news

News November 15, 2024

HEADLINES

image

* కాంగ్రెస్ విభజన రాజకీయాల్ని నమ్ముకుంది: మోదీ
* విద్య, ఉపాధి అవకాశాలు పెరగాలంటే కులగణన జరగాలి: CM రేవంత్
* తెలంగాణ గ్రూప్-4 ఫలితాలు విడుదల
* గత ఐదేళ్లలో పైసా పెట్టుబడి రాలేదు: CM చంద్రబాబు
* వైసీపీకి ప్రతిపక్ష హోదా మేము కాదు, ప్రజలివ్వాలి: పవన్
* ఆనాడు సభలో నా తల్లిని అవమానించారు: లోకేశ్
* ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామకృష్ణ రాజు ఎన్నిక

News November 15, 2024

బంగ్లా రాజ్యాంగానికి కీలక మార్పులు!

image

రాజ్యాంగం నుంచి సెక్యులరిజం, సోషలిజంను తొలగించాలని బంగ్లా AG అసదుజ్జమాన్ ప్రతిపాదించారు. అవామీ లీగ్ ప్రభుత్వం చేసిన 15వ రాజ్యాంగ సవరణ లౌకిక‌వాదాన్ని ప్రాథ‌మిక సూత్రంగా పున‌రుద్ధరించడం సహా షేక్ ముజీబుర్ రెహ్మాన్‌ను జాతిపితగా గుర్తిస్తోంది. దీన్ని స‌వాల్ చేస్తూ కోర్టులో పిటీషన్లు దాఖలయ్యాయి. కేసు విచారణ సందర్భంగా 15వ రాజ్యాంగ సవరణ రాజ్యాంగ విరుద్ధమని తమ ప్రభుత్వం ప్రకటించాలనుకుంటోందని AG అన్నారు.

News November 15, 2024

ఫిట్‌మెంట్ ఫ్యాక్ట‌ర్ 2.86!

image

8వ వేత‌న స‌వ‌ర‌ణ సంఘంపై కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగులు గంపెడాశ‌ల‌తో ఉన్నారు. జీతాలు, పెన్షన్ల సవరణ కోసం కనీసం 2.86 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌‌పై ఉద్యోగులు ఆశాభావంగా ఉన్న‌ట్టు NC-JCM సెక్రటరీ(స్టాఫ్ సైడ్) శివ్ గోపాల్ మిశ్రా పేర్కొన్నారు. ఈ లెక్క‌న ప్రభుత్వ ఉద్యోగి కనీస వేత‌నం ప్రస్తుతం ఉన్న రూ.18 వేల నుంచి రూ.51,480కి పెరగనుంది. అదే విధంగా పెన్షన్లు కూడా రూ.9 వేల నుంచి రూ.25,740కి పెరుగుతాయని అంచనా.

News November 15, 2024

సర్ఫరాజ్ ఖాన్‌కు గాయం?

image

టీమ్ ఇండియా ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ గాయపడ్డట్లు తెలుస్తోంది. నెట్ ప్రాక్టీస్‌లో ఆయన మోచేతికి గాయమైనట్లు సమాచారం. వెంటనే ఆయన నొప్పితో మైదానం వీడినట్లు తెలుస్తోంది. గాయం తీవ్రతపై ఇంకా క్లారిటీ రాలేదు. దీనిపై జట్టు మేనేజ్‌మెంట్ స్పందించాల్సి ఉంది. ఒకవేళ గాయం తీవ్రత ఎక్కువగా ఉంటే తొలి టెస్టుకు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది జట్టు కూర్పుపై కూడా ప్రభావం చూపిస్తుంది.

News November 15, 2024

KTR అరెస్టులో కాంగ్రెస్ ఎందుకు తగ్గుతోంది?: కొండా

image

TG: వికారాబాద్ కలెక్టర్‌పై దాడి కేసులో కేటీఆర్‌ను అరెస్ట్ చేయాలని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత ఇలా అధికారులపై దాడులకు దిగడం దారుణమని ఆయన మండిపడ్డారు. మరోవైపు KTR అరెస్టు విషయంలో కాంగ్రెస్ ఎందుకు వెనక్కి తగ్గుతోందని విశ్వేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు.

