India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అమెరికాలో విదేశీ వర్కర్లను నియమించుకునే కంపెనీలపై 25 శాతం అదనంగా పన్నులు విధించాలని ట్రంప్ సర్కార్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ పన్నులు ఈ ఏడాది డిసెంబర్ 31 తర్వాత అమలు చేయాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అమెరికన్లకే ఉద్యోగాలు దక్కాలనే ఉద్దేశంతో ఈ విధానం తీసుకొస్తున్నట్లు సమాచారం.
యూఎస్ ఓపెన్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫ్యామిలీ సందడి చేసింది. ఈ ఈవెంట్కు ట్రంప్తో పాటు ఇవాంకా భర్త జారెడ్ కుష్నర్, వారి కుమార్తె అరబెల్లా రోజ్ కుష్నర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇంటర్నేషనల్ మీడియా కళ్లన్నీ 13 ఏళ్ల అరబెల్లానే ఫోకస్ చేయడంతో ఆమె హైలైట్ అయ్యారు. తన తాత ట్రంప్తో ముచ్చటిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
AP: ఉపరాష్ట్రపతి ఓటింగ్ ప్రక్రియపై మంత్రి నారా లోకేశ్ టీడీపీ ఎంపీలకు పలు సూచనలు చేశారు. రేపు వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక నేపథ్యంలో ఆయన ఢిల్లీకి వెళ్లారు. అక్కడ టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పాల్గొన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికపై చర్చించారు. కాగా టీడీపీకి లోక్సభలో 16, రాజ్యసభలో ఇద్దరు ఎంపీల బలం ఉంది.
AP: సీఎం చంద్రబాబు ప్రతిపాదన మేరకు ఇకపై ప్రతి రోజూ తిరుపతి-షిర్డీ మధ్య రైలు నడిపేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. 07637/07638 నంబర్ రైలు రేణిగుంట, కడప, ధర్మవరం, రాయచూర్, షోలాపూర్, దౌండ్ మీదుగా ప్రయాణిస్తుంది. బ్రహ్మోత్సవాలు, పండుగల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఈ రైలును రెగ్యులర్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఈ రైలు టెంపరరీ సర్వీస్గా కొనసాగింది.
TG: ఉపరాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో సీఎం రేవంత్ ఢిల్లీకి వెళ్లారు. రేపు ఉ.10 గం. నుంచి సా.5 గం. వరకు ఓటింగ్ జరగనుంది. ఆ తర్వాత అధికారులు ఫలితాలు వెల్లడించనున్నారు. అటు రేవంత్ రేపు పలువురు కేంద్రమంత్రులతో భేటీ అయ్యే అవకాశం ఉంది. రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులు, పెండింగ్ నిధులపై వినతిపత్రాలు ఇస్తారని తెలుస్తోంది. యూరియా కొరత, ఇటీవల భారీ వర్షాలకు జరిగిన నష్టాన్ని వారికి వివరించనున్నారు.
ఉద్యోగులు ఫిట్గా ఉండేందుకు చైనాలోని Arashi Vision అనే కంపెనీ వెరైటీ విధానానికి శ్రీకారం చుట్టింది. బరువు తగ్గితే మొత్తం 1 మిలియన్ యువాన్లు (రూ.1.23 కోట్లు) రివార్డుల రూపంలో ఇస్తామని ప్రకటించింది. 500 గ్రాములు తగ్గితే రూ.6,181 ఇస్తామని తెలిపింది. ఓ ఉద్యోగి 3 నెలల్లో 20 కేజీలు తగ్గి రూ.2.46 లక్షలు గెలుచుకున్నాడు. ఈ పోటీలో పాల్గొన్న ఉద్యోగులు తిరిగి బరువు పెరిగితే 500 గ్రా.కు రూ.9,867 చెల్లించాలి.
జమ్మూకశ్మీర్లోని కుల్గాంలో భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు సైనికులు వీరమరణం పొందారు. ఆపరేషన్ గడర్లో ఇద్దరు ఉగ్రవాదులను అంతమొందించినట్లు అధికారులు వెల్లడించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సైనికులకు సంతాపం తెలిపారు. ఉగ్రవాదుల ఏరివేతకు గాలింపు కొనసాగుతోందని వెల్లడించారు.
TG: ప్రేయసి మరణవార్తను తట్టుకోలేక ప్రియుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మంచిర్యాల(D)లోని పాత కొమ్ముగూడెంలో జరిగింది. ఇంజినీరింగ్ విద్యార్థిని హితవర్షిణి ప్రేమలో విఫలమై నిన్న SECBADలో రైలు కిందపడి సూసైడ్ చేసుకుంది. ‘నా బంగారు తల్లి లేని లోకంలో బతకలేను. మనల్ని ఎవ్వరూ విడదీయలేరు. వచ్చే జన్మలో పెళ్లి చేసుకుంటా’ అంటూ లెటర్ రాసి వినయ్ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ గాయం నుంచి కోలుకున్నట్లు తెలుస్తోంది. వెస్టిండీస్తో సిరీస్కు ఆయన అందుబాటులోకి రావడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. గాయం నుంచి మరింత వేగంగా కోలుకునేందుకు పంత్ వైద్య నిపుణులను సంప్రదిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా ఇంగ్లండ్తో నాలుగో టెస్టులో క్రిస్ వోక్స్ విసిరిన బంతి పంత్ కాలికి బలంగా తగిలింది. దీంతో ఆయన విలవిల్లాడుతూ వెంటనే మైదానాన్ని వీడారు.
టిక్ టాక్ యాప్పై నిషేధం ఎత్తివేసే ఆలోచన లేదని కేంద్ర ఐటీశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఆ యాప్ను మళ్లీ పునరుద్ధరించే ప్రతిపాదనలు రాలేదని స్పష్టం చేశారు. దీనిపై ప్రభుత్వంలో కూడా ఎలాంటి చర్చలు జరగలేదని చెప్పారు. కాగా భారత్-చైనా మధ్య సంబంధాలు మెరుగుపడుతుండటంతో టిక్ టాక్ యాప్ మళ్లీ ఇండియాలోకి వస్తుందంటూ ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. దీనిపై మంత్రి ఈ విధంగా స్పందించారు.
Sorry, no posts matched your criteria.