India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
IPL: చెన్నై ఈ ఏడాది చెత్త ప్రదర్శనతో వరుస పరాజయాలు మూటగట్టుకుంటున్న విషయం తెలిసిందే. ధోనీ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టినా గత మ్యాచ్లో ఫలితం మారలేదు. అయినా SMలో క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. లక్నోలో ఇవాళ LSG, CSK మ్యాచ్ సందర్భంగా సోషల్ మీడియా బజ్పై స్టార్ స్పోర్ట్స్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఇందులో 84% చెన్నైకి, 16% లక్నోకు సపోర్ట్ చేస్తున్నట్లు తేలింది. ఇవాళ గెలుపుపై చెన్నై ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు.
ఐపీఎల్లో భాగంగా ఈరోజు లక్నోలో CSKతో LSG తలపడుతోంది. టాస్ గెలిచిన చెన్నై బౌలింగ్ ఎంచుకుంది. ప్లే ఆఫ్స్కి వెళ్లాలంటే ఈ మ్యాచ్లో CSK కచ్చితంగా గెలవాల్సి ఉంటుంది. తెలుగు ప్లేయర్ రషీద్ CSKలో ఈరోజు ఆడనున్నారు.
CSK: రచిన్, రషీద్, త్రిపాఠీ, విజయ్ శంకర్, ఓవర్టన్, జడేజా, ధోనీ, నూర్, కాంబోజ్, ఖలీల్, పతిరణ
LSG: మార్ష్, మార్క్రమ్, పంత్, పూరన్, బదోనీ, మిల్లర్, సమద్, శార్దూల్, ఆకాశ్, దిగ్వేశ్, ఆవేశ్
ఫార్మా దిగ్గజం డా.రెడ్డీస్ ఉద్యోగులకు షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఖర్చులను తగ్గించుకునేందుకు 25% ఎంప్లాయీస్ను తొలగిస్తోందని ‘బిజినెస్ స్టాండర్డ్స్’ తెలిపింది. వార్షిక వేతనం రూ.కోటికిపైన ఉన్నవారిని రాజీనామా చేయాలని, 50-55 ఏళ్ల పైన ఉన్న సీనియర్ ఎంప్లాయీస్ని VRS తీసుకోవాలని ఆదేశించినట్లు పేర్కొంది. మేజర్గా R&D ఉద్యోగులపైనే ఫోకస్ చేసినట్లు సమాచారం. దీనిపై సంస్థ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన మాస్ ఎంటర్టైనర్ ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ సెన్సార్ పూర్తి చేసుకుని U/A సర్టిఫికెట్ దక్కించుకుంది. ట్రైలర్ గ్రిప్పింగ్గా ఉండటం, చాలాకాలం తర్వాత విజయశాంతి ఫైట్లు చేయడంతో సినిమాపై ఆసక్తి నెలకొంది. 144 నిమిషాల నిడివి ఉన్న ఈ మూవీ ఈ నెల 18న విడుదల కానుంది. ప్రదీప్ చిలుకూరి డైరెక్ట్ చేయగా అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించాయి.
నిన్న రాత్రి DCపై ముంబై సాధించిన విజయం వెనుక గొప్పదనాన్ని రోహిత్కు కట్టబెట్టడం సరికాదని మాజీ క్రికెటర్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డారు. ‘రోహిత్ సలహాలు ఇచ్చారు కరెక్టే. కానీ ఎవరు ఎన్ని చెప్పినా దాన్ని మైదానంలో అమలు చేయాల్సింది కెప్టెనే. క్రెడిట్ అంతా రోహిత్కు ఇవ్వడం అస్సలు కరెక్ట్ కాదు. ఒకవేళ ఏదైనా తేడా జరిగి మ్యాచ్ను ముంబై చేజార్చుకుని ఉంటే అందరూ హార్దిక్నే తిట్టి ఉండేవారు’ అని పేర్కొన్నారు.
AP: ప్రైవేట్ కాలేజీలకు ధీటుగా ప్రభుత్వ, KGBV, APRJC, మోడల్ స్కూళ్లు, హైస్కూల్ ప్లస్, ఒకేషనల్ కాలేజీల్లో చదివి టాపర్లుగా నిలిచిన ఇంటర్ విద్యార్థులను మంత్రి లోకేశ్ సన్మానించనున్నారు. రేపు మ.2 గంటలకు ఉండవల్లిలోని తన నివాసంలో 52 మందికి అవార్డులను అందించనున్నారు. వీరితో పాటు ఆరుగురు విభిన్న ప్రతిభావంతులైన విద్యార్థులనూ లోకేశ్ సన్మానించనున్నారు. అనంతరం వారితో కాసేపు ముచ్చటించనున్నారు.
బర్ధమాన్ జిల్లా(WB)లోని ఓగ్రామంలో ఉన్న రైల్వే స్టేషన్కు ఇప్పటి వరకూ పేరే లేదు. తొలుత రాయ్నగర్ అని ఉండేది. అయితే 2008లో ట్రాక్ని కొద్ది మేర పెంచడంతో సమీపంలోని రైనా అనే గ్రామంలో స్టేషన్ను పునర్నిర్మించారు. దీంతో రైనా పేరుతో రైల్వేస్టేషన్ ఉండాలని గ్రామస్థులు నిరసన చేశారు. రెండు గ్రామాల మధ్య భేదాభిప్రాయాలు రావడంతో రైల్వేశాఖ ఇప్పటివరకూ స్టేషన్కు పేరే పెట్టలేదు.
దిగ్గజ బ్రిటిష్ నటి జీన్ మార్ష్(90) కన్నుమూశారు. ఆమె గత కొంతకాలంగా డిమెన్షియాతో బాధపడుతున్నారని, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారని సన్నిహితులు తెలిపారు. బ్రిటిష్ డ్రామా ‘అప్స్టెయిర్స్, డౌన్స్టెయిర్స్’కి 1975లో ఆమె ప్రతిష్ఠాత్మక ఎమ్మీ పురస్కారాన్ని గెలుచుకున్నారు. 2012లో జీన్కు ‘ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్’ గౌరవం దక్కింది.
AP: కడప(D) ఒంటిమిట్ట(M) నడింపల్లి వద్ద బస్సు-బొలెరో ఢీకొన్న ఘటనలో జీపులోని ముగ్గురు, నెల్లూరు(D) రాపూరులోని తిక్కనవాటిక పార్కు వద్ద కారు ఢీకొట్టడంతో వడ్లు ఎండబెట్టుకుంటున్న ఇద్దరు రైతులు చనిపోయారు. TG జనగామ(D) రాఘవపూర్ వద్ద లారీని కారు ఢీకొట్టడంతో కారు డ్రైవర్ సహా ఇద్దరు మహిళలు చనిపోయారు. అటు RR(D) దామరగిద్ద వద్ద కారు డోర్లు లాక్ పడటంతో అందులో ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులు ఊపిరాడక చనిపోయారు.
AP: వక్ఫ్ సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో వైసీపీ పిటిషన్ దాఖలు చేసింది. మైనార్టీలకు వ్యతిరేకంగా కేంద్రం ఈ చట్టం రూపొందించిందని పిటిషన్లో పేర్కొంది. పార్లమెంట్లో కూడా ఆ పార్టీ బిల్లును వ్యతిరేకించింది.. కాగా మైనార్టీ సమాజానికి వైసీపీ అండగా ఉంటుందని జగన్ ఇటీవల హామీ ఇచ్చారు.
Sorry, no posts matched your criteria.