India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అక్రమ చొరబాట్లను నిరసిస్తూ బ్రిటన్లో చెలరేగిన అల్లర్లను అక్కడి ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. బాధ్యులు మున్ముందు బాధపడాల్సి ఉంటుందని ప్రధాని స్టార్మర్ హెచ్చరించారు. సమాజంలో విద్వేషాన్ని పెంచుతున్న నిరసనకారులపై ఉగ్రవాద చట్టాల కింద అభియోగాలు నమోదు చేస్తామని హోం శాఖ స్పష్టం చేసింది. బ్రిటన్లో ముస్లింల అక్రమ వలసలపై ఆందోళనలు జరుగుతున్నాయి.
వర్షాకాలం వచ్చిందంటే చాలు ఎన్నో పోషకాలు ఉండే బోడ కాకరకాయలకు డిమాండ్ ఉంటుంది. పొట్టిగా, గుండ్రంగా ఉంటూ పైన చిన్నచిన్న ముళ్లు ఉంటాయి. అడవిలో పెరిగే ఈ తీగలు వానాకాలం తర్వాత ఎండిపోతాయి. గిరిజనులు ఉదయాన్నే అడవికి వెళ్లి కోసుకొచ్చి ఉపాధి పొందుతారు. ప్రస్తుతం కేజీ రూ.300పైనే పలుకుతోంది. కొన్ని ప్రాంతాల్లో వీటిని అడవి కాకర, ఆకాకరకాయ అని పిలుస్తారు. మరి ఈ సీజన్లో బోడకాకరకాయ కూర తిన్నారా? కామెంట్ చేయండి.
AP: రాష్ట్రంలోనే తొలిసారిగా విశాఖలోని దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ విద్యార్థినులకు నెలలో ఒక రోజు నెలసరి సెలవును ప్రకటించింది. ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. విద్యార్థినులు మెయిల్ ద్వారా ఈ లీవ్ తీసుకోవచ్చు. ఈ విషయమై గత ఏడాది విద్యార్థినులు రిజిస్ట్రార్కు ప్రతిపాదన చేయగా జనవరిలో ఆమోదం తెలిపారు. ఇప్పటికే దేశంలోని 7 యూనివర్సిటీల్లో ఈ సెలవు విధానం అమల్లో ఉంది.
AP: నేటి నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ అల్లూరి సీతారామరాజు, విజయనగరం, బాపట్ల, కృష్ణా, పార్వతీపురం, శ్రీకాకుళం తదితర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. నిన్న శ్రీకాకుళం జిల్లాలోని ఆమదాలవలసలో అత్యధికంగా 5.5 సెం.మీ. వర్షపాతం నమోదైంది.
లండన్ వెళ్లి రాజకీయ ఆశ్రయం పొందాలని యోచిస్తోన్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు పరిస్థితులు అనుకూలంగా లేవు. బంగ్లాలో చెలరేగిన అల్లర్లపై విచారణ జరిగే అవకాశం ఉండడంతో ఆమెను స్వదేశానికి అప్పగించకుండా రక్షణ కల్పించలేమన్న భావనలో బ్రిటన్ ఉన్నట్టు తెలుస్తోంది. పైగా దీనిపై ఐరాస సారథ్యంలో స్వతంత్ర దర్యాప్తు జరపాలని బ్రిటన్ కోరడం గమనార్హం.
పది రూపాయల నాణేలు చెల్లవన్నది అపోహేనని RBI స్పష్టం చేసింది. ఏ డిజైన్, ఏ ఆకృతిలో ఉన్న నాణెమైనా చెల్లుతుందని, వాటిని తీసుకునేందుకు ఎవరూ నిరాకరించవద్దని తెలిపింది. నిరాకరిస్తే చట్టప్రకారం శిక్షార్హులని హెచ్చరిస్తోంది. రూ.10 కాయిన్స్ బయట వ్యాపారులెవరూ తీసుకోకపోవడంతో బ్యాంకుల్లోనే భారీ సంఖ్యలో ఉండిపోతున్నాయని పేర్కొంది. నాణేలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు చర్యలు చేపడుతోంది.
TG: సౌదీకి వెళ్లిన సిరిసిల్ల యువకుడు ఇమ్రాన్ వీడియో <<13792013>>వైరల్<<>> కావడంపై ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్పందించారు. ఇమ్రాన్ను తిరిగి స్వదేశానికి రప్పించడానికి ప్రభుత్వం తరఫున ఇండియన్ ఎంబసీ, సౌదీ అరేబియాకు లేఖ రాసి అధికారులతో మాట్లాడారు. గల్ఫ్ కార్మికులు ఎవరూ అధైర్యపడవద్దని ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
TG: NCERT ప్రణాళిక అనుగుణంగా విద్యార్థులపై పాఠాల భారం తగ్గించేందుకు ఇంటర్ బోర్డు కసరత్తు చేస్తోంది. ఇందుకోసం సబ్జెక్టుల నిపుణుల కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. 2025-26 నుంచి కొత్త పుస్తకాలు అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. కెమిస్ట్రీలో 10-15% పాఠ్యాంశాలు తగ్గుతాయని, MECకి ప్రత్యేక మ్యాథ్స్ పుస్తకం, బైపీసీ సబ్జెక్టుల్లో మార్పులు జరిగే అవకాశముందని ఇంటర్ బోర్డు వర్గాలు చెబుతున్నాయి.
AP: రాజధాని అమరావతిలో నేటి నుంచి కంప చెట్లు, తుమ్మ చెట్లు, పిచ్చి మొక్కల తొలగింపు ప్రక్రియ (జంగిల్ క్లియరెన్స్) ప్రారంభం కానుంది. వీటిని తొలగించేందుకు CRDA రూ.36.50 కోట్లతో టెండర్లను పిలవగా NCCL సంస్థ కాంట్రాక్ట్ దక్కించుకుంది. ఈ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపడతామని, నెల రోజుల్లో 58వేల ఎకరాల్లో జంగిల్ క్లియరెన్స్ పూర్తి చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు.
TG: రాష్ట్రంలో ఆరు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, కొమురం భీం, మంచిర్యాల, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు తెలిపింది. ఇక నిన్న ఖమ్మం గుబ్బగుర్తిలో అత్యధికంగా 14.8cm వర్షపాతం నమోదైంది. తల్లాడలో 11.8, రఘునాథపాలెంలో 10.7 సెం.మీ.ల వర్షం కురిసింది.
Sorry, no posts matched your criteria.