India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: సీఎం రేవంత్ అధ్యక్షతన కాంగ్రెస్ శాసనసభా పక్షం రేపు సమావేశం కానుంది. శంషాబాద్ నోవాటెల్లో ఉ.11 గంటల నుంచి జరగనున్న ఈ భేటీలో 4 అంశాలపై చర్చించనున్నారు. భూ భారతి, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, SC-ST వర్గీకరణపై చర్చ జరగనుంది. ఈ మేరకు పార్టీ MLAలు, MLCలకు ప్రభుత్వ విప్లు సమాచారం ఇచ్చారు.
కాంగ్రెస్ తమ స్వార్థ ప్రయోజనాల కోసం రాజ్యాంగాన్ని బుజ్జగింపు సాధనంగా వాడిందని ప్రధాని మోదీ విమర్శించారు. హస్తం పార్టీ తన అధికారానికి ముప్పు ఉందని భావించినప్పుడల్లా దేశ అత్యున్నత శాసనాన్ని తుంగలో తొక్కేదని నొక్కిచెప్పారు. రాజ్యాంగంతో దేశంలో సామాజిక న్యాయం జరుతుందని భావించిన అంబేడ్కర్ ఆశయాలకు కాంగ్రెస్ ద్రోహం చేసిందని మండిపడ్డారు. హరియాణాలో హిసార్ విమానాశ్రయంలో ప్లాంటును PM ప్రారంభించారు.
AP: భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా టీటీడీ బోర్డు మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ వ్యాఖ్యలు చేశారని టీటీడీ ఈవో శ్యామలారావు విమర్శించారు. 3 నెలల్లో 100 ఆవులు చనిపోయాయని అసత్య ప్రచారం చేశారన్నారు. ప్రతి నెలా సగటున 15 ఆవులు మరణిస్తాయని, 3 నెలల్లో 43 మృతి చెందాయని తెలిపారు. దాతలు ఇచ్చిన ఆవుల్లో కొన్ని అనారోగ్యంతో చనిపోయాయని చెప్పారు. మరణించిన ఆవులకు పోస్టుమార్టం చేయలేదనడం అవాస్తవమన్నారు.
AP: తిరుమలలోని గోశాల నిర్వహణలో మార్చి 2021 నుంచి మార్చి 2024 వరకు ఎన్నో అక్రమాలు జరిగాయని టీటీడీ ఈవో శ్యామలారావు ఆరోపించారు. గత ఐదేళ్లలో చనిపోయిన ఆవుల వివరాలను దాచిపెట్టారన్నారు. ఆవులు లేని గోశాలకు దాణా పేరుతో నిధులు దుర్వినియోగం చేశారని చెప్పారు. అలాగే స్వామివారికి ఆర్గానిక్ ప్రసాదాల పేరుతో అక్రమాలు చోటుచేసుకున్నాయని వివరించారు. రూ.3 కోట్ల విలువైన సరకులకు రూ.25 కోట్లు చెల్లించారని పేర్కొన్నారు.
US అధ్యక్షుడు ట్రంప్ ఉక్రెయిన్ సందర్శించాలని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీ కోరారు. రష్యా తమ దేశంలో చేసిన విధ్వంసం చూడాలన్నారు. యుద్ధంతో తమ దేశంలో నెలకొన్న పరిస్థితులు, మరణించిన, గాయపడిన ప్రజలు, దెబ్బతిన్న కట్టడాల్ని చూసిన అనంతరం ఏదైనా నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాగా ఫిబ్రవరిలో ట్రంప్, జెలెన్స్కీ మధ్య జరిగిన చర్చలు వాగ్వాదంతో అర్ధాంతరంగా ముగిశాయి.
