India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
భార్య వేధింపులతో <<14841616>>ఆత్మహత్య<<>> చేసుకున్న అతుల్ సుభాష్కు న్యాయం చేయాలని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. #JusticeForAtulSubhash అనే హ్యాష్ట్యాగ్తో నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. న్యాయం, అన్యాయం ఏంటో తెలియకుండా మగవారిదే తప్పు అని నిర్ణయించడం వల్లే ఇలాంటివి జరుగుతున్నాయని విమర్శిస్తున్నారు. పిల్లల పేరుతో అధికంగా భరణం డిమాండ్ చేస్తున్నారని.. ఈ ఆత్మహత్యతో ఇవన్నీ ఆగిపోవాలని డిమాండ్ చేస్తున్నారు.
సీయూఈటీ-యూజీ 2025 పరీక్షలు రాసే అభ్యర్థులకు UGC ఛైర్మన్ జగదీశ్ కుమార్ గుడ్ న్యూస్ చెప్పారు. వచ్చే ఏడాది నుంచి ఆన్లైన్లోనే ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్లు తెలిపారు. విద్యార్థులు ఏ సబ్జెక్ట్కైనా దరఖాస్తు చేసుకోవచ్చని, మొత్తం 63 సబ్జెక్టుల్లో పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. దేశంలోని కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఇతర విద్యాసంస్థల్లో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ పరీక్షలు నిర్వహిస్తారు.
TG: కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గత పదేళ్లుగా విగ్రహాన్ని ఏర్పాటు చేయకపోతే ప్రజా ఆకాంక్షల మేరకు తాము విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఎందుకు అధికారికంగా ఏర్పాటు చేయలేదో ప్రజలకు సమాధానం ఇవ్వాలన్నారు. ‘జయ జయహే తెలంగాణ’ను ఎందుకు రాష్ట్ర గీతంగా ప్రకటించలేదని ప్రశ్నించారు.
జాతీయ స్థాయిలో కాంగ్రెస్ వ్యతిరేక స్టాండ్కు YCP కట్టుబడి ఉన్నట్టు కనిపిస్తోంది. INDIA కూటమి బాధ్యతల్ని CM మమతా బెనర్జీకి ఇవ్వాలని మిత్రపక్షాలు కాంగ్రెస్పై ఒత్తిడి తెస్తున్నాయి. దీనికి గొంతు కలుపుతూ కూటమిని నడిపించడానికి మమత సరైన నాయకురాలని YCP MP విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు. పెద్ద రాష్ట్రానికి CM అయిన మమత తనను తాను నిరూపించుకున్నారంటూ ఆమెకు మద్దతు పలకడం గమనార్హం.
రాజ్యసభ ఛైర్మన్పై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే ఓటింగ్ సందర్భంగా ఆ రోజు సభకు హాజరైనవారిలో సగం కంటే ఎక్కువ మంది మద్దతు అవసరం. రాజ్యసభ ఆమోదం అనంతరం ఇదే తీర్మానం లోక్సభలో సాధారణ మెజారిటీతో నెగ్గాలి. ఈ ప్రక్రియ అంతా కూడా Article 67(b), 92, 100 ద్వారా జరుగుతుంది. విపక్షాలకు బలం లేకపోవడంతో రాజ్యసభలో తీర్మానం నెగ్గే పరిస్థితి లేదు.
ఆరోగ్య పరిరక్షణలో ఉసిరిని మించింది లేదని ఆయుర్వేదం చెబుతోంది. పరగడపున దీని జ్యూస్ తాగితే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. చలికాలంలో రెగ్యులర్గా తీసుకుంటే జబ్బు పడకుండా కాపాడుతుంది. మెటబాలిజాన్ని మెరుగుపరిచి బరువు తగ్గేందుకు సాయపడుతుంది. ఇందులోని విటమిన్-సి బోలెడంత ఇమ్యూనిటీని ఇస్తుంది. ఉదర సమస్యలు తొలగించి మలబద్ధకాన్ని తరిమేస్తుంది. కాలేయ, కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. స్ట్రెస్నూ తొలగిస్తుంది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారినట్లు AP విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇది వచ్చే 24 గంటల్లో శ్రీలంక-తమిళనాడు తీరాల వైపు కదులుతుందంది. దీని ప్రభావంతో రేపు NLR, అన్నమయ్య, CTR, TPTY, ELR, కృష్ణా, NTR, GNT, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయంది. ఎల్లుండి నుంచి NLR, ATP, శ్రీసత్యసాయి, YSR, అన్నమయ్య, చిత్తూరు, TPTY జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయంది.
దేశీయ బెంచ్ మార్క్ సూచీలు మంగళవారం ఫ్లాట్గా ముగిశాయి. ఉదయం నుంచి మధ్నాహ్నం వరకు Lower Lowsతో నేలచూపులు చూసిన సూచీలకు కీలక దశలో సపోర్ట్ లభించింది. అనంతరం రివర్సల్ తీసుకోవడంతో ప్రారంభ నష్టాల నుంచి రికవర్ అయ్యాయి. చివరికి సెన్సెక్స్ 1.59 పాయింట్ల లాభంతో 81,510 వద్ద, నిఫ్టీ 9 పాయింట్ల నష్టంతో 24,610 వద్ద స్థిరపడ్డాయి. రియల్టీ, ఐటీ, పీఎస్యూ బ్యాంకుల షేర్లు రాణించాయి.
గుండెపోటు మరణ వార్తలు ఎక్కువవడంతో ఛాతి నొప్పి వచ్చినా కొందరు ఆందోళన చెందుతుంటారు. అయితే, గుండె కండరాలకు అవసరమైనంత రక్తం లభించనప్పుడు కూడా ఇలా ఛాతిలో నొప్పి వస్తుందని, దీనిని ఆంజినా పెక్టోరిస్ అంటారని వైద్యులంటున్నారు. ‘ఇది ఛాతీలో ఒత్తిడి వల్ల వచ్చే నొప్పి మాత్రమే. నడవడం, వ్యాయామం చేయడం వల్ల శారీరక శ్రమ పెరిగి ఇలాంటివి జరుగుతుంటాయి. 5-10 నిమిషాలు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది’ అని తెలిపారు.
AP: పవన్ కళ్యాణ్ను చంపేస్తానని <<14834003>>హత్యా బెదిరింపులకు<<>> పాల్పడిన వ్యక్తిని మల్లికార్జునరావుగా పోలీసులు గుర్తించారు. అతని మానసిక పరిస్థితి సరిగ్గా లేదని తెలుస్తోంది. మల్లికార్జున రావు మద్యం మత్తులో బెదిరింపు కాల్స్ చేసినట్లు గుర్తించారు. గతంలో అతనిపై ఓ కేసు నమోదైనట్లు సమాచారం. మరోవైపు నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని హోంమంత్రి అనిత ఆదేశించారు.
Sorry, no posts matched your criteria.