news

News February 3, 2025

డబ్బుల్లేక సన్యాసం తీసుకున్నా: మాజీ హీరోయిన్

image

ఆర్థిక కష్టాలతో తాను సన్యాసం తీసుకున్నానని మాజీ హీరోయిన్ మమతా కులకర్ణి అన్నారు. ‘కిన్నెర అఖాడా మహామండలేశ్వర్ కోసం నేను రూ.కోట్లు ఇచ్చానంటున్నారు. నా వద్ద రూ.10cr కాదు కదా రూ.కోటి కూడా లేదు. ప్రభుత్వం నా బ్యాంకు ఖాతాలు సీజ్ చేసింది. చేతిలో రూపాయి లేకుండా జీవితాన్ని ఎలా నెట్టుకొస్తున్నానో నాకే తెలియదు’ అని కన్నీటి పర్యంతమయ్యారు. ఈమెను మహామండలేశ్వర్‌గా నియమించి వెంటనే బహిష్కరించిన విషయం తెలిసిందే.

News February 3, 2025

కోహ్లీని ఎలా ఔట్ చేయాలో బస్ డ్రైవర్ చెప్పాడు: సాంగ్వాన్

image

ఇటీవల రంజీ మ్యాచ్‌లో కోహ్లీని ఔట్ చేసిన H.సాంగ్వాన్ ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ‘ఢిల్లీ తరఫున పంత్, కోహ్లీ ఆడతారనుకున్నాం. ఆ తర్వాత కోహ్లీ మాత్రమే బరిలోకి దిగుతున్నారని, మ్యాచ్ టెలికాస్ట్ అవుతున్నట్లు తెలిసింది. ఆ సమయంలో మా బస్సు డ్రైవర్ విరాట్‌కు ఫోర్త్ లేదా ఫిఫ్త్ స్టంప్ బాల్ వేస్తే ఔట్ అవుతారన్నారు. కానీ నేను నా ప్లాన్ ప్రకారం బౌల్ చేశా’ అని చెప్పారు. ఈ మ్యాచ్‌లో విరాట్ 6పరుగులే చేశారు.

News February 3, 2025

లావణ్యది తప్పుడు ప్రచారం: మస్తాన్ సాయి

image

లావణ్య తనపై తప్పుడు ప్రచారం చేస్తోందని <<15351108>>మస్తాన్ సాయి<<>> పోలీసులతో చెప్పాడు. హార్డ్ డిస్కులో దొరికిన వీడియోలు తన భార్య, గర్ల్ ఫ్రెండ్‌కు సంబంధించినవని, 2017లో తీసుకున్నామని తెలిపాడు. హార్డ్ డిస్కులో లావణ్యకు సంబంధించిన యాంటీ ఎవిడెన్స్ ఉన్నాయని, వాటిని మాయం చేసేందుకు హార్డ్ డిస్క్ దొంగిలించిందన్నాడు. వ్యక్తిగత డిమాండ్ల కోసం తనను బ్లాక్‌మెయిల్ చేస్తోందని వెల్లడించాడు.

News February 3, 2025

70-90 పని గంటల ప్రతిపాదన పరిగణించట్లేదు: కేంద్రం

image

వారానికి 70-90 పని గంటల ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకోవడం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇటీవల కొందరు కార్పొరేట్ కంపెనీల అధినేతలు పని గంటలపై కామెంట్లు చేసిన నేపథ్యంలో లోక్‌సభలో పలువురు MPలు దీనిపై ప్రశ్నించారు. కేంద్ర సహాయ మంత్రి శోభ కరండ్లజే స్పందించి పైవిధంగా రాతపూర్వక వివరణ ఇచ్చారు. వారానికి 60గంటలకు మించి ఆఫీసుల్లో పని చేస్తే ఆరోగ్యం దెబ్బతింటుందని ఇటీవల ఆర్థిక సర్వే తెలిపింది.

