India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
‘హాయ్ నాన్న’ సినిమా డైరెక్టర్ శౌర్యువ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్తో సినిమా తీస్తున్నారనే వార్త ఇండస్ట్రీలో తెగ వైరలైంది. ఈ రూమర్లలో వాస్తవం లేదని శౌర్యువ్ క్లారిటీ ఇచ్చారు. ‘ఇది నిజం కాదు. ఈ వదంతులు ఎలా మొదలయ్యాయో నాకు తెలియదు. దురదృష్టవశాత్తు ఇది తప్పుడు సమాచారం. నిజం కావాలనే నేను కోరుకుంటున్నా. ఒకరోజు అది నిజమవుతుందని ఆశిద్దాం’ అని ఆయన చెప్పుకొచ్చారు. ఇప్పటికైతే ఎన్టీఆర్తో మూవీ ప్లాన్ లేదన్నారు.
ఇండియన్ రైల్వే టికెట్ కలెక్టర్ స్వప్నిల్ కుసాలే పారిస్ ఒలింపిక్స్లో <<13752961>>కాంస్యం<<>> సాధించి ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారు. రెజ్లింగ్కు కంచుకోట అయిన కొల్హాపూర్(MH)కు చెందిన ఆయన షూటింగ్లో అదరగొట్టారు. రైల్వే TCగా పనిచేసిన ధోనీ అంటే తనకెంతో అభిమానమని కుసాలే నిన్న మీడియాతో చెప్పారు. ఆయనలా మైదానంలో ప్రశాంతంగా ఉండటం తన ఆటకు ఎంతో అవసరమని పేర్కొన్నారు.
భారీ వర్షాల ధాటికి ఉత్తరాది రాష్ట్రాలు విలవిలలాడుతున్నాయి. ఏడు రాష్ట్రాల్లో ఒక్క రోజులోనే 32 మంది ప్రాణాలు కోల్పోయారు. గరిష్ఠంగా ఉత్తరాఖండ్లో 10 మంది మృతిచెందారు. హిమాచల్ ప్రదేశ్-4, ఢిల్లీ-5, యూపీలోని గ్రేటర్ నోయిడా-2, హరియాణాలోని గురుగ్రామ్-3, రాజస్థాన్లోని జైపూర్లో- 3, బిహార్లో ఐదుగురు చనిపోయారు. ఢిల్లీలో ఒక్కరోజులో ఆ స్థాయి వర్షం కురవడం 14ఏళ్లలో ఇదే తొలిసారి.
ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ ‘జొమాటో’పై నెట్టింట విమర్శలొస్తున్నాయి. రెస్టారెంట్లో ఉన్న ధరలకు ఆన్లైన్లో చూపించే వాటికి చాలా వ్యత్యాసం ఉందని ఓ నెటిజన్ చేసిన ట్వీట్ వైరలవుతోంది. ముంబైలోని ఓ హోటల్లో ఉప్మా రూ.40 ఉంటే జొమాటోలో రూ.120 ఉందని సాక్ష్యాలతో పోస్ట్ చేశారు. అయితే, ప్లాట్ఫామ్లో ఉండే ధరలను రెస్టారెంట్స్ నిర్ణయిస్తాయని జొమాటో రిప్లై ఇచ్చింది. మీరూ దీనిని గుర్తించారా? కామెంట్ చేయండి.
తెలంగాణలోని పలు జిల్లాల్లో రేపు వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, కొత్తగూడెం, ఖమ్మంలో వాన పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. వరంగల్, మెదక్, హన్మకొండ, కామారెడ్డి, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లోనూ ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది.
పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. తమ గడ్డపై హమాస్ చీఫ్ హనియేను ఇజ్రాయెల్ చంపడంతో ఇరాన్ ప్రతీకారంతో రగిలిపోతోంది. ఇజ్రాయెల్పై ప్రత్యక్ష దాడి చేయాలని ఆ ప్రభుత్వం తమ సైన్యాన్ని తాజాగా ఆదేశించినట్లు న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రచురించింది. తాజాగా హమాస్ మిలిటరీ చీఫ్ మహమ్మద్ దైఫ్ని కూడా ఇజ్రాయెల్ మట్టుబెట్టింది. దీంతో ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
AP: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి CM చంద్రబాబు కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ నెల 5వ తేదీన జరిగే మీటింగ్కు ఉన్నతాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. శాంతి భద్రతలు, గంజాయి నిర్మూలనపై సమావేశంలో CM ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించనున్నారు. గత ప్రభుత్వ హయాంలో భూములు, ఇసుక, సహజ వనరుల దోపిడీ జరిగినట్లు గుర్తించామని చెబుతున్న సీఎం.. ఈ అంశాలపై ఫోకస్ పెడతారని తెలుస్తోంది.
గత సెప్టెంబర్లో 20K నుంచి ఇప్పుడు 25K మైలురాయిని (25%) తాకేందుకు నిఫ్టీ50 సూచీ 220 సెషన్లే తీసుకుంది. ఈ 5వేల పాయింట్ల ర్యాలీలో 10 స్టాక్సే 50% మేర కంట్రిబ్యూట్ చేశాయి. భారతీ ఎయిర్టెల్, రిలయన్స్ కలిపి 8%, TCS, SBI, ONGC, టాటా మోటార్స్, ICICI బ్యాంకు, NTPC, M&M, ఇన్ఫోసిస్ కలిపి 38.6% కంట్రిబ్యూట్ చేశాయి. ఈ వ్యవధిలో ఈ కంపెనీల MCap రూ.23.29 లక్షల కోట్లు పెరిగింది. మరో 36 కంపెనీలు 1-3% పెరిగాయి.
హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియే హత్య మిడిల్ ఈస్ట్ రాజకీయాల్లో కలకలం రేపిన వేళ ఇజ్రాయెల్ మరో సంచలన ప్రకటన చేసింది. హమాస్ మిలిటరీ చీఫ్, ఇజ్రాయెల్పై దాడిలో సూత్రధారి మహమ్మద్ దైఫ్ హతమైనట్లు తెలిపింది. జులైలో జరిగిన ఎయిర్స్ట్రైక్స్లో అతను ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించింది. కాగా జులై 13న దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్ ప్రాంతంలో దైఫ్, హమాస్ కమాండర్ సాలామెహ్ తలదాచుకుంటున్న స్థావరాలపై దాడి చేసింది.
శ్రీకృష్ణ జన్మభూమిపై ముస్లిం సంఘాలు దాఖలు చేసిన పిటిషన్ను అలహాబాద్ హైకోర్టు కొట్టివేసింది. అక్కడ పూజలు చేసుకునే హక్కు కల్పించాలని హిందూ పక్షం పిటిషన్ వేయగా, ఆ పిటిషన్ను కొట్టివేయాలని ముస్లిం సంఘాలు కోర్టును ఆశ్రయించాయి. దీనిపై విచారించిన కోర్టు హిందూ సంఘాల పిటిషన్పై విచారణ కొనసాగించవచ్చని తీర్పునిచ్చింది.
Sorry, no posts matched your criteria.