news

News August 14, 2024

బీసీసీఐ-బైజూ సెటిల్‌మెంట్‌పై సుప్రీం కోర్టు స్టే

image

బైజూస్‌కు, బీసీసీఐకి మధ్య రూ.158.9 కోట్లకు సెటిల్‌మెంట్ జరిగిన సంగతి తెలిసిందే. సెటిల్‌మెంట్‌ను జాతీయ కంపెనీ లా అప్పిలేట్ ట్రైబ్యునల్(NCLAT) ఆమోదించడాన్ని సవాలు చేస్తూ అమెరికాకు చెందిన గ్లాస్ ట్రస్ట్ కంపెనీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. విచారణ అనంతరం NCLAT నిర్ణయంపై సుప్రీం కోర్టు స్టే విధించింది. తదుపరి నోటీసులిచ్చేవరకూ సెటిల్‌మెంట్ డబ్బును బ్యాంకు ప్రత్యేక ఖాతాలో ఉంచాలని స్పష్టం చేసింది.

News August 14, 2024

LA ఒలింపిక్స్‌లో చేరే కొత్త గేమ్స్ ఇవే!

image

క్రికెట్ అభిమానులు లాస్ ఏంజెలిస్‌లో జరిగే 2028 ఒలింపిక్స్ గేమ్స్ కోసం ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే క్రికెట్ ఆ ఒలింపిక్స్‌లో భాగం కానుంది. బేస్‌బాల్, సాఫ్ట్‌బాల్, క్రికెట్, స్క్వాష్, లాక్రోస్, ఫ్లాగ్ ఫుట్‌బాల్ వంటి మొత్తం ఆరు కొత్త గేమ్స్ LA ఒలింపిక్స్‌లో చేరనున్నాయి. మరి టీ20 వరల్డ్ కప్ గెలిచిన టీమ్ఇండియా 2028లో ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధిస్తుందా? కామెంట్ చేయండి.

News August 14, 2024

SALUTE: యువత కోసం ఫ్రీ లైబ్రరీ

image

ప్రతీది వ్యాపారమైన ఈరోజుల్లోనూ కొందరు సమాజం కోసం పరితపిస్తున్నారు. కేరళకు చెందిన ప్రతాపన్ కూడా ఇదే కోవలోకి వస్తారు. యువతలో విజ్ఞానం పెంపొందించాలన్న ధ్యేయంతో 2012లో పుతియాకావులోని తన ఇంట్లో లైబ్రరీ స్థాపించారు. అందులో ప్రస్తుతం 3వేల పుస్తకాలున్నాయి. అందులోకి ఎవరైనా వెళ్లి ఫ్రీగా పుస్తకాలు చదువుకోవచ్చు. అయితే పుస్తకాలు తిరిగిచ్చేటప్పుడు వాటి రివ్యూలు ఇవ్వాలని ఆయన వారికి చెబుతున్నారు. >SALUTE

News August 14, 2024

BSNL 4G వచ్చేసింది!

image

పెరిగిన టారిఫ్ ధరలతో సతమతమవుతున్న టెలికం యూజర్లకు BSNL అదిరిపోయే న్యూస్ చెప్పింది. మొబైల్‌లో BSNL సిమ్‌కు 4G నెట్‌వర్క్ వచ్చినట్లు తెలియజేస్తూ ఓ ఫొటోను టెలికమ్యూనికేషన్స్ శాఖ ట్వీట్ చేసింది. అతి త్వరలోనే దగ్గరలోని ఔట్‌లెట్లలో వినియోగదారులు 4G సిమ్ పొందొచ్చని తెలిపింది. ప్రస్తుతం టవర్స్ ఏర్పాటు చేసే ప్రక్రియ జరుగుతున్నందున మొదట కొన్ని చోట్ల 4G నెట్‌వర్క్ వచ్చే అవకాశం ఉంది.

News August 14, 2024

లేడీ డాక్టర్ హత్యాచార ఘటనపై స్పందించిన రాహుల్

image

కోల్‌కతాలోని RG కర్ హాస్పిటల్‌లో ట్రైనీ లేడీ డాక్టర్‌పై రేప్&మర్డర్ ఘటనపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. స్థానిక పాలకుల తీరుపై ఆయన సందేహాలు వ్యక్తం చేశారు. నిందితుడిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోందని అనుమానం వెలిబుచ్చారు. మెడికల్ కాలేజీలో డాక్టర్లకే భద్రత లేకపోతే తల్లిదండ్రులు తమ కూతుళ్లను బయటికి పంపిస్తే ఎలా అని ఆలోచించేలా ఈ ఘటన చేసిందని అన్నారు.

