news

News February 4, 2025

రిటైర్మెంట్ ప్రకటించిన శ్రీలంక క్రికెటర్

image

శ్రీలంక క్రికెటర్ దిముత్ కరుణరత్నే(36) ఇంటర్నేషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఈనెల 6 నుంచి AUSతో జరిగే రెండో టెస్ట్ మ్యాచే తనకు చివరిదని తెలిపారు. SL తరఫున 99 టెస్టుల్లో 7,172 పరుగులు, 50 ODIల్లో 1,316 రన్స్ చేశారు. టెస్టుల్లో 16 సెంచరీలు, 39 హాఫ్ సెంచరీలతో ఓపెనర్‌గా అద్భుతంగా రాణించారు. 30 టెస్టులకు కెప్టెన్‌గానూ వ్యవహరించారు. ఇటీవల ఫామ్ కోల్పోవడంతో రిటైర్ అవ్వాలని డిసైడ్ అయ్యారు.

News February 4, 2025

అసెంబ్లీ వాయిదా.. హరీశ్ ఫైర్

image

TG: అసెంబ్లీ సమావేశాలను ప్రారంభించిన కాసేపటికే వాయిదా వేయడంపై BRS MLA హరీశ్‌రావు ఫైరయ్యారు. ‘అసెంబ్లీ ప్రారంభమైన 2 నిమిషాలకే వాయిదా వేయటం ఏంటి? క్యాబినెట్ సమావేశం కొనసాగుతుందని, సబ్జెక్టు నోట్స్ సిద్ధం చేయలేదని సభను వాయిదా వేయాలని శ్రీధర్ బాబు కోరడం హాస్యాస్పదం. నాడు ప్రతిపక్షంలో ఉన్నా ప్రిపేర్ కాలేదు, నేడు ప్రభుత్వంలో ఉన్నా ప్రిపేర్ కాలేదు. ఇంకెప్పుడు ప్రిపేర్ అవుతారు?’ అని ఎద్దేవా చేశారు.

News February 4, 2025

దూరమై ఒక్కటైన వేళ.. ఉద్వేగ క్షణాలు!

image

మహాకుంభమేళాకు కోట్లాది మంది భక్తులు తరలివెళ్లగా రద్దీ కారణంగా చాలా మంది తప్పిపోతున్నారు. అలాంటి వారికి పోలీసులు అండగా నిలుస్తున్నారు. తాజాగా ఫాఫా మౌ జంక్షన్ రైల్వే స్టేసన్‌లో ఓ మహిళ తప్పిపోగా.. ఆమెను తన భర్తతో కలిపేందుకు రైల్వే పోలీసులు అవిశ్రాంతంగా శ్రమించి, అనౌన్స్‌మెంట్స్ ఇచ్చి ఎట్టకేలకు ఒక్కటి చేశారు. ఆ సమయంలో వారు ఉద్వేగానికి లోనై అందరికీ నమస్కరిస్తూ కృతజ్ఞతలు తెలిపిన ఫొటో వైరలవుతోంది.

News February 4, 2025

అమెరికా x చైనా: యుద్ధం మొదలైంది!

image

రెండు అతిపెద్ద ఎకానమీస్ మధ్య ట్రేడ్ వార్ మళ్లీ మొదలైంది. అమెరికాపై చైనా ప్రతీకార టారిఫ్స్ దాడి ఆరంభించింది. అక్కడి నుంచి దిగుమతి చేసుకొనే బొగ్గు, LNG ఉత్పత్తులపై 15%, క్రూడాయిల్, వ్యవసాయ యంత్రాలు, పెద్ద కార్లు, పికప్ ట్రక్స్‌పై 10% సుంకాలు ప్రకటించింది. Feb 10 నుంచి ఇవి అమల్లోకి వస్తాయని తెలిపింది. చైనా ఉత్పత్తులపై ట్రంప్ వేసిన 10% టారిఫ్స్ శనివారం నుంచి అమల్లోకి రావడంతో ప్రతీకారానికి దిగింది.

News February 4, 2025

ప్రతి ఒక్కరూ ఇవి తెలుసుకోండి!

image

ఆరోగ్యకరమైన వ్యక్తి BP-120/80 ఉంటుంది. పల్స్ (70-100), టెంపరేచర్ (36.4°C-37.2°C), బ్రీతింగ్ (12-16p/m), హిమోగ్లోబిన్ (పురుషులు 13-18, మహిళలు 11.50-16g/dL), కొలస్ట్రాల్(130-200), పొటాషియం(3.50-5), సోడియం(135-145mEq/L), రక్తం (5-6L), షుగర్ (పిల్లల్లో 70-130, పెద్దల్లో 70-115mg/dL), ఐరన్ (8-15mg), తెల్ల రక్త కణాలు(4000-11000), ప్లేట్లెట్స్ (1.5L- 4L), విటమిన్ D3(20-50ng/ml), Vit-B12 (200-900pg/ml).

