India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

గోండ్ కటిరాలో ఉండే ప్రొటీన్ మీ కండరాలను ఆరోగ్యంగా ఉంచడంలో, కణజాలాలను బాగు చేయడంలో సహాయపడుతుంది. ఇది శక్తిని కూడా అందిస్తుంది. గోండ్ కటిరా తీసుకోవడం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇందులో ఉండే డైటరీ ఫైబర్ గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. గోండ్ కటిరా తినడం వలన చర్మం, జుట్టుకు కూడా మేలు చేస్తుంది. ఇది ముఖం పై మొటిమలను పోగొట్టడంలో, జుట్టు సమస్యలకు చికిత్స చేయడంలో ప్రయోజనకరంగా ఉంటుంది.

చెన్నై ఆవడిలోని హెవీ వెహికల్ ఫ్యాక్టరీ 220 Jr. టెక్నీషియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. టెన్త్, NAC/NTC/STC అర్హతతో పాటు పని అనుభవం గలవారు FEB 14 వరకు ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్లో సడలింపు ఉంది. షార్ట్ లిస్టింగ్, ట్రేడ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. సైట్: https://avnl.co.in *మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.

AP: ఈ ఏడాది కూడా విశాఖ నుంచి పుదుచ్చేరి మీదుగా చెన్నై వరకు లగ్జరీ క్రూయిజ్షిప్ విహారానికి ఏర్పాట్లు సాగుతున్నాయి. జూన్ 24, జులై 1, 8, 15వ తేదీల్లో సర్వీసులు ఉంటాయి. రేట్లు, టైమింగ్స్పై విశాఖ పోర్టు అధికారులు కార్డిలియా క్రూయిజ్ ఎంవీ ఎంప్రెస్ యాజమాన్యంతో చర్చలు పూర్తిచేశారు. త్వరలోనే టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. కాగా ఈ 11 అంతస్తుల షిప్ ఇప్పటికే మూడుసార్లు విశాఖ నుంచి సేవలందించింది.

బెంగళూరులోని CSIR-నేషనల్ ఏరోస్పేస్ లాబోరేటరీస్ 47 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనుంది. గ్రాడ్యుయేట్(BE, BTech), డిప్లొమా అర్హత గల వారు NATS పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. గ్రాడ్యుయేట్ ట్రైనీలకు FEB 10న, డిప్లొమా ట్రైనీలకు FEB 11న ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. గ్రాడ్యుయేట్లకు నెలకు రూ.12,300, డిప్లొమా ట్రైనీలకు రూ.10,900 చెల్లిస్తారు. వెబ్సైట్: https://www.nal.res.in/

AI దిగ్గజాలు గూగుల్ జెమినీ, చాట్GPTలకు మన కంపెనీ సవాలు విసురుతోంది. బెంగళూరు స్టార్టప్ ‘సర్వం ఏఐ’ రిలీజ్ చేసిన Sarvam Vision, Bulbul టూల్స్ సంచలనం రేపుతున్నాయి. వర్డ్ అక్యూరసీలో 87.3%, ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్(OCR)లో 84.3%, ఎర్రర్ రేటులో 8.6%తో జెమినీ, చాట్GPT, ఆంథ్రోపిక్ క్లౌడ్ కన్నా ఎంతో మెరుగైన ప్రదర్శనను కనబరిచాయి. ప్రస్తుతం ఇవి టెక్ నిపుణులను ఆశ్చర్యపరుస్తున్నాయి.

సర్వం ఏఐ కంపెనీని 2023లో వివేక్ రాఘవన్, ప్రత్యూష్ కుమార్ స్థాపించారు. హైఎండ్ క్లౌడ్ కంప్యూటర్ల కోసమే కాకుండా ఫోన్లు, స్థానిక భాషల కోసం దీన్ని రూపొందించారు. భారత భాషల్లోని క్లిష్టమైన డాక్యుమెంట్లనూ Sarvam Vision ఈజీగా చదివేస్తోంది. text-to-speech టూల్ ‘Bulbul’ 11 భారత భాషల్లో 32 వాయిస్లు అందిస్తోంది. చౌకగా, స్థానిక భాషలతో, స్క్రిప్టులను చదవడంలో మేలైన OCRతో ఇక్కడి సంస్థలను సర్వం ఏఐ ఆకర్షిస్తోంది.

AP: రేషన్ కార్డుదారులకు రూ.20కే కేజీ గోధుమ పిండి అందించే కార్యక్రమాన్ని మంత్రి మనోహర్ నిన్న తెనాలిలో ప్రారంభించారు. ప్రస్తుతం జిల్లా కేంద్రాల్లో 1,800 టన్నుల గోధుమ పిండి పంపిణీ చేస్తున్నామని, రానున్న రోజుల్లో అన్ని చోట్లా ఇస్తామని చెప్పారు. స్మార్ట్ రేషన్ కార్డు ద్వారా నెలలో 15 రోజుల పాటు ఉదయం నుంచి సాయంత్రం వరకు సరకులు తీసుకోవచ్చని తెలిపారు.

గురుగ్రామ్, నోయిడా ఎయిర్పోర్ట్ మధ్య ‘ఎయిర్ టాక్సీలు’ నడపాలని CII ప్రతిపాదించింది. గంటల ప్రయాణం నిమిషాల్లోనే ముగిసేలా ఆఫీసులు, హాస్పిటల్స్, కమర్షియల్ బిల్డింగ్లపైనే ల్యాండింగ్ ప్యాడ్లు ఏర్పాటు చేయనున్నారు. ఫస్ట్ ఫేజ్లో ఆర్గాన్ ట్రాన్స్పోర్ట్ కోసం వీటిని వాడతారట. మెట్రో స్టేషన్లు, బిజినెస్ హబ్లను కలుపుతూ ఈ నెట్వర్క్ రాబోతోంది.

పిల్లల్లో వయసుకు తగిన ఎదుగుదల లేకపోవడం, పాలు ఎక్కువగా తాగడం, చిరుతిళ్లు తినడం, నులిపురుగులు, ఐరన్ డెఫిషియన్సీ వల్ల ఆకలి తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. పిల్లలకు మంచి పౌష్టికాహారం, పండ్లు, సూప్స్ పెట్టాలి. జంక్ ఫుడ్ చిన్నప్పటి నుంచే అలవాటు చేస్తే ఊబకాయం, అనారోగ్యాలు వస్తాయి. ఫోన్లు, టీవీ చూపించి అన్నం పెట్టొద్దు. దీనితో అర్టిజం, హైపర్ యాక్టివ్ సమస్యలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

ఎండిన మామిడి ఆకులు గుమ్మానికి ఉండటం అశుభంగా భావిస్తారు. అవి నల్లగా మారినా వెంటనే తొలగించాలి. లేకపోతే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతుందని నమ్ముతారు. ఇంట్లో ప్రతికూలత ఏర్పడే అవకాశం ఉంటుందట. అందుకే ఎండిన తోరణాలను తొలగించి అవసరమైతే మూలా నక్షత్రం రోజున, ఇతర శుభ ముహూర్తాల్లో కొత్త పచ్చని మామిడి ఆకులను కట్టాలని సూచిస్తున్నారు. ఇలా చేస్తే ఇంటికి సానుకూల శక్తి చేకూరి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది.
Sorry, no posts matched your criteria.