news

News November 13, 2024

మరో నాలుగు కార్పొరేషన్లకు డైరెక్టర్ల నియామకం

image

APలో మరో నాలుగు కార్పొరేషన్ల డైరెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. రజక, కొప్పుల వెలమ, గవర, నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్లలో 15 మంది చొప్పున మొత్తం 60 మంది డైరెక్టర్లను నియమించారు. ప్రతి కార్పొరేషన్‌లో ఇద్దరు జనసేన, ఒక బీజేపీ సభ్యుడికి అవకాశం ఇవ్వగా, మిగతా 12 మంది టీడీపీ వాళ్లే. జాబితా కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

News November 13, 2024

KTR ఆదేశాలతోనే కలెక్టర్‌పై దాడి!.. రిమాండ్ రిపోర్టులో సంచలనం

image

TG: కేటీఆర్, బీఆర్ఎస్ ముఖ్య నేతల ఆదేశాలతోనే లగచర్లలో అధికారులపై దాడి జరిగినట్లు పట్నం నరేందర్ రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. ‘ప్రభుత్వ ప్రతిష్ఠను దిగజార్చాలనే కుట్ర పన్నారు. సురేశ్‌కు తరచూ ఫోన్ చేసినట్లు నరేందర్ రెడ్డి ఒప్పుకున్నారు. కొందరికి డబ్బులిచ్చి దాడికి ఉసిగొల్పారు. అధికారులను చంపినా పర్వాలేదని నరేందర్ రెడ్డి రైతులకు చెప్పారు’ అని రిమాండ్ రిపోర్టులో నమోదు చేశారు.

News November 13, 2024

WHATSAPP యూజర్లే టార్గెట్‌గా సైబర్ క్రిమినల్స్ కొత్త స్కామ్

image

పెళ్లిళ్ల సీజన్ మొదలైంది. వేలాదిగా జంటలు పెళ్లిపీటలు ఎక్కనున్నాయి. ఇదే అదనుగా సైబర్ క్రిమినల్స్ పాత APK స్కామ్‌నే మళ్లీ కొత్తగా మొదలుపెట్టారు. తెలియని ఫోన్ నంబర్ నుంచి మీ వాట్సాప్‌కు పెళ్లి ఇన్విటేషన్ పంపిస్తారు. అందులో APK ఫైల్ ఉంచుతారు. దాన్ని తెరవగానే మీ మొబైల్లో సీక్రెట్‌గా ఇన్‌స్టాలై బ్యాంకు, పర్సనల్ డేటాను దొంగిలిస్తుంది. దీని ఆధారంగా క్రిమినల్స్ మీ బ్యాంకులోని డబ్బును దోచుకుంటారు.

News November 13, 2024

బ్రదర్.. ఇకనైనా లేచి పాదాలకు పనిచెప్పు!

image

కంప్యూటర్ ముందు గంటల తరబడి కూర్చుంటే ప్రమాదకరమని తెలిసినా లేచి నడిచేందుకు కొందరు ఇష్టపడరు. ఇలా సుదీర్ఘంగా కూర్చొని పనిచేస్తే ఏం జరుగుతుందో తెలుసుకుందాం. 2 గంటల పాటు కుర్చీలో కూర్చోవడం సిగరెట్ తాగినంత హానికరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇలా చేస్తే మధుమేహం, గుండె జబ్బులొస్తాయి. మెడ, వెనుక భాగంలో నొప్పి వస్తుంది. జీవక్రియ నెమ్మదిస్తుంది. ఊపిరితిత్తుల సామర్థ్యం పడిపోతుంది. SHARE IT

News November 13, 2024

బ్రేకప్‌తో కుంగిపోయా: రాశి ఖన్నా

image

తన బాయ్‌ఫ్రెండ్‌తో బ్రేకప్ అయ్యాక ఎంతో కుంగిపోయినట్లు హీరోయిన్ రాశి ఖన్నా తెలిపారు. తాను నటించిన ‘ది సబర్మతి రిపోర్టు’ ప్రమోషన్లలో ఆమె మాట్లాడారు. ‘గతంలో నాకు ఓ లవ్ స్టోరీ ఉండేది. కానీ కొన్ని కారణాల వల్ల అతడితో బ్రేకప్ అయ్యింది. ఆ సమయంలో ఎంతో బాధపడ్డా.. కుంగిపోయా. ఆ తర్వాత ఆ బాధ నుంచి బయటపడి కెరీర్‌పై దృష్టి పెట్టా. ఇప్పుడు నా ఫ్యామిలీ, ఫ్రెండ్సే నాకు అండ’ అని ఆమె చెప్పుకొచ్చారు.

