news

News April 15, 2025

నేటి నుంచి ఇంటింటికీ ‘మన మిత్ర’

image

AP: వాట్సాప్ గవర్నెన్స్‌పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం నేటి నుంచి ఇంటింటికీ ‘మన మిత్ర’ కార్యక్రమం చేపట్టనుంది. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ప్రతి ఒక్కరి స్మార్ట్ ఫోన్‌లో 9552300009 నంబర్‌ను సేవ్ చేస్తారు. దాన్ని ఉపయోగించే విధానాన్ని ప్రజలకు వివరిస్తారు. ప్రస్తుతం 250కిపైగా సేవలు వాట్సాప్‌లో అందుతుండగా జూన్ నాటికి ప్రభుత్వం 500 సేవలకు విస్తరించనుంది.

News April 15, 2025

ధోనీ రికార్డుల మీద రికార్డులు

image

CSK కెప్టెన్ ధోనీ నిన్నటి LSG మ్యాచ్‌లో రికార్డుల మీద రికార్డులు నమోదు చేశారు. IPLలో 200డిస్మిసల్స్(స్టంపౌట్లు, క్యాచ్‌లు, రనౌట్లు) చేసిన తొలి వికెట్ కీపర్‌గా నిలిచారు. అలాగే లీగ్ ప్రారంభం నుంచి అత్యధిక ఇన్నింగ్సుల్లో (132) సిక్సర్లు బాదిన బ్యాటర్‌గానూ ఘనత సాధించారు. మరోవైపు IPLలో అత్యధిక సార్లు(18) POTM అవార్డ్ గెలిచిన 2వ ప్లేయర్‌గా రికార్డులకెక్కారు. ఈ లిస్టులో తొలి స్థానంలో రోహిత్ (19) ఉన్నారు.

News April 15, 2025

అమరావతిలో 1,600 ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీ!

image

AP: అమరావతి ప్రాంతంలో 1,600 ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీ నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. కృష్ణా నదిపై నిర్మించే ఐకానిక్ బ్రిడ్జి పక్కనే దీనిని ఏర్పాటు చేస్తారని సమాచారం. మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం, ట్రాక్ అండ్ ఫీల్డ్ స్టేడియాలు, స్పోర్ట్స్ వర్సిటీ, స్పోర్ట్స్ విలేజ్ నిర్మిస్తారని తెలుస్తోంది. మరోవైపు ఈ ప్రాంతంలోనే 1.25 లక్షల మంది కెపాసిటీ గల భారీ క్రికెట్ స్టేడియం కూడా నిర్మించనున్నారు.

News April 15, 2025

శబరిమలలో అయ్యప్ప లాకెట్ల విక్రయాలు ప్రారంభం

image

శబరిమల ఆలయంలో ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు(TDB) అయ్యప్ప స్వామి బంగారు లాకెట్ల విక్రయాలను ప్రారంభించింది. కోవెలలోని గర్భగుడిలో ఉంచి పూజించిన లాకెట్ల విక్రయాలను నిన్నటి నుంచి మొదలెట్టింది. అయ్యప్ప 2 గ్రాముల లాకెట్ ధర రూ,19,300, 4 గ్రాములైతే రూ.38,600, 8గ్రా. లాకెట్ ధరను రూ.77,200గా నిర్ణయించినట్లు దేవస్థానం తెలిపింది. కాగా తొలి లాకెట్‌ను ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేసిన AP భక్తుడికి అందజేశారు.

News April 15, 2025

RTCలో 3,038 పోస్టుల భర్తీ: సజ్జనార్

image

TG: ఆర్టీసీలో 3,038 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని ఆ సంస్థ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఈ నియామకాల్లో ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామని చెప్పారు. పోస్టుల భర్తీతో ఉద్యోగులు, కార్మికులపై పనిభారం తగ్గుతుందని తెలిపారు. అలాగే ఆర్టీసీ ఉద్యోగుల పెండింగ్ సమస్యలను తీర్చేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. సంస్థ ఉద్యోగులు, సిబ్బంది సంక్షేమానికి యాజమాన్యం కట్టుబడి ఉందని చెప్పారు.

