India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రముఖ తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ ఆనారోగ్యంతో శాన్ ఫ్రాన్సిస్కోలోని ఓ ఆస్పత్రిలో చేరారు. గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన్ను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్టు జాకీర్ స్నేహితుడు రాకేశ్ చౌరాసియా తెలిపారు. 73 ఏళ్ల జాకీర్ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళనగా ఉన్నట్టు రాకేశ్ చెప్పారు.
జమిలి ఎన్నికలకు BSP చీఫ్ మాయావతి మద్దతు ప్రకటించారు. దీని వల్ల ఖర్చులు తగ్గడమే కాకుండా, పథకాల అమలుకు ఆటంకాలు తప్పుతాయన్నారు. SC, STలకు ప్రమోషన్లలో రిజర్వేషన్లను వ్యతిరేకించిన INC, SPలు రిజర్వేషన్లపై సైలెంట్గా ఉండాలన్నారు. SC, ST, OBC రిజర్వేషన్లను మార్చకుండా 9వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. BJP కూడా రిజర్వేషన్ల వ్యతిరేక ధోరణిని అవలంబిస్తోందని మాయావతి మండిపడ్డారు.
మార్చి 31, 2026 నాటికి దేశాన్ని నక్సల్స్ రహితంగా మారుస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. రాయ్పూర్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నక్సలిజాన్ని రూపుమాపేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడి ఉన్నాయన్నారు. ఛత్తీస్గఢ్ నక్సలిజం నుంచి విముక్తి పొందితే, దేశం మొత్తం ఈ ముప్పు నుంచి మోక్షం పొందుతుందన్నారు. ఏడాదిగా ఈ విషయంలో వృద్ధి సాధించామన్నారు.
తెలంగాణలో గ్రూప్2 పరీక్షలు సోమవారం కూడా కొనసాగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలు కలిపి 1368 సెంటర్లలో అభ్యర్థులు పరీక్షలు రాస్తున్నారు. రేపు కూడా పరీక్ష ఉండటంతో ఆ విద్యాసంస్థలకు సోమవారం సెలవు ఉంటుంది. మిగతా స్కూళ్లు, కాలేజీలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయి.
మహానటి హీరోయిన్ కీర్తి సురేశ్ తన ప్రియుడు ఆంటోనీని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. గోవాలో ఈ నెల 12న ఉదయం హిందూ సంప్రదాయంలో వీరి వివాహం జరిగింది. తాజాగా క్రిస్టియన్ పద్ధతిలోనూ ఈ జంట పెళ్లి చేసుకుంది. దీనికి సంబంధించిన ఫొటోలను ఆమె ఇన్స్టాలో షేర్ చేశారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 నుంచి 11 వరకు తొలుత ప్రశ్నోత్తరాలు నిర్వహించనున్నారు. ఆ తర్వాత ఇటీవల మృతి చెందిన మాజీ ఎమ్మెల్యేలకు సభ్యులు సంతాపం తెలియజేస్తారు. రేపు సభలో స్పోర్ట్స్ యూనివర్సిటీ, యూనివర్సిటీల సవరణ బిల్లులు ప్రవేశపెట్టనున్నారు. పర్యాటక విధానంపై స్వల్పకాలిక చర్చ జరగనుంది.
మహాయుతి ప్రభుత్వ క్యాబినెట్ కొలువుదీరింది. నాగ్పూర్లోని రాజ్భవన్లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ రాధాకృష్ణన్ సభ్యులతో ప్రమాణం చేయించారు. బీజేపీ నుంచి 19 మంది, శివసేన నుంచి 11 మంది, ఎన్సీపీ నుంచి 9 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. సీఎంతో కలుపుకొని 43 మంది మంత్రులుగా కొనసాగవచ్చు. ఫడణవీస్, శిండే, అజిత్ ఇదివరకే బాధ్యతలు చేపట్టడంతో మరొకరు త్వరలో ప్రమాణం చేసే అవకాశం ఉంది.
TG: నిన్న రాత్రి తన కుటుంబంపై దాడికి ప్రయత్నం జరిగిందని మంచు మనోజ్ ఆరోపించారు. తల్లి బర్త్డే సందర్భంగా కేక్ ఇచ్చే నెపంతో తాను లేనప్పుడు విష్ణు, అనుచరులు, బౌన్సర్లు ఇంట్లోకి వచ్చారని తెలిపారు. <<14889405>>జనరేటర్లో <<>>పంచదార కలిపిన డీజిల్ పోసి పని చేయకుండా చేశారని ఆరోపించారు. రాత్రి విద్యుత్ అంతరాయంతో ఆందోళనకు గురయ్యామన్నారు. తన కుటుంబం నిరంతరం భయంతో జీవిస్తోందని, చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.
AP: సీఎం చంద్రబాబు రేపు పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఉదయం 10.గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి హెలికాప్టర్లో బయల్దేరి 10.45కు పోలవరం వ్యూ పాయింట్కు చేరుకుంటారు. అనంతరం ప్రాజెక్టుకు సంబంధించి గ్యాప్ వన్, గ్యాప్ టూ, డీ వాల్ సహా సైట్ను పరిశీలిస్తారు. గెస్ట్ హౌస్లో ప్రాజెక్టు పనులపై సమీక్ష నిర్వహిస్తారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడనున్నారు. ఆ తర్వాత తిరిగి అమరావతికి చేరుకుంటారు.
సూపర్ స్టార్ మహేశ్ బాబు, రాజమౌళి కాంబోలో తెరకెక్కనున్న మూవీపై ఓ క్రేజీ రూమర్ వైరల్ అవుతోంది. ఈ సినిమాలో ప్రముఖ హీరోయిన్ ప్రియాంకా చోప్రా నటిస్తారని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే చిత్ర బృందం ఆమెను సంప్రదించినట్లు టాక్. ఈ సినిమాలో ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్, బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్ బ్యానర్పై కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు.
Sorry, no posts matched your criteria.