news

News April 14, 2025

కాంగ్రెస్ ఆదేశిస్తే రాజకీయాల్లోకి వస్తా: రాబర్ట్ వాద్రా

image

కాంగ్రెస్ పార్టీ ఆదేశిస్తే, తన కుటుంబ సభ్యుల ఆశీర్వాదంతో తప్పకుండా రాజకీయాల్లోకి వస్తానని రాబర్ట్ వాద్రా అన్నారు. ప్రియాంకా గాంధీ భర్త అయినందునే ఇంతకాలం రాజకీయ చర్చల్లో తనపై విమర్శలు చేసేవారన్నారు. రాహుల్, ప్రియాంకలను చూసి ఎంతో నేర్చుకోవచ్చన్నారు. దేశంలో సెక్యులరిజం ప్రమాదంలో పడుతున్న ప్రస్తుత తరుణంలో, పార్లమెంట్‌లో పోరాడటానికి మరిన్ని గొంతుకలు కావాలని రాబర్ట్ వాద్రా అభిప్రాయపడ్డారు.

News April 14, 2025

డోస్ పెంచిన ఆశావహులు

image

TG: మంత్రిపదవుల ఆశావహులు డోస్ పెంచి గళం విన్పిస్తున్నారు. HYD, రంగారెడ్డి జిల్లాల్లో ఎన్నికైన ఏకైక కాంగ్రెస్ నేతనైన తనకు పదవి దక్కాలని మల్‌రెడ్డి రంగారెడ్డి అన్నారు. అటు ప్రజల కోసం తపించే తాను మంత్రి పదవికి అర్హుడినని రాజగోపాల్ అన్నారు. అయితే జానారెడ్డి లాంటివారు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఇక తనకు మినిస్ట్రీ రాకుంటే మంచిర్యాలను ముంచినట్లే అని స్థానిక నేత ప్రేమ్ సాగర్ ఇవాళ ఆవేదన వ్యక్తం చేశారు.

News April 14, 2025

ఇంగ్లిష్ పుస్తకాలకు హిందీ పేర్లు.. NCERT వివాదాస్పద నిర్ణయం

image

ఇంగ్లిష్ పుస్తకాలకు NCERT హిందీ పేర్లు పెట్టడం వివాదాస్పదమైంది. గతంలో 6వ తరగతి టెక్ట్స్‌బుక్ పేరు ఇంగ్లిష్‌లో ‘Honeysuckle’ అని ఉండగా హిందీలో ‘పూర్వీ’ అని మార్చింది. ఇది సంగీత రాగం పేరు. 1,2 తరగతుల పుస్తకాలకు మృదంగ్, 3rd క్లాస్ బుక్స్‌కు సంతూర్ అని పేర్లు పెట్టింది. ఇవి సంగీత పరికరాలు. తమిళనాడు హిందీ భాషను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వేళ NCERT పేర్లను మార్చడం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది.

News April 14, 2025

గిగ్ వర్కర్లకు భద్రత కల్పించే బిల్లుపై ప్రజాభిప్రాయ సేకరణ

image

TG: గిగ్ వర్కర్లకు భద్రత కల్పించే బిల్లు ముసాయిదాను వెంటనే ప్రజలకు అందుబాటులో ఉంచాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. ప్రజల సలహాలు, సూచనలు, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని తుది ముసాయిదా రూపొందించాలని సూచించారు. సచివాలయంలో గిగ్ వర్కర్లు, యూనియన్ల ప్రతినిధులు, మంత్రులు, అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. గిగ్ వర్కర్లకు ఉద్యోగ భద్రత, బీమా, ఇతర హక్కులు కల్పించేలా ఈ బిల్లును రూపొందించారు.

News April 14, 2025

దిగ్వేశ్‌కు జరిమానా మళ్లీ ఎందుకు విధించారు?: గవాస్కర్

image

LSG బౌలర్ దిగ్వేశ్ నోట్‌బుక్ సెలబ్రేషన్స్ కారణంగా అతడికి 2సార్లు జరిమానా పడిన సంగతి తెలిసిందే. రెండోసారి ఫైన్ ఎందుకు వేశారంటూ మాజీ క్రికెటర్ గవాస్కర్ ప్రశ్నించారు. ‘వెళ్లిపోతున్న బ్యాటర్‌ దగ్గరకు వెళ్లి మరీ సెలబ్రేట్ చేసుకున్నందుకు తొలిసారి జరిమానా విధించారు. మరి 2వసారి ఎవరి వద్దకూ వెళ్లకుండా తను ఉన్న చోటే సెలబ్రేట్ చేసుకుంటే మళ్లీ ఎందుకు జరిమానా విధించారు? దాని అవసరమేముంది?’ అని ప్రశ్నించారు.