News November 13, 2024

మూసీ పరీవాహక ప్రాంతాల్లో బీజేపీ నేతల బస

image

TG: దమ్ముంటే మూసీ ఒడ్డున బస చేయాలన్న సీఎం రేవంత్ రెడ్డి సవాల్ నేపథ్యంలో టీబీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 16న 25 మూసీ పరీవాహక ప్రాంతాల్లో బీజేపీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు బస చేయనున్నారు. ఆరోజు సా.4 గంటల నుంచి మరుసటి రోజు ఉ.8 గంటల వరకు అక్కడే ఉండనున్నారు. కాగా మూసీ పునరుజ్జీవన ప్రాజెక్ట్‌లో భాగంగా పరీవాహక ప్రాంతాల ప్రజలను తరలిస్తుండటంపై అధికార, విపక్షాల మధ్య మాటలయుద్ధం జరుగుతోంది.

News November 13, 2024

PHOTOS: పెర్త్‌లో భారత ఆటగాళ్ల ప్రాక్టీస్

image

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియాకు చేరుకున్న భారత జట్టు పెర్త్ మైదానంలో ప్రాక్టీస్ ఆరంభించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను బీసీసీఐ Xలో పోస్ట్ చేసింది. తొలి టెస్ట్ ఈనెల 22 నుంచి పెర్త్ వేదికగా జరగనుండగా, కెప్టెన్ రోహిత్ శర్మ ఆడతారా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. హిట్‌మ్యాన్ ప్రస్తుతం భారత్‌లోనే ఉన్నారు. ఆయన కూడా ఇక్కడ బ్యాటింగ్ ప్రాక్టీస్ స్టార్ట్ చేశారని క్రీడా వర్గాలు తెలిపాయి.

News November 13, 2024

నామినేషన్ దాఖలు చేసిన RRR

image

AP అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవికి ఉండి MLA కనుమూరు రఘురామకృష్ణరాజు నామినేషన్ దాఖలు చేశారు. NDA కూటమికి చెందిన పార్టీల నేతలు ఆయన తరఫున అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్‌కు నామినేషన్ పత్రాలు అందించారు. ఈ పదవికి ఇంకెవరు నామినేషన్ దాఖలు చేయకపోవడంతో రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఉప సభాపతి పదవికి RRR ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించే అవకాశం ఉంది.

News November 13, 2024

ఎల్లుండి నుంచి ICICI క్రెడిట్ కార్డుల కొత్త రూల్స్

image

* క్యాష్ అడ్వాన్స్‌లపై ఫైనాన్స్ ఛార్జీలు 3.75%
* రూ.101-500 పెండింగ్ బిల్లుపై లేట్ ఛార్జీ రూ.100
* రూ.50వేల పెండింగ్ బిల్లుపై లేట్ ఛార్జీ రూ.1300
* రూ.100లోపు బిల్లు విషయంలో ఎలాంటి లేట్ ఫీజు ఉండదు
* ఎడ్యుకేషన్ విషయంలో థర్డ్ పార్టీ అప్లికేషన్ల ద్వారా చెల్లింపులకు 1% ఛార్జీ వర్తింపు
* స్కూల్/కాలేజీకి నేరుగా పేమెంట్ చేస్తే ఈ ఛార్జీ నుంచి మినహాయింపు ఉంటుంది.

News November 13, 2024

ఎలాంటి వారికి మద్దతిస్తున్నారో ఆలోచించుకోవాలి: అనిత

image

AP: సొంత చెల్లి, తల్లిని తిట్టిన వారిని జగన్ ఏం చేయలేకపోతే, తాము అరెస్ట్ చేస్తున్నట్లు హోంమంత్రి అనిత వెల్లడించారు. ‘మహిళలను ఏమైనా అంటే రాయలసీమ వాసులు ఊరుకోరు. కానీ జగన్ సీఎం ఉన్నప్పుడు కొందరు సోషల్ మీడియాలో దారుణంగా పోస్టులు పెట్టారు. జడ్జిలు, వారి కుటుంబ సభ్యులను కూడా నోటికి వచ్చినట్లు మాట్లాడారు. ఇప్పుడు ఎలాంటి వారికి మద్దతిస్తున్నారో జగన్ ఆలోచించుకోవాలి’ అని ఆమె సూచించారు.