India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఐపీఎల్లో భాగంగా ఆర్ఆర్తో జరుగుతున్న మ్యాచులో ఆర్సీబీ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.
RCB: కోహ్లీ, సాల్ట్, పాటీదార్ (C), లివింగ్స్టోన్, కృనాల్, జితేశ్, టిమ్ డేవిడ్, భువనేశ్వర్, హేజిల్వుడ్, సుయాశ్, యశ్ దయాల్.
RR: జైస్వాల్, శాంసన్ (C), రానా, పరాగ్, జురేల్, హెట్మయర్, హసరంగ, ఆర్చర్, తీక్షణ, తుషార్, సందీప్ శర్మ.
మరికాసేపట్లో RCBతో RR తలపడనుంది. ఈ క్రమంలో పదమూడేళ్ల వైభవ్ సూర్యవంశీ(RR)కి తుది జట్టులో స్థానం దక్కుతుందా అనేదానిపై తీవ్ర చర్చ నడుస్తోంది. ఇప్పటికే ఆయన నెట్స్లో తీవ్రంగా సాధన చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీంతో ఆయనకు ఒక ఛాన్స్ ఇవ్వాలని క్రికెట్ ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు. వైభవ్తో డ్రింక్స్ మోయించడమే కాకుండా మ్యాచులో ఆడించాలని కోరుతున్నారు.
మూడేళ్లుగా తమ వద్ద పనిచేస్తున్న వాంగ్ అనే మహిళా ఉద్యోగిని పట్ల చైనాలోని ఓ కంపెనీ అమానవీయంగా వ్యవహరించింది. ఓ నెలలో ఆరు రోజులు ఒక నిమిషం ముందు ఎగ్జిట్ అయ్యారనే కారణంతో ఉద్యోగం నుంచి తొలగించింది. దీంతో ఆమె కోర్టులో దావా వేశారు. వాంగ్ను తొలగించడం చట్టవిరుద్ధమని, ఆమెకు పరిహారం చెల్లించాలని కంపెనీని న్యాయమూర్తి ఆదేశించారు. నిమిషం ముందు వెళ్లడం పరిగణనలోకి తీసుకోవద్దని తేల్చిచెప్పారు.
వచ్చే రెండేళ్లలో రోడ్ల నిర్మాణాల కోసం రూ.10 లక్షల కోట్లు ఖర్చు చేస్తామని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ప్రత్యేకించి ఈశాన్య భారతంలోని రహదారులను USAరోడ్ల మాదిరిగా అభివృద్ధి చేస్తామన్నారు. రెండేళ్లలో భారత్ని ప్రపంచంలోని అత్యున్నత మౌలిక సదుపాయాలు కలిగిన దేశంగా అభివృద్ది చేస్తామని మంత్రి పేర్కొన్నారు. 2014లో 91,287కి.మీ ఉన్న జాతీయ రహదారుల పొడవు ప్రస్తుతం 1,46,204 కి.మీకి పెరిగిందన్నారు.
టాప్ క్లాస్ బౌలర్ మహ్మద్ షమీ ఇప్పుడు SRH టీమ్కు భారంగా మారారు. అతడు బౌలింగ్కు వచ్చాడంటే ఎక్కడ భారీగా పరుగులిస్తాడోనని SRH అభిమానులు భయపడే పరిస్థితి వచ్చింది. నిన్న PBKSతో మ్యాచులోనూ 4 ఓవర్లు వేసి ఒక్క వికెట్ కూడా తీయకుండా ఏకంగా 75 రన్స్ ఇచ్చారు. ఈ సీజన్లో 6 మ్యాచులాడిన షమీ 5 వికెట్లే తీశారు. దీంతో తదుపరి మ్యాచ్లో అతడిని పక్కనపెట్టి మరో బౌలర్ను తీసుకోవడం బెటర్ అనే చర్చ మొదలైంది. ఏమంటారు?
వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా బెంగాల్లో జరుగుతున్న ఆందోళనల్లో ముగ్గురు చనిపోయారు. మాజీ క్రికెటర్, TMC MP యూసుఫ్ పఠాన్ ప్రాతినిధ్యం వహిస్తున్న బహరంపూర్లోనూ ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇదిలాఉంటే యూసుఫ్ చాయ్ తాగుతూ ఓ ఫొటోను ఇన్స్టాలో షేర్ చేయడంతో నెటిజన్లు ఫైరవుతున్నారు. ఏమాత్రమైనా సిగ్గుందా? అని దుయ్యబడుతున్నారు. హిందువులు ఊచకోతకు గురవుతుంటే పఠాన్ ఎంజాయ్ చేస్తున్నారని BJP నేత షెహజాద్ ఫైరయ్యారు.
ఢిల్లీ ప్రభుత్వాన్ని సీఎం రేఖా గుప్తా భర్త అనధికారికంగా నడుపుతున్నారని ఆప్ నేత, మాజీ ముఖ్యమంత్రి ఆతిశీ ఆరోపించారు. గతంలో మహిళా సర్పంచ్ వ్యవహారాలను ఆమె భర్తలు చూసుకునే వాళ్లని విన్నాం, ఇప్పుడు ఏకంగా సీఎం పనులనే రేఖా గుప్తా భర్త చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కాగా ఒక మహిళా నాయకురాలై ఉండి మరో మహిళా నేతను అవమానపరచడం ఆశ్చర్యకరంగా ఉందని ఆ రాష్ట్ర BJP అధ్యక్షుడు వీరేంద్ర సచ్ దేవా విమర్శించారు.
TG: రేపటి నుంచి అమల్లోకి తీసుకురానున్న భూభారతి పోర్టల్పై మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకేసారి రాష్ట్రమంతటా పోర్టల్ను లాంచ్ చేస్తే తప్పులు సరిచేయడం ఇబ్బందవుతుందన్నారు. అందుకే పైలట్ ప్రాజెక్టుగా తొలుత మూడు మండలాల్లో అమలు చేస్తామన్నారు. సామాన్యుడికి సైతం సులువుగా అర్థమయ్యేలా పోర్టల్ ఉంటుందని స్పష్టం చేశారు. ‘ధరణి’తో గత ప్రభుత్వం చేసిన అక్రమాలను బయటపెడతామన్నారు.
TG: జీవితమంతా పర్యావరణ పరిరక్షణ కోసం పనిచేసిన పద్మశ్రీ వనజీవి రామయ్య అదే ప్రకృతిలో కలిసిపోయారు. ఖమ్మం జిల్లాలోని స్వగ్రామం రెడ్డిపల్లిలో ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు పూర్తయ్యాయి. రామయ్యను ఖననం చేసిన చోటే కుటుంబ సభ్యులు మొక్క నాటారు. ఆయన అంతిమయాత్రకు ప్రజలు, ప్రముఖులు భారీగా తరలివచ్చారు. అంతకుముందు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ రఘురాంరెడ్డి ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు.
మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుమార్ హీరోగా తెరకెక్కిన అడ్వెంచర్ హారర్ థ్రిల్లర్ ‘కింగ్స్టన్’ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగు, తమిళ భాషల్లో జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రానికి కమల్ ప్రకాశ్ దర్శకత్వం వహించగా, దివ్యభారతి హీరోయిన్గా నటించారు. మార్చి 7న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విఫలమైనా విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
Sorry, no posts matched your criteria.