news

News February 7, 2026

శివాభిషేకం: ఏ అభిషేకంతో ఏ ఫలితం?

image

☛ ఆవు పాలు: సర్వ సౌభాగ్యాలు ☛ ఆవు పెరుగు: ఆరోగ్యం, బలం ☛ ఆవు నెయ్యి: ఐశ్వర్యాభివృద్ధి ☛ పంచదార: దుఃఖనాశనం, ఆకర్షణ ☛ తేనె: తేజో వృద్ధి ☛ భస్మజలం: మహాపాప హరణం ☛ సుగంధోదకం: పుత్రలాభం ☛ పుష్పోదకం: భూలాభం ☛ బిల్వజలం: భోగభాగ్యాలు ☛ నువ్వుల నూనె: అపమృత్యు భయ హరణం ☛ రుద్రాక్షోదకం: మహా ఐశ్వర్యం ☛ సువర్ణజలం: దరిద్ర నాశనం ☛ అన్నాభిషేకం: సుఖ జీవనం ☛ ద్రాక్షరసం: సకల కార్యాభివృద్ధి.

News February 7, 2026

మహిళల్లో నలభై ఏళ్ల తర్వాత వచ్చే వ్యాధులివే..

image

నలభై ఏళ్ల తర్వాత మహిళల్లో అనేక వ్యాధుల ముప్పు ఉందని నిపుణులు చెబుతున్నారు. పని ఒత్తిడి, ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయడం వల్ల పలు శారీరక, మానసిక వ్యాధులొస్తాయని చెబుతున్నారు. ముఖ్యంగా బోలు ఎముకల వ్యాధి, గుండె జబ్బులు, రొమ్ము క్యాన్సర్ దాడి చేస్తాయంటున్నారు. శరీరంలో హార్మోన్ల మార్పుల కారణంగా ఈ సమస్యలు వస్తాయని చెబుతున్నారు. కాబట్టి మహిళలు 40 తర్వాత తరచూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు.

News February 7, 2026

NIT వరంగల్‌లో 39 పోస్టులు.. దరఖాస్తు గడువు పెంపు

image

<>NIT<<>> వరంగల్‌లో 39 పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ కాగా.. ఫిబ్రవరి 28 వరకు పొడిగించారు. పోస్టును బట్టి డిగ్రీ, పీజీ, బీఈ/బీటెక్, డిప్లొమా, ఎంసీఏ, ఎంఎస్సీ ఫిజిక్స్, ఇంటర్, టెన్త్, ఐటీఐ అర్హతగల వారు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.1500, SC, ST, PwBDలకు రూ.1000. స్క్రీనింగ్/స్కిల్/ రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://nitw.ac.in/

News February 7, 2026

నలభైల్లో ఇలా సులువుగా బరువు తగ్గండి

image

40ఏళ్ల తర్వాత చాలామంది మహిళల్లో హార్మోన్లమార్పులు, జీవక్రియలు నెమ్మదించి బరువు పెరుగుతారు. ఇలాకాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. తీసుకునే ఆహారంలో ప్రొటీన్లు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. వయసు పెరుగుతున్నా వర్కవుట్‌ చేయడం మానకూడదు. సుఖ నిద్ర వల్ల ఒత్తిడి, ఆందోళనలు తగ్గడంతో పాటు హార్మోన్ల సమతుల్యత పెరుగుతుంది. వీటితోపాటు తరచూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు.

News February 7, 2026

చిన్నపిల్లలకు సోషల్ మీడియా బంద్.. త్వరలోనే నిర్ణయం!

image

చిన్న పిల్లలను SM నుంచి దూరంగా ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. వయసు ఆధారంగా ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌ల వినియోగానికి అనుమతులపై సీరియస్‌గా ఆలోచిస్తున్నట్లు కేంద్ర ఐటీ కార్యదర్శి ఎస్‌ కృష్ణన్‌ తెలిపారు. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఇటీవల ఆర్థిక సర్వే చేసిన సూచనలన్నింటినీ సమగ్రంగా పరిశీలిస్తున్నామని చెప్పారు. ఢిల్లీలో జరిగిన ICANN సదస్సులో ఆయన మాట్లాడారు.

