార్జిన్ పెంచుతున్నారు. దీంతో TDP పెద్దలకు కూడా కమీషన్ పెరుగుతోంది. అంతిమంగా మద్యం రేట్లు పెరుగుతున్నాయి. ఇది మందుబాబులకు పెనుభారంగా మారనుంది’ అని ట్వీట్ చేసింది. రూ.99 బ్రాండ్ క్వార్టర్, బీర్లు కాకుండా మిగతా మద్యం సీసాపై రూ.10 పెంచిన విషయం తెలిసిందే.

డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టాక పాత చట్టాల దుమ్ము దులిపేస్తున్నారు. US వ్యాపారాలకు విఘాతం కలిగిస్తోందని ఫెడరల్ చట్టం ‘FCPA’ను నిలిపేశారు. మరిన్ని మినహాయింపులు, ఉపశమనం కల్పించేలా సవరించాలని కొత్త అటార్నీ జనరల్ పామ్ బొండిని ఆదేశించారు. అమెరికన్ కంపెనీలు, ఎగ్జిక్యూటివ్స్ బిజినెస్ కోసం ఇతర దేశాల అధికారులకు లంచం ఇవ్వడం ఈ చట్ట ప్రకారం నేరం. అదానీపై FCPA ప్రకారమే అభియోగాలు మోపడం గమనార్హం.

*సచిన్- 34357 రన్స్ (782 ఇన్నింగ్సులు)
*విరాట్- 27329 (611)
*రాహుల్ ద్రవిడ్- 24208 (605)
*రోహిత్ శర్మ- 19519 (526)
*గంగూలీ- 18575 (488)
*ధోనీ- 17266 (526)
*సెహ్వాగ్- 17253 (443)
*అజహరుద్దీన్- 15593 (455)

అదానీ గ్రూప్పై లంచం కేసులో జో బైడెన్ పాలకవర్గంలోని DoJ తీసుకున్న నిర్ణయాలు ప్రశ్నార్థకంగా ఉన్నాయని ఆరుగురు US కాంగ్రెస్ సభ్యులు కొత్త అటార్నీ జనరల్కు లేఖరాశారు. ఇవి మిత్రదేశం భారత్తో సంబంధాలను సందిగ్ధంలో పడేశాయన్నారు. రాజకీయాలు, వాణిజ్యం, ఎకానమీస్కు అతీతంగా ఎదిగిన 2 దేశాల అనుబంధాన్ని బైడెన్ నిర్ణయాలు రిస్క్లో పడేశాయని వెల్లడించారు. కేసును పక్కనపెట్టాల్సింది పోయి ముందుకెళ్లారని ఆరోపించారు.

స్టార్ నటుడు సైఫ్ అలీఖాన్పై దుండగుడు దాడి చేసిన విషయం తెలిసిందే. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక తన చిన్న కొడుకు జెహ్ చెప్పిన మాటలను ఆయన గుర్తుచేసుకున్నారు. ‘‘పిల్లలు బాగానే ఉన్నారు. దేవుడికి ధన్యవాదాలు. ‘మళ్లీ దొంగ ఇంట్లోకి వస్తాడేమో. ఇది మీ దగ్గర ఉంచుకోండి’ అని జెహ్ ఓ ప్లాస్టిక్ కత్తి ఇచ్చాడు. ‘అబ్బాను గీత కాపాడింది. అబ్బా నన్ను కాపాడాడు’ అని తను చెప్పాడు’’ అని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

AP: గత ఐదేళ్ల విధ్వంసంతో చాలా వెనకబడిపోయామని సీఎం చంద్రబాబు అన్నారు. సమర్థ నాయకత్వం ఉంటే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని చెప్పారు. నెమ్మదిగా ఒక్కో సమస్యను అధిగమిస్తూ ఉన్నామన్నారు. ‘సంపద సృష్టించాలి.. పేదలకు పంచాలి. ఆరు నెలల పాలనలో 12.94% వృద్ధిరేటు కనబడింది. ఫైళ్ల పరిశీలన వేగం పెంచాలి. సమస్య వచ్చిన వెంటనే పరిష్కరిస్తే మంచి ఫలితాలు వస్తాయి’ అని సచివాలయంలో మంత్రులు, కార్యదర్శుల సమావేశంలో CM అన్నారు.

రోహిత్ శర్మలానే విరాట్ కోహ్లీ కూడా ఫామ్ అందుకుంటారని శ్రీలంక క్రికెట్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ అభిప్రాయపడ్డారు. వీరిద్దరూ ప్రత్యర్థిపై ఎదురుదాడికి దిగితే భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడం ఖాయమని జోస్యం చెప్పారు. ‘ప్రస్తుతం రోహిత్ సేన అన్ని విభాగాల్లో పటిష్ఠంగా ఉంది. భారత్తోపాటు పాక్, బంగ్లా, అఫ్గాన్లో నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నారు. వీరికి పాకిస్థాన్ పిచ్లు బాగా సహకరిస్తాయి’ అని ఆయన పేర్కొన్నారు.

ఎయిడ్స్ నియంత్రణకు ఏటా US ఇచ్చే రూ.3,83,160కోట్ల సాయాన్ని ట్రంప్ నిలిపేయడంపై ఐరాస ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో కొత్త HIV కేసులు 6 రెట్లు పెరుగుతాయని చెప్పింది. 2029 కల్లా 63 లక్షల ఎయిడ్స్ మరణాలు సంభవిస్తాయంది. 2023లో కొత్తగా 13 లక్షల కేసులు మాత్రమే నమోదయ్యాయని, ట్రంప్ నిర్ణయంతో ఇప్పటి వరకు 160 దేశాల్లో వచ్చిన ఫలితాలు వృథా అవుతాయంది. ఇథియోపియా, ఉగాండా, మొజాంబిక్ దేశాల్లో ఎయిడ్స్ కేసులు ఎక్కువ.
Sorry, no posts matched your criteria.