news

News April 14, 2025

BJP అంబేడ్కర్‌కు శత్రువు : మల్లికార్జున్ ఖర్గే

image

బీజేపీ, RSS భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌కు శత్రువులని AICC అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. 1952 ఎన్నికల్లో ఆయన ఓటమికి V.Dసావర్కర్, SA డాంగే కారణమన్నారు. ఈ విషయాన్ని అంబేడ్కర్ స్వయంగా ఓ లేఖలో పేర్కొన్నారని తెలిపారు. దేశవ్యాప్తంగా కులగణన చేయాలని, ప్రైవేట్ విద్యాసంస్థల్లోనూ SC, ST, OBCలకు రిజర్వేషన్లు అమలు చేసే చర్యలు చేపట్టాలని మల్లికార్జున్ ఖర్గే డిమాండ్ చేశారు.

News April 14, 2025

రూ.75 లక్షలు తీసుకుని నితిన్ హ్యాండిచ్చాడు: నిర్మాత

image

హీరో నితిన్‌పై నిర్మాత, డైరెక్టర్ వశిష్ఠ తండ్రి సత్యనారాయణరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తన కొడుకు దర్శకత్వంలో సినిమా చేసేందుకు రూ.75 లక్షలు అడ్వాన్స్ తీసుకుని నితిన్ హ్యాండిచ్చారని చెప్పారు. ఆ సమయంలో ‘అఆ’ పెద్ద హిట్టవడంతో వశిష్ఠతో చేస్తే రేంజ్ పడిపోతుందని వద్దన్నారని పేర్కొన్నారు. అప్పట్లో ఆ ప్రాజెక్టు కోసం రూ.2 కోట్లు ఖర్చుచేసినట్లు తెలిపారు. తర్వాత వశిష్ఠ ‘బింబిసార’తో హిట్ కొట్టాడని చెప్పారు.

News April 14, 2025

అంబేడ్కర్ విదేశీ విద్యా దీవెన పథకాన్ని మళ్లీ తీసుకొస్తాం: CM

image

AP: అంబేడ్కర్ విదేశీ విద్యా దీవెన పథకాన్ని మళ్లీ ప్రారంభిస్తామని CM చంద్రబాబు ప్రకటించారు. గుంటూరు(D) పొన్నెకల్లులో మాట్లాడుతూ ‘పేదలకు అండగా ఉంటాం. రెసిడెన్షియల్ స్కూళ్లలో నాణ్యమైన విద్య, భోజనం అందిస్తాం. అమరావతికి ప్రతిష్టాత్మక వర్సిటీలు, కాలేజీలను తీసుకొస్తాం’ అని తెలిపారు. చరిత్రలో ఎప్పుడూ చూడని రాజకీయం 2019-24 మధ్య చూశానని, తనలాంటి వాళ్లు కూడా బయటకు రాని పరిస్థితి ఉండేదని వ్యాఖ్యానించారు.

News April 14, 2025

ట్రైన్ వెయిటింగ్ లిస్టులో రకాలు..

image

*వెయిటింగ్ లిస్టు (WL): ఇది సాధారణంగా ఉండేది.
*జనరల్ (GNWL): ట్రైన్ స్టార్ట్ అయ్యే/దగ్గరి స్టేషన్ నుంచి ప్రయాణించే వారు ఈ లిస్టులో ఉంటారు.
*పూల్డ్ కోటా (PQWL): ట్రైన్ రూట్ మధ్యలో ఉండే స్టేషన్స్‌లో ఎక్కేవారికి ఈ లిస్ట్ వర్తిస్తుంది.
*రోడ్ సైడ్ స్టేషన్ (RSWL): చిన్న, రోడ్డుసైడ్ స్టేషన్స్ నుంచి ఎక్కేవారికి,
>GNWLలో టికెట్స్ కన్ఫమ్ అయ్యే అవకాశం ఎక్కువగా
ఉంటుందట.

News April 14, 2025

హంతకుడి ఎన్‌కౌంటర్.. ఈ ‘లేడీ సింగం’ గురించి విన్నారా?

image

కర్ణాటక హుబ్బళ్లిలో ఐదేళ్ల చిన్నారిపై రేప్ అటెంప్ట్ చేసి చంపిన నిందితుడిని <<16090804>>ఎన్‌కౌంటర్<<>> చేసింది PSI అన్నపూర్ణ. ఆస్పత్రిలో బాలిక మృతదేహాన్ని చూసి ఆమె ఏడ్చేశారు. నిందితుడు రితేశ్ కోసం వేట కొనసాగించారు. లొంగిపోమని కోరగా రితేశ్ పోలీసులపై రాళ్లు రువ్వాడు. దీంతో అన్నపూర్ణ రితేశ్‌పై కాల్పులు జరపగా రెండు బుల్లెట్లు తగిలి అతడు హతమయ్యాడు. అందరూ అన్నపూర్ణను లేడీ సింగం అంటూ ప్రశంసిస్తున్నారు.

News April 14, 2025

40ల్లో జాబు ఎందుకు పోతుందో వివరించిన CEO

image

40, ఎర్లీ 50 వయసుండే ప్రొఫెషనల్స్ జాబులు కోల్పోవడంపై బాంబే షేవింగ్ కంపెనీ CEO శాంతను దేశ్‌పాండే స్పందించారు. ఎక్కువ సీనియారిటీ, అధిక జీతాల కారణంగానే ఉద్యోగాలు కోల్పోతారన్నారు. బాధ్యతలు ఎక్కువగా ఉండే వయసులో జాబ్ పోవడంపై విచారం వ్యక్తం చేశారు. జాబ్ పోకుండా ఉండాలంటే.. AIలో నైపుణ్యం పెంచుకోవడం, ఎక్కువ పొదుపు, ఎంటర్‌‌పెన్యూరియల్ మైండ్‌సెట్ పెంచుకోవాలన్నారు.

News April 14, 2025

USతో టారిఫ్ వార్.. చైనా ఎగుమతులపై తీవ్ర ఒత్తిడి!

image

US- చైనా టారిఫ్ వార్ మరింత తీవ్రమయ్యేలా ఉంది. ప్రస్తుతం చైనా ఎగుమతి రంగం తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నట్లు ఆ దేశ కస్టమ్స్ విభాగం ప్రతినిధి తెలిపారు. ఒత్తిడున్నా పరిస్థితులు విధ్వంసకరంగా లేవన్నారు. US ప్రతీకార సుంకాల వల్ల ‘నింగి విరిగి నేలకూలదు’ అని వ్యాఖ్యానించారు. చైనా వైవిధ్యభరిత మార్కెట్‌ను సృష్టిస్తోందన్నారు. చైనాలో దేశీయ మార్కెట్ డిమాండ్ కూడా అధికంగా ఉంటుందని తెలిపారు.

News April 14, 2025

ప్రస్తుతం పెళ్లి ఆలోచన లేదు: తమన్నా

image

విజయ్ వర్మ‌తో బ్రేకప్ వార్తలు వస్తున్న వేళ తమన్నా పెళ్లిపై స్పందించారు. ప్రస్తుతానికి వివాహం చేసుకునే ఆలోచన లేదని ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. ప్రేమను వ్యాపారంగా చూస్తే సమస్యలొస్తాయని <<15926914>>మిల్కీ బ్యూటీ,<<>> రిలేషన్‌షిప్‌లో సంతోషం, బాధలను స్వీకరిస్తేనే సంతోషంగా ఉంటామని విజయ్ ఇటీవల కామెంట్ చేశారు. దీంతో వీరు విడిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై వీరిద్దరూ ఇప్పటి వరకు స్పందించలేదు.

News April 14, 2025

ఏపీలో రూ.5,001 కోట్లతో LG కొత్త ప్లాంట్!

image

AP: తిరుపతి జిల్లాలోని శ్రీసిటీలో LG కంపెనీ కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఏర్పాటు చేయబోతోంది. మే 8న దీని ఓపెనింగ్ సెర్మనీ ఉండే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం గతేడాది NOVలో 247 ఎకరాలను కేటాయించింది. రూ.5,001 కోట్ల పెట్టుబడులను ఆమోదించింది. ఈ ప్లాంటులో ఫ్రిజ్‌లు, ఏసీలు, వాషింగ్ మెషీన్లు, టీవీలు, కంప్రెషర్లను తయారు చేయనున్నారు. 1,495 మంది స్థానికులకు ప్రత్యక్ష ఉపాధి కల్గనుంది.

News April 14, 2025

నేటి నుంచి భారీ స్థాయిలో జాబ్ నోటిఫికేషన్లు: మంత్రులు

image

TG: ఇకపై విద్య, <<16093517>>ఉద్యోగాల్లో<<>> SC వర్గీకరణ అమలు అవుతుందని మంత్రులు దామోదర, ఉత్తమ్ మీడియా సమావేశంలో వెల్లడించారు. SC వర్గీకరణ నేటి నుంచి అమల్లోకి వస్తుందని, నేటి నుంచి భారీ స్థాయిలో జాబ్ నోటిఫికేషన్లు విడుదల చేస్తామని ప్రకటించారు. ప్రభుత్వం జారీ చేసే అన్ని జాబ్ నోటిఫికేషన్లకు SC వర్గీకరణ వర్తిస్తుందన్నారు. SC వర్గీకరణ గురించి చాలా పార్టీలు మాట్లాడాయని, కానీ దాని కోసం ప్రయత్నం చేయలేదని అన్నారు.