News February 3, 2025

U19 WC టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్.. లిస్టులో నలుగురు భారత ప్లేయర్లు

image

U19 మహిళల WCలో సత్తా చాటిన 12 మంది ఆటగాళ్లతో ICC టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్‌ను ప్రకటించింది. ఇందులో భారత్ నుంచి త్రిషతో పాటు కమలిని, ఆయుషి శుక్లా, వైష్ణవిశర్మ చోటు దక్కించుకున్నారు.
జట్టు: త్రిష, బోథా(SA), పెర్రిన్(ENG), కమలిని, కావోయిహ్మ్ బ్రే(AUS), పూజా మహతో(NEP), కైలా రేనెకే(కెప్టెన్-SA), కేటీ జోన్స్(ENG), ఆయుషి శుక్లా, చమోడి ప్రబోద(SL), వైష్ణవి శర్మ, తాబిసెంగ్(SA).

News February 3, 2025

గ్రూప్-1 ఫలితాల వెల్లడికి లైన్ క్లియర్

image

TG: గ్రూప్-1 పరీక్ష ఫలితాల విడుదలకు లైన్ క్లియర్ అయింది. నియామకాలపై వివిధ రకాల అభ్యంతరాలతో పలువురు అభ్యర్థులు దాఖలు చేసిన రెండు పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో త్వరలోనే గ్రూప్-1 ఫలితాలు విడుదల కానున్నాయి.

News February 3, 2025

ఇది రాహుల్ అవివేకానికి నిదర్శనం: కిషన్ రెడ్డి

image

యూపీఏ ప్రభుత్వంలోని వైఫల్యాలను ఎన్డీఏ ప్రభుత్వానికి ఆపాదించడం రాహుల్ గాంధీ అవివేకానికి నిదర్శనమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో పదేళ్లలో 2.9 కోట్ల ఉద్యోగాల సృష్టి జరిగితే ఎన్డీఏ పాలనలో ఒక్క 2024లోనే 4.9 కోట్లు సృష్టించినట్లు ఆర్బీఐ నివేదిక పేర్కొందని Xలో తెలిపారు. వివిధ రంగాల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనతో పోలిస్తే NDA ప్రభుత్వంలోనే ఉపాధిలో వృద్ధి ఉందని వెల్లడించారు.

News February 3, 2025

వీటి పూర్తి పేర్లు మీకు తెలుసా?

image

నిత్యం ఏదోచోట మనం వినియోగించే వస్తువుల కంపెనీల ఫుల్‌ఫామ్స్ చాలా మందికి తెలియదు. అందులో కొన్నింటి గురించి తెలుసుకుందాం. TVS- తిరుక్కురుంగుడి వెంగారం సుందరం, SYSKA- శ్రీ యోగి సంత్ కృపా అనంత్, WIPRO- వెస్ట్రన్ ఇండియా పామ్ రిఫైన్డ్ ఆయిల్స్ లిమిటెడ్, HDFC- హౌసింగ్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్, PAYTM- పే థ్రూ మొబైల్, MRF- మద్రాస్ రబ్బర్ ఫ్యాక్టరీ. మీకు ఇంకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి.

News February 3, 2025

వైసీపీ ‘ఫీజు పోరు’ మార్చి 12కు వాయిదా

image

AP: విద్యార్థులకు వెంటనే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వాలని కోరుతూ, ఈనెల 5న తలపెట్టిన ‘ఫీజు పోరు’ కార్యక్రమాన్ని వైసీపీ మార్చి 12కి వాయిదా వేసింది. ఈ మేరకు Xలో ప్రకటన రిలీజ్ చేసింది. రాష్ట్రంలోని మెజారిటీ జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ కార్యక్రమానికి అనుమతి ఇవ్వాలని కోరినా, ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి స్పందన రాలేదని పేర్కొంది.

News February 3, 2025

పరీక్ష లేకుండానే లక్షన్నర జీతంతో ఉద్యోగాలు

image

NTPCలో 475 ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. బీటెక్‌లో 65శాతం పర్సెంటేజీ కలిగి ఉండాలి. ఎలాంటి రాత పరీక్ష లేకుండా గేట్ స్కోర్ ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. రిజర్వేషన్ బట్టి వయోపరిమితి ఉంది. అప్లికేషన్ ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.300. ఈ నెల 13 వరకు అప్లికేషన్లు స్వీకరిస్తారు. జీతం గరిష్ఠంగా రూ.1,40,000. <>వెబ్‌సైట్<<>>: careers.ntpc.co.in/recruitment/