News April 14, 2025

మళ్లీ 44వేల ఎకరాలా.. రాజధాని ఎక్కడ?: షర్మిల

image

AP: అమరావతి కోసం ప్రభుత్వం <<16089907>>మరో 44వేల ఎకరాలను <<>>సమీకరించనుందన్న వార్తలపై APCC చీఫ్ షర్మిల మండిపడ్డారు. ‘అరచేతిలో వైకుంఠం చూపించడం బాబుగారికే తెలిసిన విద్య. రాజధాని పేరుతో రైతుల భూముల్ని తనవారికి కట్టబెట్టి రియల్ ఎస్టేట్ చేయాలని చూసే కుట్ర ఇది. 34వేల ఎకరాల్లో అసలు రాజధాని ఎక్కడ? కూలిపోయేలా ఉన్న తాత్కాలిక కట్టడాలు, పాడుబడిన భూములు.. ఇదేనా ఆంధ్రుల ఆత్మగౌరవం?’ అని ప్రశ్నించారు.

News April 14, 2025

మార్చిలో అత్యధికంగా అమ్ముడైన కారు ఇదే..

image

MAR నెల అమ్మకాల్లో హ్యూండయ్ క్రెటా అదరగొట్టింది. మారుతీ సుజుకీ స్విఫ్ట్‌ను వెనక్కి నెట్టి తొలి స్థానంలో నిలిచింది. గతనెల 18,059 క్రెటా యూనిట్లు అమ్ముడవగా 2024 MAR విక్రయాలతో పోలిస్తే 9% వృద్ధి నమోదైంది. స్విఫ్ట్(17,746), టాటా పంచ్(17,714), వ్యాగన్ R(17,175), ఎర్టిగా(16,804), బ్రెజా(16,546) వరుసగా 2,3,4,5,6 స్థానాల్లో నిలిచాయి. అయితే MARలో ఓవరాల్‌గా మారుతీ కార్లే అత్యధికంగా అమ్ముడయ్యాయి.

News April 14, 2025

బెంగాల్ అల్లర్లు.. NIA విచారణకు BJP డిమాండ్

image

బెంగాల్ అల్లర్ల వెనుక కుట్ర కోణం ఉందని, NIA విచారణ జరపాలని ప్రతిపక్ష BJP డిమాండ్ చేస్తోంది. ఆందోళనకారులు రూ.100 కోట్ల ఆస్తులను ధ్వంసం చేశారంది. వక్ఫ్ చట్ట సవరణను వ్యతిరేకిస్తూ బెంగాల్‌లోని పలు జిల్లాల్లో చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ఈ ఘటనల్లో ఇప్పటివరకు 150 మంది నిందితులు అరెస్టయ్యారు. హైకోర్టు జోక్యంతో కేంద్ర భద్రతా బలగాలు రంగంలోకి దిగి పరిస్థితులను అదుపులోకి తెచ్చాయి.

News April 14, 2025

అమర్‌నాథ్ యాత్ర-2025 రిజిస్ట్రేషన్ ప్రారంభం

image

JULY 3 నుంచి AUG 9 వరకు జరిగే అమర్‌నాథ్ యాత్ర-2025 కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలైంది. ఈ యాత్రకు వెళ్లాలనుకునే వారు కచ్చితంగా ముందస్తు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. https://jksasb.nic.in/ <>సైట్‌లో<<>> పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో, హెల్త్ సర్టిఫికెట్, OTP సమర్పించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది కలిసి గ్రూప్ రిజిస్ట్రేషన్ కూడా చేసుకునే వెసులుబాటు కూడా ఉంది.

News April 14, 2025

కాసేపట్లో వర్షం

image

TG: హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో కాసేపట్లో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఎల్బీనగర్, కాప్రా, ఉప్పల్, మల్కాజ్‌గిరి, ఉస్మానియా యూనివర్సిటీ, కంటోన్మెంట్, పటాన్‌చెరు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, కామారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లోనూ వర్షాలు పడతాయని అంచనా వేసింది.