news

News November 10, 2025

తెలంగాణ న్యూస్

image

✦ దేశ విద్యా రంగానికి పునాదులు వేసిన ఘ‌న‌త మౌలానా అబుల్ క‌లాం ఆజాద్‌కే ద‌క్కుతుంద‌న్న CM రేవంత్.. రేపు మౌలానా జయంతి సందర్భంగా స్మరించుకున్న CM
✦ 2026 చివరి నాటికి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పూర్తి: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
✦ ఈనెల 17, 18 తేదీల్లో HYD సమీపంలోని తొర్రూర్, బహదూర్‌పల్లి, కుర్మల్ గూడ ప్రాంతాల్లోని 163 రాజీవ్ స్వగృహ ఓపెన్ ప్లాట్ల వేలం.. <>దరఖాస్తుకు<<>> ఈ నెల 15వరకు గడువు

News November 10, 2025

భోజనం చేసిన వెంటనే ఈ 5 పనులు చేయొద్దు!

image

భోజనం చేసిన వెంటనే కొన్ని పనులు చేయవద్దని, దానివల్ల ఆరోగ్యానికి మంచిది కాదని డాక్టర్లు చెబుతున్నారు.
*స్నానం చేయవద్దు. దీనివల్ల జీర్ణక్రియ మందగిస్తుంది. 2 గంటల తర్వాత స్నానం చేయవచ్చు.
*వెంటనే నిద్రపోవద్దు. 20 నిమిషాల పాటు నడవాలి.
*చల్లటి నీరు తాగవద్దు. గోరువెచ్చని లేదా జీలకర్ర-ధనియాల కషాయం తాగాలి.
*తిన్న వెంటనే పండ్లు తినవద్దు. గంట ముందు లేదా 2 గంటల తర్వాత తినొచ్చు.
*వ్యాయామం చేయవద్దు.

News November 10, 2025

ఢిల్లీ పేలుడు.. విచారణకు ఆదేశించిన హోంమంత్రి

image

ఢిల్లీ పేలుడుపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరా తీశారు. ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్, ఢిల్లీ సీపీతో మాట్లాడి వివరాలు తీసుకున్నారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. ఇప్పటికే NSG, NIA టీమ్స్ ఘటనాస్థలికి చేరుకున్నాయి. అటు పేలుడులో 8 మంది మరణించగా, 24 మందికి తీవ్రగాయాలయ్యాయి. కార్లు, దుకాణాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఎర్రకోట వద్ద భీతావహ వాతావరణం నెలకొంది.

News November 10, 2025

రహదారి పక్కన ఇంటి నిర్మాణానికి నియమాలు

image

రహదారి పక్కనే ఇల్లు కట్టుకుంటే, ఆ దారి కొలతకు ఇంటి పొడవు రెండింతల కంటే ఎక్కువ ఉండకూడదని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తారు. ఈ నియమం ఇంటికి, బయటి శక్తి ప్రవాహానికి మధ్య సమతుల్యతను నెలకొల్పుతుందని అంటారు. ‘ఇంటి పొడవు అధికంగా ఉంటే.. అది రోడ్డు నుంచి వచ్చే చంచల శక్తిని ఎక్కువగా ఆకర్షించి, ఇంట్లో స్థిరత్వాన్ని తగ్గిస్తుంది. గృహంలో ప్రశాంతత ఉండాలంటే ఈ నియమం పాటించాలి’ అని తెలుపుతున్నారు. <<-se>>#Vasthu<<>>

News November 10, 2025

19న పుట్టపర్తికి PM మోదీ రాక: CBN

image

AP: సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 19న PM మోదీ పుట్టపర్తికి రానున్నారని CM CBN తెలిపారు. అలాగే 22న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వస్తారన్నారు. ఈ నేపథ్యంలో పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. మంత్రుల కమిటీ అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించాలని సూచించారు. కాగా 65 ప్రత్యేక రైళ్లతో పాటు ఈనెల 13 నుంచి డిసెంబర్ 1 వరకు 682 రైళ్లు పుట్టపర్తికి రైల్వే శాఖ నడుపనుందని అధికారులు వివరించారు.

