India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తన అమ్మతనం అనుభవాలను ఓ పాడ్కాస్ట్లో పంచుకున్నారు. ‘ఇజాన్ పుట్టిన తర్వాత 3 నెలలే పాలిచ్చా. కొడుక్కి పాలిచ్చే క్రమంలో శారీరకంగా, మానసికంగా కుంగిపోయా. ఆ సమయంలోనే ఆటపరంగా, ఇతర పనులు, నిద్రలేమి సమస్యలు ఎదురయ్యాయి. అప్పుడు నాకు బ్రెస్ట్ ఫీడింగ్ కష్టమనిపించింది. ఆ తర్వాత నా శరీరం ఆటకు సహకరించకపోవడంతో రిటైర్మెంట్ పలికా’ అంటూ ఆమె చెప్పుకొచ్చారు.
AP: విడదల రజినిపై ముందస్తు చర్యలు తీసుకోవద్దని, ఇదే సమయంలో 41A నోటీసులిచ్చి విచారించాలని ACBని హైకోర్టు ఆదేశించింది. విచారణకు సహకరించాలని, కేసుపై బహిరంగ వ్యాఖ్యలు చేయొద్దని రజినికి సూచించింది. శ్రీలక్ష్మీబాలాజీ స్టోన్క్రషర్ యజమానిని బెదిరించి వసూళ్లకు పాల్పడ్డారంటూ రజినిపై కేసు నమోదు కాగా, ఆమె A1గా ఉన్నారు. ఇదే కేసులో అరెస్టైన ఆమె మరిది గోపి(A3) ముందస్తు బెయిల్ పిటిషన్ డిస్పోజ్ అయింది.
AP: అప్పు చేయకుండా సంపద సృష్టిస్తామని అప్పట్లో CM చంద్రబాబు చెప్పారని, కానీ ఇప్పుడు రాష్ట్రాన్ని అప్పులమయంగా మారుస్తున్నారని YCP నేత పేర్ని నాని విమర్శించారు. కూటమి ప్రభుత్వానికి బిల్డప్ ఎక్కువ.. బిజినెస్ తక్కువ అని ఆయన ఎద్దేవా చేశారు. ‘రాష్ట్రంలో ఒక్క పథకం కూడా అమలు చేయలేదు. చంద్రబాబు, పవన్ ఎక్కడికి వెళ్లినా విమానాల్లోనే. ప్రజల సొమ్ముతో విలాసాలు చేస్తారా? ఇంత బరితెగింపా?’ అని ఆయన ఫైర్ అయ్యారు.
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీలకు నోటీసులు ఇవ్వాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీ హైకోర్టును కోరింది. అందుకు కోర్టు నిరాకరించింది. నూతన న్యాయ చట్ట నిబంధనల ప్రకారం నిందితులను విచారించకుండా ఛార్జిషీట్ తీసుకోలేమని పేర్కొంది. కాగా, మనీలాండరింగ్ కేసు ఛార్జిషీట్లో కాంగ్రెస్ అగ్రనేతలు శామ్ పిట్రోడా, సుమన్ దూబేలను కూడా ఈడీ నిందితులుగా చేర్చిన విషయం తెలిసిందే.
శరీరం నుంచి సువాసన వచ్చేందుకు చాలా మంది పర్ఫ్యూమ్ వాడుతుంటారు. దీనిని ఎక్కువగా వాడితే అనారోగ్యాన్ని కొనితెచ్చుకోవడమేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పర్ఫ్యూమ్స్లో ఉపయోగించే థాలేట్స్, సింథటిక్ సువాసనలు శరీరానికి హాని కలిగిస్తాయి. వీటి వల్ల చర్మంపై అలర్జీ, దద్దుర్లు వస్తాయి. పదేపదే వీటిని ఉపయోగిస్తే రోగనిరోధక శక్తి క్షీణిస్తుంది. క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
ఢిల్లీ కొత్త మేయర్గా బీజేపీ అభ్యర్థి రాజా ఇక్బాల్ సింగ్ ఎన్నికయ్యారు. మొత్తం 142 ఓట్లకుగానూ 133 ఓట్లు సాధించి ఇక్బాల్ విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి మన్దీప్ సింగ్కు 8 ఓట్లు వచ్చాయి. ఒక ఓటు చెల్లలేదు. దీంతో ఇక్బాల్ మేయర్గా ఎన్నికైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకటించారు.
పహల్గామ్ ఉగ్రదాడి సమయంలో అక్కడ సైనికులు ఎందుకు లేరు? అని ప్రతిపక్షాల ప్రశ్నలకు కేంద్రం సమాధానమిచ్చింది. ఏటా బైసరన్ ప్రాంతం అమర్నాథ్ యాత్రతో పాటే టూరిస్టుల కోసం ఓపెన్ అవుతుందని చెప్పింది. ఆ సమయంలో సైనికుల పహారా ఉంటుందని తెలిపింది. కానీ, ప్రస్తుతం APR 20 నుంచే టూరిస్ట్ ఆపరేటర్లు పర్యాటకులను తీసుకొచ్చారని పేర్కొంది. ఆ విషయాన్ని స్థానిక అధికారులు భద్రతా బలగాలకు చెప్పకపోవడమే కారణమని వివరించింది.
PAKతో ఉద్రిక్తతల నడుమ ఆ దేశస్థులంతా ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని భారత ప్రభుత్వం ఆదేశించింది. అయితే అక్రమంగా దేశంలోకి వచ్చి భారత పౌరుడిని పెళ్లి చేసుకున్న పాకిస్థానీ సీమా హైదర్ దేశం వీడే అవసరం లేదని ఆమె లాయర్ శివ సింగ్ వెల్లడించారు. గ్రేటర్ నోయిడా వాసి సచిన్ను ఆమె పెళ్లి చేసుకుందని, ఇటీవల కూతురుకు జన్మనిచ్చిందని తెలిపారు. ఆమె పౌరసత్వం భర్తతో ముడిపడి ఉందని, కేంద్రం ఆదేశాలు వర్తించవని పేర్కొన్నారు.
కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ‘క’ మూవీ దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్(DPIFF)కు నామినేట్ అయింది. ఢిల్లీలో ఈ నెలాఖరున జరిగే అవార్డుల ప్రదానోత్సవంలో ఉత్తమ చిత్రాన్ని ప్రకటించనున్నారు. కాగా సుజీత్, సందీప్ తెరకెక్కించిన ఈ మూవీ గతేడాది అక్టోబర్లో విడుదలైంది. చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ వద్ద రూ.55 కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టింది. నయన్ సారిక, తన్వీరామ్లు హీరోయిన్లుగా నటించారు.
తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్ట వద్ద యుద్ధ వాతావరణం నెలకొంది. దాదాపు 10వేల మందితో భద్రత బలగాలు మావోయిస్టుల కోసం గుట్ట చుట్టూ వేట కొనసాగిస్తున్నాయి. మావో అగ్ర నేతలు నక్కి ఉన్నారన్న సమాచారంతో కూంబింగ్ చేపట్టారు. 3 రోజులుగా ఆపరేషన్ కగార్ కొనసాగుతుండటంతో కొందరు జవాన్లకు వడదెబ్బ తగలడంతో చికిత్స అందిస్తున్నారు. మరోవైపు తాము చర్చలకు సిద్ధమని మావోలు ప్రకటించినట్లు వార్తలు వస్తున్నాయి.
Sorry, no posts matched your criteria.