News February 7, 2026

ఇండియా-US డీల్.. చైనాకు లాభం!

image

ఇండియా, అమెరికా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందంతో పరోక్షంగా చైనా లాభపడుతోంది. US ఆంక్షల నేపథ్యంలో రష్యా క్రూడాయిల్ కొనుగోళ్లను భారత్ తగ్గించింది. దీంతో చైనా వైపు రష్యా మొగ్గుచూపింది. ఒక్కో బ్యారెల్‌పై 12 డాలర్ల డిస్కౌంట్‌ను ఆఫర్ చేసింది. ఇప్పటికే రష్యా చమురులో చైనా 47% వరకు కొంటుండటం గమనార్హం. మరోవైపు 2024 డిసెంబర్‌తో పోలిస్తే గతేడాది డిసెంబర్‌లో ఇండియాకు రష్యన్ ఆయిల్ దిగుమతులు 27.5% తగ్గిపోయాయి.

News February 7, 2026

IND-US ట్రేడ్ అగ్రిమెంట్‌తో గ్రామీణ జీవనోపాధి: కేంద్ర మంత్రి

image

IND-US ఇంటరిమ్ వాణిజ్య ఒప్పందంతో వికసిత్ భారత్ వైపు కీలక అడుగుపడిందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ‘గ్రామీణ ప్రజల జీవనోపాధికి భరోసా లభించింది. మొక్కజొన్న, సోయా, పాలు, పౌల్ట్రీ, ఇథనాల్, టొబాకో, పలురకాల కూరగాయలు, మాంసం రంగాలు సురక్షితంగా ఉన్నాయి. ప్రజా సంక్షేమం, వ్యాపారాభివృద్ధితోపాటు ఇరుదేశాల మధ్య ఆర్థిక సహకారాన్ని ఈ అగ్రిమెంట్ బలోపేతం చేస్తుంది’ అని SMలో పేర్కొన్నారు.

News February 7, 2026

ప్రైవేటు స్కూళ్లలో ఉచిత ప్రవేశాలకు నోటిఫికేషన్

image

AP: విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేటు స్కూళ్లలో పేద, వెనుకబడిన వర్గాల పిల్లలకు ఒకటో తరగతిలో 25% సీట్లు ఫ్రీగా కేటాయించేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైనవారు https://cse.ap.gov.in/లో FEB 20 నుంచి మార్చి 10 వరకు అప్లై చేసుకోవాలి. లాటరీ విధానంలో మార్చి 25, ఏప్రిల్ 12న విద్యార్థులకు సీట్లు కేటాయిస్తారు. అనాథలు, దివ్యాంగులు, HIV బాధితులు, SC, ST, BCలకు రిజర్వేషన్ల ప్రకారం సీట్లు కేటాయిస్తారు.

News February 7, 2026

డ్రాగన్ ఫ్రూట్ సాగుకు ‘ఉపాధి హామీ’.. తగ్గిన పెట్టుబడి, పెరిగిన ఆదాయం

image

సేంద్రియ పద్ధతిలో డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తూ మంచి ఆదాయం పొందుతున్నారు APలోని అనకాపల్లి జిల్లాలో పలువురు రైతులు. ఈ పంటకు ఉపాధి హామీ పథకం కింద నిధుల సాయంతో వీరి పెట్టుబడి ఖర్చు చాలా వరకు తగ్గుతోంది. నిపుణుల సూచనతో పంట నాటి తొలి ఏడాది నుంచే రూ.లక్షల్లో ఆదాయం పొందుతున్నారు. ఉపాధి హామీ కింద ఈ పంటకు ఎంత సాయం వస్తుంది? ఇతర కీలక సమాచారానికి <<-se_10015>>పాడిపంట క్లిక్<<>> చేయండి.

News February 7, 2026

IMPS ట్రాన్సాక్షన్లపై SBI ఛార్జీలు

image

IMPS ట్రాన్సాక్షన్లపై సర్వీస్ ఛార్జీల వసూలుకు SBI సిద్ధమైంది. రూ.25వేల-రూ.లక్ష వరకు రూ.2+GST, రూ.లక్ష-2లక్షల వరకు రూ.6+GST, రూ.2లక్షల-5లక్షల వరకు రూ.6+GST వసూలు చేయనుంది. అయితే రూ.25వేల కంటే తక్కువ నగదు బదిలీకి ఎటువంటి ఛార్జీ చెల్లించనవసరం లేదు. ఇంటర్నెట్, మొబైల్ బ్యాంకింగ్, యోనో యాప్ ద్వారా చేసే ట్రాన్సాక్షన్లపై ఛార్జీలు వర్తిస్తాయి. FEB 15 నుంచి ఈ ఛార్జీలు అమలులోకి రానున్నాయి.