India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: గిగ్ వర్కర్లకు భద్రత కల్పించే బిల్లు ముసాయిదాను వెంటనే ప్రజలకు అందుబాటులో ఉంచాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. ప్రజల సలహాలు, సూచనలు, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని తుది ముసాయిదా రూపొందించాలని సూచించారు. సచివాలయంలో గిగ్ వర్కర్లు, యూనియన్ల ప్రతినిధులు, మంత్రులు, అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. గిగ్ వర్కర్లకు ఉద్యోగ భద్రత, బీమా, ఇతర హక్కులు కల్పించేలా ఈ బిల్లును రూపొందించారు.
LSG బౌలర్ దిగ్వేశ్ నోట్బుక్ సెలబ్రేషన్స్ కారణంగా అతడికి 2సార్లు జరిమానా పడిన సంగతి తెలిసిందే. రెండోసారి ఫైన్ ఎందుకు వేశారంటూ మాజీ క్రికెటర్ గవాస్కర్ ప్రశ్నించారు. ‘వెళ్లిపోతున్న బ్యాటర్ దగ్గరకు వెళ్లి మరీ సెలబ్రేట్ చేసుకున్నందుకు తొలిసారి జరిమానా విధించారు. మరి 2వసారి ఎవరి వద్దకూ వెళ్లకుండా తను ఉన్న చోటే సెలబ్రేట్ చేసుకుంటే మళ్లీ ఎందుకు జరిమానా విధించారు? దాని అవసరమేముంది?’ అని ప్రశ్నించారు.
AP: అమరావతి కోసం ప్రభుత్వం <<16089907>>మరో 44వేల ఎకరాలను <<>>సమీకరించనుందన్న వార్తలపై APCC చీఫ్ షర్మిల మండిపడ్డారు. ‘అరచేతిలో వైకుంఠం చూపించడం బాబుగారికే తెలిసిన విద్య. రాజధాని పేరుతో రైతుల భూముల్ని తనవారికి కట్టబెట్టి రియల్ ఎస్టేట్ చేయాలని చూసే కుట్ర ఇది. 34వేల ఎకరాల్లో అసలు రాజధాని ఎక్కడ? కూలిపోయేలా ఉన్న తాత్కాలిక కట్టడాలు, పాడుబడిన భూములు.. ఇదేనా ఆంధ్రుల ఆత్మగౌరవం?’ అని ప్రశ్నించారు.
MAR నెల అమ్మకాల్లో హ్యూండయ్ క్రెటా అదరగొట్టింది. మారుతీ సుజుకీ స్విఫ్ట్ను వెనక్కి నెట్టి తొలి స్థానంలో నిలిచింది. గతనెల 18,059 క్రెటా యూనిట్లు అమ్ముడవగా 2024 MAR విక్రయాలతో పోలిస్తే 9% వృద్ధి నమోదైంది. స్విఫ్ట్(17,746), టాటా పంచ్(17,714), వ్యాగన్ R(17,175), ఎర్టిగా(16,804), బ్రెజా(16,546) వరుసగా 2,3,4,5,6 స్థానాల్లో నిలిచాయి. అయితే MARలో ఓవరాల్గా మారుతీ కార్లే అత్యధికంగా అమ్ముడయ్యాయి.
బెంగాల్ అల్లర్ల వెనుక కుట్ర కోణం ఉందని, NIA విచారణ జరపాలని ప్రతిపక్ష BJP డిమాండ్ చేస్తోంది. ఆందోళనకారులు రూ.100 కోట్ల ఆస్తులను ధ్వంసం చేశారంది. వక్ఫ్ చట్ట సవరణను వ్యతిరేకిస్తూ బెంగాల్లోని పలు జిల్లాల్లో చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ఈ ఘటనల్లో ఇప్పటివరకు 150 మంది నిందితులు అరెస్టయ్యారు. హైకోర్టు జోక్యంతో కేంద్ర భద్రతా బలగాలు రంగంలోకి దిగి పరిస్థితులను అదుపులోకి తెచ్చాయి.
JULY 3 నుంచి AUG 9 వరకు జరిగే అమర్నాథ్ యాత్ర-2025 కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలైంది. ఈ యాత్రకు వెళ్లాలనుకునే వారు కచ్చితంగా ముందస్తు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. https://jksasb.nic.in/ <
TG: హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో కాసేపట్లో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఎల్బీనగర్, కాప్రా, ఉప్పల్, మల్కాజ్గిరి, ఉస్మానియా యూనివర్సిటీ, కంటోన్మెంట్, పటాన్చెరు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, కామారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లోనూ వర్షాలు పడతాయని అంచనా వేసింది.
IPL: లక్నో ఫ్యాన్స్కు గుడ్న్యూస్. పేసర్ మయాంక్ యాదవ్ ఎంట్రీ దాదాపుగా ఖరారైందట. వెన్ను, కాలివేలు గాయాల నుంచి కోలుకున్న మయాంక్.. ఏప్రిల్ 19న RRతో మ్యాచ్లో యాక్షన్లో దిగుతారని తెలుస్తోంది. మయాంక్ ఎంట్రీతో లక్నో బౌలింగ్ విభాగం మరింత పటిష్ఠంగా మారుతుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. గత ఐపీఎల్ సీజన్లో మయాంక్ గంటకు గరిష్ఠంగా 156.7 కి.మీ. వేగంతో బంతులు విసిరి అందరినీ ఆశ్చర్యపరిచారు.
బీజేపీ, RSS భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్కు శత్రువులని AICC అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. 1952 ఎన్నికల్లో ఆయన ఓటమికి V.Dసావర్కర్, SA డాంగే కారణమన్నారు. ఈ విషయాన్ని అంబేడ్కర్ స్వయంగా ఓ లేఖలో పేర్కొన్నారని తెలిపారు. దేశవ్యాప్తంగా కులగణన చేయాలని, ప్రైవేట్ విద్యాసంస్థల్లోనూ SC, ST, OBCలకు రిజర్వేషన్లు అమలు చేసే చర్యలు చేపట్టాలని మల్లికార్జున్ ఖర్గే డిమాండ్ చేశారు.
హీరో నితిన్పై నిర్మాత, డైరెక్టర్ వశిష్ఠ తండ్రి సత్యనారాయణరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తన కొడుకు దర్శకత్వంలో సినిమా చేసేందుకు రూ.75 లక్షలు అడ్వాన్స్ తీసుకుని నితిన్ హ్యాండిచ్చారని చెప్పారు. ఆ సమయంలో ‘అఆ’ పెద్ద హిట్టవడంతో వశిష్ఠతో చేస్తే రేంజ్ పడిపోతుందని వద్దన్నారని పేర్కొన్నారు. అప్పట్లో ఆ ప్రాజెక్టు కోసం రూ.2 కోట్లు ఖర్చుచేసినట్లు తెలిపారు. తర్వాత వశిష్ఠ ‘బింబిసార’తో హిట్ కొట్టాడని చెప్పారు.
Sorry, no posts matched your criteria.