India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
స్వర్ణాంధ్ర-2047 విజన్తో రాష్ట్రాన్ని నం.1గా నిలబెడతామని CM చంద్రబాబు అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు పూర్తయిన సందర్భంగా ట్వీట్ చేశారు. మెగా DSC, కానిస్టేబుల్ తదితర ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకున్నామని, పలు కంపెనీల నుంచి భారీ పెట్టుబడులు రాబట్టినట్లు చెప్పారు. దీపం-2 పథకం, పెన్షన్ల పెంపు వంటి హామీలను నెరవేర్చామన్నారు. కూటమి ప్రభుత్వ పాలనపై మీ కామెంట్?
నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘డాకు మహారాజ్’ సినిమా నుంచి ఈనెల 14న మొదటి పాట విడుదల కానుంది. రేపు ఉ.10.08 గంటలకు ప్రోమోను రిలీజ్ చేస్తామని మూవీ టీమ్ ప్రకటించింది. బాబీ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీకి తమన్ సంగీతం అందించారు. 2025 జనవరి 12న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.
‘షేర్లు పడ్డప్పుడు కొని పెరిగినప్పుడు అమ్మేయాలి’.. ఈ నానుడి నిజమే అయినా అవగాహన లేకుండా కొంటే తిప్పలు తప్పవు. మార్కెట్లు పడ్డాయి కదాని అప్పుచేసి పెట్టుబడి పెడితే ఆ ఊబిలోంచి బయటపడలేరు. TG, తాండూరులో ఓ ల్యాబులో పనిచేసే శివప్రసాద్ ఇదే తప్పు చేశారు. అప్పుచేసి పెట్టుబడి పెడితే రాబడి రాలేదు. దాంతో అప్పుల బాధ తాళలేక కుటుంబమంతా ఆత్మహత్య చేసుకుంది. షేర్లు కొనేముందు రకరకాల అంశాలు ఇమిడి ఉంటాయి. అవేంటంటే..
షేర్లలో అప్పుచేసి ఎప్పుడూ పెట్టుబడి పెట్టొద్దు. డబ్బు లేకుంటే నెలకు కొంత పక్కన పెట్టుకొని కార్పస్ ఏర్పాటు చేసుకోవచ్చు. ముందు నిపుణుల వద్ద ఇన్వెస్టింగ్, ట్రేడింగ్ నేర్చుకోవాలి. లాభనష్టాలు, నష్టభయంపై అవగాహన తెచ్చుకోవాలి. ఫండమెంటల్స్, టెక్నికల్స్, సపోర్టు, రెసిస్టెన్సీ, కన్సాలిడేషన్, కరెక్షన్, అక్యూములేషన్, మార్కెట్ కండీషన్స్ తెలుసుకొని చిన్నగా ఆరంభించాలి. అనుభవం వచ్చాక పొజిషన్ సైజ్ పెంచుకోవచ్చు.
టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్వదేశంలో హీరో, విదేశాల్లో జీరో అని సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ డారిల్ కల్లినన్ ఎద్దేవా చేశారు. ఫ్లాట్ ట్రాక్లపై మాత్రమే ఆయన ఆడతారన్నారు. ‘రోహిత్ ఫిట్గా కనిపించడం లేదు. కోహ్లీ ఫిట్నెస్తో పోలిస్తే హిట్మ్యాన్ చాలా వెనుకబడ్డారు. ఆయన అధిక బరువుతో సతమతమవుతున్నారు. 5 రోజుల పాటు సాగే టెస్టుల్లో ఆడేందుకు రోహిత్ పనికిరాడు’ అని ఆయన వ్యాఖ్యానించారు.
జమిలి ఎన్నికలతో ప్రాంతీయ పార్టీలపై తీవ్ర ప్రభావం చూపుతుందని రాజకీయ విశ్లేషకుల వాదన. పార్లమెంటు, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికతో జాతీయ పార్టీలకు ప్రాధాన్యం ఏర్పడి స్థానిక పార్టీలు పత్తా లేకుండా పోతాయని చెబుతున్నారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చే పార్టీనే రాష్ట్రాల్లోనూ విజయం సాధించే అవకాశాలు ఎక్కువని అంటున్నారు. మరోవైపు ఈ ఎన్నికలతో స్థానిక అంశాలు, సమస్యలు మరుగునపడుతాయని చెబుతున్నారు.
APలో కూటమి అధికారం చేపట్టి నేటికి 6 నెలలు పూర్తయ్యాయి. పెన్షన్ల పెంపు, ఫ్రీ గ్యాస్, అన్న క్యాంటీన్లు, అమరావతిలో అభివృద్ధి, రోడ్లకు మరమ్మతులు, విశాఖకు TCS, ₹60వేల కోట్ల BPCL రిఫైనరీ, ₹1.40 లక్షల కోట్లతో స్టీల్ ప్లాంట్ సహా ఎన్నో చేశామని కూటమి అంటోంది. కక్ష సాధింపులు, అక్రమ కేసులు, అత్యాచారాలు, విద్యుత్ ఛార్జీల పెంపు, ఫీజు రీయింబర్స్మెంట్, సూపర్-6 అమలు కావడం లేదనేది YCP వాదన. ఈ పాలనపై మీ కామెంట్?
TG: జల్పల్లి ఘర్షణలో అస్వస్థతకు గురైన సినీ నటుడు మోహన్ బాబు కాంటినెంటల్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జయ్యారు. రెండు రోజుల పాటు ఆయన ఆసుపత్రిలో ఉన్నారు. ఆయనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని, మెడికల్ రిపోర్టులు అన్ని నార్మల్గా ఉన్నాయని వైద్యులు తెలిపారు. నిన్న ఆయన పోలీసు విచారణకు హాజరు కాకుండా కోర్టు మినహాయింపు ఇచ్చిన సంగతి తెలిసిందే.
జమిలి ఎన్నికల నిర్వహణతో సిబ్బంది వినియోగానికి ఖర్చు తగ్గుతుందని విశ్లేషకులు అంటున్నారు. ఏక కాలంలో ఎన్నికలతో ఎలక్షన్ కోడ్ అడ్డంకులు ఉండవని, ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. మరోవైపు లాజిస్టిక్ సమస్య అడ్డంకిగా మారుతుందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఈవీఎంలతో పాటు 100శాతం వీవీప్యాట్స్ను అందుబాటులో ఉంచడం అతి పెద్ద సమస్య అని వారి వాదన. ఎన్నికల పారదర్శకతపై అనుమానాలు వస్తాయని అంటున్నారు.
వన్ నేషన్ వన్ ఎలక్షన్లో భాగంగా జమిలి ఎన్నికలకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. కాగా జమిలి ఎన్నికల్లో భాగంగా దేశంలో MP, MLA ఎన్నికలు ఒకే దఫాలో నిర్వహిస్తారు. జమిలి ఎన్నికల ప్రతిపాదన 1980లో వచ్చింది. 1999లో జస్టిస్ జీవన్ రెడ్డి నేతృత్వంలోని లా కమిషన్ జమిలి ఎన్నికలు జరపాలని సూచించింది. కానీ అప్పుడు వీలుపడలేదు. ప్రస్తుతం జమిలి ఎన్నికలు బెల్జియం, స్వీడన్, సౌతాఫ్రికా వంటి దేశాల్లో జరుగుతున్నాయి.
Sorry, no posts matched your criteria.