news

News February 6, 2025

ఇతను నిజమైన మృత్యుంజయుడు!

image

ఏడుసార్లు మరణం నుంచి బయటపడిన ‘వరల్డ్ లక్కీయెస్ట్ పర్సన్’ ఫ్రాన్ సెలాక్ జీవితం థ్రిల్లర్ మూవీ కంటే ఇంట్రెస్టిం‌గ్‌గా ఉంటుంది. తొలుత రైలు నదిలో పడిపోతే ఈయన తప్ప అందరూ చనిపోయారు. ఫ్లైట్‌లో వెళ్తుంటే డోర్స్ ఓపెన్ అవడంతో సెలాక్ గడ్డివాముపై పడి బతికారు. పలు మార్లు భారీ యాక్సిడెంట్స్ కూడా అయ్యాయి. కానీ, అతను చనిపోలేదు. 2003లో రూ.7 కోట్ల లాటరీ గెలుచుకున్నారు. 2016లో 87 ఏళ్ల వయసులో వృద్ధాప్యంతో చనిపోయారు.

News February 6, 2025

మళ్లీ మొరాయించిన చాట్ జీపీటీ

image

ఏఐ చాట్ బోట్ జీపీటీ మరోసారి మొరాయించింది. తమకు ఆ యాప్ యాక్సెస్ కావడం లేదంటూ సోషల్ మీడియాలో యూజర్లు పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. కొన్ని రోజుల క్రితం కూడా చాట్ జీపీటీ ఇదే తరహాలో ఆగిపోవడం గమనార్హం. సమస్యపై సంస్థ స్పందించింది. ఏఐ మోడల్‌లో స్వల్ప ఇబ్బందులు తలెత్తడం వల్ల ఈ పరిస్థితి నెలకొందని, చక్కదిద్దేందుకు ట్రై చేస్తున్నామని వివరణ ఇచ్చింది.

News February 6, 2025

జమిలి ఎన్నికలపై జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు

image

AP: రాష్ట్రంలో దారుణమైన పాలన కొనసాగుతోందని YS జగన్ దుయ్యబట్టారు. ‘జమిలి ఎన్నికలు వస్తాయంటున్నారు. ఎంత త్వరగా వస్తే అంత త్వరగా చంద్రబాబును పంపాలని ప్రజలు ఎదురుచూస్తున్నారు. బాబును చొక్కా పట్టుకొని ప్రశ్నించే రోజులు, తరిమికొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. బాబును నమ్మడమంటే పులి నోట్లో తలపెట్టడమేనని పదేపదే చెప్పా. చంద్రముఖిని మళ్లీ నిద్రలేపి రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడుతున్నారు’ అని వ్యాఖ్యానించారు.

News February 6, 2025

2027లో చంద్రయాన్-4 లాంచ్

image

చంద్రుడిపై రాతి నమూనాలను తీసుకొచ్చే చంద్రయాన్-4ను భారత్ 2027లో లాంచ్ చేస్తుందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. ఈ మిషన్లో LVM-3 రాకెట్‌ను 2సార్లు అంతరిక్షంలోకి పంపిస్తారని తెలిపారు. అవి తీసుకెళ్లే వేర్వేరు పరికరాలను చంద్రుడి కక్ష్యలోనే అసెంబుల్ చేస్తారని వివరించారు. ఆస్ట్రోనాట్‌ను రోదసిలోకి పంపే గగన్‌యాన్, సముద్ర గర్భంలో 6000KM లోతుకు వెళ్లే సముద్రయాన్‌ను 2026లో లాంచ్ చేస్తామన్నారు.

News February 6, 2025

విజయసాయి రెడ్డి రాజీనామాపై తొలిసారి స్పందించిన జగన్

image

AP: విజయ‌సాయి రెడ్డి రాజీనామాపై YS జగన్ తొలిసారి స్పందించారు. ‘మాకు 11 మంది రాజ్యసభ ఎంపీలుంటే సాయిరెడ్డితో కలిపి ఇప్పటివరకు నలుగురు వెళ్లిపోయారు. అయినా YCPకి ఏమీ కాదు. రాజకీయాల్లో క్యారెక్టర్ ముఖ్యం. అది సాయిరెడ్డికైనా, ఇప్పటివరకు పోయినవారికైనా, ఇంకా ఒకడో, ఇద్దరో వెళ్లేవారికైనా అదే వర్తిస్తుంది. క్యారెక్టర్‌ను బట్టే ఉంటుంది. YCP కేవలం దేవుడి దయ, ప్రజల ఆశీస్సులతోనే నడుస్తుంది’ అని స్పష్టం చేశారు.

