India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
శ్రీలంకతో రేపటి నుంచి జరిగే ODI సిరీస్లో WKగా ఎవరిని ఆడించాలనేది ఇంకా నిర్ణయించలేదని కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపారు. ‘కేఎల్ రాహుల్, పంత్ ఇద్దరూ క్వాలిటీ ప్లేయర్స్, మ్యాచ్ విన్నర్స్. టీమ్లో క్వాలిటీ ఉంది కాబట్టే సెలక్షన్ గురించి బయట చర్చ జరుగుతోంది. జట్టులో ఇలాంటి మంచి ప్లేయర్లు ఉన్నప్పుడు తుది జట్టు ఎంపిక కష్టంగా మారుతుంది. కానీ ఇలాంటి సమస్యలు ఉండటం మంచిదే’ అని ప్రెస్ కాన్ఫరెన్స్లో అన్నారు.
TG: కొత్త తెల్ల రేషన్ కార్డుల కోసం క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించింది. ఈ కమిటీ రేషన్ కార్డుల జారీకి విధివిధానాలు రూపొందించనుంది. ఈమేరకు త్వరలోనే కార్డులు జారీ చేస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు. రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు విడిగా ఇస్తామన్నారు. ధరణి పోర్టల్ పేరు భూమాతగా మార్పు, వయనాడ్ మృతుల కుటుంబాలకు ఆర్థికసాయం చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు.
బ్యాడ్మింటన్ మెన్స్ డబుల్స్ కేటగిరీలో భారత్కు నిరాశే మిగిలింది. సాత్విక్-చిరాగ్ జోడీ మలేషియా చేతిలో ఓటమి పాలైంది. తొలి సెట్లో 21-13 తేడాతో సునాయాసంగా గెలుపొందిన ఈ జోడీ ఆ తర్వాత తడబడింది. రెండో సెట్లో 14-21 తేడాతో ఓడిపోయింది. హోరాహోరీగా సాగిన మూడో రౌండ్లో సాత్విక్-చిరాగ్ జోడీ పుంజుకున్నా ఆ తర్వాత పట్టుకోల్పోయింది. దీంతో 16-21 తేడాతో మూడో రౌండ్లో ఓడి సెమీస్ ఆశలు చేజార్చుకుంది. <<-se>>#Olympics2024<<>>
AP: గనుల శాఖ మాజీ ఎండీ వెంకట్ రెడ్డిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇసుక తవ్వకాలు, గనుల్లో అక్రమాల ఆరోపణలపై విచారించి చర్యలు తీసుకున్నట్లు అందులో పేర్కొన్నారు.
రాష్ట్రాలు SC/ST ఉపవర్గీకరణ చేయవచ్చన్న సుప్రీంకోర్టు <<13751609>>తీర్పు<<>> తెలుగు రాష్ట్రాల్లో ఉద్యోగాల భర్తీపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఎన్నో ఏళ్ల పోరాటం తర్వాత సానుకూలంగా తీర్పు రావడంతో వెంటనే వర్గీకరణకు ప్రభుత్వాలపై ఆయా కులాలు ఒత్తిడి తేవొచ్చు. ప్రస్తుత నోటిఫికేషన్లకూ కొత్త రిజర్వేషన్లు వర్తింపచేయాలని ప్రభుత్వాలను డిమాండ్ చేసే ఛాన్స్ ఉంది. ఇది ప్రస్తుత, రాబోయే ఉద్యోగ నోటిఫికేషన్లలో కీలకం కానుంది.
మాజీ ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్కు ఢిల్లీ హైకోర్టులో షాక్ తగిలింది. తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఆమె వేసిన పిటిషన్ను ధర్మాసనం కొట్టేసింది. పూజ వ్యవహారంపై దర్యాప్తు జరపాలని ఆదేశించింది. ఆమెకు UPSCలో ఎవరైనా సహకరించారా? అనేది తేల్చాలంది. కాగా ఇప్పటికే ఆమె ఐఏఎస్ అభ్యర్థిత్వాన్ని యూపీఎస్సీ <<13746324>>రద్దు <<>>చేసిన సంగతి తెలిసిందే.
గోల్డ్ కొనేందుకు ఇదే బెస్ట్ టైమ్! సెప్టెంబర్లో వడ్డీరేట్ల తగ్గింపుపై US ఫెడ్ సిగ్నల్స్ ఇచ్చింది. అప్పుడు ధర ఇంకా పెరగొచ్చు. ఎందుకంటే బంగారం, డాలర్ మధ్య విలోమ సంబంధం ఉంటుంది. ఒకటి పెరిగితే మరోటి తగ్గుతుంది. వడ్డీరేట్ల కోతతో పుత్తడి మంచి పెట్టుబడి సాధనం అవుతుంది. యుద్ధాలు, జియో పాలిటిక్స్ వల్ల భారత్, చైనా టన్నుల కొద్దీ గోల్డ్ కొంటున్నాయి. కస్టమ్స్ సుంకం తగ్గడంతో యెల్లో మెటల్ డిమాండ్ పెరగడం ఖాయం.
AP: రాష్ట్రవ్యాప్తంగా తొలి రోజే 96 శాతం పింఛన్లను ప్రభుత్వం పంపిణీ చేసింది. ఉదయం 6 గంటల నుంచే సచివాలయ ఉద్యోగులు ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు నగదు అందించారు. సాంకేతిక సమస్యలు, ఇతరత్రా సమస్యలతో ఆగినవి మినహా పంపిణీ ప్రక్రియ దాదాపుగా ఈరోజే పూర్తి కానుంది. కాగా సత్యసాయి జిల్లా గుండుమలలో చంద్రబాబు స్వయంగా లబ్ధిదారులకు పింఛన్లు అందించారు.
తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. క్రికెటర్ సిరాజ్, బాక్సర్ నిఖత్ జరీన్కు గ్రూప్-1 క్యాడర్లో డీఎస్పీ ఉద్యోగాలు ఇవ్వనుంది. ఇటీవల టీ20 వరల్డ్ కప్ సాధించిన జట్టులో సిరాజ్ సభ్యుడు కాగా రాష్ట్రానికి చెందిన నిఖత్ గతంలో రెండుసార్లు వరల్డ్ ఛాంపియన్గా నిలిచారు.
TG: అసెంబ్లీలో CM రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి పోటీ పడి మహిళల్ని అవమానించారని BRS ఎమ్మెల్యే సబిత అన్నారు. ‘రేవంత్ మాటలు సీఎం హోదాను తగ్గిస్తున్నాయి. నిన్న చేసిన <<13745152>>వ్యాఖ్యలపై<<>> క్షమాపణలు చెప్పకుండా ఇవాళ మళ్లీ అలాంటి మాటలే మాట్లాడారు. సభలో లేని కవిత పేరు ప్రస్తావించడం సంస్కారమా? నా వల్ల CLP పదవి పోయిందన్న భట్టి విక్రమార్క.. ఇప్పుడు SC నేతకు CM పదవి ఇవ్వాలని ఎందుకు అడగలేదు?’ అని ప్రశ్నించారు.
Sorry, no posts matched your criteria.