News April 15, 2025

నేడు క్యాబినెట్ భేటీ

image

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ క్యాబినెట్ భేటీ జరగనుంది. వెలగపూడి సచివాలయంలో ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. రాజధాని అమరావతి, సీఆర్డీఏ, నూతన అసెంబ్లీ, హైకోర్టు భవనాల నిర్మాణాలకు అవసరమైన నిధుల సమీకరణపై చర్చిస్తారని సమాచారం. అలాగే సీఆర్డీఏ 46వ అథారిటీలో ఆమోదించిన అంశాలన్నిటికీ మంత్రిమండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశముంది.

News April 15, 2025

రషీద్ కోసం కూలీ పనులు చేసిన తండ్రి!

image

CSK తరఫున తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టిన <<16102730>>రషీద్‌<<>>ది గుంటూరు(D) పాతమల్లాయపాలెం. ఇతని తండ్రి బాలీషావలి HYDలో ఓ కంపెనీలో ఉద్యోగం చేసేవారు. అండర్-14లో రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరచడంతో రషీద్ ACAలో భాగమై మంగళగిరిలో ఉండాల్సి వచ్చింది. దీంతో బాలీషావలి ఉద్యోగం వదిలేసి అక్కడికి వెళ్లి రషీద్‌ను ప్రాక్టీస్‌కు తీసుకెళ్లేవారు. సాధన లేనిరోజు కూలీ పనులకు వెళ్లేవారు. ప్రస్తుతం కుమారుడి ఘనతను చూసి సంతోషిస్తున్నారు.

News April 15, 2025

మళ్లీ పెళ్లి ముహూర్తాలు.. తేదీలు ఇవే!

image

రేపటి నుంచి జూన్ 8 వరకు పెళ్లి ముహూర్తాలు ఉన్నాయని పురోహితులు తెలిపారు. ఏప్రిల్ 16, 18, 20, 21, 23, 30, మే 1, 3, 4, 8, 9, 10, 11, 14, 16, 18, 19, 21, 23, 24, 30, జూన్ 2, 4, 5, 6, 7, 8 తేదీల్లో మంచి రోజులున్నాయన్నారు. జూన్ 11 నుంచి జులై 12 వరకు ఆషాఢమాసంలో ముహూర్తాల్లేవని.. మళ్లీ JUL 25 నుంచి శ్రావణమాసంలో మంచిరోజులు ఉన్నాయన్నారు. కాగా APR 30న అక్షయ తృతీయ సందర్భంగా వేల పెళ్లిళ్లు జరిగే అవకాశం ఉంది.

News April 15, 2025

ఆమిర్ ఖాన్‌తో వంశీ పైడిపల్లి మూవీ?

image

బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్‌తో టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి మూవీ చేయనున్నట్లు సినీ వర్గాల్లో టాక్ విన్పిస్తోంది. వంశీ చెప్పిన స్టోరీ లైన్‌కు ఆమిర్ ఫిదా అయి పూర్తి స్క్రిప్ట్ వినిపించాలని కోరినట్లు సమాచారం. దీంతో స్క్రిప్ట్‌ని డెవలప్ చేస్తున్న ఆయన త్వరలోనే హీరోకు చెప్ప‌బోతున్న‌ట్టు తెలుస్తోంది. ఆమీర్ ఓకే చేస్తే దిల్ రాజు పాన్ ఇండియా లెవెల్‌లో మూవీ నిర్మిస్తారని టీటౌన్ వర్గాలు చెబుతున్నాయి.

News April 15, 2025

ALERT: నేటి నుంచి 3 రోజులు వర్షాలు

image

AP: రాష్ట్రంలో రానున్న మూడు రోజులపాటు పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని APSDMA తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, ప్రకాశం, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఉరుములతో వర్షం కురిసేటప్పుడు ప్రజలు జాగ్రత్తగా ఉండాలంది. పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.