News August 14, 2024

రేపు ఇంటింటా జాతీయ జెండా ఎగరవేయాలి: CM

image

AP: హర్ ఘర్ తిరంగాలో భాగంగా రేపు ఇంటింటా జాతీయ జెండా ఎగరవేయాలని సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. ‘రేపు స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తున్నాం. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం. ప్రజలకు ఉచిత ఇసుకను అందిస్తున్నాం. 16,347 పోస్టులతో డీఎస్సీ నిర్వహణకు ముందడుగు వేశాం’ అని వివరించారు.

News August 14, 2024

గ్రేట్.. తెలంగాణ నుంచి ఒక్కరే!

image

విధి నిర్వహణలో ధైర్యసాహసాలు కనబరిచిన తెలంగాణకు చెందిన హెడ్ కానిస్టేబుల్ యాదయ్య ‘గ్యాలంట్రీ ప్రెసిడెంట్ మెడల్’కు ఎంపికయ్యారు. 2022లో కేసు విచారణలో చైన్ స్నాచర్లు యాదయ్యపై కత్తితో దాడి చేశారు. కత్తిపోట్లకు గురైనా వారిని నిలువరించి పట్టుకునేందుకు ఆయన ప్రయత్నించారు. రాష్ట్రపతి శౌర్య పురస్కారానికి ఎంపికైన ఏకైక పోలీస్ అధికారిగా నిలిచిన యాదయ్యని డీజీపీ జితేందర్ సన్మానించారు.

News August 14, 2024

తీర్పు వచ్చేవరకు భారత్‌ రాకూడదని వినేశ్ నిర్ణయం?

image

ఒలింపిక్ మెడల్ విషయంలో రెజ్లర్ వినేశ్ ఫొగట్ ఆర్బిట్రేషన్ కోర్టు(CAS)ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ నెల 13నే తీర్పు రావాల్సి ఉన్నప్పటికీ న్యాయస్థానం 16కు వాయిదా వేసింది. తుది తీర్పు వచ్చేవరకు ఫొగట్ భారత్‌కు రాకూడదని నిర్ణయించుకున్నట్లు ఆమె సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఒలింపిక్స్‌ కేసుల్ని పరిష్కరించేందుకు గాను పారిస్‌లోనే CAS ఓ అడ్ హక్ డివిజన్‌ను ఏర్పాటు చేసింది. అందులోనే వినేశ్ కేసు ఉంది.

News August 14, 2024

శ్రీశైలం జలాశయం పరిసరాల్లో చేపల వేట నిషేధం

image

AP: శ్రీశైలం జలాశయం పరిసరాల్లో చేపల వేటపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. జులై, ఆగస్టులో చేపల సహజ సంతానోత్పత్తి కాలమని, ఆ సమయంలో జలాశయం బ్యాక్ వాటర్స్‌లో వేటకు వెళ్లొద్దని ఆదేశించింది. కాగా రెండు రోజుల క్రితం ప్రాజెక్టు నుంచి నీటి విడుదల ఆగిపోవడంతో మత్స్యకారులు చేపలు వేటకు దిగారు. ఈ నేపథ్యంలో అధికారులు ఉత్తర్వులు ఇచ్చారు.

News August 14, 2024

మీ ఫోన్ ఎప్పుడు ఎక్స్‌పైర్ అవుతుందో తెలుసా?

image

ప్రతి వస్తువుకి ఉన్నట్లే స్మార్ట్‌ఫోన్లకూ ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది. అయితే దాన్ని డైరెక్ట్‌గా కంపెనీలు చెప్పవు. మీ ఫోన్ బాక్స్‌పై ఉండే OS అప్డేట్స్, సెక్యూరిటీ అప్డేట్స్ ముగిసే తేదీనే ఎక్స్‌పైరీ డేట్‌గా పరిగణించవచ్చు. ఇది కంపెనీలను బట్టి మారుతుంది. సాధారణంగా 2ఏళ్లు ఉంటుంది. యాపిల్, సామ్‌సంగ్, వన్‌ప్లస్ 7ఏళ్లు అప్డేట్స్ ఇస్తాయి. అప్డేట్స్ రావడం ఆగితే ఆ తర్వాత వచ్చే యాప్స్ మీ ఫోన్లలో పని చేయకపోవచ్చు.

error: Content is protected !!