news

News February 4, 2025

UNకు డబ్బు సాయం చేసిన భారత్

image

UN రెగ్యులర్ బడ్జెట్ 2025 కోసం భారత్ $37.64 మిలియన్లు చెల్లించింది. సరైన సమయంలోగా డబ్బులిచ్చిన 35 గౌరవ సభ్యదేశాల సరసన నిలిచింది. UN కమిటీ 30 రోజుల గడువుతో JAN 31ని చివరి తేదీగా ప్రకటించింది. భారత్ ఆ లోపే డబ్బును అందించింది. దీంతో UN చీఫ్ ఆంటోనియో గుటెరస్ అధికార ప్రతినిధి స్టీఫన్ డుజారిక్ ‘భారత్‌లోని మా మిత్రులకు ధన్యవాదాలు’ అంటూ సందేశం పంపారు. ఈ సంస్థ నిర్వహణకు ఏటా సభ్యదేశాలు డబ్బులు ఇస్తాయి.

News February 4, 2025

అసెంబ్లీ ప్రత్యేక సమావేశం వాయిదా

image

TG: అసెంబ్లీ ప్రత్యేక సమావేశం వాయిదా పడింది. కులగణన, ఎస్సీ వర్గీకరణపై క్యాబినెట్ సమావేశం కొనసాగుతుందని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. శ్రీధర్ బాబు విజ్ఞప్తితో స్పీకర్ సభను మ.2 గంటలకు వాయిదా వేశారు.

News February 4, 2025

అసెంబ్లీ ప్రత్యేక సమావేశం.. విపక్ష పార్టీల ఎమ్మెల్యేలు వేర్వేరుగా భేటీ

image

TG: అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నేపథ్యంలో బీఆర్ఎస్‌ఎల్పీ, బీజేపీఎల్పీ ఎమ్మెల్యేలు వేర్వేరుగా సమావేశమయ్యారు. సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై వారు చర్చిస్తున్నారు. మరోవైపు బీసీ రిజర్వేషన్ల పెంపుపై కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదని బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. ముస్లిం రిజర్వేషన్లు 4 శాతం ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. రాజకీయ లబ్ధి కోసమే కులగణన చేసిందని దుయ్యబట్టారు.

News February 4, 2025

రోడ్డు ప్రమాదంలో లేడీ ఎస్సై మృతి

image

TG: జగిత్యాలలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చిల్వకోడూరు వద్ద బైక్‌ను ఢీకొట్టిన కారు ఆ తర్వాత చెట్టును ఢీకొనడంతో లేడీ ఎస్సై శ్వేత మరణించారు. ఈ ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తి కూడా మరణించినట్లు పోలీసులు తెలిపారు. శ్వేత ప్రస్తుతం జగిత్యాల పోలీసు హెడ్ క్వార్టర్స్‌లో పనిచేస్తున్నారు.

News February 4, 2025

తిరుపతిలో ఉద్రిక్త పరిస్థితులు.. 144 సెక్షన్

image

AP: తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నిక నేపథ్యంలో ఎస్వీ వర్సిటీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిన్న కోరం లేకపోవడంతో ఎన్నికను నేటికి వాయిదా వేశారు. తమ కార్పొరేటర్లను కిడ్నాప్ చేశారని నిన్న వైసీపీ ఆరోపించగా, తాము క్షేమంగానే ఉన్నామని వారు వీడియోలు రిలీజ్ చేశారు. కోర్టు ఆదేశాలతో పోలీసులు 144 సెక్షన్ విధించి, భారీ భద్రత ఏర్పాటు చేశారు.

News February 4, 2025

Stock Markets: తేడా 0.3 శాతమే

image

భారత స్టాక్‌మార్కెట్లపై DIIs పట్టు పెరుగుతోంది. పెట్టుబడుల పరంగా FIIsతో పోలిస్తే 0.3 శాతమే వెనుకంజలో ఉన్నారు. NSEలో ఫారిన్ ఇన్వెస్టర్ల హోల్డింగ్స్ 12 నెలల కనిష్ఠమైన 17.23 శాతానికి పడిపోయాయి. మరోవైపు DIIs హోల్డింగ్స్ 16.9 శాతానికి చేరాయి. ఇక MFs హోల్డింగ్స్ జీవితకాల గరిష్ఠమైన 9.9% వద్ద ఉన్నాయి. 2015లో మన మార్కెట్లలో FIIs పెట్టుబడులు DIIs కన్నా రెట్టింపు ఉండేవి. క్రమంగా పరిస్థితి మారుతోంది.

News February 4, 2025

చైతూను ఇంటర్వ్యూ చేయనున్న సాయి పల్లవి

image

‘తండేల్’ సినిమా విడుదల నేపథ్యంలో చిత్రయూనిట్ ఇప్పటికే ప్రమోషన్స్ మొదలుపెట్టింది. అయితే, అనారోగ్య సమస్యలతో హీరోయిన్ సాయి పల్లవి చాలా ప్రమోషన్స్‌కు దూరంగా ఉన్నారు. ఈక్రమంలో సోషల్ మీడియా ద్వారా ప్రమోషన్స్ చేసేందుకు ఆమె ముందుకొచ్చారు. హీరో చైతూతో స్పెషల్ ఇంటర్వ్యూ ప్లాన్ చేస్తున్నానని, ఏవైనా అడిగే ప్రశ్నలుంటే చెప్పాలని సాయి పల్లవి ట్వీట్ చేశారు. ఈనెల 7న ‘తండేల్’ విడుదలవనుంది.

News February 4, 2025

ఎమ్మెల్సీ కిడ్నాప్ కాలేదు: తిరుపతి ఎస్పీ

image

తిరుపతి ఎమ్మెల్సీ కిడ్నాప్ అయ్యారని జరుగుతున్న ప్రచారంపై జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు స్పందించారు. ‘ఎమ్మెల్సీని ఎవరూ కిడ్నాప్ చేయలేదు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరినట్లు ఆయనే వీడియో విడుదల చేశారు. తిరుపతిలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్లోనే ఉంది. 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్‌తో పాటు బందోబస్త్ పెంచాం. బాలాజీ కాలనీ నుంచి ఎస్వీయూ వరకు వాహనాలు మళ్లించాం’ అని ఎస్పీ స్పష్టం చేశారు.

News February 4, 2025

BREAKING: భారీగా పెరిగిన బంగారం ధరలు

image

పెళ్లిళ్ల సీజన్ వేళ పసిడి ధరలు భయపెడుతున్నాయి. ఇవాళ హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,050 పెరిగి రూ.78,100లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,150 పెరగడంతో రూ.85,200 పలుకుతోంది. ఇక కేజీ సిల్వర్ రేటు రూ.1,000 తగ్గి రూ.1,06,000లకు చేరింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.

News February 4, 2025

ఐటీ విచారణకు దిల్ రాజు

image

ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఐటీ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఇటీవల ఆయన కార్యాలయంతో పాటు నివాసాల్లో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో వ్యాపారాలకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని నోటీసులు జారీ చేశారు.