పిల్లల్లో పాలదంతాలు ఊడిపోయి కొత్తవి వస్తాయి. వాటిని కోల్పోతే మళ్లీ రావు. తాజాగా ప్రపంచంలోనే తొలిసారి UK సైంటిస్టులు ల్యాబ్లో మానవ దంతాలను సృష్టించారు. దంతాల వృద్ధికి అవసరమైన వాతావరణాన్ని కల్పించే ఓ పదార్థాన్ని అభివృద్ధి చేశారు. భవిష్యత్తులో రోగులు కోల్పోయిన దంతాలను వారిలోనే వృద్ధి చేయొచ్చంటున్నారు. ఫిల్లింగ్స్, ఇంప్లాంట్స్ అవసరం ఉండదని, దంత రక్షణలో ఇదో విప్లవాత్మక పురోగతి అని చెబుతున్నారు.
IPL: ఢిల్లీ ప్లేయర్ కరుణ్ నాయర్ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. ముంబైతో జరిగిన మ్యాచ్లో తాను చేసిన స్కోరుకు విలువే లేదన్నారు. తనకు జట్టు విజయమే ముఖ్యమని.. ఓడిపోయిన మ్యాచ్లో ఎంత స్కోర్ చేసినా లాభం లేదన్నారు. ముంబైపై కరుణ్ నాయర్ 40 బంతుల్లో 89(12 ఫోర్లు, 5 సిక్సర్లు) స్కోర్ చేశారు. తన పవర్ హిట్టింగ్తో బుమ్రాను సైతం వణికించారు. కరుణ్ నాయర్, పోరెల్(33) మినహా ఢిల్లీ జట్టులో బ్యాటర్లు ఎవరూ రాణించలేదు.
TG: రాష్ట్రంలో 59 కులాలను 3 గ్రూపులుగా విభజించింది. గ్రూప్-1లో సామాజిక, ఆర్థిక, విద్యాపరంగా వెనుకబడిన 15 కులాలను చేర్చి 1 శాతం రిజర్వేషన్ కల్పించింది. గ్రూప్-2లో మాదిగ, దాని ఉపకులాల(18)కు 9 శాతం, గ్రూప్-3లో మాల, దాని ఉపకులాల(26)కు 5శాతం కేటాయించింది. గ్రూప్-1లో 1,71,625 మంది(3.288 శాతం), గ్రూప్-2లో 32,74,377(62.749 శాతం) మంది, గ్రూప్-3లో 17,71,682(33.963 శాతం) మంది ఉన్నారు.
TG: ఏవైనా ప్రభుత్వ ఉద్యోగాలను తొలుత గ్రూప్-1లోని కులాలవారితో, అక్కడ మిగిలితే గ్రూప్-2, ఆ తర్వాత గ్రూప్-3లోని వ్యక్తులతో భర్తీ చేస్తారు. మూడు గ్రూపుల్లోనూ అభ్యర్థులు లేకపోతే ఆ ఖాళీలను క్యారీ ఫార్వర్డ్ చేస్తారు.
రోస్టర్ పాయింట్ల విభజన ఇలా..
✒ గ్రూప్-1లోని వారికి 7వ రోస్టర్ పాయింట్, గ్రూప్-2లోని వారికి 2, 16, 27, 47, 52, 66, 72, 87,97, గ్రూప్-3లోని వారికి 22, 41, 62, 77, 91 రోస్టర్ పాయింట్లు ఉంటాయి.
బంగ్లాదేశ్ స్వాతంత్ర్య సమరయోధుల జ్ఞాపకార్థం నిర్మించిన ముక్తి జోధా కాంప్లెక్స్లను దేశ ప్రధాన సలహాదారు మహ్మద్ యూనస్ తొలగిస్తున్నారని బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా తెలిపారు. ‘నిప్పుతో చెలగాటమాడితే అది మిమ్మల్నే దహించివేస్తుందని’ అని హెచ్చరించారు. యూనస్ విదేశీ శక్తులతో చేతులు కలిపి దేశ పతనానికి యత్నించారని ఆరోపించారు. భారత్లో ఆశ్రయం పొందుతున్న షేక్ హసీనా బంగ్లాకు వెళ్తానని ఇటీవల ప్రతిజ్ఞ చేశారు.
Sorry, no posts matched your criteria.