news

News February 8, 2025

ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభం

image

ఢిల్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. కొద్దిసేపటి కిందటే పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తి కాగా, ఈవీఎంలలోని ఓట్లను లెక్కిస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో 20కి పైగా స్థానాల్లో బీజేపీ స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తోంది. మరోవైపు ఆప్ 10 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. అటు కాంగ్రెస్ 1 స్థానానికే పరిమితమైంది.

News February 8, 2025

CUET PG.. దరఖాస్తులకు నేడే లాస్ట్

image

కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్(CUET) PG ప్రవేశాలకు దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది. <>https://exams.nta.ac.in/<<>> వెబ్‌సైట్‌లో అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తుల్లో సవరణకు ఈనెల 10-12 వరకు అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా ప్రముఖ సెంట్రల్, ప్రైవేట్ వర్సిటీల్లో PG కోర్సుల్లో ప్రవేశాల కోసం CUET నిర్వహిస్తారు. 157 సబ్జెక్టుల్లో మార్చి 13 నుంచి 31 వరకు పరీక్షలు జరుగుతాయి.

News February 8, 2025

ఆధిక్యంలో ఖాతా తెరిచిన కాంగ్రెస్

image

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పరువు కోసం పోరాటం చేస్తున్న కాంగ్రెస్ ఎట్టకేలకు ఖాతా తెరిచింది. ఆ పార్టీ ఓ స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతోంది. అటు బీజేపీ, ఆప్ మధ్య థగ్ ఆఫ్ వార్ నడుస్తోంది. బీజేపీ 15, ఆప్ 13 చోట్ల లీడింగ్‌లో కొనసాగుతున్నాయి.

News February 8, 2025

కేజ్రీవాల్ వెనుకంజ

image

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ వెనుకంజలో కొనసాగుతున్నారు. న్యూ ఢిల్లీ స్థానం నుంచి ఆయన పోటీ చేయగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో వెనుకబడ్డారు. అలాగే కాల్కాజీ నుంచి బరిలో నిలిచిన ఢిల్లీ సీఎం ఆతిశీ, జంగ్‌పుర నుంచి పోటీలో ఉన్న మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా కూడా ట్రయలింగ్‌లో ఉన్నారు.

News February 8, 2025

యూరియా కొరత.. రైతన్న వెత

image

TG: ఓవైపు యాసంగి వరిసాగు కీలక దశకు చేరుకున్న సమయంలో రైతన్నల్ని యూరియా కొరత వేధిస్తోంది. సుమారు 50 లక్షల ఎకరాల్లో ఈ సీజన్ వరి సాగవుతోంది. గత నెలలోనే 90శాతం వరినాట్లు పూర్తయ్యాయి. ఇలాంటి దశలో కీలకమైన యూరియా దొరక్కపోవడం అన్నదాతల్లో ఆందోళన పెంచుతోంది. వచ్చిన స్టాకు వచ్చినట్లు అయిపోతోంది. దీంతో వ్యాపారులు కృత్రిమ డిమాండ్‌ను సృష్టించి పరిస్థితిని సొమ్ము చేసుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

News February 8, 2025

ఢిల్లీ అసెంబ్లీ.. ఎప్పుడు ఏ పార్టీది అధికారం?

image

1952లో 48 స్థానాలకు ఎన్నికలు జరగగా INC 39 సీట్లతో అధికారంలోకి వచ్చింది. 1956-93 మధ్య ఎన్నికలు జరగలేదు. 1993లో 70 స్థానాలకు గాను BJP 49 చోట్ల గెలిచి సీఎం పదవి చేపట్టింది. 1998, 2003, 2008లో వరుసగా 52, 47, 43 స్థానాలతో కాంగ్రెస్ అధికారం చేజిక్కించుకుంది. 2013లో ఆప్(28)+కాంగ్రెస్(8) ప్రభుత్వం, 2015, 20లో వరుసగా 67, 62 స్థానాల్లో ఆప్ బంపర్ విక్టరీ సాధించింది. 2025 ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

News February 8, 2025

BREAKING: ఢిల్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం

image

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు. అనంతరం ఈవీఎంలను తెరవనున్నారు. మొత్తం 19 కేంద్రాల్లో లెక్కింపు కొనసాగుతోంది. 70 స్థానాల్లో 36 చోట్ల విజయం సాధించిన పార్టీ అధికారం చేపట్టనుంది. మధ్యాహ్నం 12 గంటలలోపు ఫలితాలపై ఓ క్లారిటీ రానుంది. రిజల్ట్స్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు WAY2NEWS యాప్‌లో తెలుసుకోండి.
Stay Tuned.

News February 8, 2025

జీతాలు వెనక్కి ఇవ్వండి: లెక్చరర్లకు నోటీసులు!

image

AP: డిగ్రీ కాంట్రాక్టు లెక్చరర్లు 2019లో తీసుకున్న 2నెలల జీతాలు వెనక్కివ్వాలని విద్యాశాఖ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇంటర్ కాంట్రాక్ట్ జూ.లెక్చరర్ల తరహాలో తమకు జీతమివ్వాలని డిగ్రీ కా.లెక్చరర్లు విన్నవించారు. ఆ మేరకు రాష్ట్రంలోని 600మందికి APL, మే నెలలకు గానూ 51రోజుల జీతాలందాయి. ఇలా తీసుకుంటే దాన్ని అదనంగా పరిగణించి జీతాలు వెనక్కి ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు సమాచారం.

News February 8, 2025

తొలిసారి ‘ఆప్‌’కు 48 రోజులే అధికారం

image

మూడో సారి అధికారం చేజిక్కించుకోవడానికి CM పదవికి సైతం దూరంగా ఉంటూ అరవింద్ కేజ్రీవాల్ వ్యూహ‌ప్రతివ్యూహాలు రచించారు. BJPపై ఘాటు విమర్శలు చేస్తూనే హామీలు గుప్పించారు. కాగా, తొలిసారి 2013లో అధికారం చేపట్టిన ఆప్ కాంగ్రెస్ మద్దతుతో కేవలం 48 రోజులే అధికారంలో ఉంది. 2014లో ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధించారు. ఆపై 2015 నుంచి రెండు సార్లు విజయం సాధించింది. నాలుగోసారి ఆప్ గెలుస్తుందని అనుకుంటున్నారా?

News February 8, 2025

ప్రైవేట్ వీడియోలపై హీరో నిఖిల్ స్పందన ఇదే

image

మస్తాన్ సాయి <<15351108>>ప్రైవేట్ వీడియోల<<>> వ్యవహారంలో లావణ్య అనే యువతి తన పేరును ప్రస్తావించడంపై హీరో నిఖిల్ స్పందించారు. తనపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. ఆ వీడియోలు కార్తికేయ-2 సక్సెస్ మీట్ తర్వాత జరిగిన డిన్నర్ పార్టీలోనివని చెప్పారు. తన కుటుంబసభ్యులతో ఉన్న దృశ్యాలను తప్పుగా చూపిస్తున్నారని తెలిపారు. వాస్తవం పోలీసులకు కూడా తెలుసని, అసత్య ప్రచారాలు చేస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు.