news

News August 16, 2024

పవన్‌తో ఆద్య సెల్ఫీ.. రేణూదేశాయ్ ఏమన్నారంటే?

image

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా dy.CM పవన్ కళ్యాణ్ తన కూతురు ఆద్యతో సెల్ఫీ తీసుకున్నారు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదే ఫొటోపై రేణూ దేశాయ్ తన ఇన్‌స్టాలో ఓ పోస్ట్ పెట్టారు. ‘తన నాన్నతో సమయం గడుపుతానని ఆద్య నన్ను అడగ్గానే సంతోషమేసింది. ఉన్నత వ్యక్తుల జీవితం ఆమె చూడాలనుకోవడంతో ఆనందం కలిగింది. ప్రజలకు వాళ్ల నాన్న చేసే సేవలను ఆద్య అర్థం చేసుకుంది’ అంటూ ఆమె పేర్కొన్నారు.

News August 16, 2024

ఇన్సూరెన్స్: ‘ఫ్రీ లుక్ పీరియడ్’ గురించి తెలుసా?

image

ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాక 30రోజుల వరకూ ఫ్రీ లుక్ పీరియడ్ ఉంటుంది. ఆ సమయంలో పాలసీని మరింత అర్థం చేసుకోవచ్చు. నచ్చకపోతే రద్దు చేసుకోవచ్చు. పాలసీలో ఏదైనా మోసపూరితంగా ఉన్నట్లు మీరు గుర్తిస్తే కంపెనీకి తెలియజేయాలి. కొన్ని సంస్థలు పాలసీ రద్దు చేసేందుకు వెబ్‌సైట్లోనే అవకాశం కల్పిస్తున్నాయి. కాగా కొన్ని సందర్భాల్లో 30రోజుల తర్వాతా ఈ రద్దు ఛాన్స్ ఉంటుంది. కాకపోతే కొన్ని రకాల ఛార్జెస్ ఉంటాయి.

News August 16, 2024

ప్రయాణికులకు TGSRTC గుడ్‌న్యూస్

image

TG: రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో టికెట్ల కొనుగోళ్లకు త్వరలో డిజిటల్ చెల్లింపుల విధానాన్ని తీసుకొస్తామని TGSRTC ఎండీ సజ్జనార్ తెలిపారు. ప్రస్తుతం పైలట్ ప్రాజెక్టుగా హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్, బండ్లగూడ డిపోల్లో ఇది అమలు అవుతోందన్నారు. కొద్దిరోజుల్లోనే అన్ని డిపోల్లో అందుబాటులోకి తెస్తామని వివరించారు. దీంతో ఆర్టీసీ బస్సుల్లో అటు కండక్టర్లకు, ఇటు ప్రయాణికులకు ‘చిల్లర’ కష్టాలు తప్పనున్నాయి.

News August 16, 2024

కమలను విమర్శించడం నా హక్కు: ట్రంప్

image

డెమోక్రాట్ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్‌ను వ్యక్తిగతంగా విమర్శించే హక్కు తనకుందని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఆమె తనపై అలాగే దాడి చేసిందన్నారు. తనతో సహా చాలామందిపై దాడికి న్యాయ వ్యవస్థను ఆమె ఆయుధంగా వాడుకున్నారని ఆరోపించారు. ఆమె, ఆమె తెలివితేటలపై తనకు అస్సలు గౌరవం లేదన్నారు. ఒకవేళ ఆమె గెలిస్తే ఘోరమైన అధ్యక్షురాలు అవుతుందని పేర్కొన్నారు. అందుకే తాను గెలవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

News August 16, 2024

ఏపీలో విజృంభిస్తున్న డెంగ్యూ ఫీవర్లు

image

AP: రాష్ట్రంలో వైరల్ ఫీవర్లు ప్రజలను వణికిస్తున్నాయి. పల్లె, పట్టణం అని తేడా లేకుండా ఆస్పత్రులు డెంగ్యూ, ఇతర జ్వర బాధితులతో నిండిపోతున్నాయి. ఇదే అదునుగా ప్రైవేటు ఆస్పత్రులు రోగుల నుంచి డబ్బులు పిండుకుంటున్నాయి. దీంతో వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. జిల్లా ఆస్పత్రులు, సర్వజన ఆస్పత్రుల్లో ‘ఎలిసా’ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. మందులు అందుబాటులో ఉంచాలని జిల్లా అధికారులకు సూచించింది.

News August 16, 2024

సెంట్రల్ కాంట్రాక్టు వదులుకున్న కివీస్ స్టార్ ప్లేయర్స్

image

న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్లు డెవాన్ కాన్వే, ఫిన్ అలెన్ తమ సెంట్రల్ కాంట్రాక్టును వదులుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా జరిగే పలు టీ20 ఫ్రాంచైజీ లీగ్స్‌లో ఆడేందుకే వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా ఎలాంటి లీగ్ మ్యాచులు లేనపుడు మాత్రం జాతీయ జట్టుకు ఆడనున్నారు. ఇప్పటికే కేన్ విలియమ్సన్, ఆడమ్ మిల్నే, లాకీ ఫెర్గూసన్ కూడా న్యూజిలాండ్ క్రికెట్ బోర్డుతో ఇలాంటి ఒప్పందాలే కలిగి ఉన్నారు.

News August 16, 2024

డ్రగ్స్‌తో పట్టుబడితే అడ్మిషన్ రద్దు?

image

TG: కాలేజీలు, యూనివర్సిటీల్లో డ్రగ్స్‌తో పట్టుబడితే విద్యార్థుల అడ్మిషన్ రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకుంటేనే విద్యార్థులు డ్రగ్స్ జోలికి వెళ్లరని సర్కార్ భావిస్తున్నట్లు సమాచారం. డ్రగ్స్ నివారణపై డీజీపీ, విద్యాశాఖాధికారులు, యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు రేపు సమావేశం కానున్నారు. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

News August 16, 2024

వరలక్ష్మీ వ్రతం.. ఈ తప్పులు అస్సలు చేయవద్దు!

image

ఈరోజు వరలక్ష్మీ వ్రతం. శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతంలో అమ్మవారిని ఆరాధించేటప్పుడు ఎంతో ఏకాగ్రత అవసరం. కలశాన్ని ఏర్పాటు చేసుకున్నవారు, ఆ కలశాన్ని గాజు ప్లేట్లలో పెట్టకూడదు. వెండి లేదా రాగి ప్లేట్లు వాడుకోవచ్చు. గణపతి పూజ చేశాకే లక్ష్మీపూజ చెయ్యాలి. ఈ పవిత్రమైన రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ కోపం తెచ్చుకోకూడదు. ఇతరులను తిట్టవద్దు. వాట్సాప్ స్టేటస్‌ల కోసం వ్రతం చేస్తే ముక్తి ఉండదని పెద్దలంటున్నారు.

News August 16, 2024

పొలానికి దారి లేదా.. ఇలా చేయండి

image

AP: పొలానికి వెళ్లేందుకు దారి లేని రైతుల కోసం ప్రభుత్వం కొత్త చట్టం ప్రవేశపెట్టింది. దీని ప్రకారం అలాంటి సమస్య ఉన్న రైతులు చట్టాన్ని ఆశ్రయించవచ్చు. ఈ చట్టం ద్వారా అన్నదాతలు భూమి హక్కు పొందవచ్చు. వెనుక ఉన్న పొలానికి ముందు ఉన్న పొలం రైతు దారి ఇవ్వాల్సిందే. లేదంటే సదరు రైతుపై కేసు నమోదు చేయొచ్చు. కౌలు రైతు చట్టంలోని సెక్షన్ 251 ప్రకారం పొలానికి వెళ్లేందుకు రైతులు రోడ్డు కూడా నిర్మించుకోవచ్చు.

News August 16, 2024

ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి.. రెండు రోజుల్లో భారీ వర్షాలు

image

AP: రాష్ట్ర ప్రజలు ఉక్కపోతతో అల్లాడుతున్నారు. సగటున 35 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావంతో గాలిలో తేమశాతం పెరగడం వల్లే ఇలాంటి పరిస్థితి ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల విపరీతంగా చెమటలు, ఎక్కువ దాహం వేస్తుందంటున్నారు. రానున్న 2 రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని, మన్యం, అల్లూరి, సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, అనంతపురం జిల్లాలపై ప్రభావం ఉంటుందని పేర్కొంటున్నారు.

error: Content is protected !!