News February 4, 2025

UCC అమలు దిశగా గుజరాత్!

image

యూనిఫామ్ సివిల్ కోడ్ అమలుకు గుజరాత్ సిద్ధమవుతోంది. సీఎం భూపేంద్ర పటేల్, డిప్యూటీ సీఎం హర్ష్ సంఘ్వీ మధ్యాహ్నం దీనిపై కీలక ప్రెస్‌మీట్ నిర్వహించబోతున్నారు. 2022 ఎన్నికల మ్యానిఫెస్టోలో బీజేపీ UCCపై హామీ ఇచ్చింది. ఇప్పటికే ఉత్తరాఖండ్ దీనిని విజయవంతంగా అమలు చేయడంతో 3-5 సభ్యుల కమిటీ ఏర్పాటుపై యోచిస్తోంది. మధ్యాహ్నం మరిన్ని వివరాలు తెలియనున్నాయి. వారం కిందటే ఉత్తరాఖండ్‌లో <<15276311>>UCC<<>> అమల్లోకి వచ్చింది.

News February 4, 2025

పార్టీ మారిన BRS ఎమ్మెల్యేలకు నోటీసులు

image

TG: కాంగ్రెస్‌లో చేరిన BRS ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ అయ్యాయి. వారిపై అనర్హతా వేటు వేయాలని BRS పార్టీ పిటిషన్ ఆధారంగా వివరణ ఇవ్వాలంటూ శాసనసభ కార్యదర్శి నోటీసులు పంపారు. వివరణ ఇచ్చేందుకు సమయం కావాలని MLAలు కోరారు. కాగా పార్టీ ఫిరాయింపుల పిటిషన్లపై విచారణ సందర్భంగా అసెంబ్లీ కార్యదర్శిపై <<15319239>>సుప్రీంకోర్టు <<>>ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేసింది.

News February 4, 2025

ఛాంపియన్స్ ట్రోఫీలో జట్టులో మార్పులు చేయండి: అశ్విన్

image

ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులోకి స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని తీసుకోవాలని మాజీ ప్లేయర్ అశ్విన్ సూచించారు. ఇంగ్లండ్‌తో టీ20ల్లో వరుణ్ ప్రదర్శన అద్భుతంగా ఉందని పేర్కొన్నారు. ఇప్పటివరకు వన్డేల్లో అరంగేట్రం చేయని వరుణ్‌కు ఎల్లుండి నుంచి ఇంగ్లండ్‌తో జరిగే సిరీస్‌లో అవకాశమివ్వాలని అభిప్రాయపడ్డారు. కాగా CTకి ప్రకటించిన భారత జట్టులో తుది మార్పులకు ఫిబ్రవరి 11వరకు అవకాశముంది.

News February 4, 2025

తెలుగు రాష్ట్రాల్లో మరో కీలక ప్రాజెక్టుకు ముందడుగు

image

కృష్ణా నదిపై రూ.1,082 కోట్లతో కేంద్రం చేపట్టే ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణానికి ఈ నెలాఖరులోగా టెండర్లు ఖరారు కానున్నాయి. TGలోని సోమశిల(మల్లేశ్వరం) APలోని సంగమేశ్వరం వరకు నదిలో రెండు పిల్లర్లపై 1.77kms బ్రిడ్జిని నిర్మించనున్నారు. ఈ డబుల్ స్టోర్డ్ బ్రిడ్జిలో పైనుంచి వాహనాలు వెళ్తాయి. సెకండ్ ఫ్లోర్‌లో గ్లాస్ రోడ్డు ఉంటుంది. ఈ వంతెన వల్ల HYD, తిరుపతి మధ్య దూరం 80kms తగ్గనుంది.

News February 4, 2025

పెరుగుతున్న ఎండ తీవ్రత

image

TG: రాష్ట్రంలో ఫిబ్రవరి మొదటివారంలోనే ఎండలు మండుతున్నాయి. చలి తీవ్రత తగ్గడంతో నిన్న ఆదిలాబాద్, మహబూబ్ నగర్‌లో 36.5, భద్రాచలంలో 35.6, మెదక్‌లో 34.8, హైదరాబాద్‌లో డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాబోయే రోజుల్లో ఇవి మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.