India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సినీ నటుడు మోహన్ బాబుకు వ్యతిరేకంగా జర్నలిస్టులు ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ కూడా పాల్గొని వారికి మద్దతు పలికారు. ‘మా నాన్న తరఫున నేను మీడియాకు క్షమాపణలు చెబుతున్నా. మీడియాపై దాడి దారుణం. ఇలాంటి రోజు వస్తుందని నేనెప్పుడూ ఊహించలేదు. నేను ఆయనను ఎలాంటి ఆస్తులు అడగలేదు’ అని ఆయన పేర్కొన్నారు.
విశ్వక్ సేన్, అనుదీప్ కాంబినేషన్లో ‘ఫంకీ’ మూవీ తెరకెక్కనుంది. ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఇవాళ జరిగాయి. సంక్రాంతి తర్వాత రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది. నాగవంశీ-సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తారు. కాగా విశ్వక్ సేన్ నటించిన ‘మెకానిక్ రాకీ’ మూవీ ఇటీవల విడుదలైంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నట్లు తెలుస్తోంది.
TG: మీడియా ప్రతినిధిపై నటుడు మోహన్ బాబు దాడి చేయడాన్ని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఖండించారు. ఆయనను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నో సినిమాల్లో నటించి అవార్డులు పొందిన వ్యక్తి నిన్న వ్యవహరించిన తీరు దారుణమని మండిపడ్డారు. మరోవైపు జర్నలిస్టుపై మోహన్ బాబు దాడిని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కూడా తప్పుబట్టారు. జర్నలిస్టు సమాజానికి ఆయన వెంటనే క్షమాపణలు చెప్పాలన్నారు.
నందమూరి బాలకృష్ణ హీరోగా ‘అఖండ2’ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై మేకర్స్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ఇవాళ సాయంత్రం 5.31 గంటలకు రోరింగ్ అప్డేట్ ఇస్తామని ప్రకటించారు. బోయపాటి శ్రీను రూపొందిస్తున్న ఈ మూవీకి తమన్ మ్యూజిక్ అందిస్తారు. రామ్ ఆచంట, గోపీ ఆచంట, తేజస్విని నందమూరి సంయుక్తంగా నిర్మిస్తారు. రేపు రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ మూవీ పూజా కార్యక్రమం జరుగుతుందని టాక్.
కాంగ్రెస్, రాహుల్ గాంధీకి ఆమ్ఆద్మీ షాకిచ్చింది. ఢిల్లీ ఎన్నికల్లో హస్తం పార్టీతో పొత్తు పెట్టుకోవడం లేదని స్పష్టం చేసింది. సొంత బలంతోనే పోరాడతామని వెల్లడించింది. ‘ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆప్ పొత్తు తుదిదశకు చేరుకుంది. కాంగ్రెస్ 15, ఇండియా కూటమిలోని ఇతర పార్టీలకు 1-2, మిగిలిన వాటిలో ఆప్ పోటీచేస్తుందని సన్నిహిత వర్గాల సమాచారం’ అంటూ ANI చేసిన ట్వీటుకు అరవింద్ కేజ్రీవాల్ పైవిధంగా బదులిచ్చారు.
స్త్రీ-2, వెల్కమ్ చిత్రాల్లో నటించిన ముస్తాక్ ఖాన్ను దుండగులు కిడ్నాప్ చేశారు. గతనెల 20న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ‘ఓ అవార్డ్ ఫంక్షన్కు హాజరయ్యేందుకు ఢిల్లీ వెళ్లిన ఆయనను కిడ్నాప్ చేసి UP తీసుకెళ్లారు. గన్నుతో బెదిరించి 12 గంటలు టార్చర్ పెట్టారు. అతడి కొడుకుకి ఫోన్ చేసి రూ.కోటి డిమాండ్ చేశారు. ఇంతలో కిడ్నాపర్ల చెర నుంచి ముస్తాక్ తప్పించుకొన్నాడు’ అని ఆయన ఫ్రెండ్ శివమ్ తెలిపారు.
Orthorexia పేరెప్పుడైనా విన్నారా? గ్రీకులోorthos అంటే right. ఇక orexis అంటే appetite. సింపుల్గా కరెక్ట్ డైట్ అని పిలుచుకోవచ్చు. స్వచ్ఛమైన, నాణ్యమైన ఫుడ్ తినాలనే అందరికీ ఉంటుంది. కొందరిలో మాత్రం అతిగా ఉంటుంది. తెలియకుండానే ఒక పొసెసివ్నెస్ వచ్చేసింది. దీనినే Orthorexia అంటారు. ఆరోగ్యంగా ఉండాలనుకొంటూ తిండి తగ్గించేయడం, కొన్ని ఆహారాలను అస్యహించుకోవడం, కొన్నిటినే తింటూ బక్కచిక్కిపోవడం దీని లక్షణం.
హిందువులు సహా మైనారిటీలపై మత హింస కేసుల వివరాలను బంగ్లాదేశ్ వెల్లడించింది. ఆగస్టులో షేక్ హసీనా వెళ్లినప్పటి నుంచి 88 హింసాత్మక ఘటనలు జరిగాయంది. ఈ కేసుల్లో 70 మందిని అరెస్టు చేసినట్టు యూనస్ ప్రెస్ సెక్రటరీ ఆలమ్ తెలిపారు. సునమ్ గంజ్, గాజీపూర్, ఇతర ప్రాంతాల దాడుల్లో అరెస్టులు కొనసాగుతాయన్నారు. దాడులపై ఫారిన్ సెక్రటరీ విక్రమ్ మిస్రీ ఆందోళన వ్యక్తంచేసిన మరుసటి రోజే వివరాలు వెల్లడించడం గమనార్హం.
పుష్ప-2 విడుదలైన 5 రోజుల్లో(నిన్నటి వరకు) రూ.922 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ సాధించింది. బాక్సాఫీస్ ట్రాకింగ్ వెబ్సైట్ శాక్నిల్క్ ప్రకారం మూవీ నిన్న రూ.52.50 కోట్లు వసూలు చేసింది. ఆ ట్రెండ్ కొనసాగితే ఈరోజు ముగిసేసరికి ఆ మూవీ గ్రాస్ రూ.1000 కోట్లు దాటేస్తుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే విడుదలైన వారంలోనే ఆ ఘనత సాధించిన తొలి భారత సినిమాగా పుష్ప-2 రికార్డు సృష్టిస్తుంది.
టీమ్ ఇండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లడం లేదని తెలుస్తోంది. ఆయన 5 రోజుల మ్యాచ్ ఆడేంత ఫిట్నెస్ సాధించలేదని, అందుకే ఈ టూర్ను రద్దు చేసుకున్నట్లు సమాచారం. SMATలో భాగంగా బరోడాతో జరగబోయే క్వార్టర్ ఫైనల్లో ఆయన ఆడతారని తెలుస్తోంది. ఇందులో ఆయన ఫిట్నెస్ను మరోసారి పరీక్షిస్తారని సమాచారం. కాగా చివరి మూడు టెస్టుల కోసం షమీ ఆసీస్ వెళ్తారని ఇప్పటివరకు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
Sorry, no posts matched your criteria.