India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పంద్రాగస్టు సందర్భంగా ప్రతిచోటా జాతీయ జెండాను ఎగురవేస్తుంటారు. అయితే, ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా ప్రకారం తిరంగ జెండాను ఆవిష్కరించే సమయంలో కొన్ని నియమాలు పాటించాలి. అక్కడ ఇతర జెండాలేమైనా ఉంటే వాటికంటే పైన జాతీయ జెండా ఉండేలా చూడాలి. జెండాపై ఏం రాయొద్దు. రంగుల క్రమం సరిగ్గా ఉండేలా చూసుకోండి. కాషాయ రంగు పైకి ఉండాలి. చిరిగిన, మాసిపోయిన జెండాను ప్రదర్శించకండి. పోల్కి సగంలోనే జెండా ఎగరేస్తే నేరమే.
దులీప్ ట్రోఫీలో ఆడే జట్లను BCCI ప్రకటించింది. స్టార్ ప్లేయర్లు రోహిత్, విరాట్, బుమ్రా, పాండ్య ఈ టోర్నీకి దూరంగా ఉన్నారు. ముందునుంచీ వీరు ఆడుతారనే ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. మొత్తం 4 జట్లకు గిల్, ఈశ్వరన్, రుతురాజ్, అయ్యర్ కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు. పంత్, సూర్య, రాహుల్, జడేజా, సిరాజ్, అక్షర్, కిషన్, జైస్వాల్, దూబే, తిలక్ వర్మ ఆయా జట్లకు ఆడనున్నారు. SEP 5 నుంచి 22 వరకు మ్యాచులు జరగనున్నాయి.
తెలంగాణలో త్వరలో జరగనున్న రాజ్యసభ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా అభిషేక్ మను సింఘ్వీ పేరును అధిష్ఠానం ప్రకటించింది. ఈ స్థానంలో గతంలో బీఆర్ఎస్ తరఫున గెలిచిన కే కేశవరావు రాజీనామా చేయడంతో ఖాళీ ఏర్పడింది. కాంగ్రెస్కు ఎమ్మెల్యేల సంఖ్యా బలం ఉండటంతో ఈ ఉప ఎన్నికలో ఆ పార్టీ గెలుపు లాంఛనమే.
AP: మిలిటరీ, పారామిలిటరీలో పనిచేసిన సైనికులకు రాష్ట్రంలో SPO(స్పెషల్ పోలీస్ ఆఫీసర్)గా ఉద్యోగం కల్పించాలని CM చంద్రబాబుకు ఎస్పీవో యూనియన్ లేఖ రాసింది. కరోనా సమయంలోనూ సేవలు అందించామని, 11 నెలలుగా తమకు జీతాలు ఇవ్వలేదని యూనియన్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. సాలరీ అడిగినందుకు ఉద్యోగం నుంచి తొలగించారన్నారు. అనుభవాన్ని బట్టి మాజీ ఉద్యోగులకు పోలీసు డిపార్ట్మెంట్లో అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
పారిస్ ఒలింపిక్స్లో ఫైనల్స్ వరకూ చేరి బరువు ఎక్కువగా ఉండటంతో డిస్క్వాలిఫై అయిన భారత రెజ్లర్ వినేశ్ ఫొగట్ ఈనెల 17న స్వదేశానికి రానున్నారు. ఉదయం 10 గంటలకు ఆమె ఢిల్లీలోని ఇందిరా గాంధీ విమానాశ్రయానికి చేరుకుంటారని రెజ్లర్ భజరంగ్ పునియా వెల్లడించారు. రియల్ ఫైటర్కు ఘన స్వాగతం పలకనున్నట్లు తెలిపారు. కాగా ఈనెల 16న ఆర్బిట్రేషన్ కోర్టు(CAS) తీర్పు వెలువరించనుంది.
సోషల్ మీడియా పరిచయం ప్రాణాలను బలితీసుకున్న ఘటన ఇది. MPకి చెందిన గజేంద్ర(18), 1000 కి.మీ దూరంలోని మిడ్నాపూర్లో ఆన్లైన్ స్నేహితురాలిని కలిసేందుకు క్యాబ్లో వెళ్లాడు. ఆమె కుటుంబీకులు అతడిని చావబాదారు. చనిపోయాడనుకుని క్యాబ్ డ్రైవర్ రోడ్డు పక్కన పడేశాడు. గజేంద్ర తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు డ్రైవర్ను విచారించారు. తాము వెళ్లేసరికి గజేంద్ర శరీరం ముక్కలై ఉందని, దర్యాప్తు చేస్తున్నామని వారు తెలిపారు.
తెలంగాణ ఉద్యమ నాయకుడు, రాష్ట్ర తొలి CM, ప్రధాన ప్రతిపక్ష నేత KCR పేరుని ఆహ్వాన పత్రికలో చివర్లో పెట్టి రేవంత్ సర్కార్ తమ కుంచిత స్వభావాన్ని బయటపెట్టిందని BRS విమర్శించింది. మెదక్ జిల్లాలో నిర్వహించే స్వాతంత్ర్య దినోత్సవ ఆహ్వాన పత్రికలో MPలు, MLCల తర్వాత KCR పేరు పెట్టి ప్రోటోకాల్ను ఉల్లంఘించిందని పేర్కొంది. కాంగ్రెస్ విపరీత బుద్ధిని ప్రజలు గమనిస్తున్నారని, త్వరలోనే జవాబు చెబుతారంది.
కోల్కతాలో ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనపై ఎక్స్లో ప్రశ్నించిన జర్నలిస్టును TMC ఎంపీ మహువా మొయిత్రా బ్లాక్ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అనేక అంశాల్లో కేంద్ర ప్రభుత్వంపై విమర్శలతో విరుచుకుపడే మహువా బెంగాల్లో జరిగిన ఘటనపై ప్రశ్నించినందుకు తనను బ్లాక్ చేయడంపై జర్నలిస్ట్ అజిత్ అంజుమ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఒక్క ప్రశ్నను కూడా హ్యాండిల్ చేయలేరా? అంటూ నిలదీశారు.
TG: హైదరాబాద్లో కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. దీని ద్వారా 15వేల మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా 3.46 లక్షల మంది ఉద్యోగులు ఈ సంస్థలో పనిచేస్తుండగా అందులో 70శాతం భారత్లోనే పనిచేస్తున్నారని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు.
TG: మెట్రో స్టేషన్లలో పెయిడ్ పార్కింగ్పై L&T కీలక ప్రకటన చేసింది. నాగోల్ మెట్రో స్టేషన్లో ఈ నెల 25 నుంచి పెయిడ్ పార్కింగ్ అమలు చేయనున్నట్లు పేర్కొంది. ఇవాళ పైలట్ రన్గా నిర్వహించినట్లు తెలిపింది. సెప్టెంబర్ 1 నుంచి మియాపూర్ మెట్రో స్టేషన్లోనూ అమల్లోకి రానున్నట్లు వెల్లడించింది. మరోవైపు పెయిడ్ పార్కింగ్పై ప్రయాణికుల నుంచి <<13849865>>వ్యతిరేకత<<>> వ్యక్తమైన సంగతి తెలిసిందే.
Sorry, no posts matched your criteria.