India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తుంగభద్ర డ్యామ్ <<13826054>>గేట్<<>> కొట్టుకుపోవడంతో ముందు జాగ్రత్తగా అధికారులు అన్ని గేట్లు ఎత్తేశారు. లక్ష క్యూసెక్కుల జలాలను దిగువకు విడుదల చేస్తున్నారు. కర్ణాటక మంత్రి శివరాజ్ అక్కడి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇవాళ నిపుణుల బృందం డ్యామ్ను పరిశీలించనుంది. గేట్ కొట్టుకుపోవడంతో కర్నూలులోని పలు మండలాలకూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
రోజూ టిఫిన్గా ఇడ్లీ, దోశ తదితరమైనవి తినడం ఎక్కువమందికి అలవాటు. దీని వల్ల అరగంటలోనే మధుమేహం పెరిగిపోతుందని జీర్ణకోశ వైద్య నిపుణులు చెబుతున్నారు. దానికి ముందుగా ఏదైనా ఒక పండును తింటే టిఫిన్ తర్వాత షుగర్ కంట్రోల్లో ఉంటుందని సూచిస్తున్నారు. పండ్లలో ఉండే పీచు పదార్థం కారణంగా ఆ తర్వాత తిన్న టిఫిన్ కూడా సులువుగా జీర్ణమవుతుందంటున్నారు. భోజనంలోనూ పండ్లు, కూరగాయల్ని భాగంగా చేసుకోవాలని పేర్కొంటున్నారు.
AP: ఈ నెల 16 నుంచి నామినేటెడ్ పదవులను భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో దాదాపు 90 కార్పొరేషన్లు, సంస్థలు ఉండగా 40 వరకు భర్తీ చేయొచ్చని సమాచారం. పొత్తుల్లో భాగంగా సీటు కోల్పోయిన ముఖ్య నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జులకు ఈ పదవులు దక్కనున్నట్లు తెలుస్తోంది. మొత్తం పదవుల్లో 60 శాతం టీడీపీ, 30 శాతం జనసేన, 10 శాతం బీజేపీకి దక్కనున్నట్లు సమాచారం.
వాకింగ్, జాగింగ్ రెండూ ఆరోగ్యంగా ఉండేందుకు, బరువు తగ్గేందుకు సహాయపడతాయి. రోజూ 30min చురుగ్గా వాకింగ్ చేస్తే 150-200 కేలరీలు, జాగింగ్ చేస్తే 300-400 కేలరీలు బర్న్ అవుతాయని నిపుణులు చెబుతున్నారు. వాకింగ్ ఏ వయసు వారైనా చేయవచ్చు. ఆరోగ్య సమస్యలు, కాళ్ల నొప్పులు ఉన్న వారు, గుండె ఆపరేషన్లు అయినవారు జాగింగ్ కు దూరంగా ఉండటమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
AP: డ్వాక్రా సంఘాల పొదుపులో దేశంలోనే రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. 2023-24 మార్చికి అన్ని రాష్ట్రాల పొదుపు ₹65,089cr కాగా దక్షిణాది పొదుపు ₹29,409cr. ఇందులో AP పొదుపు ₹17,292cr. ఇది దేశంలోనే అత్యధికం. ఆ తర్వాత TG(₹5,768cr), TN(₹2,854cr) కర్ణాటక(₹2,024cr) ఉన్నాయి. అలాగే APలో పొదుపు సంఘాలు 10,99,161 ఉండగా, ఒక్కో సంఘం సగటు పొదుపు ₹1,57,321. ఇది దేశంలోనే అత్యధికమని నాబార్డు నివేదికలో వెల్లడైంది.
AP: కొత్త ఓటర్ల నమోదు, పాత ఓటర్ల జాబితాలో సవరణలకు <
AP: ఖరీఫ్లో ఈ-పంటలో నమోదైన పంటలకు YCP హయాంలో అమలైన ఉచిత పంటల బీమానే కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రబీ నుంచి రైతులు తమ వాటా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఉచిత పంటల బీమాతో ఉపయోగం లేదని, 2019కి ముందున్న విధానాన్ని అమలు చేస్తామని CM చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే ఖరీఫ్ సాగు మొదలైనందున టెండర్ల ప్రక్రియ పూర్తి చేయడం అసాధ్యమని అధికారులు చెప్పడంతో CBN ఓకే చెప్పారు.
కేంద్ర మాజీ మంత్రి నట్వర్ సింగ్ (93) కన్నుమూశారు. కొద్దిరోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతూ ఢిల్లీలోని మేదాంత ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. కాగా నట్వర్ 1931లో రాజస్థాన్లోని భరత్పూర్లో జన్మించారు. 2004-05 మధ్య యూపీఏ హయాంలో విదేశాంగ మంత్రిగా సేవలందించారు. ఆయన పలు పుస్తకాలు కూడా రచించారు. 1984లో కేంద్రం నట్వర్ను పద్మ భూషణ్ అవార్డుతో సత్కరించింది.
TG: న్యూయార్క్ సెంట్రల్ పార్క్ తరహాలో హైదరాబాద్లో రాజీవ్ పార్క్ను అభివృద్ధి చేయాలని CM రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఇందుకు అనువైన ప్రాంతం, స్థలం కోసం అధికారులు కసరత్తులు మొదలుపెట్టారు. ఈ పార్క్ను 4100 ఎకరాల్లో అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు. పార్క్ చుట్టూ బిలియనీర్లు, ప్రముఖులు, కార్పొరేట్ ఆఫీస్లు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. కాగా న్యూయార్క్ సెంట్రల్ పార్క్ 843 ఎకరాల్లో విస్తరించి ఉంది.
TG: వచ్చే ఏడాది నుంచి రేషన్ లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ చేయాలని క్యాబినెట్ సబ్కమిటీ నిర్ణయించింది. చౌకధర దుకాణాలు, మధ్యాహ్న భోజన పథకం ద్వారా ఏటా 24లక్షల టన్నుల దొడ్డు బియ్యం పంపిణీ జరుగుతోందని, దీనిలో సగానికి పైగా దారి మళ్లుతున్నట్లు గుర్తించింది. రేషన్ కార్డులతో పాటు ఆరోగ్యశ్రీ కార్డులను స్మార్ట్ కార్డుల రూపంలో ఇవ్వాలని నిర్ణయించింది. కుటుంబ సమగ్ర ఆరోగ్య వివరాలతో వీటిని జారీ చేయనుంది.
Sorry, no posts matched your criteria.