News February 6, 2025

రేపు ‘జాక్’ టీజర్

image

డీజే టిల్లూతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరో సిద్ధూ జొన్నలగడ్డ ‘జాక్’ సిినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించనున్నారు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్ర టీజర్ రేపు ఉదయం 11.07 గంటలకు విడుదల కానుంది. సిద్ధూ సరసన బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య నటిస్తున్నారు. ఈ విషయాన్ని మూవీ యూనిట్ ప్రకటించింది. కాగా ఈ సినిమా ఏప్రిల్ 10న రిలీజ్ కానున్నట్లు ప్రకటించింది.

News February 6, 2025

నేషనలిజం అనుసరించొద్దు.. మీ కామెంట్!

image

ఇంటర్ కనెక్టయిన ఈ ప్రపంచంలో నేషనలిజాన్ని అనుసరించడం సరికాదన్న ఇన్ఫోసిస్ నారాయణ <<15376856>>మూర్తి<<>> వ్యాఖ్యలపై సోషల్‌మీడియాలో చర్చ జరుగుతోంది. దేశభక్తి కోసం జాతీయవాదాన్ని విడిచిపెట్టాలనడం సరికాదని కొందరు అంటున్నారు. అసలు ఒక జాతిగా నిలబడని దేశం తన సొంత అస్థిత్వాన్ని కోల్పోతుందన్న మహనీయులు మాటలను గుర్తుచేస్తున్నారు. దేశభక్తికి ప్రధానమైనదే జాతీయవాదమని చెప్తున్నారు. మరికొందరు ఆయనకు మద్దతిస్తున్నారు. మీరేమంటారు?

News February 6, 2025

ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన వ్యక్తి ఈయనే!

image

ఫ్రాన్స్‌కు చెందిన టిబెటన్ బౌద్ధ సన్యాసి మాథ్యూ రికార్డ్‌‌ని ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన వ్యక్తిగా గుర్తించారు. మాథ్యూపై విస్కాన్సిన్ యూనివర్సిటీ న్యూరో సైంటిస్టులు అతని పుర్రెకు 256 సెన్సార్లు బిగించి 12 ఏళ్ల పాటు అధ్యయనం చేశారు. ఆయన ధ్యానం చేసినప్పుడు బ్రెయిన్ చార్టుల నుంచి గామా తరంగాల ఉత్పత్తి స్థాయిని చూసి పరిశోధకులు ఆశ్చర్యపోయారు. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదని చెప్పారు.

News February 6, 2025

మా కలలన్నీ ఛిద్రమయ్యాయి: అక్రమ వలసదారుల కన్నీళ్లు

image

104మంది అక్రమ వలసదారుల్ని US తిప్పి పంపిన సంగతి తెలిసిందే. అక్కడికి వెళ్లేందుకు వారు పడిన బాధలు గుండెల్ని పిండుతున్నాయి. ‘చట్టప్రకారం అమెరికా తీసుకెళ్తామని ఏజెంట్ రూ.30 లక్షలు తీసుకున్నాడు. కానీ చట్ట విరుద్ధంగా బోర్డర్ దాటించాడు. దారిలో ఎన్నో ఘోరాలు చూశాం. ఎంతోమంది చనిపోయారు. ఎక్కడైతే బయలుదేరామో ఇప్పుడు తిరిగి అక్కడికే చేరాం. మా కలలన్నీ ఛిద్రమయ్యాయి’ అంటూ వారు కంటనీరు పెట్టుకుంటున్నారు.

News February 6, 2025

న్యూడ్ వీడియోల కేసు.. వారికి నోటీసులు!

image

అమ్మాయిల న్యూడ్ వీడియోల కేసు కొత్త మలుపు తీసుకుంటోంది. మస్తాన్ సాయి ఇంట్లో డ్రగ్స్ పార్టీ జరిగిందని నిన్న లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై పోలీసులు చర్యలకు దిగినట్లు సమాచారం. వీడియోలో ఉన్న సినీ ప్రముఖులు, ఇతరులకు నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు లావణ్య ఇచ్చిన హార్డ్ డిస్క్‌ను పోలీసులు ఫోరెన్సిక్‌కు పంపించారు.