News November 10, 2025

JE, SI పరీక్షల షెడ్యూల్ ప్రకటించిన SSC

image

స్టాఫ్ సెలక్షన్ కమిషన్(<>SSC<<>>) జూనియర్ ఇంజినీర్, SI పోస్టుల పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించింది. జూనియర్ ఇంజినీర్ ఎగ్జామ్స్ డిసెంబర్ 3 నుంచి 6 వరకు, ఎస్సై పోస్టులకు డిసెంబర్ 9 నుంచి 12 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. JE సెల్ఫ్ స్లాట్ సెలక్షన్ నవంబర్ 10 నుంచి 13వరకు, ఎస్సై పోస్టులకు NOV 17 నుంచి 21వరకు ఎంపిక చేసుకోవచ్చు. SI పోస్టులు 3,073 ఉండగా, జూనియర్ ఇంజినీర్ పోస్టులు 1731 ఉన్నాయి.

News November 10, 2025

వ్యక్తిగత ప్రదర్శన ముఖ్యం కాదు: గంభీర్

image

హెడ్ కోచ్‌గా తనకు జట్టు ప్రదర్శనే ముఖ్యమని గంభీర్ తెలిపారు. ‘క్రికెట్ వ్యక్తిగత ప్రదర్శనకు సంబంధించింది కాదని నమ్ముతాను. మేము ODI సిరీస్ ఓడిపోయాం. కోచ్‌గా ఇండివిడ్యువల్ గేమ్‌ను మెచ్చుకోవచ్చు. ఒక దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తిగా సిరీస్ ఓటమిని సెలబ్రేట్ చేసుకోలేను. T20 సిరీస్‌‌ వేరే.. అందులో గెలిచాం. దానిలో చాలా పాజిటివ్స్ ఉన్నాయి. కానీ WCకి ముందు మేమనుకున్న చోట లేము’ అని తెలిపారు.

News November 10, 2025

₹750 కోట్లతో నేచురోపతి రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్: మంత్రి

image

AP: తొలిసారిగా ‘అపెక్స్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ యోగా అండ్ నేచురోపతి’ రాష్ట్రంలో ఏర్పాటు కానుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ₹750 కోట్లతో కేంద్రం నెలకొల్పే దీనిలో బ్యాచ్‌లర్ ఆఫ్ నేచురోపతి యోగా సర్జరీలో 100 సీట్లు, PGలో 20 సీట్ల చొప్పున తొలి ఏడాదిలో ఉంటాయన్నారు. దీనికోసం 40 ఎకరాలు కావాలని కేంద్రం లేఖ రాసిందని చెప్పారు. 450 పడకల నేచురోపతి ఆసుపత్రీ అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు.

News November 10, 2025

హైదరాబాద్‌ను దేశ రెండో రాజధానిగా ప్రకటించాలా?

image

దేశ రాజధాని ఢిల్లీలో విపరీతమైన వాయు కాలుష్యంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. గాలి పీల్చలేక వేల మంది అస్వస్థతకు గురవుతున్నారు. దీంతో హైదరాబాద్‌ను దేశానికి రెండో రాజధాని చేయాలని మరోసారి డిమాండ్లు వినిపిస్తున్నాయి. అక్కడ శుభ్రమైన గాలితో పాటు కనెక్టివిటీ బాగుంటుందని వివిధ రాష్ట్రాల నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఢిల్లీలోని పలు కేంద్ర కార్యాలయాలను హైదరాబాద్‌కు తరలించాలంటున్నారు. దీనిపై మీ కామెంట్?

News November 10, 2025

భాగ్యనగరంలో ₹304 కోట్లతో ఐకానిక్ బ్రిడ్జి

image

TG: భాగ్యనగరానికి మరో ఐకానిక్ వంతెన రానుంది. మూసీ రివర్‌ ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులో భాగంగా మీర్ ఆలం ట్యాంక్ వద్ద ఈ వంతెన నిర్మాణానికి ప్రభుత్వం టెండర్లు ఖరారు చేసింది. ₹304 కోట్లతో శాస్త్రిపురం నుంచి చింతల్‌మెట్‌ మీదుగా బెంగళూరు NHని కలుపుతూ దీన్ని నిర్మించనున్నారు. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకు CM ప్రాధాన్యమివ్వడం తెలిసిందే. కాగా HYDలో దుర్గం చెరువుపై గతంలో కేబుల్ బ్రిడ్జి నిర్మించారు.