India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న దేవర మూవీ గురించి సినిమాటోగ్రాఫర్ రత్నవేలు క్రేజీ అప్డేట్ ఇచ్చారు. చిత్రంలో దుమ్మురేపే ఓపెనింగ్ సాంగ్ షూటింగ్ మొదలైనట్లు వెల్లడించారు. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని, తారక్ గ్రేస్ మూమెంట్స్కు ఫ్యాన్స్ కేరింతలు కొడతారని తెలిపారు. సెట్స్లో దిగిన తన ఫొటోను షేర్ చేశారు. కాగా మూవీ నుంచి విడుదలైన చుట్టమల్లే సాంగ్ రికార్డులు సృష్టిస్తున్న విషయం తెలిసిందే.
రాజకీయ విభేదాల వల్ల తెలంగాణ బ్రాండ్ దెబ్బతినకూడదని KTR అన్నారు. ‘TG ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే అమర్రాజా కంపెనీ మరో రాష్ట్రానికి వెళ్లవచ్చు’ అని ఆ సంస్థ ఛైర్మన్ గల్లా జయదేవ్ వ్యాఖ్యానించిన వార్తను Xలో షేర్ చేశారు. ‘₹9,500 కోట్ల పెట్టుబడులకు అమరరాజా సంస్థను ఒప్పించాం. ప్రభుత్వం ఈ డీల్ను కొనసాగించాలి. రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందంటూ ప్రకటనలు చేయడం CM మానుకోవాలి’ అని పేర్కొన్నారు.
జాబ్ క్యాలెండర్లో ఎదురయ్యే సాంకేతిక సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించింది. వేర్వేరు నోటిఫికేషన్లు ఇచ్చినప్పటికీ ఒకే హోదా, కేటగిరి, విద్యార్హత కలిగిన జాబ్స్కు ఉమ్మడి రాత పరీక్ష నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తోంది. ఉమ్మడి రాత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థుల నుంచి ఆప్షన్లు తీసుకుని మెరిట్ జాబితాను వేర్వేరుగా ప్రకటించాలని యోచిస్తోంది. ఇలా చేస్తే బ్యాక్లాగ్ పోస్టులు ఏర్పడవని భావిస్తోంది.
సుకుమార్ డైరెక్షన్లో అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప-2 షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇందులో జాతర ఫైట్ సీక్వెన్స్ మూవీపై అంచనాలను పెంచగా, అంతకుమించిన మరో యాక్షన్ పార్ట్ ఉంటుందని వార్తలు వస్తున్నాయి. క్లైమాక్స్లో హెలికాప్టర్ రిలేటెడ్గా ఉండే ఈ సీక్వెన్స్ అదిరిపోతుందని సమాచారం. దీన్ని సుకుమార్ తన స్టైల్లో డిజైన్ చేశారని తెలుస్తోంది. ఈ చిత్రం డిసెంబర్ 6న విడుదల కానున్న విషయం తెలిసిందే.
AP: రాష్ట్రంలో త్వరలో కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. మ్యారేజ్ సర్టిఫికెట్ ఆధారంగా కొత్త జంటలకు వీటిని జారీ చేయనున్నట్లు సమాచారం. కొత్త రేషన్ కార్డుల కోసం పలువురు ఎదురు చూస్తుండటంతో సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొత్త కార్డులను డిజైన్ చేస్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలో 1.48 కోట్ల రేషన్ కార్డులు ఉండగా, 89 లక్షల కార్డులకు కేంద్రం నిత్యావసరాలు అందిస్తోంది.
పద్మశ్రీ అవార్డు గ్రహీత సునీత కృష్ణన్ Xలో అడగ్గానే అపాయింట్మెంట్ ఇచ్చిన AP CM చంద్రబాబుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. రెండు విషయాలపై చర్చించాలని, అందుకు సీఎం అపాయింట్మెంట్ కావాలని ఆమె ట్వీట్ చేశారు. దీనికి స్పందించిన CM CBN ఈనెల 13న మ.2గంటలకు అపాయింట్మెంట్ ఇస్తూ రిప్లై ఇచ్చారు. ‘TNలో పార్టీ నాయకుడిని కలవడమే కష్టం. అపాయింట్మెంట్ పొందడం అసాధ్యం’ అని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు.
మ్యూజిక్ కంపోజర్, 3 గ్రామీ అవార్డుల విజేత రికీ కేజ్ అరుదైన ఘనత సాధించారు. ఒడిశాలో 14,000 మంది గిరిజన విద్యార్థులతో కలిసి ‘లార్జెస్ట్ సింగింగ్ లెసన్’ పేరిట జాతీయ గీతం జనగణమన గానంతో గిన్నిస్ రికార్డుల్లో చోటు సంపాదించారు. ఈ రికార్డింగును ఈ నెల 14న సా.5 గంటలకు విడుదల చేస్తామని ఆయన తెలిపారు. వేణుగాన విద్వాంసులు హరి ప్రసాద్ చౌరాసియా, రాకేశ్, వీణ మాస్ట్రో జయంతి తదితరులు ఇందులో భాగమయ్యారు.
AP: కదులుతున్న రైలు ఎక్కబోయి చక్రాల కిందపడి ఏపీ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. గుంటూరుకు చెందిన హర్షవర్ధన్(22) తిరుపతిలో బీటెక్ చదువుతున్నాడు. అతను తమిళనాడులోని కాంచీపురం కామాక్షమ్మ గుడికి వెళ్లి తిరిగొస్తూ తిరుత్తణి రైల్వే స్టేషన్లో దిగాడు. రైలు బయలుదేరడంతో పరిగెత్తుకుంటూ వచ్చి ఎక్కే క్రమంలో కిందపడ్డాడు. చక్రాల కింద పడి శరీరం రెండు ముక్కలైంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
AP: పట్టణాల్లో పశువులకు మేత దొరక్కపోవడంతో వాడిపారేసిన ప్లాస్టిక్ వ్యర్థాలు తిని అవి ప్రాణాలు వదులుతున్నాయి. తాజాగా ప్రకాశం జిల్లా కనిగిరిలో ప్లాస్టిక్ వ్యర్థాలు, కుళ్లిన పదార్థాలు తిని ఆవు, కడుపులోని దూడ మరణించాయి. పశువైద్యులు ఇంజక్షన్ ఇచ్చి సెలైన్ ఎక్కించినా ఫలితం లేకపోయింది. చాలా పట్టణాల్లో ఇలా రోడ్లపై వదిలేయడం వల్ల రాత్రిపూట యాక్సిడెంట్స్ కూడా జరుగుతున్నాయి.
తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. ఏటీజీహెచ్ అతిథి గృహం వరకు భక్తులు లైన్లో వేచి ఉన్నారు. నిన్న 79,313 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 39,344 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం నిన్న రూ.3.65కోట్లు వచ్చింది.
Sorry, no posts matched your criteria.