India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రేపు థియేటర్లలో నాలుగు సినిమాలు రిలీజ్ కానున్నాయి. వీటిలో మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన ‘మిస్టర్ బచ్చన్’, రామ్ పోతినేని ‘డబుల్ ఇస్మార్ట్’, కోలీవుడ్ హీరో విక్రమ్ ‘తంగలాన్’, ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ ‘ఆయ్’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నాయి. ఈ నాలుగు సినిమాలపై భారీ అంచనాలే నెలకొన్నాయి. మరి మీరు ఏ సినిమాకు వెళ్తున్నారో కామెంట్ చేయండి.
TG: మూడో విడత కింద రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు రుణమాఫీని రేపు ఖమ్మం జిల్లా వైరాలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఆ వెంటనే రైతుల ఖాతాల్లో నిధులు జమ కానున్నాయి. 14.45 లక్షల మందికి రుణమాఫీ అవుతుందని అంచనా. కాగా దక్షిణ కొరియా నుంచి రేవంత్ ఇవాళ హైదరాబాద్ చేరుకుంటారు. రేపు గోల్కొండ కోటలో జరిగే స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం ఆయన ఖమ్మంకు బయల్దేరతారు.
ఇజ్రాయెల్పై ఇరాన్, హెజ్బొల్లా, హమాస్లు ముప్పేట దాడి చేయనున్నట్లు ఆ దేశాన్ని అమెరికా అప్రమత్తం చేసింది. ఈ వారంలోనే దాడులు జరగొచ్చని వైట్ హౌస్ హెచ్చరించింది. కాగా రేపు ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ చర్చలు జరగనున్నాయి. దీంతో యూఎస్, యూకే, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ నేతలు ఇరాన్ను బుజ్జగిస్తున్నారు. చర్చల వేళ దాడులు జరపొద్దని ఇరాన్ కొత్త అధ్యక్షుడితో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు.
పారిస్ ఒలింపిక్స్లో పాల్గొన్న షట్లర్ అశ్విని పొన్నప్ప కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖపై విమర్శలు చేశారు. ‘నాకు రూ.4.50 లక్షలు చెల్లించి.. శిక్షణ, టోర్నీల కోసం రూ.1.48కోట్లు ఖర్చు చేసినట్లు సాయ్ ప్రకటించడం షాక్కు గురిచేసింది. ఇందులో వాస్తవం లేదు. నాకు డబ్బులు ఇచ్చినట్లు చెప్పడం సరికాదు. కనీసం ప్రత్యేక కోచ్ని కూడా నియమించలేదు. ట్రైనర్కు కూడా నేనే డబ్బులు ఇస్తున్నా’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తతల వేళ ఇజ్రాయెల్కు 20 బిలియన్ డాలర్ల విలువైన ఆయుధాలను అమెరికా విక్రయించింది. ఇందులో 33 వేల ట్యాంక్ క్యాట్రిడ్జ్లు, 50 వేల మోర్టార్ క్యాట్రిడ్జ్లు, 50 ఎఫ్-15 ఫైటర్ జెట్స్ ఉన్నాయి. ఈ ఆయుధాలను 2029 నాటికి ఇజ్రాయెల్కు అందించనుంది. కాగా వీటి పంపిణీని ఆపాలని మానవతావాదులు ఒత్తిడి చేస్తున్నా అమెరికా వెనక్కి తగ్గకపోవడం గమనార్హం.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘విశ్వంభర’ మూవీ టీజర్పై ఓ క్రేజీ రూమర్ వైరల్ అవుతోంది. ఈ నెల 22న మెగాస్టార్ పుట్టినరోజున ఈ సినిమా టీజర్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే టీజర్ ఎడిటింగ్, మిక్సింగ్ పనులు ప్రారంభించినట్లు సమాచారం. దీనిపై చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. వశిష్ఠ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో త్రిష హీరోయిన్గా నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
న్యూజిలాండ్ ప్లేయర్ జార్జ్ వర్కర్ క్రికెట్కు గుడ్ బై చెప్పారు. అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించారు. వర్కర్ కివీస్ తరఫున 10 వన్డేలు ఆడి 272, 2 టీ20ల్లో 90 పరుగులు చేశారు. 2015-18 మధ్య ఆయన న్యూజిలాండ్కు ప్రాతినిధ్యం వహించారు. కాగా ఆయన ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16,601 పరుగులు సాధించారు. ఇందులో 30 శతకాలు ఉన్నాయి.
ప్రతి ఒక్కరూ ఇంటిపై జాతీయ జెండాను ఏర్పాటుచేసే హక్కు ఉంది. కానీ, వాహనాలపై జెండాను పెట్టే హక్కు కొందరికే ఉంది. <
క్రికెటర్ హార్దిక్ పాండ్య, నటాషా మ్యూచువల్ అండర్స్టాండింగ్తో విడిపోయిన విషయం తెలిసిందే. అయితే విడాకుల తర్వాత చీటర్, టాక్సిక్ రిలేషన్షిప్కు సంబంధించిన పోస్టులకు నటాషా లైక్స్ కొడుతున్నారు. ‘వారు క్రియేట్ చేసిన ప్రాబ్లమ్లో వాళ్లే బాధితులుగా నటిస్తుంటారు’ అని ఉన్న ఎమోషనల్ అబ్యూజ్ రీల్ను ఆమె లైక్ చేశారు. దీంతో వీరి మధ్య తలెత్తిన మనస్పర్ధలతోనే విడిపోయి ఉంటారని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
స్వాతంత్ర్య దినోత్సవం రెండు రోజుల్లో జరుపుకోనున్న సందర్భంగా ఫ్రీడమ్ ఫైటర్ తారా రాణి శ్రీవాస్తవ గురించి తెలుసుకుందాం. మహాత్మా గాంధీ చేపట్టిన ‘క్విట్ ఇండియా’ మూమెంట్లో భాగంగా ఆమె 1942లో భర్తతో కలిసి కవాతు నిర్వహించారు. ఈక్రమంలో ఆమె భర్తను పోలీసులు కాల్చి చంపారు. అయినా, వెనక్కి తగ్గకుండా జెండా చేతపట్టి ముందుకు సాగారు. ఐదేళ్లపాటు స్వాతంత్ర్య ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. జోహార్ తారా రాణి!
Sorry, no posts matched your criteria.