India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మహిళా సాధికారిత లక్ష్యంగా LIC బీమా సఖి యోజన పథకాన్ని PM మోదీ ప్రారంభించారు. ఏడాదిలో లక్ష మందిని నియమించుకోనున్నట్లు LIC MD సిద్ధార్థ్ మహంతి ప్రకటించారు. టెన్త్ అర్హత కలిగి 18-70ఏళ్ల వయసున్న మహిళలు అర్హులు. వీరికి మూడేళ్లపాటు ఆర్థిక అంశాలు, బీమాపై శిక్షణ ఇస్తారు. తొలి ఏడాది ₹7K, రెండో ఏడాది ₹6K, మూడో ఏడాది ₹5K చొప్పున ప్రతినెలా స్టైఫండ్ అందిస్తారు. శిక్షణ తర్వాత LIC ఏజెంట్గా పనిచేయొచ్చు.
క్రిప్టో కరెన్సీ పెద్దన్న బిట్కాయిన్లో కన్సాలిడేషన్ కొనసాగుతోంది. 24 గంటల్లోనే $3736 (Rs.3.16L) నష్టపోయింది. నేడు మాత్రం స్వల్ప లాభాల్లో ట్రేడవుతోంది. $97,318 వద్ద ఓపెనైన BTC $97,040 వద్ద కనిష్ఠ, $98,159 వద్ద గరిష్ఠ స్థాయుల్ని అందుకుంది. $477 లాభంతో $97,960 వద్ద చలిస్తోంది. ఇక ఎథీరియమ్ 4.86, XRP 10.45, సొలానా 5.78, BNP 4.96, DOGE 9, ADA 12.73, షిబాఇను 13% మేర పతనమయ్యాయి. క్రిప్టో Mcap తగ్గింది.
BGT మూడో టెస్టులో రోహిత్ శర్మ ఓపెనర్గా రావాలని మాజీ క్రికెటర్లు రవిశాస్త్రి, గవాస్కర్ అభిప్రాయపడ్డారు. KL రాహుల్ను మిడిలార్డర్లో ఆడించాలన్నారు. కానీ ఫామ్లో ఉన్న KLను ఓపెనర్గా కొనసాగించాలని, 3rd టెస్టులో రెడ్ కూకబురా బాల్తో ఆడుతారు కాబట్టి మిడిలార్డర్కు బ్యాటింగ్ ఈజీ అవుతుందని మరికొందరు అంటున్నారు. 2nd టెస్టులో మిడిలార్డర్లో బ్యాటింగ్కు వచ్చిన రోహిత్ రన్స్ చేయడంలో విఫలమైన సంగతి తెలిసిందే.
స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా మొదలవ్వొచ్చు. ఆసియా, గ్లోబల్ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలే అందుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ 0.05% ఎగిసింది. జపాన్, కొరియా సూచీలు స్వల్పంగా పెరిగాయి. నిన్న US సూచీలు నష్టపోవడం గమనార్హం. నిఫ్టీకి 24,682 వద్ద రెసిస్టెన్సీ, 24,587 సపోర్టు ఉన్నాయి. టాటా మోటార్స్, సింజిన్, మెట్రోపొలిస్, BEL, లుపిన్, టైగర్ లాజిస్టిక్స్, NHPC, VI షేర్లపై ఇన్వెస్టర్లు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు.
ఆగ్నేయ బంగాళాఖాతంలోని అల్పపీడనం ప్రభావంతో బుధవారం నుంచి శుక్రవారం వరకు కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు పడతాయని APSDMA తెలిపింది. చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో ఎక్కువగా పడతాయంది. నేడు ASR, తూ.గో., ప.గో., కృష్ణా, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, YSR జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. అటు, TGలోని పలు జిల్లాలో ఇవాళ వర్షాలు పడతాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది.
కర్ణాటక బెళగావి జిల్లాలోని GOVT ఆస్పత్రుల్లో JAN నుంచి 322 మంది నవజాత శిశువులు చనిపోయినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. APR-OCT మధ్య 29 మంది మహిళలు ప్రసవానంతరం చనిపోయారని తెలిపింది. ఈ ఘటనలపై విపక్ష BJP ఆగ్రహం వ్యక్తం చేసింది. కర్ణాటక కాంగ్రెస్ మోడల్ అంటే డెత్ ట్రాప్ అని విమర్శించింది. ఆరోగ్య శాఖను కాంగ్రెస్ శ్మశానవాటికగా మార్చిందని, తల్లులు, పిల్లల ప్రాణాలను తీస్తోందని దుయ్యబట్టింది.
ఈ ఏడాది జూన్ 1 నుంచి ఇప్పటి వరకు గోదావరి, కృష్ణా, వంశధార నదుల నుంచి 5,021 టీఎంసీల జలాలు సముద్రంలో కలిశాయి. గోదావరి నుంచి 4,130, కృష్ణా నుంచి 869, వంశధార నుంచి 21 టీఎంసీలు వృథా అయ్యాయి. ఈ మూడు నదుల నుంచి కేవలం 293 టీఎంసీలను మాత్రమే పంటల సాగుకు ఉపయోగించుకున్నారు. రిజర్వాయర్లలో ఉన్న నీటి నిల్వ, వినియోగించుకున్న జలాల కంటే వృథా నాలుగు రెట్లు ఉండటం గమనార్హం.
జాతీయ ఆహార భద్రత చట్టం కింద 81 కోట్ల మందికి ఉచితం, రాయితీపై రేషన్ పంపిణీ చేస్తున్నామని కేంద్రం చెప్పడంపై సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇక పన్ను చెల్లింపుదారులు మాత్రమే మిగిలి ఉన్నారని అర్థమవుతోందని పేర్కొంది. ఇంకెంత కాలం ఉచితాలు ఇస్తారు? ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించలేరా? అని ప్రశ్నించింది. వలస కార్మికుల సమస్యలపై నమోదు చేసిన సుమోటో కేసు విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.
TG: తమను రెగ్యులర్ చేసి జీతాలు పెంచాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 19వేల మందికి పైగా సమగ్ర శిక్ష ఉద్యోగులు నేడు సమ్మెలోకి దిగనున్నారు. తమను రెగ్యులర్ చేస్తామని గతేడాది CM రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినా కార్యరూపం దాల్చలేదని తెలిపారు. 20 ఏళ్లుగా తక్కువ జీతాలకు పని చేస్తున్నామని వాపోతున్నారు. బోధన, బోధనేతర సిబ్బంది సమ్మెతో KGBVలు, అర్బన్ రెసిడెన్షియల్ స్కూళ్లు, భవిత సెంటర్లలో బోధన నిలిచిపోయే అవకాశం ఉంది.
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ తన క్యాబినెట్లోకి భారత సంతతి మహిళను ఎంపిక చేశారు. సిక్కు కమ్యూనిటీకి చెందిన ఇండో అమెరికన్ లాయర్ హర్మిత్ థిల్లాన్ను మానవ హక్కుల అసిస్టెంట్ అటార్నీ జనరల్ పోస్టుకు నామినేట్ చేశారు. ఇప్పటికే ఆయన తన కార్యవర్గంలోకి భారత మూలాలున్న వివేక్ రామస్వామి, కోల్కతాలో జన్మించిన భట్టాచార్య, కశ్యప్ పటేల్ (కాష్ పటేల్)ను నామినేట్ చేసిన విషయం తెలిసిందే.
Sorry, no posts matched your criteria.