News November 14, 2024

‘పుష్ప 2’ ట్రైలర్ నిడివి ఎంతంటే?

image

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘పుష్ప 2’ మూవీ ట్రైలర్ ఈ నెల 17న విడుదల కానుంది. పట్నాలో సాయంత్రం 5 గంటలకు లాంచ్ ఈవెంట్ ప్రారంభం కానుంది. ట్రైలర్ నిడివి 2 నిమిషాల 44 సెకన్లు ఉండనుంది. కాగా దేశవ్యాప్తంగా ఉన్న ముఖ్యమైన నగరాల్లో మూవీ టీమ్ ప్రమోషన్లు చేయనుంది. సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్నారు. డిసెంబర్ 5న వరల్డ్ వైడ్‌గా మూవీ రిలీజ్ కానుంది.

News November 14, 2024

సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూనే ఉంటాం: రోజా

image

AP: సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని నిలదీస్తూ పోస్టులు పెడుతూనే ఉంటామని YCP నేత ఆర్కే రోజా స్పష్టం చేశారు. ప్రశ్నిస్తే కేసులు పెడతారా? అని ఆమె నిలదీశారు. ‘రాష్ట్రంలోని యువత, మహిళలు, రైతులను మోసం చేశారు. మహిళలకు రూ.1,500, విద్యార్థులకు రూ.15 వేలు, రైతులకు రూ.20 వేలు, యువతకు రూ.3 వేలు ఎగ్గొట్టారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే కచ్చితంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడతాం’ అని ఆమె ట్వీట్ చేశారు.

News November 14, 2024

ఎడమ కంటికి సమస్య.. కుడి కంటికి ఆపరేషన్ చేశారు

image

UP గ్రేటర్ నోయిడాకు చెందిన నితిన్ భాటి తన కొడుకుకు ఎడమ కంట్లో నుంచి తరచూ నీరు కారుతోందని ఆనంద్ స్పెక్ట్రమ్ హాస్పిటల్‌కి తీసుకెళ్లాడు. పరీక్షించిన వైద్యులు బాలుడి కంట్లో ఫారెన్ బాడీ(మెటల్ వంటి ధూళి) ఉన్నట్లు గుర్తించి, ఆపరేషన్ చేశారు. అయినా సమస్య తీరకపోవడంతో మరో ఆసుపత్రిని సంప్రదించారు. అయితే బాలుడి ఎడమ కంటికి కాకుండా కుడి కంటికి ఆపరేషన్ చేశారని తేలింది. ఘటనపై బాలుడి తండ్రి PSలో ఫిర్యాదు చేశారు.

News November 14, 2024

విలియమ్సన్ రికార్డును సమం చేసిన సూర్య

image

టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అరుదైన ఘనత సాధించారు. టీ20ల్లో 200కుపైగా రన్స్ ఎక్కువ సార్లు కొట్టిన జట్టుకు నాయకత్వం వహించిన రెండో కెప్టెన్‌గా సూర్య (9) రికార్డు సృష్టించారు. ఈ క్రమంలో ఆయన న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ (9) రికార్డును సమం చేశారు. అగ్రస్థానంలో విరాట్ కోహ్లీ (12) ఉన్నారు. మూడో స్థానంలో విండీస్ కెప్టెన్ రోవ్‌మన్ పావెల్ (7) కొనసాగుతున్నారు.

News November 14, 2024

తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు మహిళలకు ఆహ్వానం

image

TG: కాంగ్రెస్ పాలనకు ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఘనంగా విజయోత్సవాలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. డిసెంబర్ 7న ట్యాంక్‌బండ్ పరిసరాల్లో, 8న సచివాలయ పరిసరాల్లో, 9న నెక్లెస్ రోడ్డులో వేడుకలు నిర్వహించనున్నారు. 9న సచివాలయ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. దీనికి రాష్ట్రవ్యాప్తంగా మహిళలను ఆహ్వానించాలని సీఎం నిర్ణయించారు.